స్మిత్ ఫీల్డ్ అగ్ని జ్వాలలు (క్రీ.శ. 1410–1556)

స్మిత్ ఫీల్డ్ అగ్ని జ్వాలలు (క్రీ.శ. 1410–1556)

జయశాలియైన విలియమ్ (William the Conqueror) యొక్క కనిష్ఠ కుమారు డైన ఒకటవ హెన్రీ (Henry I) పరిపాలనలోని మూడవ సంవత్సరమునందు అనగా క్రీ.శ. 1103 లో “పరిశుద్ధుడైన బర్తలోమయి” అను పేరుగల ఒక వైద్యశాల స్మిత్ ఫీల్డ్ పట్టణములో స్థాపించబడెను. ఈ వైద్యశాల నిర్మాణము రాజైన హెన్రీ ఆస్థాన సంగీత విద్వాంసుడైన రేయర్ (Rayer) చే ప్రారంభించబడి కొంతకాలమునకు రిచర్డ్ విట్టింగ్టన్ (Richard Whittington) అను లండన్ నగరపాలక అధ్యక్షునిచే పూర్తిచేయబడెను. ఈ స్మిత్ ఫీల్డ్ పట్టణములో సుమారు వంద సంవత్సరములకు పైగా రాజాజ్ఞలను అతిక్రమించినవారిని, ఇతర దుర్మార్గులను ఉరితీసి చంపిరి.

జాన్ బ్రాడి

రాజైన నాలుగవ హెన్రీ పరిపాలనా కాలములో అనగా క్రీ.శ. 1410, మార్చి నెల ఒకటవ తారీఖు శనివారము రోజున కేంటర్ ్బరి ఆర్చిబిషప్ థామస్ అరుండేల్, దర్జీగా పనిచేయుచున్న జాన్ బ్రాడి (John Brady) ని “పవిత్రపరచబడిన సంస్కార ములో క్రీస్తుయొక్క నిజ ప్రత్యక్షత ఉన్నదా?” అని ప్రశ్నించెను. అందుకు బ్రాడి ఏ పాస్టరుకూడ ప్రార్థనచేసి రొట్టె, ద్రాక్షారసములను క్రీస్తు శరీరముగా మార్చుట అసాధ్యమని జవాబు చెప్పెను. బ్రాడి తన నమ్మకములను మార్చుకొనకపోగా ఇతరులనుకూడా అదేవిధముగా నమ్మునట్లు చేయుటకు ప్రయత్నించుచున్నాడని ఆర్చిబిషప్ గమనించి బ్రాడిని బహిరంగ మతద్రోహి అని నిందించి అతనిని రాజకీయ అధికారులకు అప్పగించెను.

ఈ విషయములు ఉదయము జరుగగా మధ్యాహ్నమునకు బ్రాడిని కాల్చి చంపుడని రాజాజ్ఞ జారీయైనది. వెంటనే బ్రాడిని స్మిత్ ఫీల్డ్కు తీసుకొనివెళ్లి ఖాళీ పీపాలో ఉంచి ఉరికొయ్యకు ఇనుప గొలుసులతో కట్టి, అతని చుట్టూ ఎండిన కట్టెలు పేర్చిరి. విధముగ బ్రాడి నిలువబడియున్నప్పుడు రాజుయొక్క జ్యేష్ఠ కుమారుడు మరియు సింహాసనమునకు వారసుడైన ఆరవ హెన్రీ అక్కడ ఉండుట తటస్థించి, బ్రాడి ప్రాణమును రక్షించుటకు ఏదేని ఒక మార్గమును అన్వేషించసాగెను.

ఈ లోపు, పరిశుద్ధుడైన బర్తలోమయి దేవాలయపు అధిపతి జ్యోతులను చేపట్టిన పన్నెండుమంది అనుచరులతో పెద్ద ఊరేగింపుగా పవిత్ర సంస్కారమును అచ్చటికి తీసుకొనివచ్చి జాన్ బ్రాడి ముందుంచి, దాని గురించి అతని నమ్మకమును మరల తెలిసికొనగోరెను. అందుకు బ్రాడి అది కేవలము పరిశుద్ధపరచబడిన రొట్టె మాత్రమేగాని క్రీస్తు శరీరము కాదను విషయము తాను సంపూర్ణముగా ఎరుగుదునని జవాబు చెప్పగా, ఆ మాటలకు వెంటనే వారతనికి నిప్పు ముట్టించిరి.

