మొదటి క్రైస్తవ హతసాక్షులు

మొదటి క్రైస్తవ హతసాక్షులు

మత్తయి 16:18 లో ప్రభువైన యేసు తన శిష్యులతో ఈ విధముగ చెప్పెను:

ప్రభువైన యేసు మాటలలోని మూడు ప్రధానాంశములను యిట్లు గ్రహించ వచ్చును :

మత్తయి 16-18

  1. క్రీస్తు ఈ లోకములో ఒక సంఘమును కలిగియుండును.
  2. ఆయన సంఘము శక్తివంతముగ అపవాదిచే ముట్టడింపబడును.
  3. అపవాది దాడులు దానిని నాశనము చేయలేవు.

సంఘ చరిత్రను వెనుదిరిగి చూచినట్లయితే ప్రతి శతాబ్దములోను ప్రభువైన యేసు చెప్పిన మాటలు నెరవేరినట్లు మనము చూడగలము. ఘనమైన దాని చరిత్ర ఆయన మాటలు నిజమని నిరూపించును. మొదటిగా, లోకములో క్రీస్తు నిజ సంఘ మున్నదనుట నిర్వివాదాంశము.

రెండవది, ప్రతి శతాబ్దములోను ప్రతి స్థాయిలోనున్న లౌకిక, మత నాయకులు, వాటి పాలితులు బహిరంగముగాను, బలవంతముగాను వివిధమైన కపటబుద్ధి, మోసపూరిత పద్ధతులను అవలంభించుచు, యథార్థమైన ఆ సంఘమును నిందించి, బహుగా హింసించిరి.

మూడవది, ఎదురైన ప్రతి ముట్టడిని సంఘము ఓర్పుతో సహించి, క్రీస్తుయొక్క సాక్ష్యమును గట్టిగ పట్టుకొని యుండెను. క్రూరమైన కోపము, ద్వేషము సృజించిన తుపానుద్వారా సంఘము ప్రయాణించుట చూచుటకెంతో మహిమకరముగ ఉండును.

Psalm23.infoKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPsalm91.infoSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveBible Study Act

దాని చరిత్ర చాలావరకు ఈ గ్రంథములో వ్రాయబడినది. ఈ గొప్ప కార్యములు క్రీస్తు మహిమకొరకు వ్రాయబడెను. సంఘము యొక్క హతసాక్షుల అనుభవజ్ఞానము చదువరులమీద ప్రయోజనకరమైన ప్రభావము కలిగి, వారి క్రైస్తవ విశ్వాసమును బలపరచునని ఆశించుచున్నాము.

ప్రభువైన యేసుక్రీస్తు

మానవులమైన మనకొరకు పరమును వీడి, ఈ లోకమునకు వచ్చి, మానవ పాపమును సిలువలో భరించి, మన దోషశిక్షనుండి మనలను రక్షించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఈ క్రైస్తవ హతసాక్షుల వరుసలో మొదటివాడు. (పటము 2 చూడుము) ఇక్కడ గ్రంథస్థము చేయవలసిన అవసరములేకుండ ఆయన శ్రమలు, సిలువ కథ పరిశుద్ధ లేఖనములలో చక్కగ చెప్పబడినవి.

తర్వాత ఆయన పునరుత్థానము యూదుల ఉద్దేశ్యమును ఓడించినదని చెప్పిన చాలును. అంతేగాక ఆయన శిష్యుల హృదయ ములకు నూతన ధైర్యమును, నూతన మార్గమును చూపినది. పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మశక్తిని పొందిన తర్వాత, ఆయన నామమును ప్రకటించుటకు అవసర మైన నమ్మకము, ధైర్యము కలిగియుండుట యూదుల అధికారులనందరిని కలవర పరచినది, వినువారందరు విభ్రాంతినొందిరి.

