మార్టిన్ లూథర్ : సేవ, హింసింపబడుట (క్రీ.శ. 1517-1546)

మార్టిన్ లూథర్ : సేవ, హింసింపబడుట (క్రీ.శ. 1517-1546)

మార్టిన్ లూథర్ క్రీ.శ. 1483 నవంబరు 10న హాన్స్ అను గని కార్మికునికి సార్జనీ (Saxony) లోని ఐస్లెబెన్ (Eisleben) లో జన్మించెను. యువకుడైన లూథర్ మాగెబర్గ్ (Magdeburg), ఐసెనాక్ (Eisenach) ల యందు విద్యనభ్యసించిన తరువాత ఎర్ఫర్ట్ (Erfurt) విశ్వవిద్యాలయములో ప్రవేశించెను.

క్రీ.శ. 1505 లో పట్టభద్రుడై తండ్రి కోరికమేరకు న్యాయశాస్త్రమును చదువుట ప్రారంభించెను. కాని కొద్దికాలమునకే న్యాయశాస్త్రమును చదువుట వదలి, ప్రపంచమునే త్యజించి, ఎర్ఫర్టోని అగస్టీనియన్ సన్యాసుల మఠములో చేరెను. ఈ ఆకస్మిక నిర్ణయమునకు కారణము ఒకసారి భయంకరమైన ఉరుము, మెరుపుల శబ్దమునకు అతడు భయపడి క్రిందపడెను. ఆ భయముతో ‘ఈ అశాశ్వత జీవమునకు విలువలేదని ఆత్మయొక్క నిత్యజీవమే ముఖ్యమ’ని గ్రహించెను.

క్రీ.శ. 1508 లో మఠమునందు లూథర్ అభిషేకము నొందెను. క్రీ.శ 1509 లో విటెన్బర్గ్ (Wittenberg) విశ్వవిద్యాలయములో చదువుకొనుటకు మరియు వేదాంతము ఉపన్యసించుటకు పంపబడెను. క్రీ.శ. 1510 లో ఒక పని నిమిత్తము అతడు రోమును సందర్శించి, అక్కడ ప్రముఖ సంఘ నాయకులలో బాహాటముగ కనిపించుచున్న అవినీతిని చూచి విస్మయమునొందెను. క్రీ.శ. 1511 లో వేదాంత శాస్త్రములో డాక్టర్ డిగ్రీని పొంది, అనంతరము విటెన్ బర్గ్ విశ్వవిద్యాలయములో దైవశాస్త్రాచార్యునిగా నియమింపబడెను.

మార్టిన్ లూథర్ రోమన్ కేథలిక్ మతసిద్ధాంతములలో గొప్ప అనుభవము కలిగిన వ్యక్తియైనప్పటికిని, అతడు ‘క్రైస్తవ మతము’ను దీక్షతో పాటించుటకు పూనుకొనెను. అయితే అతని ఆత్మీయ స్థితి వ్యక్తిగత ఆందోళనకు గురిచేసెను. అతనికి అధికమగు చున్న వ్యాకులతకు సరియైన సమాధానము అతడు బోధించుచున్న వేదశాస్త్రములో లభించలేదు.

దేవుని చట్టము మానవ బలహీనతలను అంగీకరించునా? లేక దేవుని చట్ట సమ్మతమైన జీవితము జీవించవలెనా? అను ప్రశ్న ఉత్పన్నమైనది. జవాబును కనుగొనుటకు బైబిలు మాత్రమే ముఖ్యమైనదిగా భావించి చదువుట ప్రారంభించెను. ఆ విధముగ చదువుచున్నప్పుడు అపొస్తలుడైన పౌలు వ్రాసిన రోమా పత్రికపై అతడు తన దృష్టిని కేంద్రీకరించి, అందులో జవాబును కనుగొనెను.

యేసు క్రీస్తు యొక్క సిలువ మరణమునందు దేవుడు మను ష్యులను తనతో సమాధానపరుచుకొనెను.

దేవుని కృపవలన మాత్రమే పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలిగి విశ్వాసము ద్వారా స్వీకరింపబడితిమి. అందువలన మనుష్యుడు చేయ వలసినది ధర్మశాస్త్రమునకు సంపూర్ణముగా లోబడుట లేక మత సిద్ధాంతములను కచ్చితముగ నెర వేర్చుటద్వారా కాదుగాని, క్రీస్తులో దేవుడు సంపూర్తి చేసిన కార్యమునందు విశ్వాసముకలిగి యుండుటయే ముఖ్యము. విశ్వాసము పరిపూర్ణ మైనప్పుడు శిక్షింప బడుదుమను భయమువలన కాదుగాని, ప్రేమద్వారానే విధేయు లగుటకు నడిపింపబడుచున్నాము.”

లూథర్ తన చదువులో ఇంకనూ కొనసాగుటవలన పూర్వమునుండి వంశ పారంపర్యముగా వచ్చుచున్న మూఢనమ్మకములు మరియు రోమన్ కేథలిక్ సంఘము యొక్క బోధలు అపొస్తలుడైన పౌలుయొక్క సిద్ధాంతములకు చాల భిన్నముగ ఉన్నవని గ్రహించెను.

అవి లూథర్ యొక్క వ్యక్తిగత ఉద్దేశ్యములను మార్చి, త్వరలో అతడు ఆ మూఢనమ్మకములనుండి మరియు రోమన్ కేథలిక్ తప్పుడు సిద్ధాంతములనుండి వేరై, ఆత్మ రక్షణ విషయములో మానవుని ప్రమేయము కలదని నొక్కి చెప్పిన రోమా వేదాంత పాండిత్యమును తిరస్కరించెను. సత్కార్యములద్వారా నీతిమంతునిగా తీర్చ బడుదురని చెప్పు రోమా సంఘపు అలవాట్లను, బోధలను లూథర్ త్రోసిపుచ్చెను. అతడు క్రొత్తగా అర్థము చేసికొనిన సిద్దాంతములైన సత్యసువార్త, క్రీస్తు ముగించిన పని, అతనిని త్వరలోనే రోమా సంఘాధికారులతో సంఘర్షణకు దారితీసెను.

క్రీ.శ. 1517 లో పాపపరిహార పత్రికలను అమ్ముచున్న తన సంఘనాయకులను ముఖాముఖిగా ఎదిరించుటద్వారా మార్టిన్ లూథర్ కేథలిక్ నాయకులతో తన సంఘర్షణ ప్రారంభించెను. రోములో పరిశుద్ధుడైన పేతురు దేవాలయమును నిర్మించుటకు కావలసిన ధనమును సమకూర్చుటకు పోప్ పదియవ లియో (Pope Leo X) పాపపరిహార పత్రికలను రోమన్ కేథలిక్లకు అమ్ముట ప్రారంభించెను. ఈ పత్రికలు కొనుటద్వారా వారు తాము చేసిన పాపమును పోగొట్టుకొనెదరు.

ఇది చూచిన అనేకమంది యుక్తిగల మతాధిపతులు వెంటనే తమ దేవాలయములకొరకు లేక వారి స్వప్రయోజనములకొరకు పాపపరిహార పత్రికలనమ్ముచు ధన సంపాదనలో పడిరి. లేఖనములకు భిన్నమైనది మరియు క్షమించు దేవుని కృపను, యేసుక్రీస్తుయొక్క శ్రమలను, సిలువ మరణమును అవమానపరచు ఈ దుష్ట సంప్రదాయమును లూథర్ అడ్డుకొనెను.