ఆ అమాయకపు ఆత్మకు నిప్పు సెగ తగిలినప్పుడు, ‘కరుణింపుము!’ అని కేకవేసెను. అతడు ప్రభువును ప్రార్థించెను, అతని అరుపు భయంకరమైన శబ్దముతో ఉన్నందున యువరాజైన ఆరవ హెన్రీ నిప్పును ఆర్పివేయుడని ఆజ్ఞాపించి ‘నీ మత ద్రోహమును విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నావా?’ అని బ్రాడిని ప్రశ్నించెను. అతడు అంగీకరించి నట్లయితే జీవించుటకు అవసరమైన అన్ని సదుపాయములు తాము కల్పించెదమని, రాజుగారి ఖజానానుండి సాంవత్సరిక వేతనమునుకూడ ఇచ్చెదమని చెప్పెను.

అయితే క్రీస్తుయొక్క పరాక్రమముగల యోధుడైన బ్రాడి యువరాజు మాటలను లెక్కచేయక, తనకు కల్పించెదమన్న సౌకర్యములను తిరస్కరించి, గొప్ప విగ్రహా రాధనను, దుష్టత్వమును ఒప్పుకొనుటకు బదులు ఎంతటి భయంకరమైన హింసల నైననూ సహించుటకే నిశ్చయించుకొనెను. అందుచే యువరాజు బ్రాడిని మరలా అగ్నిలోనికి విసరివేయుడని ఆజ్ఞాపించెను. అయిననూ బ్రాడి క్రీస్తునందు తన నమ్మకములను విసర్జించక అంతమువరకు ధైర్యముగా నిలువబడెను.

విలియమ్ స్వీటింగ్, జాన్ బ్రూస్టర్

గతములో ఒకసారి ఈ ఇద్దరు మనుష్యులు మతద్రోహనేరము చేసిరని ఋజువై నందున వారు మతద్రోహులని అందరికి తెలియునట్లు కేథలిక్ ప్రతిమలు చిత్రీకరించ బడిన చిహ్నములను ధరింపవలెనని ఆజ్ఞాపింపబడిరి. అయితే కొంతకాలమునకు ఆ చిహ్నములను ధరించుట మానినందున వారిని తిరిగి నిర్బంధించి, పరిశుద్ధ సంస్కారమును గురించి వారి నమ్మకములు రోమ్ యొక్క ఉపదేశములకు భిన్నముగా ఉన్నవని, వారు నిషేధింపబడిన పుస్తకములను చదువుచున్నారని మరియు మత ద్రోహులతో స్నేహము చేయుచున్నారను నేరములు వారిపై మోపి, వారిద్దరిని కలిపి క్రీ.శ. 1511 అక్టోబరు 18వ తేదీన సజీవదహనము చేసిరి.

జాన్ స్టిల్మన్

క్రీ.శ. 1518 లో జాన్ స్టిల్మన్ (John Stilman) బహిరంగముగా కేథలిక్ విగ్రహారాధనకు వ్యతిరేకముగా మాట్లాడినందున, పవిత్రపరచబడిన సంస్కారములో క్రీస్తు ప్రత్యక్షతలేదని తృణీకరించుటవలన మరియు జాన్ విక్లిఫ్ను ఘనముగా పొగడినందువలన బిషప్ సభ అతనిని దోషిగా తీర్చి, లండన్ న్యాయాధికారులకు అప్పగింపగా వారు స్మిత్ ఫీల్డులో జాన్ స్టిల్మన్ ను సజీవ దహనము గావించిరి.

జాన్ లాంబర్ట్

జాన్ లాంబర్ట్ (John Lambert) నార్ఫోక్ (Norfolk) పట్టణములో జన్మిం చెను. అతడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములో ఉన్నత విద్యను అభ్యసించి లాటిన్, గ్రీకు భాషలలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. ఆ కాలములో ఇంగ్లాండులో నెలకొన్న తీవ్రపరిస్థితులవలన లాంబర్ట్ ఇంగ్లాండును వదలి ఐరోపా వెళ్లి ఇక్కడ టిండేల్, ఫ్రిడ్జ్లతో కలసి ఒక సంవత్సరము నివసించెను.

ఆ సమయములో ఆంట్వెర్స్ లోని ‘ఇంగ్లీష్ హౌస్’ (దౌత్య కార్యాలయమువంటిది) లో పాదిరిగా పనిచేసెను. అక్క డున్నప్పుడు సర్ థామస్ మోర్, బార్లో (Barlow) అనువారు ఇతనిపై ఇంగ్లాండునకు ఫిర్యాదుచేసి మరింత కష్టపెట్టిరి. ఇది జరిగిన కొద్దికాలమునకే ఇంగ్లాండు అధికారులు లాంబర్ను ఆంట్వెరున్నుండి లండన్కు తీసుకొనివెళ్లి విచారణ నిమిత్తము కేంటర్ బరీ ఆర్చిబిషప్ వార్హమ్ యెదుట హాజరుపరచిరి.