మొదటి క్రైస్తవ హతసాక్షులు

క్రైస్తవ సంఘ ప్రారంభ దినములలో రోమా ప్రభుత్వ పరిపాలన కాలములో హింసలు భరించి క్రీస్తుకొరకు మరణించినవారిని మొదటి క్రైస్తవ హతసాక్షులుగా పేర్కొనవచ్చును. ప్రభువు తన శిష్యులను వీడి పరమునకు వెళ్లినపుడు, వారు ఒంటరి గాను, నిరుత్సాహముగాను యుండిరి.

వారాయన స్వరమును తరువాత కాలములో ప్రత్యక్షముగా వినకపోయినను ఆయన పరమునుండి వారిని చూచుచున్నాడని, ఆత్మ స్వరూపిగా వారిమధ్యనే యున్నాడని శిష్యులు గ్రహించిరి. ఆయన వారితోనుండగా, “మీరు సర్వలోకమునకు వెళ్లి, సకల జనులకు సువార్త ప్రకటించుడి” అను ఆయన ఆజ్ఞను తాము పాటించవలసినదని వారు గ్రహించిరి.

పండ్రెండుమంది శిష్యులలోని ఇస్కరియోతు యూదా ఆయనను యూదులకు అప్పగించిన తరువాత తన తప్పును గ్రహించి, ఉరిపోసికొని మరణించెను. అతని స్థానములో మత్తీయ అను వ్యక్తిని అపొస్తలునిగా వారు ఎన్నుకొనిరి. తరువాత వారు యేసు తమతో చెప్పిన ఆజ్ఞను నెరవేర్చుటకు పూనుకొని, సకల జనులకు క్రీస్తు నామమును ప్రకటించుటకు ప్రపంచము నలుమూలలకు వెళ్లిరి.

ఈ విధముగా క్రీస్తు సువార్తను ప్రకటించుటకు వెళ్లిన అపొస్తలులు మరియు సువార్తికులు ఎంతకాలము జీవించిరో, ఏవిధముగ మరణించిరో క్రొత్త నిబంధనలో వ్రాయబడలేదు. అయితే సంఘపెద్దయైన స్తెఫను, అపొస్తలుడైన యాకోబునుగూర్చి మాత్రమే క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడెను. సైఫను రాళ్లతో కొట్టబడి హతసాక్షి యాయెను.

యాకోబు హేరోదు ఖడ్గముచే చంపబడెను. అయితే మిగిలిన అపొస్తలు లందరు ఆలాగుననే హతసాక్షులైరని చరిత్రకారుల రచనలవలన మనకు తెలియు చున్నది. ఆలాగు హతసాక్షులైనవారి జీవితములలో కొన్నింటిని మనము ఈ గ్రంథములో చదువగలము.

స్తెఫను

యేసును చంపినవారికి విశ్వాస మార్గములో సువార్తను బోధించినందున అతడు హతసాక్షి మరణము పొందెను. సంఘ ప్రారంభ దినములలో శిష్యులసంఖ్య విస్తరించుచుండగా, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరను ఫిర్యాదు వచ్చెను.

అపొ. 6-8

అంతట పండ్రెండు గురు అపొస్తలులు శిష్యుల సమూహముతో – “మేము దేవుని వాక్యమును బోధించుట మాని, ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. కాబట్టి మీరు ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరుపొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి” అనిరి.

ఆలాగు ఏర్పాటుచేయబడిన ఏడుగురిలో సైఫను ఒకడు. సైఫను ఆత్మతోను, విశ్వాసముతోను, జ్ఞానముతోను నిండుకొని కృపావరములు కలిగినవాడు. అతడు బలముతో దేవుని వాక్యమును బోధించుచు వ్యాధిగ్రస్థులను స్వస్థపరచగా అనేకులు క్రీస్తును అంగీకరించిరి. దీనికి యూదులు కోపించి, స్తెఫను దేవునిని, మోషేను దూషించుచున్నాడని అతనిపై అబద్దసాక్ష్యము మోపి, మహాసభయెదుటకు తీసుకొని ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు వెళ్లిరి.