లూథర్, పోప్ లియోలు ఈ విషయముపై వెంటనే విభేదించిరి. కనుక మార్టిన్ లూథర్ క్రీ.శ. 1517 అక్టోబరు 31న విటెన్బర్గ్ లోని కేజిల్ చర్చి (Castle Church) ప్రధాన ద్వారమునకు తొంబది ఐదు ప్రతిపాదనలు కలిగిన పట్టికను మేకులతో కొట్టెను. పాపపరిహార పత్రికలను అమ్మి పాపములను క్షమించు అధికారము పోప్లకు లేదనెను.

అనతికాలములోనే లూథర్ ప్రకటించిన ప్రతిపాదనలు జర్మనీ అంతటా ప్రచారము పొంది గొప్ప వివాదమును సృష్టించెను. (తొంబది ఐదు సిద్ధాంతముల పూర్తి జాబితాకొరకు మొదటి అనుబంధము చూడుము).

సంఘపరముగ మతాచార్యులు, బోధకులందరు తమ ఉపదేశములు, రచనలద్వారా లూథర్ ఉపదేశములను ఎదుర్కొనుచుండిరి. వారిలో ఒకడు ‘లూథర్ మతద్రోహి, అతడు అగ్నితో కాల్చి చంపబడుటకు యోగ్యుడ’ని చెప్పి, లూథర్ రచనలు, ప్రసంగము లలో కొన్నింటిని తీసికొని, లూథరన్ను కాల్చుటకు గుర్తుగా వాటిని తగులబెట్టెను.

తరువాత వెంటనే జర్మన్ చక్రవర్తియైన మాగ్జిమిలియన్ (Maximillian), పవిత్ర రోమా సామ్రాజ్య చక్రవర్తియైన ఐదవ చార్లెస్, స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్, పోప్ మొదలగువారందరు సాగనీ రాజైన మూడవ ఫ్రెడరిక్ (Frederick III) ను కలసికొని లూథర్ను నెమ్మదిపరచవలెనని కోరిరి. ఫ్రెడరిక్ వెంటనే స్పందించలేదు.

కాని, ఆ సమస్య విషయములో కొందరు పండితులను, ఇరాస్మస్ వంటివారినికూడా సంప్రదించెను. ఇరాస్మస్ రాజుతో మార్టిన్ లూథర్ రెండు గొప్ప తప్పిదములు కలవని చెప్పెను. అవి 1. అతడు మతాచార్యుల పొట్టకొట్టుట, 2. పోపు కిరీటమును పగడొట్టుట. కొంతమంది వేదశాస్త్ర పండితులు సంఘములోని తప్పులను సవరించు టకు లూథర్కుగల ఆసక్తి సరియైనదేనని రాజుకు జవాబివ్వగా, రాజుకూడ ‘లూథర్ యొక్క సిద్ధాంత ప్రభావము సరియైనదే’నని వారు చెప్పిన విషయమును ధృవీకరించెను.

అదే సంవత్సరములో ఇరాస్మస్ ఆర్చిబిషపైన మెంజ్ (Mentz) కు ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో అతడిట్లు తెలిపెను, “ఈ లోకము మానవ నిర్మితమైన సంస్థలతోను, యాచించుచున్న మతాచార్యుల కౄరత్వముతోను నిండియున్నది. వారి బోధలను వ్యతిరేకించువారెవరైనను మతద్రోహిగా పరిగణింపబడును. మతాధిపతులను అనుసరింపనివాడు మతద్రోహియని, వారికర్ణముకాని దేనినైననూ మతద్రోహమని ముద్రవేసిరి. గ్రీకు భాషను తెలిసికొనుట లేక వారికంటే చక్కగా మాట్లాడగలుగుటకూడ మతద్రోహమైనది.”

క్రీ.శ. 1518 ఆగస్టు 7న ఆస్కోలి బిషప్ (Ascoli) హైరోమ్ (Hierome) లూథర్ను రోమ్ముకు రావలసినది శాసించెను. రాజైన ఫ్రెడరిక్ మరియు విటెన్బర్గ్ విశ్వవిద్యాలయమువారు లూథర్ పక్షముగ పోప్కు ఉత్తరములు వ్రాసిరి. లూథరెయెడల సానుభూతి కలవాడని తలంచిన పోప్ సలహాదారుడైన కెరోలస్ మిలీషియస్ (Carolus Miltitius) కు కూడ వారు అట్టి ఉత్తరమునే వ్రాసిరి.

ఆ ఉత్తరములో వారు లూథర్ను రోమ్కు బదులు ఆక్స్బర్గ్ కార్డినల్ కెజేటన్ (Cardinal Cajetan) వద్ద విచారించ వలయునని కోరగా, పోప్ విచారణ నిమిత్తము లూథర్ను ఆక్స్బర్గ్కు పిలిపించి, అక్కడనుండి అవసరమయితే బలవంతముగా అతనిని రోముకు తీసికొనిరావలసినదిగా కెజేటన్ను ఆజ్ఞాపించెను.

కార్డినల్ ఆజ్ఞ మేరకు క్రీ.శ. 1518 అక్టోబరులో మార్టిన్ లూథర్ ఆక్స్బర్గ్ వెళ్లెను. అతడు వెళ్లుచూ అతనిని మెచ్చుకొనుచు అనేకమంది వ్రాసిన ఉత్తరములను తనతోపాటు తీసికొని వెళ్లెను. మాగ్జిమిలియన్ చక్రవర్తినుండి తనకెట్టి ప్రమాదము వాటిల్లదను హామి వచ్చువరకు ఆక్స్బర్గ్ లో అతడు మూడు దినములు వేచియుండెను. తరువాత కార్డినల్ కెజేటన్ ముందు లూథర్ హాజరుకాగా, కార్డినల్ లూథరు మూడు విషయములను గురించి తెలియజేయవలసినదిగా ఆజ్ఞాపించెను :

  1. తన తప్పులనుగూర్చి పశ్చాత్తాపపడి వాటిని వెనుకకు తీసికొనుట.
  2. మరలా అదే తప్పులను చేయకుండుట.
  3. సంఘమును బాధపెట్టు విషయములన్నిటినుండి వెనుకకు మళ్లుట.

మార్టిన్ లూథర్ తన తప్పు ఏమిటని కార్డినల్ను ప్రశ్నించినప్పుడు, పోప్ లియో పంపిన ఆజ్ఞాపత్రికను కార్డినల్ అతనికి చూపించి, పాపపరిహార పత్రికలు పాప క్షమాపణ నిమిత్తము ఇవ్వబడినవని, రొట్టె, ద్రాక్షారసము తీసికొనువారికి దేవునియందు విశ్వాసము అవసరము లేదని, విశ్వాసమునకు సంబంధించిన అన్ని విషయములలో పోప్యొక్క అధికారమునకు తిరుగులేదని చెప్పెను.

లూథర్ తిరిగి వ్రాతపూర్వకముగ ఇచ్చిన సమాధానములో, పోప్కూడ తప్పులు చేయు అవకాశమున్నదని, అతడు చెప్పినది లేఖనముల ప్రకారమున్నప్పుడు మాత్రమే అతనియెడల మనము విధేయత చూపింపవలెనని, విశ్వాసియైన యే క్రైస్తవునికైననూ అతనితో విభేదించుటకు, దేవుని వాక్యమునుండి అతని తప్పులను ఎత్తిచూపించుటకు అధికారము కలదని చెప్పెను.

మరియు లూథర్ నీతిమంతుడెవడును లేడని, ఎవరును క్రియలద్వారా నీతిమంతులుగా తీర్చబడరని, సంస్కారమునాచరించువారెవరైనను క్రీస్తు పూర్తిచేసిన పనియందు విశ్వాసము కలిగియుండవలెనని తెలిపెను. ప్రతి అంశములోను తన మాటలను ఖాయపరచుకొనుటకు లూథర్ లేఖన భాగములనే ఉదహరించెను.