విచారణ జరుగుచున్న కాలములో ఆర్చిబిషప్ చనిపోయినందువలన లాంబర్ట్క కొంతకాలము స్వేచ్ఛ లభించెను. అందుచే అతడు లండన్ తిరిగివెళ్లి చిన్న పిల్లలకు గ్రీకు, లాటిన్ భాషలు బోధించు ఉపాధ్యాయునిగా పనిచేయుట ప్రారంభించెను. ఆ సమయములో లాంబర్ట్కు కేథలిక్ పరిశుద్ధ సంస్కారములో నమ్మకము లేదనెడి విషయము రాజైన ఎనిమిదవ హెన్రీకి తెలియబడగ అతడు లాంబర్ట్ను తనయెదుట హాజరుకావల్సినదిగా ఆజ్ఞాపించెను. రాజాజ్ఞ ప్రకారము లాంబర్ట్ అతనియెదుట హాజరైనప్పుడు రాజు కోపముతో “నీ పేరేమిటి?” అని ప్రశ్నించెను.

క్రీస్తువంటి వినయముగల లాంబర్ట్ గొట్టెపిల్లవలె రాజుయెదుట ఒంటికాలుపై మోకరించి, “నా పేరు జాన్ నికోల్సన్ (John Nicholson), అయినను అందరు నన్ను లాంబర్ట్ అని పిలచెదరు” అని జవాబివ్వగ, రాజు, “ఏమిటి, నీకు రెండు పేర్లున్నవా? నీవు రెండు పేర్లు కల్గియున్నందున నేను నిన్ను నమ్మను” అనెను.

అందుకు లాంబర్ట్, “ఓ ఘనతగలిగిన యువరాజా! నా పేరు మార్చుకొనుట అవసరమని మీ బిషప్లు నన్ను బలవంతము చేసిరి” అని జవాబిచ్చెను. ఈ విధముగా వారు కొంతసేపు మాట్లాడుకొనిన తరువాత రాజు పరిశుద్ధ సంస్కారమునుగురించి నీవు కచ్చితముగ నమ్ముచున్నదేమిటో బహిరంగముగ తెలియజేయుమని లాంబర్ట్ను ఆజ్ఞాపించెను.

“నా సమాధానము పరిశుద్ధుడైన అగస్టీన్ సమాధానము వంటిది

రాజు తన స్థాయికి తక్కువగ భావించక వివాదాస్పదమైన మత విషయములను విని అర్థము చేసికొనునట్లుగా అతని హృదయమును ప్రభావితము చేసినందుకు లాంబర్ట్ మొదట దేవునికి వందనములు చెల్లించుచుండగ, రాజు కోపముతో లాంబర్ట్న అడ్డుకొని, “నన్నుగూర్చిన పొగడ్తలు వినుటకు నేనిక్కడకు రాలేదు. అధిక ప్రసంగములు చేయకుండ పరిశుద్ధ సంస్కారమును అది క్రీస్తు శరీరమేనా లేక అట్లు కాదని గూర్చి క్లుప్తముగ జవాబు చెప్పుము తృణీకరించెదవా, నీవేమి చెప్పుదువు?” అని ప్రశ్నించెను.

అంతట రాజు “పరిశుద్ధుడైన అగస్టీన్ లేక ఇతరులు సమాధానములు నాకు చెప్పవద్దు. నీవు దానిని క్రీస్తు శరీరమందువా, లేక కాదని అందువా, నాకు స్పష్టముగా చెప్పుము” అని ప్రశ్నించెను. అందుకు లాంబర్ట్ “అట్లయిన అది క్రీస్తు శరీరమని నేను ఒప్పుకొనను” అని ప్రత్యుత్తరమిచ్చెను.

“అయితే జ్ఞాపకముంచుకొనుము, ఇప్పుడు నీవు ‘ఇది నా శరీరము’ అని క్రీస్తు పలికిన పరిశుద్ధ లేఖనముల ప్రకారము దండింపబడుదువు” అని రాజు పలికి, లాంబర్ట్ దృఢముగ నమ్ముచున్న అభిప్రాయములు సరియైనవి కావని నిరూపించుమని ఆర్చిబిషప్ క్రాన మర్ను ఆదేశించెను. (క్రాన్మర్ అప్పటికి ప్రొటెస్టంట్ సంస్కరణ సిద్ధాంతములవైపు మార్పు చెందలేదు).