స్తెఫను అచ్చటకూడ యేసే ‘మెస్సీయా’ అని సాక్ష్యమిచ్చెను. వారీమాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే స్తెఫను పరిశు ద్ధాత్మతో నిండినవాడై  చెప్పగా వారు ఇంకా కోపపడి, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లురువ్వి చంపిరి.

మత్తయి 2-16,19

తన ప్రభువు సిలువవేయబడిన ఎనిమిది సంవత్సరముల తరువాత క్రీ.శ. 35 లో స్తెఫనుకు హతసాక్షి మరణము సంభవించెను. యేసు వాస్తవమునకు క్రీ.పూ. 6 లో పుట్టినట్లు, అనగా క్రీ.పూ. 4 లో హేరోదు మరణమునకు ముందు రెండు సంవత్స రములలోపు పుట్టినట్లు భావింపబడెను. (మత్తయి 2:16,19), సెఫనుకు వ్యతిరేకముగ కలిగిన ఈ ద్వేషము, ‘క్రీస్తే యూదుల మెస్సీయా’ అని గట్టి నమ్మకముతో ఒప్పుకొనిన వారందరికి అధిక హింస కలిగెను.

లూకా ఈ విధముగ వ్రాయుచున్నాడు: ఆ హింసలో సుమారు రెండువేలమంది క్రైస్తవులు మతవైరముచేత చంపబడిరి. వారిలో సంఘముచేత ఏర్పాటుచేయబడిన ఏడుగురు పెద్దలలో ఒకడైన నీకా నోరుకూడ ఉండెను. (అపొ. 6:5).

అపొ. 8-1

యాకోబు (పటము 3 చూడుము)

యూదయ రాజైన మొదటి హేరోదు అగ్రిప్ప ఆజ్ఞ ప్రకారము ఇతడు క్రీ.శ. 44 లో ఖడ్గముతో చంపబడెను. ఇతని త్యాగము యేసు ముందుగానే అతనితోను, అతని సహోదరుడైన యోహానుతోను చెప్పినదాని నెరవేర్పుగా ఉన్నది. (మార్కు 10:39) .

అపొ. 12-2-1

పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్తయైన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ (Clemens Alexandrinus) ఈ విధముగా వ్రాసెను :

“చంపబడుటకు యాకోబు తీసికొని పోబడుచున్నప్పుడు, అతనిని బంధిం చినవారిలో ఒకడు అతనితోకూడ వధస్థలమునకు వెళ్లెను. యాకోబు తన మరణసమయములో చింతాక్రాంతుడుగాను, భయముతోను ఉండునని అతడు తలంచెను. కాని యాకోబు యుద్ధములో గెలిచిన వీరునివలె ఉత్సా హముగా, సంతోషముగా ఉండుట చూచి అతడు ఆశ్చర్యపడెను. “యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడును, రక్షకుడునైయుండును.

హతసాక్షుల చరిత్ర తెలుగులో

లేనియెడల అతడు తన మరణసమయములో అంత ఆనందముతో ఉండేవాడు కాడు” అని తలంచెను. తలంచుట మాత్రమేకాదు, ఆ సమయంలోనే అతడు క్రీస్తును అంగీకరించి అపొస్తలుని పాదములమీదపడి క్షమాపణ కోరుకొనెను. వెంటనే తానుకూడ క్రైస్తవుడనని ఒప్పుకొని, యాకోబు ఒక్కడే చనిపోకూడ దనెను. ఆ మీదట వారిద్దరిని శిరచ్ఛేదము చేసిరి”.