ఏది ఏమైనను, కార్డినల్ ఈ విషయములో లూథర్ ఉదహరించిన పరిశుద్ధ లేఖనములను వినుటకు ఇష్టపడలేదు. లూథర్ చెప్పిన బైబిలు వాదములనుకూడా అతడు లెక్కచేయక, లేఖనములనుండికాక సంప్రదాయముగా వచ్చుచున్న సిద్ధాంత ములను, మూఢనమ్మకములను ఉదహరించుచూ అతడు తన సొంత జ్ఞానమునుబట్టి మాట్లాడి లూథర్ను పశ్చాత్తాపపడి రమ్మని చెప్పెను. లూథర్ ఆక్స్బర్గ్ మూడు దినములుండి తనకు విధించబడిన నిబంధనలకు మౌనముగా ఉండగలనని, తన శత్రువులుకూడా ఆలాగుననే ఉండవలెనని తెలియచేయు ఉత్తరమును కార్డినల్కు వ్రాసెను.

అతడక్కడ మరి మూడు దినములుండినను కార్డినల్నుండి ఏ సమాధానము రాలేదు. స్నేహితుల సలహామీద అతడు ఆక్స్బర్గ్ విడిచి విటెన్బర్డ్కు తిరిగివచ్చెను. అతడు బయలుదేరుటకు ముందు బహిరంగ స్థలములలో అతికించిన పట్టికలనుగూర్చి కార్డినల్కు వివరణను, పోప్కు విన్నపమును పంపెను.

లూథర్ విన్నపమునకు సమాధానముగ పోప్ ఒక నూతన శాసనమును జారీ చేసెను. “పాపపరిహార పత్రికలిచ్చు అధికారము ‘అన్ని సంఘములకు కేంద్రమైన రోమ్లోని పవిత్ర మాతృ సంఘము’ యొక్క సిద్ధాంతములలోని ఒక భాగమని, పోప్లు పేతురుయొక్క వారసులని, క్రీస్తు ప్రతినిధులని ప్రకటించెను.

మృతులకు, సజీవులకు మరియు పాప విమోచన లోకములో (Purgatory) ఉన్నవారిని పాపమునుండి విడుదలచేయుటకు కావలసిన పాపపరిహార పత్రికలను మంజూరుచేయు అధికారము కూడ వారికి కలదని చెప్పెను. ఈ సిద్ధాంతమును క్రీస్తును విశ్వాసముతో వెంబడించు వారందరూ అంగీకరింపవలెను. ఈ సిద్ధాంతమును అంగీకరింపక, ఆచరింపకనుండు కేథలిక్ లు గొప్ప శాపముతోకూడిన బాధను పొందుదురని, వారు సంఘమునుండి పూర్తిగా వెలివేయబడుదురని హెచ్చరించెను.”

పోప్ ఇచ్చిన ఈ శాసనమును లూథర్ ఆక్షేపించుచూ రోమన్ కేథలిక్ సంఘ సర్వసభ్య సమావేశమునకు విన్నవించుకొనుటద్వారా దానికి సమాధానమిచ్చెను. లూథర్ సర్వసభ్య సమావేశమునకు చేసిన ఫిర్యాదును పోప్ పదియవ లియో తెలిసికొని జర్మన్వాడైన కరోలస్ మిలీషియస్ (Carolus Miltitius) అను తన సలహాదారునికి ఒక బంగారు గులాబి పుష్పమునిచ్చి దానిని ఫ్రెడరిక్ రాజుకు అందజేయవలసినదిగా పంపించెను.

మిలీషియస్ ఆ ప్రాంతములోని ఇతర ప్రభువులకు పోప్నుండి రహస్య ఉత్తరములుకూడ తీసికొని వెళ్లెను

అయితే మిలీషియస్ జర్మనీ చేరకముందే, రోమా చక్రవర్తియైన మొదటి మాగ్జి మిలియన్ చనిపోయెను. (జనవరి, క్రీ.శ. 1519). వెంటనే ఖాళీ సింహాసనముకొరకు ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీపడిరి. వారు ఫ్రాన్సు రాజైన మొదటి ఫ్రాన్సిస్, మరియు స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్. అదే సంవత్సరము ఆగస్టు నెల చివరకు చార్లెస్ జర్మనీ రాజుగను మరియు పవిత్ర రోమా చక్రవర్తిగను ఐదవ చార్లెస్ అను బిరుదుతో తన తండ్రి తరపున తాతగారైన మొదటి మాగ్జిమిలియన్ స్థానములో ఎన్నుకొనబడెను.

క్రీ.శ. 1519 వేసవిలో మార్టిన్ లూథర్, అతని ఉపదేశములనుగూర్చిన విభేదములు సుడిగాలివలె వ్యాపించెను. ఫ్రెడరిక్ రాజు మేనమామ, సాగనీ రాజైన జార్జ్ పరిపాలన కాలములో లీప్సిక్ (Leipsic) నగరమందు ఒక బహిరంగ సభ ఏర్పాటుచేయబడెను. ఈ వాగ్వివాదము జాన్ ఎఖియస్ (John Eckius) అను బోధకునికి, విటెన్ బర్గ్ ఆచార్యుడైన అంద్రెయ కెరోలోస్టాడ్ (Andreas Carolostadt) కు మధ్య జరిగెను.

ఎఖియస్ మార్టిన్ లూథర్ బోధించిన కొన్ని ఉపదేశములను, ముఖ్యముగా మతాధిపతుల క్షమాపణకు సంబంధించినవాటిని ఖండించెను. కెరోలో స్టాడ్, మార్టిన్ లూథర్ పక్షమున బలముగా వాదించెను. రాజైన జార్జ్ తర్కించుటకు వచ్చిన ఆ ఇద్దరికి, దాని చూచుటకు వచ్చిన ప్రేక్షకులకు ఏ అపాయము కలుగదని వాగ్దానము చేసెను. లూథర్ తర్కములో పాల్గొనుటకు కాదుగాని, వారు తర్కించు కొనునది వినుటకు హాజరయ్యెను.

లూథర్ ఉద్దేశ్యము వ్యతిరేకముగ ఉన్నను అతడు తప్పనిసరిగా ఎఖియస్తో వాదించవలసివచ్చెను. అతడు చర్చించిన ముఖ్యాంశము పోప్ యొక్క అధికారమును గురించినది. పోప్ జారీచేసిన శాసనముల విషయములో లూథర్ తన అలవాటైన దృక్పధమునే కలిగియుండి, పోప్ ప్రవేశపెట్టిన శాసనములకు లేఖనముల సమర్థన లేకుంటే అవి చెల్లనేరవని చెప్పెను.

పోప్లు పరిశుద్ధుడైన పేతురు వారసులనియు, సంఘముపై వారికి సంపూర్ణ అధికారము కలదను సంప్రదాయ సంఘ పద్ధతులను ఎఖియస్ బలపరచెను. అందు వలన వారు భూమిమీదనున్న క్రీస్తుయొక్క ప్రతినిధులనీ, రోమా బిషప్ యొక్క అధికా రము దేవుని చట్టములో స్థిరముగా స్థాపింపబడినదనీ అతడు బలముగా వాదించెను.

ఈ వాగ్వివాదములు ఐదు దినములు కొనసాగెను. ఎఖియస్ తన వాదనలో మూర్ఖత్వమును, అవిధేయతను, మోసమును ప్రదర్శించెను. అతడు లూథర్ను పోప్ చేతులకు అప్పగింపవలెనని తలంచెను. అందుకు కారణములను ఈ విధముగా చెప్పెను : “సంఘమనునది ఒక పౌర సమితివంటిది. నాయకుడు లేకుండా సంఘము, సైన్యాధిపతి లేకుండా సైనికదండు ఉండవు అని దేవుని చట్టము తెలుపుచున్నది. క్రీస్తుయొక్క సార్వత్రిక సంఘమునకు పోప్ నాయకుడుగ ఉండవలెననునది దేవుని చట్టముయొక్క సారాంశమేయని గ్రహించవలెను.”