క్రాన్ మర్ అనేక విధములుగ ప్రయత్నించినను లాంబర్ట్ అభిప్రాయములు సరియైనవి కావని నిరూపించలేకపోయెను. అతడు చెప్పినవాటియందు శక్తిలేదు, అవన్నియూ దేవుని సత్య వాక్యమునకు విరుద్ధముగా ఉన్నవి. చివరకు, పగలంతయు గడిచి దీపములుకూడ వెలిగించినందున రాజు ఆ చర్చను ముగింప తలంచి “ఈ జ్ఞానముగల మనుష్యుల మాటలకు, ఆలోచనలకు నీవేమి చెప్పుదువు. నీవు జీవించుటకు ఇష్టపడుచున్నావా లేక మరణించుటకా? ఏమి చెప్పుదువు? నీకు స్వేచ్ఛ ఉన్నది” అని ప్రశ్నించెను.

అందుకు లాంబర్ట్, “రాజైన మీ ఇష్టమునకు సంపూర్ణముగా లోబడుచున్నాను” అని జవాబివ్వగా, “నాకు కాదు దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకొనుము” అని రాజు పలికెను. “నా ఆత్మను దేవుని చేతులకు అప్పగించితిని, కాని నా శరీరమును మాత్రము సంపూర్ణముగా మీకు సమర్పించుచున్నాను” అని లాంబర్ట్ సమాధానమిచ్చెను.

అందుకు రాజు “నీ అంతట నీవు నా తీర్పునకు అప్పగించుకొంటే నీవు కచ్చితముగా చనిపోవలయును. ఎందుకనగా, నేను మతద్రోహుల సంరక్షకుడను కాదు” అని చెప్పి, థామస్ క్రామ్వల్వైపు తిరిగి, “క్రామ్వెల్! ఇతనికి వ్యతిరేకముగా మరణ శాసనమును చదువుము” అని చెప్పెను.

క్రామ్వల్ మరణ శాసనమును చదివిన వెంటనే లాంబర్ట్ను సజీవ దహనము చేయుటకు స్మిత్ ఫీల్డు తీసికొని వెళ్లిరి. ఈ విధముగా సజీవ దహనము గావింపబడు వారిని చూచుటకు వచ్చినట్లు లాంబర్ట్ను సజీవ దహనము చేయు సమయములోకూడా అనేకమంది లండన్ పౌరులు కొందరు స్నేహితులుగా, కొందరు విరోధులుగా మరియు కొందరు అధికారులు తమ వృత్తి ధర్మము నిర్వర్తించుటకు సమావేశమైరి. ఆ విధముగా సమావేశమైనవారిలో కేంటర్ ్బరి ఆర్చిబిషప్ థామస్ క్రాన్మర్ మరియు రాజుయొక్క ముఖ్యమంత్రి థామస్ క్రామ్వల్లు కూడా ఉండిరి.

స్మిత్ఫీల్డ్లో సజీవ దహనము చేయబడినవారిలో ధన్యుడైన ఈ హతసాక్షికంటే భయంకరముగను, నిర్దయగను చంపబడినవారు మరి ఎవరూ లేరు. అతని కాళ్లు పూర్తిగా మొండెమువరకు కాలిన తరువాత హింసకులు అగ్నిని చాలవరకు తొలగించి కొంచెము మంటను మాత్రమే అతని క్రింది భాగము కాలునట్లు ఉంచిరి. వారిలో ఇద్దరు అతనికి ఇరువైపులా నిలిచి పొడవైన ఈటెలతో అతడు అగ్నిలో పడకుండా అతని శరీరముయొక్క పై భాగమును బంధించిన స్తంభమునకు నొక్కిపట్టి ఉంచిరి.

నిస్సహాయుడైన జాన్ లాంబర్ట్ ఆ విధముగా వ్రేలాడుట చూచిన ప్రజలు సానుభూతితో విలపించిరి. అతని వ్రేళ్లచివరి భాగములనున్న క్రొవ్వుకు అగ్నితగిలి మండుచుండగా అతడు తన చేతులను ఆకాశమువైపు ఎత్తి ప్రజలకు ఈ విధముగా చెప్పెను, “క్రీస్తు తప్ప మరెవరును లేరు, క్రీస్తు తప్ప మరెవరును లేరు”. అంతట కాల్చుచున్నవారు నొక్కిపట్టి ఉంచిన తమ బల్లెములను తొలగించగా లాంబర్ట్ క్రింద మండుచున్న అగ్నిలో పడి తన ప్రాణమును క్రీస్తుకు అప్పగించెను.

