మతాధికారుల హింసలు, విచారణ (క్రీ.శ. 1208–1834)

మతాధికారుల హింసలు, విచారణ (క్రీ.శ. 1208–1834)

సుమారు 12వ శతాబ్దమువరకు క్రీస్తుయొక్క నిజ విశ్వాసులకు కలిగిన హింసలు, శ్రమలు క్రైస్తవేతరులైన అన్యప్రపంచమునుండి వచ్చినవి. కాని ఇప్పుడు రోమా సంఘము లేఖనములలోని సత్యమును, ప్రేమతో కూడిన ఆజ్ఞలను త్రోసివేసి వారి తప్పుడు సిద్ధాంతములు, అన్య మతాచారములను వ్యతిరేకించినందుకు నిజవిశ్వాసులపై కత్తి కట్టినది. ఇది కాన్స్టాంటైన్ కాలమునుండి విస్తరించెను.

ఏ సత్య సిద్ధాంతములకొరకు అనేకమంది క్రైస్తవులు హతసాక్షులైనారో అట్టి విధానములనుండి రోమా సంఘము వేరైపోయెను. కాగా భక్తి, పవిత్రత, మానవత్వము, ప్రేమ, దయ మొదలగువాటిని విసర్జించి, అన్యుల మూఢనమ్మకములను, విగ్రహారాధనను ఆచరించుట మొదలు పెట్టిరి. వారు ఆర్థికముగా, సాంఘికముగా లాభసాటిగావుండు సిద్ధాంతములను అమలుచేసిరి. సంఘసంబంధమైన విషయములన్నింటిలో వారికి అధిక ప్రాధాన్యత లభించినది.

వారిని, వారి సిద్ధాంతములను ఎవరు వ్యతిరేకించెదరో, వారిని నాస్తికులని ముద్రవేసి, అవసరమైన మేరకు బలప్రయోగముతో వారు తమతో ఏకీభవించునట్లు చేసిరి. వారు మనస్సు మార్చుకొనక, పోప్ (Pope) యెడల, అతని అనుచరులయెడల తమ విధేయతను, విశ్వాసమును ప్రకటించకపోతే వారిని ఉరితీసేవారు. వారు చేసిన ఘోరకృత్యములకు పాత నిబంధనలోను, అలాగే అను వాక్యభాగములను విశ్లేషించి విశ్వాసులకు విధించిన శిక్షలను తమకు తాము సమర్థించుకొనిరి.

లూకా 14-23

అనేక శతాబ్దములు రోమా సంఘము ఆకలిగొన్న మృగమువలె రెచ్చిపోయి, వేలకొలది క్రీస్తుయొక్క నిజవిశ్వాసులను చంపుచు, ఇంక అనేక వేలమందిని హింసిం చుచు, ఏడ్పించినది. అందుకే ఆ కాలమును సంఘముయొక్క ‘చీకటి యుగము’గా అభివర్ణింతురు. వారి రౌద్రమునకు మొదట ఫ్రాన్స్లోని వార్డెనులు బలిపశువులైరి.

క్రీ.శ. 1000 లో చీకటి, మూఢనమ్మకములచేత సత్యవాక్యముయొక్క వెలుగు ఆర్పివేయబడినప్పుడు, సంఘమునకు సంభవించిన గొప్ప విపత్తును చూచి కొందరు పవిత్రతతోకూడిన సత్యసువార్త వెలుగులోనికి ప్రజలను నడిపించవలెనని నిశ్చయించు కొనిరి. ప్రజలను మభ్యపెట్టి నిజవెలుగును దాచివేయు ప్రయత్నములనన్నిటిని పోగొట్ట వలెనని సంకల్పించుకొనిరి.

మొదట బెరెన్గా గారియస్ (Berengarius) అను ధైర్యవంతుడు లేఖనములలోని పరిశుద్ధ సువార్తను ఉన్నది ఉన్నట్లుగ బోధించుట ప్రారంభించెను. చాలసంవత్సరములు విశ్వాసులు ఆ సత్యసువార్తను చేబట్టి, ఆ వెలుగును అనేక వేల మందికి అందించిరి. ఇట్లు క్రీ.శ. 1140 వరకు అనేకమంది విశ్వాసులు మార్పు చెందిరి.