సంఘమునకు అధిపతి కలడు ఆ అధిపతి స్వయముగా యేసుక్రీస్తేనని చెప్పుట ద్వారా మార్టిన్ లూథర్ ఆ వాదమును ఎదిరించెను. ఆయన ఒక్కడే సంఘమునకు శిరస్సుయని చెప్పెను. అప్పుడు ఎఖియస్ మత్తయి సువార్తలో యేసుప్రభువు చెప్పిన మాటలను ఉదహరించెను, “మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును” (మత్తయి 16:18).

యోహాను 20-22, 23

ఈ వాక్యము విశ్వాసముయొక్క ఒప్పుకోలు అని, పేతురు సార్వత్రిక సంఘమునే సూచించుచున్నాడు కాని తననుమాత్రము కాదని, ఆ బండ యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యమే కాని పేతురు కానే కాదని లూథర్ విశదపరచెను. (యోహాను 21:16). ఈ మాటలు ప్రభువు పేతురుకుమాత్రమే చెప్పెననెను. అందుకు మార్టిన్ లూథర్

లూథర్ చెప్పినదానికి ఆధారములతో కూడిన అధికారముతో తన స్థానమును నిర్ధారించుకొనుటకు ఎఖియస్ కాన్స్టన్స్ సభయొక్క తీర్మానములను చూపించెను. సభలోని సభ్యులు పోపనకు వారి విధేయతను, సభకు అతనిని “పరమోన్నతాధికారిగ” నియమించుటను అతడు ఉదహరించెను. అట్టి ప్రముఖమైన విషయములో సాధారణ సభ తప్పుచేయదని అతడు చెప్పెను.

కొన్ని తీర్పులు మరియు కాన్స్టన్స్ సభయొక్క అధికారము గొప్పగా ఎంచబడినవి, కాని సభకు సంబంధించిన కొన్ని అంశములు ప్రశ్నింపతగినవి. ఎందుకనగా అవి మనుష్యుల సామాన్య తీర్పులని లూథర్ చెప్పెను. మరియు అతడు “ఏ సభకైనను విశ్వాసమునకు సంబంధించిన విషయములలో క్రొత్త ప్రతిపాదనలు చేయు అధికారము లేదు, ఇది నిశ్చయము” అని చెప్పెను.

ఈ వాగ్వివాదములోని నివేదికలు సరియైన నిర్ణయములు కాకపోయినను వాటిని ఐరోపా అంతటా వ్యాపింపజేసిరి. ఆ విధముగ ఎఖియస్ తన స్థానమును నిలుపు కొనెను. అయితే అతడు లూథర్ విశ్వాసమునకు, ఆచరణకు పరిశుద్ధ లేఖనములు ముఖ్య నియమములని దృఢముగ నమ్మెను.

క్రీ.శ. 1520 లో లూథర్ మూడు పుస్తకములు వ్రాసి, వాటిలో తన అభిప్రాయము లను వెల్లడించెను. మొదటిది ‘జర్మన్ దేశ క్రైస్తవ ఉన్నత వర్గానికి ఉద్బోధన’ (The Address to the Christian Nobility of the German Nation) అను పుస్తకము. ఇందు సంఘ సంస్కరణను తమ స్వహస్తములలోనికి తీసికొనవలెనని జర్మనీ ప్రభువుల నతడు ప్రోత్సహించెను.

రెండవ పుస్తకము ‘సంఘముయొక్క బబులోను చెరకు పీఠిక’ (A Prelude Concerning the Babylonian Captivity of the Church). ఇందులో అతడు రోమా సంఘముయొక్క ఆధిపత్యమును, సంస్కారములను ఖండించెను. మూడవది ‘క్రైస్తవ వ్యక్తి స్వాతంత్య్రము’ (On the Freedom of a Chris- tian Man). ఇందులో క్రైస్తవుని స్వాతంత్య్రము, దేవుని కృపావరములలో దృఢమైన విశ్వాసము, సత్కార్యములను వివరించెను.

లోవియన్ మరియు కొలోనే పట్టణములలోని మతగురువులు, పండితులు లూథర్ పుస్తకములు మత ద్రోహమునకు సంబంధించినవని నిందించిరి. మూర్ఖత్వము, క్రూరత్వము, దుర్మార్గము, అపవిత్రత కలిగి తనను నిందించు అధికారము కలిగిన మతగురువులకు లూథర్ తగినరీతిగ సమాధానమిచ్చెను.

క్రీ.శ. 1520 జూన్ 15న, పోప్ పదియవ లియో లూథర్కు ఒక ఆజ్ఞాపత్రికను జారీచేసెను. దాని ప్రకారము లూథర్ తన మతవ్యతిరేక చర్యలను అరువది దినములలో రద్దుపరచుకొనవలెను. అయితే ఆ ఆజ్ఞాపత్రిక లూథర్పై కాని, అతని సిద్ధాంతములపై కాని ఎట్టి ప్రభావమును చూపలేదు.

జర్మనీ ప్రభువులకు వ్రాసిన తన మొదటి పుస్తకములో లూథర్ మతగురువుల అధికారమును మూడు ముఖ్య భాగములుగా విమర్శించెను. అవి ఈ విధముగ నుండెను.

  1. ఆత్మీయ విషయములలో లోక సంబంధమైన నాయకులకు అధికారము లేదు.
  2. భేదము వచ్చిన వాక్యభాగము లేఖనములలో ఎక్కడున్నను పోహామాత్రమే దానిని వివరింపవలెను కాని మరియొకరు వివరింపకూడదు.
  3. పోప్ మినహా మరియొకరికి సభను సమావేశపరచు అధికారము లేదు.

ఇంకా అనేక విషయములను వివరించెను. అవి, పోప్ యొక్క గర్వమును అనుమ తింపకూడదు, జర్మనీనుండి చాలా ధనము పోప్కు పంపించబడెను, బోధకులు వివాహము చేసికొని భార్యలను కల్గియుండుట అనుమతింపబడవలెను, మాంసమును తినుటకుగల స్వాతంత్ర్యమును అరికట్టకూడదు, ఇష్టపూర్వకమైన పేదరికము మరియు యాచనను నిషేధింపవలెను, చక్రవర్తి సిజిస్మండు జాన్ హస్, జెరోమ్లతో పాటు నిలువబెట్టవలెను, మతద్రోహులను అగ్నితోకాక దేవుని వాక్యముతో ఒప్పించవలెను, పిల్లలకు బోధించు మొదటి పాఠము రోమా సంఘముయొక్క సంప్రదాయములను గురించికాక యేసుక్రీస్తుయొక్క సువార్తమీద కేంద్రీకరింపబడినదై యుండవలెను.

ఐదవ చార్లెస్ జర్మనీ రాజుగను, పవిత్ర రోమా చక్రవర్తిగను అభిషేకింపబడిన తరువాత పోప్ లియో ఇద్దరు కార్డినల్స్ను ఫ్రెడరిక్ ప్రభువునొద్దకు పంపెను. మార్టిన్ లూథర్పై చర్య తీసికొనునట్లు అతనిని ఒప్పించుటకు వారు పంపబడిరి. కార్డినల్స్ రాజు అభిమానమును పొందుటకు అతని పుట్టుకను, కుటుంబ సంస్కృతిని, అతని నాయకత్వమును ఘనపరచి రాజుకు పోప్ పేరున రెండు ప్రత్యేకమైన కోరికలను తెలియజేసిరి. అవి లూథర్ పుస్తకములన్నింటిని అతడు కాల్చివేయవలెను మరియు లూథర్ను రోముకు పంపవలెను లేక ఉరితీయవలెను.