ఆనీ ఆస్క్యూ

లింకన్ షైర్ యోధుడైన సర్ విలియమ్ ఆస్క్యూ కుమార్తెయైన శ్రీమతి ఆనీ ఆస్క్యూ (Anne Askew) రోమన్ కేథలిక్ సిద్ధాంతములను ద్వేషించినదను నేరముపై ఆమెను బంధించి అనేక విధములుగ చిత్రహింసలకు గురిచేసి స్మిత్ ఫీల్డ్లో సజీవదహనము గావింపవలసినదిగ తీర్పుచెప్పిరి.

అనేక భయంకర చిత్రహింసలకు గురియై నడువలేని స్థితిలోనున్న ఆనీ ఆస్క్యూను ఒక కుర్చీలో కూర్చుండబెట్టి స్మిత్ ఫీల్డనకు తీసికొనివచ్చి గొలుసులతో ఆమె శరీరమును ఉరికంబమునకు బిగుతుగా కట్టిరి. అనేకమంది ప్రజలు అచ్చట చేరుటచే వారిని అదుపుచేయుటకు చుట్టూ దడికట్టిరి. రియోత్స్ (Wriothesley) అను ఇంగ్లాండు న్యాయాధిపతి, నార్ఫోక్ ప్రభువు, బెడ్ఫోర్డ్ ప్రభువు, లార్డ్ మేయర్ మొదలగు అనేకమంది ప్రభువులు ఆ దృశ్యమును చూచుటకు పరి.

బర్తలోమయి దేవాలయమునందలి ప్రాంగణమునకు చేరిరి. వీరందరు ఆనీ ఆస్క్యూ సజీవ దహనము గావింపబడు స్థలమునకు దగ్గరగా వేయబడిన బల్లపై కూర్చుండిరి. వారిలో ఒకరు ఆమెచుట్టూ పేర్చబడిన కట్టెలపై తుపాకీ మందు కలదని విని, భయముతో నిప్పుముట్టించబోవు సమయమున అది పేలి తమమీదికి వచ్చునని హెచ్చరించెను.

అయితే కట్టెలమీద తుపాకీ మందు ఉంచబడలేదని, త్వరగా కాలుటకు ఆనీ ఆస్క్యూ శరీరముమీదనే ఉంచబడినదని బెడ్ఫోర్డ్ ప్రభువు చెప్పెను. అప్పుడు ప్రధాన న్యాయాధిపతియైన రియోత్లో తన విశ్వాసమునుండి ఆనీ ఆస్క్యూ వెనుతిరిగినట్లయితే రాజు ఆమెను క్షమించునని చివరిగా ఒక అవకాశమిచ్చెను.

అయితే ఆమె “నా విశ్వాసమును వదలుకొనుటకంటే నేను చనిపోవుటకు ఇష్టపడు చున్నాను, నా ప్రభువును తిరస్కరించుటకు నేను స్మిత్ఫల్డ్ రాలేదని” జవాబు చెప్పెను. ఈ విధముగా యోగ్యురాలైన ఆనీ ఆస్క్యూ మంటలలో సజీవముగా దహింపబడి క్రైస్తవులందరూ అనుసరించదగిన విశ్వాసముతోకూడిన గొప్ప మాదిరిని చూపించి, దేవునికి ఆశీర్వాదకరమైన త్యాగముగా క్రీ.శ. 1546 లో ప్రభువునందు నిద్రించెను.

ఏడుగురు హతసాక్షులు కలసి బాధననుభవించుట

స్మిత్ ఫీల్డ్ ను, మరి అనేక ఇతర స్థలములలోను సజీవ దహనము చేయబడిన హతసాక్షుల కథలను లేక వారి పేర్లను స్థలాభావమువలన ఈ గ్రంథములో సంపూర్తిగా వ్రాయుటకు వీలుపడలేదు. ప్రభువైన యేసునుగూర్చి యోహాను చెప్పిన విధముగా హతసాక్షుల విషయములోకూడా చెప్పుట సరిగానుండును.

యోహాను 21-25

అదే విధముగా హతసాక్షులుకూడ లెక్కించలేనంతమంది కలరు. వారందరినిగూర్చి దేవునికి మాత్రము తెలియును. కొందరి పేర్లు మాత్రమే ఇక్కడ వ్రాయుచున్నాము. వారు థామస్ మేన్ (Thomas Man), జాన్ లాసెల్స్ (John Lacels), జాన్ ఆడమ్స్ (John Adams), నీకొలాస్ బెలేనియన్ (Nicholas Belenian), జాన్ బ్రాడ్ఫోర్డ్ (John Bradford), జాన్ లీఫ్ (John Leaf), జాన్ ఫిల్పాట్ (John Philpot), థామస్ లా (Thomas Loseby), హెన్రీ రామ్సే (Henry Ramsey), థామస్ తిర్టెల్ (Thomas Thirtel), మార్గరెట్ హైడ్ (Margaret Hide), ఆగ్నెస్ స్టాన్లీ (Agnes Stanley), జాన్ హలింగ్దేల్ (John Hallingdale), విలియమ్ స్పేరో (William Sparrow), రిచర్డ్ గిబ్సన్ (Richard Gibson), హెన్రీ పాండ్ (Henry Pond), రెయినాల్డ్ ఈస్ట్ లాండ్ (Reinald Eastland), రాబర్ట్ సౌతామ్ (Robert Southam), మాథ్యూ రికర్బీ (Matthew Ricarby), జాన్ ఫ్లాయిడ్ (John Floyd), జాన్ హాలిడే (John Holiday), రోజర్ హాలెండ్ (Roger Holland) – మరియు క్రీ.శ. 1556 జనవరి 27వ తేదీన కాల్చబడిన మరి యేడుగురు.