ఈ విషయములో పోప్ కలతచెంది మార్పుచెందిన విశ్వాసులను తమ రాజ్యములనుండి తరిమివేయుమని యువరాజులకు లేఖలు వ్రాసి, వారికి వ్యతిరేకముగ పత్రికలు వ్రాయుమని చదువరులైన తన అధికారులను ఆదేశించెను.

వార్డెనులకు హింసలు

పీటర్ వాల్డో (Peter Waldo, క్రీ.శ. 1173) అధిక ధనవంతుడైన వర్తకుడు, తనకున్న సంపదనంతటిని పేదలకు దానముచేసి సంచార సువార్తికునిగా పేరుగాంచెను. మతాధికారుల ధనవ్యామోహమును, అణచివేతను తీవ్రముగ ఖండించెను. కొద్దికాలము లోనే ఫ్రాన్స్లోని వార్డెనులైన అనేకమంది మార్పుచెందిన విశ్వాసులు అతనితో కలిసిరి.

మొదట వాల్డో మతాధికారులు గుర్తింపుకొరకు ప్రయత్నించి, రోమా సంఘముపై తన ప్రభావమును చూపించవచ్చునని తలంచెను కాని దానికి బదులుగా వారు అతనిని నాస్తికుడని నిందించి క్రీ.శ. 1184 లో వెలివేసిరి.

అంతట వాల్డో, అతని అనుచరులు కలసి వేరొక సంఘమును అభివృద్ధిచేసి, దానికి స్వంత బోధకులను ఏర్పాటుచేసుకొనిరి. వారు సంఘకట్టుబాట్లను, పవిత్రతనుగూర్చి బోధించి, రోమా సంఘనాయకులను, వారి వ్యసనములను దుయ్యబట్టి, ఎట్టి పరిస్థితుల లోను మానవ జీవితమును అంతముచేయు అధికారము వారికి లేదని చెప్పిరి. కనుక క్రీ.శ. 1208 లో వాలైనులు మరియు ఇతర మార్పుచెందిన విశ్వాసులపై, ముఖ్యముగ ఆల్బిజెనుల (Albigens) పై మతయుద్ధము చేయుటకు పోప్ అనుమతించెను.

క్రీ.శ. 1211 లో ఎనుబదిమంది వాల్డో అనుచరులను స్ట్రాస్బర్గ్ (Strasbourg), పట్టణములో బంధించి, పోప్ నియమించిన మత విచారణకర్తలతో తీర్పు చెప్పించి, వారిని స్తంభమునకు కట్టి సజీవదహనము చేసిరి. ఇది జరిగిన కొద్దికాలమునకు అనేకమంది వార్డెనులు ఉత్తర ఇటలీలోని ఆల్పైన్ (Alpine) లోయలో నివసించుటకు వలస వెళ్లిపోయిరి. క్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తూనే క్రీ.శ. 1218 లో వాల్డో మరణించెను.

ఆల్బిజెనుల హింసలు

ఆల్బిజెను (Albigens) లందరు మార్పుచెందిన మతస్థులు (Reformed religion people). వారు 12,13 వ శతాబ్దములలో దక్షిణ ఫ్రాన్సులో నివసించిరి. వారు ఫ్రెంచి పట్టణమైన ఆల్బి (Albi) లో కేంద్రీకరింపబడినందున వారికి ఆ పేరు వచ్చెను. వారు చాల కఠినమైన నైతిక విలువలు గలవారు. వారిలో కౌంట్ టౌలౌస్ (Count of Toulouse), కౌంట్ ఫోయిక్స్ (Count of Foix), కౌంట్ బెజైర్స్ (Count of Beziers) వంటి అనేకమంది ప్రముఖులేకాక ఇంకా ఎందరో చదువరులు, ఉన్నతస్థాయి కలవారున్నారు. వారిని అణచుటకు రోము మొదట సిస్టెర్సియన్ (Cistercian) ను మరియు డొమినికన్ మఠ సన్యాసులను పంపి, వారిని తిరిగి మతాధికారుల సిద్ధాంతములలోనికి మార్చుటకు ప్రయత్నించెను. అయితే ఆల్బిజెనులు సంస్కరింపబడిన తమ సిద్ధాంతములకు కట్టుబడి ఉండుటవలన వారి ప్రయత్నములు విఫలమైనవి.