లూథర్ను తన రాజ్యములో బంధించి ఉంచినట్లయితే ఇతర రాజ్యములలో ఉన్న రోమన్ కేథలిక్లపై అతని ప్రభావముండదని పోప్యొక్క సొంత సలహాదారుడు చెప్పినదానిని రాజుకూడ సమర్థించెను. లూథర్ యొక్క రచనలను, ఉపదేశములను పరిశీలనచేసి అతనిని మతద్రోహిగ రుజువుచేయుటకు పండితులైన వేదశాస్త్రజ్ఞులను, నిపుణులను పంపించమని పోప్కు తెలియజేయవలసినదిగా రాజు కార్డినల్స్తో ఇట్లు చెప్పెను :

అతడు మతద్రోహులలో ఒకడుగా నిర్ణయింపబడి

కార్డినల్స్ రోముకు తిరిగిరాకముందు, వారు లూథర్ పుస్తకములను అధిక సంఖ్యలో సేకరించి వాటిని బహిరంగముగ కాల్చివేసిరి. అది వినిన లూథర్ విటెస్బర్గ్ విశ్వవిద్యాలయములోని విద్యార్థులను, అధ్యాపకులను గుంపుగా ప్రోగుచేసి పోప్ తనకు వ్యతిరేకముగా జారీ చేసిన బహిష్కరణ దండన పత్రమును అందరియెదుట కాల్చివేసెను. ఇది క్రీ.శ. 1520, డిసెంబరు 10న జరిగెను.

క్రీ.శ. 1521, జనవరిలో పోప్ పదియవ లియో లూథర్ను ఈ చర్యనిమిత్తము మతద్రోహిగా తీర్పు చెప్పి, సంఘమునుండి బహిష్కరించవలెనను ఆజ్ఞను జారీచేసి చక్రవర్తియైన ఐదవ చార్లెస్ను దానిని అమలుపరచమని ఆజ్ఞాపించెను. కాని చక్రవర్తి ఆ విధముగ చేయుటకు బదులు వామ్స్ (Worms) పట్టణములో కేంద్ర శాసన సభను సమావేశపరచి, లూథరన్ను తనయెదుట హాజరుకమ్మని ఉత్తరువును పంపెను.

చక్రవర్తితో పాటు కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజలు ఎర్ల్ పెలటైన్ రాజు భవనములో సమావేశమైరి. సైనిక సంరక్షణలో లూథర్ను రహస్యముగ చక్రవర్తి యెదుట హాజరుపరచిరి, కాని ఆ రహస్యము ఎక్కువ కాలము నిలువలేదు. రహస్యముగా బంధింపబడిన లూథర్ను చూచుటకు గొప్ప జనసమూహము ఆ భవనములో ప్రవే శించగా, వారిని సైనికులు నివారించలేకపోయిరి.

అనేకమంది ప్రేక్షకులు కూర్చుండు టకు కట్టబడిన మెట్లపైకెక్కి అక్కడ జరుగుచున్న కార్యక్రమములను చూచుటకు కూర్చుండిరి. ఒకసారి లూథర్ మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు, పెపన్ హేమకు చెందిన ఉల్లిక్ (Ulrick) తాము మాట్లాడుమని అతనిని అడుగు సమయము వచ్చువరకు నిశ్శబ్దముగా నుండవలెనని లూథరన్ను ఆజ్ఞాపించెను.

రాజు అభిమానమును పొందుటకు అతని పుట్టుకను, కుటుంబ సంస్కృతిని, అతని నాయకత్వమును ఘనపరచి రాజుకు పోప్ పేరున రెండు ప్రత్యేకమైన కోరికలను తెలియజేసిరి. అవి లూథర్ పుస్తకములన్నింటిని అతడు కాల్చివేయవలెను మరియు లూథర్ను రోమ్ముకు పంపవలెను లేక ఉరితీయవలెను.

లూథర్ను తన రాజ్యములో బంధించి ఉంచినట్లయితే ఇతర రాజ్యములలో ఉన్న రోమన్ కేథలిక్లపై అతని ప్రభావముండదని పోప్యొక్క సొంత సలహాదారుడు చెప్పినదానిని రాజుకూడ సమర్థించెను. లూథర్ యొక్క రచనలను, ఉపదేశములను పరిశీలనచేసి అతనిని మతద్రోహిగ రుజువుచేయుటకు పండితులైన వేదశాస్త్రజ్ఞులను, నిపుణులను పంపించమని పోప్కు తెలియజేయవలసినదిగా రాజు కార్డినల్స్తో ఇట్లు చెప్పెను :

కార్డినల్స్ రోముకు తిరిగిరాకముందు, వారు లూథర్ పుస్తకములను అధిక సంఖ్యలో సేకరించి వాటిని బహిరంగముగ కాల్చివేసిరి. అది వినిన లూథర్ విటెన్ బర్గ్ విశ్వవిద్యాలయములోని విద్యార్థులను, అధ్యాపకులను గుంపుగా ప్రోగుచేసి పోప్ తనకు వ్యతిరేకముగా జారీ చేసిన బహిష్కరణ దండన పత్రమును అందరియెదుట కాల్చివేసెను. ఇది క్రీ.శ. 1520, డిసెంబరు 10న జరిగెను.

క్రీ.శ. 1521, జనవరిలో పోప్ పదియవ లియో లూథర్ను ఈ చర్యనిమిత్తము మతద్రోహిగా తీర్పు చెప్పి, సంఘమునుండి బహిష్కరించవలెనను ఆజ్ఞను జారీచేసి చక్రవర్తియైన ఐదవ చార్లెస్ను దానిని అమలుపరచమని ఆజ్ఞాపించెను. కాని చక్రవర్తి ఆ విధముగ చేయుటకు బదులు వామ్స్ (Worms) పట్టణములో కేంద్ర శాసన సభను సమావేశపరచి, లూథర్ను తనయెదుట హాజరుకమ్మని ఉత్తరువును పంపెను.

చక్రవర్తితో పాటు కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజలు ఎర్ల్ పెలటైన్ రాజు భవనములో సమావేశమైరి. సైనిక సంరక్షణలో లూథర్ను రహస్యముగ చక్రవర్తి యెదుట హాజరుపరచిరి, కాని ఆ రహస్యము ఎక్కువ కాలము నిలువలేదు. రహస్యముగా బంధింపబడిన లూథర్ను చూచుటకు గొప్ప జనసమూహము ఆ భవనములో ప్రవే శించగా, వారిని సైనికులు నివారించలేకపోయిరి.

అనేకమంది ప్రేక్షకులు కూర్చుండు టకు కట్టబడిన మెట్లపైకెక్కి అక్కడ జరుగుచున్న కార్యక్రమములను చూచుటకు కూర్చుండిరి. ఒకసారి లూథర్ మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు, పెపన్ హేమకు చెందిన ఉల్టిక్ (Ulrick) తాము మాట్లాడుమని అతనిని అడుగు సమయము వచ్చువరకు నిశ్శబ్దముగా నుండవలెనని లూథరన్ను ఆజ్ఞాపించెను.

ట్రెవెస్ (Treves) పట్టణ బిషప్ యొక్క ప్రతినిధి సభను ప్రారంభించుచూ ఇట్లనెను: ఆ ప్రశ్నలేవనగా, నీయెదుట కుప్ప వేయబడిన పుస్తకములను నీవే వ్రాసితివా? వాటిని ఉపసంహరించుకొందువా లేక బలపరచెదవా?”