క్రీ.శ. 1556 లో ఆ దినమున రాణియైన మొదటి మేరి పరిపాలనలో బోధకుడైన థామస్ విఠిల్ (Thomas Whittle), బార్లెట్ గ్రీన్ (Bartlet Green) అను పెద్ద మనుష్యుడు, జాన్ టడ్సన్ (John Tudson) మరియు జాన్ వెస్ట్ (John Went) అను శిల్పులను, భార్యాభర్తలైన థామస్ బ్రౌన్ (Thomas Browne) ఇసబెల్ ఫోస్టర్ (Isabel Foster) మరియు వీరి దాసియైన జోన్ లాష్ఫోర్డ్ (Joan Lashford) మొదలగువారందరిని కలిపి ఒకేసారి సజీవ దహనము చేసిరి.

వీరిలో కొందరి వృత్తాంతములనుగూర్చి కొద్ది సమాచారముమాత్రమే మనయొద్ద గలదు. లండన్ బిషప్ యైన బోనర్, థామస్ విరిల్ను అతి క్రూరముగా హింసించి, అతని ముఖముమీద పలుమార్లు కొట్టుటచే అది గుర్తుపట్టలేని విధముగా మారెను. ఒక స్నేహితునికి విఠిల్ ఈ విధముగా వ్రాసెను – “బిషప్ నన్ను పోర్టర్ అను వసతి గృహమునకు పంపించగా, అక్కడ రాత్రంతయూ నేలపైనున్న గడ్డిచాపమీద పరుంటిని. నా జీవితమంతటిలో అంతటి బాధాకరమైన రాత్రిని యెరుగను.

తరువాత బిషప్ యెదుటికి నేను వచ్చినప్పుడు, ‘నేను పిలిచినట్లయితే నీవు కేథలిక్ ఆరాధనకు వచ్చెదవా?” అని అతడు ప్రశ్నించెను. అందుకు నేను ‘నీవు పిలిచినట్లయితే నీ ఆజ్ఞ ప్రకారము తప్పనిసరిగా వచ్చెదను, కాని ఇష్టపూర్వకముగామాత్రము రాను’ అని సమాధానమిచ్చితిని. దానికి కోపోద్రేకుడైన బిషప్ అతని పిడికిలితో నా ముఖముపై కొట్టి చిన్న గదిలో నన్ను బంధించెను.

అక్కడ చాపగాని, దిండుగాని లేకుండా రెండు రాత్రులు గడపవలసివచ్చినది. అయిననూ నేను నేలమీద చక్కగా నిద్రపోతిని. దేవునికి వందనములు.” ప్రభువు కృపనుబట్టి విరిల్ తన విశ్వాసములో స్థిరముగా నిలిచియున్నందున మిగిలిన ఆరుగురితోపాటు అతనిని అగ్నియొద్దకు తీసికొనివచ్చిరి.

బార్లెట్ గ్రీన్ మంచి కుటుంబమునకు చెందినవాడు. అతడు ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయములో ఉన్నత విద్య నభ్యసించెను. విద్యార్థిగా అతడక్కడ ఉన్నప్పుడు తరచు పీటర్ మార్టిర్ (Peter Martyr) ఉపన్యాసములకు హాజరై క్రీస్తు సువార్తలోని నిజ వెలుగును గ్రహించెను. క్రీ.శ. 1556 జనవరి 15వ తేదీన అతడు నిర్బంధింపబడి మతద్రోహిగా దండించబడెను.