రెండవ (1139), మూడవ (1179), నాల్గవ (1215) లాటెరన్ సభలు (Lateran Councils) జరిపి, ప్రతి సభలో భిన్నమతావలంభికులకు ఖైదు, వారి ఆస్తిని ప్రభుత్వము స్వాధీనపరచుకొనుట, మొదలగు శిక్షలున్నవని బెదరించిరి. అయితే ఈ శిక్షలేవియు ఆల్బిజెనులను రోమా సంఘనాయకుల అధీనములోనికి తీసికొని రాజాలకపోయెను. అందుచే ఆల్బిజెనులకు వ్యతిరేకముగ హింసాయుద్ధము ప్రారంభించుట న్యాయమని మూడవ పోప్ ఇన్నోసెంట్ (Pope Innocent III) తన ప్రతినిధులను ఐరోపా అంతటికి పంపించి, సైన్యములను సమకూర్చి, ఆల్బిజెనులపై యుద్ధము చేయుటకు పంపెను. పోప్ ఈ యుద్ధమును ‘పవిత్ర యుద్ధము’గా ప్రకటించి ఈ యుద్ధములో పాల్గొనినవారందరికి “పరలోకము”ను వాగ్దానము చేసెను.

క్రీ.శ. 1209 నుండి క్రీ.శ. 1229 వరకు జరిగిన మిక్కిలి అపవిత్రమైన ఈ యుద్ధములో ఆల్బిజెనుడైన కౌంట్ రేమాండ్, గొప్ప ధైర్యముతో టౌలౌస్ పట్టణమును, మతోన్మాదియైన రోమన్ కథోలిక్ సంస్థానాధిపతిని, మరికొన్ని ఇతర ప్రాంతములను జయించెను. పోప్ సైన్యము కౌంట్ రేమాండ్ను బహిరంగముగా ఓడించలేకపోవుటచే, ఫ్రాన్స్ రాజు, రాణి మరియు ముగ్గురు ఆర్చిబిషప్లు గొప్ప సైన్యమును సమకూర్చి, శాంతి ఒప్పందమునకు రావలసినదిగా కౌంట్ రేమాండ్ను ఆహ్వానించిరి. అయితే అతడు వచ్చిన తరువాత మోసముతో అతనిని నిర్బంధించి, చెరసాలలో వేసిరి. అతనిని శత్రువుల ముందు అవమానపరచుటకు కిరీటము లేని తల, పాదరక్షలు లేని కాళ్లతో బలవంతముగా నడిపించి, వివిధ రకములైన చిత్రహింసలద్వారా హింసించి పోప్ల సిద్ధాంతములను వ్యతిరేకించవద్దని హెచ్చరించిరి.

కౌంట్ రేమాండ్ను బంధించిన తరువాత, అనభిషిక్తులైనవారు పరిశుద్ధ లేఖనము లను చదువరాదని పోప్ ఆజ్ఞాపించెను. పదమూడవ శతాబ్దము మిగతా కాలములో ఐరోపా అంతట మతన్యాయస్థానము (Inquisition) ద్వారా ఆల్బిజెనులను, వాల్డెను లను, ఇతర మార్పుచెందిన క్రైస్తవులను అణచుటయే వారి ప్రధాన గురియైయున్నది.

మత న్యాయస్థానము

మతద్రోహులను శిక్షించుటకు ఏర్పాటుచేయబడిన న్యాయస్థానమును ‘ఇన్క్వ జిషన్’ అందురు. ఆనాటి క్రైస్తవ సంఘములోని దోషములను, మూఢభక్తిని వ్యతిరే కించినవారిని శిక్షించుటకీన్యాయస్థానమేర్పడెను. బిషప్లచేత, సంఘసంబంధమైన సభ్యులతో ఈ న్యాయస్థానము పరిపాలింపబడెను.