అందుకు లూథర్ “దేవుని వాక్యమునకు కీడు కలుగకుండ, నా ఆత్మ నరకమునకు పోకుండ, నాకు తృప్తికలుగువరకు ధ్యానము చేసికొనిన తరువాత సమాధానమిచ్చుటకు కావలసిన స్వేచ్ఛను, సమయమును అనుగ్రహింపుమని వినయముగా వేడుకొను చున్నాను” అని జవాబిచ్చెను.

లూథర్ విన్నపమునుగూర్చి రాజులందరూ చర్చించుకొనిన తరువాత ఎఖియస్ (Eckius) అనునతడు చక్రవర్తి నిర్ణయమును ఈ విధముగ తెలియజేసెను. “ఘనత వహించిన చక్రవర్తి కనికరమునుబట్టి నీవు ధ్యానము చేసికొని సమాధానమిచ్చుటకు ఒక దినము సమయము అనుగ్రహింపబడెను. రేపు, ఇదే సమయమునకు వ్రాత పూర్వకముగా కాక వాంజ్ఞ్మూలముగ నీ సమాధానమును చెప్పవలెను.”

ఎఖియస్ లూథరన్ను వెంటబెట్టుకొని తన గదిలోనికి తీసికొనివెళ్లగా, అచ్చట లూథర్ మరుసటి దినము చెప్పవలసిన జవాబునిమిత్తము దేవుని చిత్తమును తెలిసి కొనుటకు వాక్యమును శ్రద్ధగా చదువుచు ప్రార్థించుచుండెను.

మరుసటి ఉదయమున లూథర్ సమాధానము వినుటకు అనేకమంది గుమి కూడిరి. ఎఖియస్ లూథర్ ఇట్లనెను, “చక్రవర్తి ఆదేశమునకు ఇప్పుడు జవాబు చెప్పుము. నీవు వ్రాసిన పుస్తకములలోని విషయములన్నిటిని నీవు మనస్పూర్తిగా అంగీకరించెదవా లేక వాటిలో ఏ భాగమునైనను ఉపసంహరించుకొనెదవా? నీమీద అధికారులుగా దేవుడు నియమించినవారికి నిన్ను నీవు అప్పగించుకొనెదవా?”

అందుకు మార్టిన్ లూథర్ ఈ విధముగ సమాధానమిచ్చెను. “ఘనతవహించిన మహా చక్రవర్తీ! మీరు సరియగు సమాధానమును కోరిన విషయమును దృష్టిలో నుంచుకొని మోసపూరితముగా కాకుండ, లేఖనములకు విరుద్ధముగా కాకుండ, నిస్సందేహముగాను, నిశ్చయముగాను, స్థిరమైనది, యథార్థమైనదానిని నేను ఈ విధముగ ఒప్పుకొనుచున్నాను.

మార్టిన్ లూథర్! పవిత్ర రోమా సామ్రాజ్యాధినేతలందరి అంగీకారమువలన పవిత్రుడును,

అనేకసార్లు తప్పులు చేసి వారిలో వారికి విభేదములు గల పోషన్ను, ఆయన ప్రముఖుల సభను నేను నమ్మను – నా మనఃస్సాక్షి పరిశుద్ధ లేఖనములకు, దేవుని మాటకు అంకితమై పూర్తిగా బంధింపబడినది. కనుక వాటిని నమ్ముటమాత్రమేకాక ఒక్కదానినైనను ఉపసంహరించుకొనుటకు వీలుపడదు. నా మనఃస్సాక్షికి వ్యతిరేకముగా జేయుట నాకు అన్యాయము, అది దేవునికి వ్యతిరేకముగా నుండును. దీనిపైననే నేను ఆధారపడి నిలుచున్నాను. నేను చెప్పుటకు మరింకేమియు లేదు. దేవుని కృప నాపై కలదు.”

రాజులు మరలా సంప్రదించుకొనిన తరువాత, ఎఖియస్ లూథర్ – “నీవు వ్రాసినవన్నియు క్రైస్తవ్యమని నిరూపించుటకు నీవు యిష్టపడుచున్నావా? ఈ ప్రశ్నకు ‘అవును, కాదు’ అను క్లుప్తమైన జవాబును చక్రవర్తి కోరుచున్నాడ”ని చెప్పెను.

చక్రవర్తి మరియు ప్రముఖులవైపు తిరిగి తన మనఃస్సాక్షిని గౌరవించవలసినదిగ లూథర్ వారిని ప్రార్థించెను. తన మనఃస్సాక్షి పరిశుద్ధలేఖనములకు అనుకూలముగ స్థిరపరచబడినది కనుక తన మనఃస్సాక్షికి విరుద్ధముగా బలవంతము చేయవద్దని వారిని వేడుకొని, “నేను లేఖనములకు కట్టుబడి ఉన్నాను” అను మాటలతో లూథర్ తన జవాబును ముగించెను.

సాయంత్రమై చీకటిపడినప్పటికి సభలోని ప్రముఖులు లూథర్ విషయములో తుది నిర్ణయమునకు రాలేకపోయినందున వారు తమ విచారణను ఆపి లూథర్ను బందోబస్తుతో అతని నివాసమునకు పంపిరి. వారు మరల సమావేశమైనప్పుడు, చక్రవర్తినుండి వచ్చిన లేఖను సభకు చదివి వినిపించిరి.

దాని ప్రకారము తన ఉద్దేశ్యములను లూథర్ ఉపసంహరించుకొనకపోయినను, చక్రవర్తి ఇచ్చిన తన వాగ్దానమును నిలుపుకొనుటకు లూథర్కు ఎట్టి ప్రమాదము వాటిల్లకూడదని ఆదేశించగా, లూథర్ ఇంటికి తిరిగి వెళ్లెను. అతడు సభనుండి ఇంటికి తిరిగి వెళ్లకమునుపు ఇరువదియొక్క దినముల తరువాత చక్రవర్తి న్యాయస్థానములో మరల హాజరుకావలెనని తెలిపిరి.

ఈ మధ్యకాలములో లూథర్కు వ్యతిరేకముగ భయంకర ఉద్యమము చెలరేగెను. అతనికి వ్యతిరేకముగా ఫిర్యాదు చేయబడిన ప్రకటన కాగితములు గోడలకు అతికించబడినవి. సామ్రాజ్యమంతట మతనాయకుల, సామాన్యప్రజల పెదవులమీద లూథర్ పేరు ప్రతిధ్వనించెను.

మూడు వారముల వ్యవధిలో చక్రవర్తి, పోప్ ఒక అంగీకారమునకు వచ్చి లూథర్ను, లూథర్ చేయుచున్న పనిలో భాగస్థులైనవారిని దేశద్రోహులుగా ప్రకటించి, లూథర్ ఎక్కడ కన్పించినా అతనిని ఖైదుచేసి, అతని పుస్తకములన్నింటిని చేజిక్కించుకొని కాల్చివేయవలెనని ఆజ్ఞాపించిరి. అందుచే లూథర్ వార్ట్బర్గ్ (Wartburg) కోటలో రహస్యముగా ఎనిమిది నెలలు దాగియుండెను. ఈ కాలములోనే అతడు క్రొత్త నిబంధన గ్రంథమును జర్మన్ భాషలోనికి అనువదించెను. ఇంకను అనేక పత్రికలుకూడ వ్రాసెను.

ఇదేకాలములో ఇంగ్లాండు రాజైన ఎనిమిదవ హెన్రీ లూథరుకు వ్యతిరేకముగ ఒక శాసనము జారీచేసెను. ఫలితముగ పోప్ ఆ రాజుకు ఘనమైన “విశ్వాస సంరక్షకుడు” అను (Defender of the faith) బిరుదునిచ్చి గౌరవించెను.