న్యూ గేట్ చెరసాలకు అతడు తీసుకొనిపోబడినప్పుడు, హింసింపబడుచున్న తమ సహోదరుని ఓదార్చవచ్చునను ఆశతో ఇద్దరు స్నేహితులు అతనిని కలసిరి. వారి హృదయములు స్నేహముతోను, ప్రేమతోను నిండి గ్రీన్ కొరకు ఏడ్చుచుండగా, గ్రీన్ వారితో ఇట్లనెను, “ఓ, నా స్నేహితులారా! నేను హృదయ భారముతో నున్నప్పుడు మీరు వచ్చి నాకిచ్చు ఆదరణ ఇదేనా? నన్ను ఆదరించి సేవచేయుటకు బదులు మిమ్మును మీరే ఓదార్చుకొనుచున్నారా?”

బిషప్ బోనర్ గ్రీన్ను ఇనుప దండముతో కొట్టుచున్నప్పుడు అతడు అధికముగా సంతోషించెను. అతడు ఇన్ని బాధలననుభవించినను వాటినిగూర్చి ఎక్కడను చెప్పలేదు. ఎందుకనగా అది తనను తాను ఘనపరచుకొనినట్లుండునని గ్రీన్ భావించెను. సజీవ దహనము గావింపబడుటకు ముందు తన స్నేహితుడైన మిస్టర్ కాటన్కుమాత్రమే కొంతవరకు చెప్పెను.

థామస్ బ్రౌన్ ఫ్లీట్ స్ట్రీట్ ని పరి. బ్రిడ్స్ (St. Bride’s) గురుమండలములో నివసించెను.

ఆరాధనకు గురుమండలపు దేవాలయమునకు వెళ్లకపోవుటవలన అచ్చటి పోలీసులు అతనిని బంధించి బిషప్ బోనర్ వద్దకు తీసుకొని వెళ్లిరి. అతడు థామస్ బ్రౌన్ు దేవాలయమునకు తీసుకొనివెళ్లి ఆరాధన చేయమనగా అతడు తిరస్కరించి, ఒక తోటలోనికి వెళ్లి చెట్ల మధ్య మోకరించెను. దీనికి బిషప్ బోనర్ అతనిని గట్టిగా మందలించి, “బ్రౌన్, నా యెదుట అనేక పర్యాయములు నీపై నేరారోపణ మోపబడెను. నీ పొరపాట్లనుండి నిన్ను మళ్లించుటకు నేనెంతో కష్టపడితిని. అయిననూ నీవు, నీవంటివారనేకులు నేను రక్త దాహముగలవాడనై మిమ్ములను చంప ప్రయత్నించు చున్నానని చెప్పుచుంటిరి” అనెను.

అందుకు బ్రౌన్, “అవును, నా ప్రభువా, నిజముగా నీవు రక్తపిపాసివి. సముద్రపు నీటివలె నీవు పీల్చుకొనగలిగినంత రక్తము నాలో ఉన్నది” అని జవాబిచ్చెను. బ్రౌన్ సమాధానము వినిన బోనర్ కోపోద్రేకుడై అతనిని కాల్చి చంపుమని తీర్పు చెప్పెను.

జోన్ లాష్ఫోర్డ్ కమ్మరివాడైన రాబర్ట్ వార్న్ కుమార్తె. రాబర్ట్ వార్న్ దేవుని సత్య సువార్తకొరకు హింసింపబడి కొద్దికాలము క్రితము సజీవ దహనముగావించబడెను. ఇతని భార్యయైన ఎలిజబెత్ వార్న్ క్రీ.శ 1555 జనవరి 1వ తేదీన లండన్లోని బౌ చర్చి యార్డులో తొమ్మిదిమందితో పాటు ఒక ఇంటిలో సమావేశమైనప్పుడు బంధింపబడెను.

జూన్ 11 వరకు ఆమె టవర్ జైలులో ఉంచబడినది, తరువాత న్యూ గేట్ జైలునకు బదిలీచేయబడగా అక్కడ జూలై 2వ తేది వరకు ఆమె ఉండెను. జూలై 6వ తేదీన ఈ పదిమంది ఖైదీలు బిషప్ బోనర్దుటకు తేబడిరి. వీరందరిని న్యాయ విచారణ చేయకుండనే అతి క్రూరముగా హింసించిరి.

ఈ తొమ్మిదిమంది పేర్లు ఏమనగా జార్జ్ టంకర్విల్ (George Tankervil), రాబర్ట్ స్మిత్ (Robert Smith), థామస్ ఫస్ట్ (Thomas Fust), థామస్ లేస్ (Thomas Leyes), జాన్వేడ్ (John Wade), స్టీఫెన్ వేడ్ (Stephen Wade), జార్జి కింగ్ (George King), విలియం హాల్ (William Hall), మరియు జోన్ లాష్ఫోర్డ్ (Joan Lashford).