ప్రతి మతన్యాయస్థానములో సుమారు ఇరువదిమంది అధికారులు నియమించ బడిరి. ప్రధాన విచారణకర్త, ముగ్గురు ముఖ్య న్యాయాధికారులు, కోశాధికారి, పురజనులకు సంబంధించిన అధికారి, ఆర్థిక సంబంధమైన లెక్కలుచూచు అధికారి, మతాధికారుల హింసలు, విచారణ వశపరచుకొనిన ఆస్తి విషయములు చూచు అధికారి, ఆస్తి విలువను తనఖీచేయు అధికారులు, “జైలు అధికారి, ఉరితీయువారు, కాల్చువారు, వైద్యులు, జరిగిన విషయములను గ్రంథస్థము చేయు లేఖికులు కలరు.

మతద్రోహులని అనుమానించబడినవారిని నేరారోపణలతో సంబంధము లేకుండ వారిని న్యాయమూర్తులు చాలా కఠినముగ శిక్షించెను. వారి వయస్సు, ఆడ, మగ, జాతి తేడా లేకుండ, ఉన్నత కుటుంబీకులైనను ఏవిధమైన దయాదాక్షిణ్యములు చూపలేదు. వారి ఉన్నత ఉద్యోగము, సాంఘిక స్థితి, శారీరక లేక మానసిక స్థితి గతులనుకూడ లెక్కచేయలేదు. మత సిద్ధాంతములను, వారి అధికారమును ధిక్కరించిన వారియెడల ముఖ్యముగ ఒకప్పుడు రోమన్ కేథలికైయుండి, ఇప్పుడు ప్రొటెస్టంట్ లైన వారిని అతి దారుణముగ హింసించిరి.

ఇన్విజిషన్ ముందు వాదనద్వారా రక్షించుకొను పద్ధతి లేదు. నేరము మోపబడిన చాలును. ధనము ఎంత ఎక్కువ ఉంటే అంత అపాయము. కొన్నిసార్లు మతద్రోహి అనే కాదుగాని అధిక ధనవంతులనికూడ కొందరిని ఉరితీసిరి. అనేకసార్లు వారి భూములు, గృహములు, అధికారములు లాగివేయబడెను.

నిజ క్రైస్తవులను మతద్రోహులుగా చిత్రించి, వారిని వివిధరీతులుగా వేధించి, వారు తాము నేరము చేసినట్లు ఒప్పుకొన్ను పరిస్థితులను కల్పించి, హింసించుటకు వారికి తెలిసిన ప్రతి పద్ధతిని అవలంభించిరి. కొన్నిసార్లు హింసించుటకు క్రొత్త పద్ధతులను ఊహించి అమలు చేసిరి. కొయ్యస్తంభమునకు కట్టి కాళ్లు, చేతులు ఎముకలు స్థానము తప్పువరకు సాగదీయుట, నిప్పులతో కాల్చుట, కాలుచున్న లోహములపై పరుండబెట్టుట, బొటనవ్రేళ్లను నరుకుట, కాళ్లు చేతులను చితుక గొట్టుట, పళ్లు ఊడబెరుకుట, ముళ్లగంటెతో చర్మమును లాగుట, మాంసపు కండలలో ఇనుప కొక్కెములు గ్రుచ్చి మాంసము చిన్న చిన్న ముక్కలుగా వచ్చునట్లు లాగుట, శరీరములో సూదులు గ్రుచ్చుట, కాళ్లు చేతుల వ్రేళ్లగోరులక్రింద సూదులు గ్రుచ్చుట, కొరడాలతో కొట్టుట, దుడ్డుకఱ్ఱలతో కొట్టుట, అవయవములను మెలివేయుట, కీళ్లను విడదీయుట – ఈ రీతిగ నిజక్రైస్తవులను మతిభ్రమించినవారిలా, న్యాయనిర్ణేతలు పేర్కొనలేనన్ని ఘోరపద్ధతులద్వారా చిత్ర హింసలకు గురిచేసిరి.