పోప్ పదియవ లియోకు క్రీ.శ. 1521 నవంబరులో జ్వరము వచ్చి డిసెంబరు ఒకటిన మరణించెను, అతని వయస్సు 47 సం॥లు. అతనికి విషప్రయోగము జరిగినదని అనేకమంది అనుమానించిరి. చక్రవర్తియైన చార్లెస్కు ఉపాధ్యాయుడు, గొప్ప పండితుడైన ఆరవ అద్రియన్ (Adrian) అతని తరువాత పోష్గా నియమింప బడెను. అద్రియన్ లోవైన్ (Louvain) లో పెరిగిన జర్మనీ దేశస్థుడు. ఇతడు గొప్ప విద్యావంతుడు కనుక అతడు పూర్వమున్న పోప్లోవలెగాక ఆధునికమైన నాగరిక జీవనవిధానమును అనుసరించెను.

ప్రొటెస్టంట్ మత సంస్కరణోద్యమమునకు ప్రతిస్పందించి, రోమన్ కేథలిక్ సంఘమును సంస్కరింపవలెనను ప్రయత్నము చేసిన మొదటి పోప్ అద్రియన్ యైనప్పటికీ, ఇతడు లూథర్ను సంఘమునకు మరియు పోషకు శత్రువుగానే పరిగణించెను. ఇతడు పోప్ నియమింపబడిన కొద్దికాలమునకు చక్రవర్తి జర్మనీ రాజ్యముల సమావేశమును క్రీ.శ. 1522 లో న్యూరెంబర్గ్ (Nuremberg) లో ఏర్పాటుచేసెను.

ఆ సభలో లూథర్నుగూర్చి తన అభిప్రాయములను అద్రియన్ ఒక పత్రికద్వారా వెల్లడిపరచెను. అతని పత్రిక సారాంశము ఈ విధముగ ఉన్నది : “మార్టిన్ లూథర్ మిక్కిలి చెడ్డవైన పాత మత ద్రోహములనుండి క్రొత్తగా ఉదయించినవాడు. మొదట పోప్ల ముఖ్య ప్రకటనలద్వారా అతనికి మరణశిక్ష విధింపబడెను.

అయినను అతడు తన పిచ్చితనమునుండి తొలగక దినదినము తప్పులతోను, అనేక మతద్రోహములతోను, అవిధేయత తోను, దేశద్రోహముతోనుకూడిన క్రొత్త పుస్తకములద్వారా ప్రపంచమును కలతపెట్టుట మానక జర్మనీ దేశమంతటిని పాడుచేసెను. ఇదే వ్యాధి ఇతర ప్రాంతములకుకూడ వ్యాపించినది.

అతడు విషముగల చెడు నాలుకతో సామాన్య ఆత్మలను, మనుష్యుల ప్రవర్తనను పాడుచేయుటకు ఇంకను ప్రయ త్నించుచుండెను. అన్నిటికంటె చెడ్డదేమనగా అతడు తనకు సహకరించిన వారినికూడ పాడుచేయుచున్నాడు.

ఓ జర్మనీ ప్రభువులారా! ప్రజలారా! లూథర్, అతని లూథరనుల చెడు కార్యములకు, మోసములకు ఇవి ఉపోద్ఘాతము, ముందుమాటలని మీరు ఇంకనూ గుర్తించలేరా? సువార్త సత్యమును కాపాడుచున్నట్లు నటించుట లూథరనులచే మొదట ప్రారంభించబడినదని మీరు మీ కన్నులతో చూచి స్పష్టముగ గ్రహించలేరా?

వారు బహుకాలమునుండి ఆశించినట్లుగా మీ ఆత్మలను పాడుచేయ తలంచుట ఇప్పుడు బహిరంగముగా స్పష్టమైనది. విధేయతను విడనాడుటకు స్వాతంత్య్రమను పేరుతో ఈ అన్యాయ పుత్రులు ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు ప్రవర్తించుటకు మార్గము కల్పించుకొనిరని మీరు గ్రహించలేదా?

బోధకులకు, బిషప్లకు, మరియు ప్రధాన బిషప్లకు విధేయత కల్గియుండుటకు బదులు మీ కన్నుల యెదుటే సంఘ ఆస్తులను, దేవునికి అభిషేకించిన వస్తువులను దొంగిలించుట మీరు చూచితిరిగదా, ఇక సామాన్య ప్రజల వస్తువులనుండి వారి చేతులను వెనుకకు తీసికొనెదరని మీరు అనుకొనుచున్నారా? వారి చేతులకు అందినదానినంతటిని పెరికి వేయరని మీరు తలంచుచున్నారా?

మీరు అట్టివారికి వ్యతిరేకముగ త్వరలో సరియైన పరిహారమును కనుగొనకపోయినచో మీమీద, మీ వస్తువులమీద, గృహములమీద, భార్యలమీద, పిల్లలమీద, రాజ్యములమీద, ఆస్తిమీద, మీకు భక్తి గౌరవ ములున్న దేవాలయములమీద కూడ ఈ దుఃఖకరమైన విపత్తుయొక్క ప్రభావము అధికముగా ఉండును.

అందువలన ఈ బహిరంగ అగ్నిని ఆర్పుటకు క్రైస్తవులందరు పరిశు ద్ధుడైన దేవునికి, ధన్యుడైన పేతురుకు, భూమిమీద అతని ప్రతినిధియైన పోప్కు మీ సహాయము అందించవలెనని కోరుచున్నాము. మార్టిన్ లూథర్ను ఈ ఆందోళనలకు, తప్పులకు కారకులైన మోసగాళ్లనందరిని అణచుటకు మీ శాయశక్తుల సహకరించవలెను. జీవమునకు, విశ్వాసము నకు అనుకూల వాతావరణమును వృద్ధిచేయవలెను.

ఈ మోసగాళ్లు ఎవరైన మీ గద్దింపులు వినుటకు నిరాకరించినచో వారివలన మంచిగా ఉన్న ప్రజలుకూడా చెడిపోకుండునట్లు ఏర్పాట్లు చేయవలెను. నైతికముగా చెడిన నోటిపుండుగల వ్యాధి కల్గినవారిని మెత్తదనము, నెమ్మది అను మందులద్వారా బాగుచేయలేకపోతే, మంచి భాగములుకూడ రోగగ్రస్థము కాకుండునట్లు నొప్పి కలిగించెడి మందును, మాడిపోవునట్లు చేయు అగ్ని వంటి మందులను తప్పక ఉపయోగించవలెను.

ఆ మార్గములో మోషేను ఎదిరించి అభిప్రాయభేదములచే మతము నుండి వేరైన దాతాను, అబీరాములను దేవుడు నరకములోనికి విసరెను, మరియు ఎవరైతే మతాధికారికి విధేయులైయుండరో అట్టివారికి మరణ శిక్ష విధించవలెనని ఆజ్ఞాపించెను. కనుక అపొస్తలులలో ప్రధానుడైన పేతురు – దేవునిని మోసగించవలెనని ప్రయత్నించిన అననీయ, సప్పీరాలకు మరణదండన విధించెను. కనుక గతములో పాలించిన దైవిక చక్రవర్తులు జొవీనియన్ మరియు ప్రిసీలియన్లను మతద్రోహులని తీర్పు చెప్పి శిరచ్ఛేద నము గావించిరి.