వారిమీద మోపిన నేరములు ఏమనగా పవిత్రపరచబడిన సంస్కారము క్రీస్తుయొక్క నిజమైన శరీరమని నమ్మకపోవుట, కేథలిక్ ఆరాధనకు హాజరుకాకుండుట, అందుకు వ్యతిరేకముగ మాటలాడుట, సంప్రదాయక రోమా పండుగలకు, ఆచారములకు, సంస్కారములకు వ్యతిరేకముగా మాట్లాడుట. ఎలిజబెత్ ను బిషప్ నొద్దకు తీసికొని వచ్చి కాల్చెదమని బెదిరించినప్పుడు ఆమె అతనితో, క్రీ.శ. 1555 జూలై 12వ తేదీన ఆమెయు, ఆమెతోపాటుగల తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది మత ద్రోహులుగా తీర్పుతీర్చబడి మరుసటి నెలలో స్ట్రాట్ఫోర్డ్-లీ-బో (Stratford-le-Bow) వద్ద సజీవ దహనము చేయబడిరి.

నీవు చేయవలసినది చేయుము, నేనుమాత్రము క్రీస్తును తిరస్కరింపను

వీరితోపాటు ఆ సమయమున కాల్చబడని పదియవ వ్యక్తి ఎలిజబెత్ కుమార్తెయైన జోన్. కొంతకాలముపాటు ఆమెను విడుదలచేసి మరల కొన్ని నెలల అనంతరము తిరిగి బంధించిరి. బిషప్ బోనర్ ఆమెను పరీక్షించినప్పుడు ఆమె తాను పోప్ల బలిపూజకు హాజరుకానని, యాజకునియెదుట తన పాపములను ఒప్పుకొననని ధైర్యముగా ప్రకటించగా, ఆమె తల్లి సజీవదహనము గావింపబడిన ఆరు నెలల తరువాత జోన్ స్తంభమునకు కట్టబడి కాల్చివేయబడినది.

తెలియని ఐదు కథలు

ఫాక్స్ యొక్క క్రైస్తవ హతసాక్షుల గ్రంథమునకు దృష్టాంతములను వెదకు చున్నప్పుడు, ఐదుగురు క్రైస్తవులు హతసాక్షి మరణములను వివరించుచు చెక్కబడిన ఐదు రాగి చిత్తరువులను కనుగొంటిమి, అవి విఠాలస్ (Vitalus), శార్టింగ్కు చెందిన ఉల్ఫ్ంగ్ బిండర్ (Wolfgang Binder), హెన్రిక్ ప్రుయిజ్ (Hendrik Pruijt), జాన్ బ్రెట్ (John Bret), మరియు మత్తీయాస్ మేర్ (Matthais Mayr). ఆ సమయములో చాల తక్కువ సమాచారముమాత్రమే మాకు లభించినది. అయిననూ, ఆ రాగి చిత్తరువులను చేర్చవలెనని మేము నిశ్చయించుకొంటిమి, ఎందుకనగా వారు హింసించబడి చంపబడిన విధానము వేలకొలది హతసాక్షులు హింసింపబడి చంప బడిన విధానమునకు ఆదర్శమైనది. జ్ఞాపకముంచుకొనుటకు వారు అర్హులు.

విఠాలస్

విఠాలస్ (పటము 9 చూడుము) ఇటలీలోని రవెన్నాలో క్రీ.శ. 99 సంవత్సరములో సజీవముగా సమాధిచేయబడెను.

ఉల్ఫ్ గాంగ్ బిండర్

శార్డింగ్కు చెందిన ఉల్ఫ్ంగ్ బిండర్ (పటము 11 చూడుము) జర్మనీలోని బవేరియాలో క్రీ.శ. 1571 లో శిరచ్ఛేదము చేయబడెను.

క్రీ.శ. 1574 లో వర్కుమ్ (Workum) వెలుపట హెండ్రిక్ ఫ్రుయిజు (పటము 12 చూడుము) తారుపూసి, అతనిని చిన్న పడవకు కట్టి, నిప్పు ముట్టించి ఆ పడవను నీటిలోనికి త్రోసివేసిరి.

జాన్ బ్రెట్

బెల్జియమ్ ని ఆంట్వెర్స్లో క్రీ.శ. 1576 లో జాన్ బ్రెట్ అను (పటము 13 చూడుము) ఆంగ్లేయుని నాలుకను ఎఱ్ఱగా కాల్చిన మేకులతో రంధ్రములు చేసి, తరువాత కొయ్యకు కట్టి కాల్చివేసిరి.

మత్తీయాస్ మేర్

వైర్ (Weir) పట్టణములో క్రీ.శ. 1592 లో మేర్ను (పటము 14 చూడుము) చేతులు వెనుకకు కట్టి, నీటిలో ముంచి చంపిరి.

Leave a Comment