అపొ. 6-5

ఫిలిప్పు

ఫిలిప్పు గలిలయలోని బేత్సయిదాలో జన్మించెను. అతడు ఆసియాలోని అనేక ప్రాంతములకు వెళ్లి అన్యజనులకు సువార్తను ప్రకటించెను. అతడు ప్రయాణము చేయుచూ ప్రుగియలోని హెరపొలిస్ (Hierapolis) అను పట్టణమునకు వచ్చెను. ఈ పట్టణములోని ప్రజలు భయంకరమైన సర్పారాధన చేయువారు. ఫిలిప్పు వారికి క్రీస్తు సువార్తను ప్రకటించెను.

ఆ పట్టణ అధికారులు, సర్పయాజకులు విగ్రహారాధన ద్వారా తమకు వచ్చుచున్న ధనము పోవుచున్నదని గ్రహించి ఫిలిప్పును కొరడాలతో కొట్టి, చెరసాలలో బంధించి, క్రూరముగా హింసించి సిలువవేసిరి. అతని స్నేహితుడైన బర్తొలొమయి ఫిలిప్పు మృతదేహమును సిలువమీదనుండి దింపి, సమాధిచేయుటకు అనుమతి పొందెను. ఇట్లు క్రీ.శ. 54 లో అపొస్తలుడైన ఫిలిప్పు క్రీస్తుకొరకు హతసాక్షి మరణము పొందెను.

మత్తయి (పటము 4 చూడుము)

అపొస్తలుడైన మత్తయి గలిలయలోని నజరేతులో జన్మించెను. ఇతడు కపెర హూములో పన్నులు వసూలు చేయువాడుగా జీవించెను. యేసు తన శిష్యుడుగా ఉండుటకు అతనిని పిలువగా మత్తయి సమస్తమును వదలిపెట్టి ఆయనను వెంబ డించెను. క్రీస్తు పరమునకు ఆరోహణుడైన తరువాత దాదాపు తొమ్మిది సంవత్సరముల వరకు అతడు యూదయలో సువార్తను ప్రకటించెను. యూదయను విడచి, అన్య జనులకు సువార్త ప్రకటించుటకు వెళ్లకమునుపు యూదులకొరకు హెబ్రీ భాషయందు మత్తయి సువార్తను రచించెను. తదుపరి మత్తయి జీవితమును గూర్చిగాని, అతడు ఎప్పుడు, ఎక్కడ, ఏవిధముగ మరణించినాడనిగాని ఏమీ తెలియదు. మరికొన్ని రచనలు అతడు ఇనుపమేకులతో భూమిలో గ్రుచ్చబడినాడని, ఇతియోపియాలోని నాదబ (Nadabah) అను పట్టణములో క్రీ.శ. 60 లో బల్లెముతో శిరచ్ఛేదము చేయబడినాడని తెలుపుచున్నవి.

స్టీఫన్ హతసాక్షుడు బైబిల్ వచనం

అపొ. 8-27

చిన్న యాకోబు

యోహాను సోదరుడైన యాకోబు, క్రీస్తు శిష్యవర్గములో పెద్దవాడుగా పరిగణింప బడగా ఈ యాకోబు చిన్నవాడుగా పరిగణింపబడెను. ఈయన ప్రభువైన యేసుయొక్క సహోదరుడు, యాకోబు పత్రిక గ్రంథకర్తకూడ. క్రీస్తు ఆరోహణుడైన తరువాత అతడు యెరూషలేము సంఘమునకు అధ్యక్షుడయ్యెనని తెలియుచున్నది. ఆ బోధను ఖండించుచూ యాకోబు విశ్వాసు లందరి ఉపయోగార్థమై ఒక సార్వత్రిక పత్రికను వ్రాసెను.