అదేవిధముగ, కాన్న్స్ సభలో మన పూర్వికులు జాన్ హసన్ను అతని అనుచరులను, జెరోమ్ను దండించి చంపిరి. ఇప్పుడు మార్టిన్ లూథర్ హస్ పునరుజ్జీవింపబడినట్లు కన్పించుచున్నది. మన పూర్వికుల ఆచరణ యోగ్యమైన కార్యములను, ఉదాహరణలను మీరు అనుకరించి నట్లయితే దేవుని దయగలిగిన కృప తన సంఘమును విడుదల చేయుననుటలో సందేహము లేదు.”

పోప్ యొక్క పిలుపునకు స్పందించిన సామ్రాజ్యములోని రాజులందరు కలసి లూథర్ను శిక్షించుటకు పోప్కు ఒక ఉత్తరము వ్రాసిరి. ఆ ఉత్తరముయొక్క సారాం శము ఈ విధముగ ఉన్నది : “పూజ్యులైన మీరు (పోప్) గొప్ప దుఃఖముతో బాధపడుటకు లూథరు, అతనియొక్క మతశాఖ కారణమని మేము గ్రహించితిమి.

అతని ప్రభావము నకు లోనైనవారి ఆత్మలు ప్రమాదకరమైన నిత్య నరకములోనున్నవని మేము గుర్తించుచున్నాము. మీ దుఃఖములో మేమును భాగస్వాములము. జర్మనీలోని అనేకమంది ప్రజలు మార్టిన్ లూథర్ అభిప్రాయములతో పోలిన మార్గము లను అనుసరించుచున్నందున ఇంతవరకు లూథర న్ను శిక్షించుట జరుగ లేదు. ఇది సామ్రాజ్యములో గొప్ప పునరుజ్జీవమును, అనుకూలతనుబట్టి యుద్ధమునకును దారితీయును.

లూథర్ యొక్క మార్గములను అనుసరించుచున్న సామాన్య ప్రజలను సంస్కరింపకపోయినచో లౌకిక, మత విషయములలో సఖ్యత ఏర్పడుటకు ఇక అవకాశముండదు.

కనుక సాధ్యమైనంత త్వరగా పోప్, చక్రవర్తియొక్క అంగీకారముతో జర్మనీలోని ఒక అనుకూల స్థలమందు క్రైస్తవ సభను ఏర్పాటుచేయవలెనని మేము సిఫారసు చేయుచున్నాము. ఆ సభలో ప్రజలు భయము లేకుండ స్వేచ్ఛగా మాట్లాడుటకు అవకాశము కల్పించవలెను.

లూథర్గాని, అతని అనుచరులుగాని ఇకపై వ్రాయుటకు, ప్రకటించు టకు, ఏదేని అచ్చువేయించుటకు అనుమతి పొందకుండునట్లు చేయు బాధ్యత ఫ్రెడరిక్ ప్రభువునకు అప్పగింపవలెనని మేము సిఫారసు చేయు చున్నాము. అతని రాజ్యములోని బోధకులందరు లూథర్ యొక్క ఉద్దేశ్యము లను ప్రచారము చేయకుండ నిషేధింపవలెను.

ఈ ఉత్తరువును ఉల్లంఘించు బోధకులు శిక్షింపబడుదురు. ఎట్టి క్రొత్త పుస్తకమునైన అమ్మబడుటకు ముందు సంఘాధికారుల అనుమతి తీసికొన వలెను. బోధకులు వివాహము చేసికొనినచో లేక బాధ్యతలను విస్మరించిన యెడల వారు సంఘనాయకులచేత శిక్షింపబడుదురు.”

ఇది జరిగిన వెంటనే లూథర్ అనుచరులలో ఒకడైన అంద్రెయ కెరోలోస్టాడ్ (Andreas Carolostadt) పోప్కు, ఆయనయొక్క ఉన్నత హోదాకలిగిన బిషప్లకు మరింత కోపము కలిగెడి కార్యములు చేయునట్లు ప్రజలను ప్రేరేపించి, రోమా దేవాలయములలోని విగ్రహములను, ప్రతిమలను కూలద్రోయించెను. ఆ విధముగ పరిశుద్ధ స్థలములను, విగ్రహములను, సిలువలను నాశనము చేయుచున్న ఉద్రేక పూరితులైన ప్రజలలో శాంతి భద్రతలను పునరుద్దరించుటకు లూథర్ విటెన్బర్గ్ కు క్రీ.శ. 1522 మార్చిలో తిరిగి వచ్చెను.

తరువాతి సంవత్సరములలో వందకుపైగా పత్రికలు, వ్యాసములు, బైబిలు వ్యాఖ్యానములు, వేలకొలది ఉత్తరములు, బైబిలునంతటిని జర్మనీ భాషలోనికి తర్జుమా చేయుట మొదలగు కార్యక్రమములతో లూథర్ జీవితము నిండియుండెను.

ఫిలిప్ మెలాంక్తన్ (Philipp Melanchthon) మరికొందరి సహకారముతో మార్టిన్ లూథర్ జర్మనీలో అనేక సువార్త సంఘములను స్థాపించి, అనేక శతాబ్దముల నుండి అమలులోనున్న సంప్రదాయక మూఢనమ్మకములను రద్దుచేసెను.

లూథర్ క్రీ.శ. 1546 ఫిబ్రవరి 18న చనిపోవునాటికి అరువది మూడు సంవత్సరముల వయస్సు కలవాడు. ఈ గొప్ప సంస్కర్తయొక్క చివరి గడియలను మెలాంక్తన్ ఈ విధముగ వర్ణించెను : బుధవారము గతించినది, ఫిబ్రవరి 17న డా. మార్టిన్ లూథర్ తనయొక్క దీర్ఘవ్యాధిచేత బలహీనుడయ్యెను. సాయంకాలము భోజనమైన తరువాత అతనికి మరింత బలహీనత ఆవరించెను. దానితో అతడు తీవ్రముగ బాధపడుచు విశ్రాంతి గదిలోనికి వెళ్లి అక్కడ తన మంచముపై రెండు గంటలు విశ్రమించెను. ఈ లోపు అతని బాధ అధికమైనది.

తన చివరి గడియ సమీపించుచున్నప్పుడు ఫిబ్రవరి 18 ఉదయము 9 గంటల ముందు భక్తిపూర్వకముగ ప్రార్థించి దేవునికి స్తోత్రములు చెల్లించెను. “నా పరలోకపు తండ్రీ, నిత్యజీవము, కృపగల దేవా, నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రత్యక్షపరచితివి. ఆయననుగురించి నేను బోధించితిని. నేను ఆయన నెరుగుదును.

నా ప్రాణము, నా ఆర్యోగము, నా విమోచకునిగ నేనాయనను ప్రేమించితిని. నేను ప్రేమించిన ఆయనను దుష్టులు హింసించి, దూషించి, బాధించిరి. నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుము.”

కొన్ని నిమిషములు గడిచిన తరువాత లూథరు స్తోత్రములు చెల్లించు ప్రార్థన మూడుసార్లు చేసెను : “ఓ సత్య దేవా, నీవు నన్ను విమోచించితివి. నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను”. ఈ ప్రార్ధన అనంతరము లూథర్ తన అభిమాన లేఖన భాగమును ఒప్పగించెను: అది ముగియగానే అతడు తన కన్నులు మూసికొనెను, ఇక మరెన్నటికిని తెరువలేదు.

యోహాను 3-16

అతని మరణముతోపాటు అతని సేవకూడ నశించునని లూథర్ విరోధులు సంతోషించిరి. అయితే అది దేవుని సత్య వాక్యముమీద ఆధారపడినది గనుక ఆలాగున జరుగలేదు. దేవుని వాక్యమువలే లూథర్యొక్క సిద్ధాంతములుకూడ యేసుక్రీస్తుయొక్క సత్యసువార్తను లోకమంతటా వ్యాపింపజేసినవి.

Leave a Comment