అపొ. కా. 12-17; 15-13-29

యాకోబు క్రీ.శ. 66 లో మరణించినాడని నమ్మినను, కచ్చితమైన కాలము, మరణించిన విధానమును గూర్చి తెలియదు. యూదుల చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ (Flavius Josephus) చెప్పిన ప్రకారము – ప్రధాన యాజకుడైన అననీయ ఆజ్ఞ ప్రకారము చిన్నయాకోబును రాళ్లురువ్వి చంపిరి. కాని తొలి క్రైస్తవ చరిత్రకారుడైన హెజిసిప్పస్ (Hegesippus), మూడవ శతాబ్దపు క్రైస్తవ చరిత్రకారుడైన యూసెబియస్ (Eusebius) లు ఉదహరించినట్లు చిన్నయాకోబు దేవాలయ శిఖరమునుండి క్రిందకు త్రోసివేయబడెననియు, కాని దాని ప్రాకారముపైనుండి పడినందువలన అతడు చనిపో లేదనియు, అతనిని దుడ్డుకఱ్ఱలతో నలుగగొట్టి చంపిరనియు తెలియుచున్నది.

క్రైస్తవ హతసాక్షుల పాత్ర

అంద్రెయ (పటము 5 చూడుము)

ఎడెస్సా (Edessa) నగరములో క్రీస్తు సువార్తను ప్రకటించుచుండగా, ఆ పట్టణ గవర్నరు అక్కడున్న విగ్రహారాధనకు భిన్నముగా బోధించినచో అతనిని చంపివేతునని బెదిరించెను. అయినను అంద్రెయ బహు ధైర్యముగా సువార్తను బోధించుచుండెను. అందుచే సమాన పొడవుగల రెండు కొయ్యలతో చేయబడి, వాటి చివరిభాగములు భూమిలో నాటబడిన ‘X’ ఆకారముగల సిలువపై అతనిని చంపవలసినదిగా శిక్ష విధింపబడెను.

మత్తయి 4-18

ఆ సిలువపై అతడు మేకులతో కొట్టబడలేదు గాని త్రాళ్ళతో కట్టబడి, తుదకు నెమ్మదిగా మరణించి హతసాక్షియాయెను. అప్పటినుండి, ‘X’ ఆకారముగల సిలువ ‘పరిశుద్దు డైన అంద్రెయ సిలువ’గా ప్రసిద్ధిచెందెను.

తనకొరకు సిద్దము చేయబడిన సిలువను చూచి అంద్రెయ ఏమాత్రమును భయపడలేదు. అతని ముఖకవళికలు మారలేదు, మనస్సు చలించలేదు. అతడు బిగ్గరగా “ఓ సిలువా, నీకు సుస్వాగతము, సంపూర్ణ మనస్సుతో, సంతోషముగా, నీ యొద్దకు వచ్చుచున్నాను. నిన్ను ప్రేమించుచున్నాను, నీమీద మరణించుటకు సిద్ధముగా ఉన్నాన”ని చెప్పి అంద్రెయ మూడు దినములు ఆ సిలువమీద వ్రేలాడుచూ, భయం కరమైన బాధ, హింసను అనుభవించెను. అయినను సిలువశ్రమను అనుభవించుచునే క్రీస్తు ప్రేమనుగూర్చి తన చుట్టూ చేరియున్న ప్రజలకు తెలియజేసెను. వారిలో కొందరు ఆ మాటలను నమ్మి క్రీస్తును విశ్వసించిరి. అచ్చట చేరిన ప్రజలలో కొందరు అంద్రెయను విడిచిపెట్టమని కోరగా, అధికారి సమ్మతించెను గాని చివరి త్రాడు విప్పుచుండగా అంద్రెయ అప్పటికే మరణించి క్రిందపడిపోయెను. ఇట్లు అంద్రెయ సిలువ వీరుడుగా తాను ప్రేమించిన క్రీస్తుకొరకు హతసాక్షియాయెను.

మత్తీయ

మత్తీయ గురించి విపులముగా తెలియదు కాని ఇస్కరియోతు యూదా స్థానములో అపొస్తలుడుగా ఎన్నిక చేయబడినవాడు. ఇతడు యెరూషలేములో రాళ్లతో కొట్టబడి, తరువాత శిరచ్చేదము చేయబడెనని తెలియుచున్నది.

మార్కు

క్రొత్త నిబంధనలో వ్రాయబడినది తప్ప మార్కును గురించి మరేమియు తెలియదు.సెరాపిస్ (Serapis) అను దేవతకు భక్తితో చేయుచున్న పండుగనుగూర్చి మార్కు వ్యతిరేకముగ మాట్లాడి నాడని అలెగ్జాండ్రియ ప్రజలు అతనిని హింసించి, ముక్కలు ముక్కలగునట్లు ఈడ్చి చంపిరని తెలియుచున్నది.

2 తిమోతి 4-11

పేతురు

క్రీస్తుకొరకు హతసాక్షియైన మరియొక అపొస్తలుడు సీమోను పేతురు. ఇతడు గలిలయలోని బేత్సయిదావాడును, జాలరియైన యోహాను కుమారుడు. యేసు అతనికి ‘కేఫా’ అను పేరు పెట్టెను. సిరియా భాషలో ‘కేఫా’ అనగా ‘రాయి’ అని అర్థము.

ఈ పేరు అతని స్థిరమైన విశ్వాసమును సూచించుచున్నది. కాని ఒక సమయములో అతడు బలహీనుడై తన ప్రభువునుగూర్చి బొంకెను. తదుపరి పశ్చాత్తాపము పొంది, క్రీస్తుకొరకు నమ్మకమైన సాక్షిగా నిలిచెను.

హతసాక్షుల గురించి బైబిల్ వచనాలు

అపొస్తలుడైన పేతురుయొక్క త్యాగమును గూర్చి తొలి క్రైస్తవ చరిత్రకారుడైన హెజిసిప్పస్ నుండి లభించినదే మనకున్న సమాచారము. క్రీస్తుయొక్క అద్భుత దర్శనము ఆ వర్ణనలో చేర్చబడినది.  వినిన శిష్యులు రోము పట్టణము విడిచి పారిపొమ్మని అతనిని ప్రాధేయపడిరి. చాల వాదము జరిగిన తరువాత అతడు బయలుదేరెను.

యోహాను 21-18

కాని అతడు పట్టణద్వారమువద్దకు వెళ్లెనో లేదో క్రీస్తు అతనివైపు నడచి వచ్చు చున్నట్టు కనిపించెను. పేతురు సాష్టాంగపడి, ‘ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావు?’ అని అడిగెను. అందుకు ప్రభువైన క్రీస్తు ‘నేను మరల సిలువ వేయబడుటకు వచ్చితిన’ని సమాధానమిచ్చెను.

యోహాను 21-19

కనుక పట్టణమునకు అతడు తిరిగివెళ్లి బంధింపబడెను. తన విశ్వాసమునకై చంపబడు స్థలమునకు అతడు తీసికొని రాబడినప్పుడు, తన ప్రభువు సిలువ వేయబడిన రీతిగ సిలువ వేయబడుటకు తాను అర్హుడను కాదని, కనుక తనను తలక్రిందులుగ సిలువవేయుడని వారిని కోరెను. ఆ ప్రకారమే తలక్రిందులుగ పేతురు సిలువ వేయబడెను.

పౌలు

క్రీ.శ. 61 లో అపొస్తలుడైన పౌలును రోమా చెరసాలలో బంధించిరి. అక్కడ నుండియే అతడు ఎఫెసు, ఫిలిప్పై, కొలొస్పై సంఘములకు పత్రికలు వ్రాసెను. అతడు సుమారు మూడు సంవత్సరములు చెరసాలలో ఉండి క్రీ.శ. 64 లో విడుదల పొందెను. అదే సంవత్సరము మే నెలలో రోము పట్టణము దగ్ధమైనది. (అపొ. 28:30). కొద్ది స్వేచ్ఛ లభించగానే, పౌలు పశ్చిమ, తూర్పు ఐరోపాలను, ఆసియా ప్రాంతమును దర్శించెను. అప్పుడే తిమోతికి మొదటి పత్రికను, తీతుకు ఒక పత్రికను వ్రాసెను.

రోము పట్టణమును తగులబెట్టినాడని మొదట నీరో నిందింపబడెను. గనుక తన మీదకు వచ్చిన నిందను తొలగించుకొనుటకు నీరో క్రైస్తవులను నిందించెను.

మొదటి క్రైస్తవ హతసాక్షులు

తత్ఫలితముగ వారియెడల భయంకరమైన హింసలు ప్రారంభమైనవి. ఆ సమయములో పౌలును పట్టుకొని మరల రెండవసారి రోమా చెఱసాలలో బంధించిరి. బహుశః అప్పుడే పౌలు తిమోతికి తన రెండవ ఉత్తరము వ్రాసెను, అదే అతని చివరి పత్రిక.

అనతికాలములోనే చక్రవర్తికి వ్యతిరేకముగ నేరము చేసిన దోషియని తీర్పుచెప్పి పౌలుకు మరణశిక్ష విధించి శిరచ్ఛేదము చేసిరి. అది క్రీ.శ. 66, అనగా యెరూషలేము నాశనమగుటకు కేవలము నాలుగు సంవత్సరములకు ముందు జరిగెను. ఈ విధముగా అపొస్తలుడైన పౌలు తాను నమ్మిన క్రీస్తుకొరకు మరణమువరకు నమ్మకముగా ఉండి హతసాక్షి మరణము పొందెను.

యూదా

క్రీస్తు కొరకు హతసాక్షియైన మరియొక అపొస్తలుడు యాకోబు సహోదరుడైన యూదా. ఇతడు మెసపొటోమియాలోని పురాతన నగరమైన ఎడెస్సాలో క్రీ.శ. 72 లో సిలువ వేయబడెను.

బర్తొలొమయి

ఇతడు అనేక దేశములలో సువార్త ప్రకటించినాడని చరిత్ర తెలియజేయుచున్నది. మత్తయి సువార్తను హిందూదేశపు భాషలోనికి తర్జుమా చేసి దానిని ఆ దేశములో బోధించుచుండగా విగ్రహారాధికులైన అన్యులు కోపగించి బర్తొలొమయిని సిలువవేసిరి.

తోమా (పటము 6 చూడుము)

ఇతనిని సిరియా భాషలో తోమా అనియు, గ్రీకు భాషలో దిదుమ అనియు పిలుతురు. తోమా పర్షియా, పార్థియా, హిందూ దేశములలో సువార్త ప్రకటించెను. హిందూదేశములోని కాలమినా (Calamina) లో కోపోద్రిక్తులైన అన్యులు బల్లెములతో పొడిచి, హింసించి, కొలిమి మంటలలోనికి విసరగా తోమా తన ప్రాణమును విడిచెను.

లూకా (పటము 7 చూడుము)

లూకా అన్యుడు, గ్రీసు దేశస్థుడైయుండవచ్చును. అతడు ఎప్పుడు, ఏవిధముగ క్రైస్తవుడైనది తెలియదు. బహుశః అతడు త్రోయలో వైద్యుడైయుండవచ్చును లో గమనించుము, త్రోయలో లూకా తన అంశములో ‘వారు’ అను పదమునుండి ‘మనము’ అను పదమునకు వెళ్లెను.

హతసాక్షుల చరిత్ర తెలుగులో

అపొ. 16-8 - 10

“అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి – నీవు మాసిదో నియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొను చున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.”

హతసాక్షుల గురించి బైబిల్ వచనాలు

లూకా పౌలుతో ఫిలిప్పై వెళ్లెను, కాని అతనితోపాటు చెరసాలలో ఉంచబడలేదు మరియు పౌలు విడుదలైన తరువాత అతనితో ప్రయాణము చేయలేదు. లూకా ఫిలిప్పైని తన నివాసముగ చేసికొని అక్కడ కొంతకాలము ఉండెను. అప్పటినుండి అతడు యెరూషలేమునకు వెళ్లువరకు పౌలుతో కలసి ప్రయాణముచేసెను. పౌలు యెరూషలేములోను మరియు కైసరయ చెరసాలలో బంధింపబడినప్పుడు లూకా మరియొకసారి కనిపించకుండ వెళ్లెను.  అనేకమంది బైబిలు పండితులు లూకా పౌలుతో ఉన్న ఈ కాలములోనే తన సువార్తను, అపొస్తలుల కార్యముల గ్రంథమును వ్రాసినాడని నమ్ముచున్నారు.

(అపొ. 20-5,6)

స్టీఫన్ హతసాక్షుడు బైబిల్ వచనం

పౌలు రెండవసారి ఖైదులో ఉంచబడినప్పుడు లూకా పౌలుతో లేక పౌలుకు దగ్గరగా ఉన్నట్టు కనిపించుచున్నది.  పౌలుతో కలసి సువార్తను ప్రకటించిన విధముగానే లూకా పౌలు మరణించిన తరువాతకూడ సువార్తను ప్రకటించుచునే ఉండెను.

తిమోతి 4-11

అయితే లూకా ఎప్పుడు, ఏవిధముగా చనిపోయెననునది స్పష్టముగా తెలియదు. ఒక పురాతనాధారమునుబట్టి, ‘ఏ విధమైన ఆటంకము లేకుండ లూకా ప్రభువును సేవించెను. అతనికి భార్యగాని పిల్లలుగాని లేరు. ఎనుబది నాలుగు సంవత్సరముల వయస్సులో బొయాషియా (Boeatia) లో పరిశుద్ధాత్మపూర్ణుడై శాశ్వతముగా నిద్రించి నాడని’ తెలియుచున్నది. మరియొక తొలి ఆధారము – సువార్తను ప్రకటించుటకు అతడు గ్రీసు దేశము వెళ్లగా, ‘అచ్చట ఏథెన్సు నగరములో ఒక ఒలీవ చెట్టుకు వ్రేలాడదీయబడుటవలన క్రీ.శ. 93 లో హతసాక్షియైనాడని చెప్పుచున్నది.

క్రైస్తవ హతసాక్షుల పాత్ర

ప్రకటన గ్రంథములోని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్టీస్, ఫిలడెల్ఫియ, లవొదకయ అను ఏడు సంఘములను స్థాపించి కీర్తి గడించిన అపొస్తలుడైన యోహాను యాకోబునకు సహోదరుడు. ఇతనిని ఎఫెసులో బంధించి, రోమునకు తీసుకొనివెళ్లి అక్కడ సలసల కాగుచున్న నూనె పాత్రలోనికి విసరివేసిరి గాని అది అతనికి ఏ హానియు చేయలేదని చెప్పబడినది. ఫలితముగ అతడు విడిపింపబడి, చక్రవర్తి డొమిషియన్ (Domitian) ఆజ్ఞచే పత్మాసు ద్వీపమునకు ఖైదీగా పంపబడగ, అతడక్కడ ప్రకటన గ్రంథమును వ్రాసెను. పత్మాసునుండి విడుదల పొందిన తరువాత అతడు ఎఫెసునకు తిరిగివచ్చి, అక్కడ క్రీ.శ. 98 లో మరణించెను. క్రూర మరణమును తప్పించుకొనిన అపొస్తలుడు ఇతడు ఒక్కడే.

హింసలు కొనసాగుచున్నను, క్రూర మరణములు సంభవించుచున్నను రక్షింప బడినవారినందరిని ప్రభువు తన సంఘమునకు చేర్చుచుండెను. సంఘము అపొస్తలుల సిద్ధాంతములతో లోతుగా వేళ్లూని, పరిశుద్దుల రక్తముతో బాగుగా తడుపబడి, తనకు సంభవింపనైయున్న క్రూర హింసలకు సిద్దపడియున్నది.

Leave a Comment