ఇనిక్విజిషన్ తీర్పులను ముగించిన తరువాత ఉరితీయు స్థలములో పవిత్రమైన కార్యక్రమము జరుగును. అది ‘సెర్మొ జెనెరాలిస్’ (Sermo generalis / సాధారణ ప్రసంగము) అని తెలియబడినది. స్పెయిన్లో దానిని ‘ఆటో-డి-ఫె’ (Auto – De-Fe / విశ్వాస కార్యము) అందురు. దానికి ప్రాంతీయ అధికారులు, మతాధికారులు, ఉరితీయుటను కోరువారందరు, మతద్రోహులకు శత్రువులైనా, మిత్రులైనా అందరు హాజరవుదురు. నేరస్థులుగా తీర్చబడిన మతద్రోహులు వారి మతద్రోహమును ఒప్పుకొని, తమ విశ్వాసమును పరిత్యజించినచో వారి శిక్షలు రద్దుచేయుదురు. అనగా తీవ్రముగా శిక్షించుటకు బదులు, ఖైదులో ఉంచుట, సంఘ అవసరములకు వారి ఆస్తిని, వస్తువులను వశపరచుకొనుట చేసెదరు. ఒకవేళ నేరస్థులు తమ విశ్వాసములో పట్టుదలగా ఉన్నచో, వారిని శపించి, అందరు చూచుచుండగ కాల్చిచంపుటకు హంతకులకు అప్పగించెదరు. ఎవరును మతద్రోహమునకు పాల్పడకుండ వారిని చాలా క్రూరముగా చంపెడివారు. అయితే హతసాక్షుల ధైర్యమును, వారి హింసలలో, అగ్నిజ్వాలలో దేవుడు వారికి అనుగ్రహించిన కృపను చూచినప్పుడు క్రీస్తునందు నిజవిశ్వాసమున్నవారు మరింత బలపడిరి.

ప్రపంచములోనున్న మతన్యాయస్థానములన్నిటిలో స్పెయిన్లో ని మతన్యాయ స్థానము చాల పట్టుదలగాను, తీవ్రముగాను పనిచేసెను. అపవిత్రులుగా ఉండి, పవిత్రులమని చెప్పుకొనువారికి హద్దులేని అధికారము లిచ్చినప్పుడు వారి ఆగడాలకు అంతుండదు.

స్పెయిన్

మతన్యాయస్థానములవలన ప్రపంచములో ఎందరు చంపబడినది, హింసింపబడి నది తెలుసుకొనుటకు వ్రాతపూర్వక ఆధారములు లేవు. అయితే స్పెయిన్ మతన్యాయ స్థానమునకు సంబంధించి వ్రాయబడిన కొన్ని సంఘటనలు ఇచ్చట పరిశీలించుదము.

స్పెయిన్లో పదిహేడు న్యాయస్థానములు కలవు. అందు ఒక్కొక్కటి ఏడాదికి సుమారు పదిమంది మతద్రోహులను కాల్చిచంపెను. అనేక వేలమంది ప్రజలను చిత్రహింసలకు గురిచేసి, అంగవైకల్యము గావించెను. వారెన్నటికి ఆ గాయముల నుండి కోలుకొనలేకపోయెను. కేవలము వారి తప్పుడు మతసిద్ధాంతములను అంగీక రించకపోవుటవలన స్పెయిన్ మతన్యాయస్థానముద్వారా సుమారు 32,000 మంది ప్రజలు నమ్మలేని విధముగ హింసింపబడి, సజీవదహనము గావించబడిరి.

వీరుకాక, అనేక వేలమంది జైలునకు పంపబడి, వారి ఆస్తి ఆక్రమించబడి, రక్తము కారునంతగా హింసింపబడి, జీవితములో వారికున్న దంతయు పోగొట్టుకొనిరి. వీరి సంఖ్య సుమారు 3,39,000. శ్రమలవలన గుహలలోను, చీకటి, పురుగులు, దుర్గంధము, రోగగ్రస్థమైన బొరియలలో ఉండి, విరిగిన హృదయములతో, బ్రతుకు దెరువుకొరకు వారిమీద ఆధారపడిన వేలకొలది మనుష్యులను వదలి, క్రీస్తుకొరకు మరణించినవారెందరో కలరు. వారినిగూర్చి గ్రంథస్థము చేయబడిన ఆధారములు భూమిపై లేవు కాని వ్రాసిపెట్టిన గ్రంథములు తీర్పుదినముకొరకు పరలోకములో దాచిపెట్టబడినవి.

క్రీ.శ. 1483 లో స్పెయిన్లోని రోమన్ కేథలిక్ పరిపాలకులు, ఆరగాను చెందిన రెండవ ఫెర్డినాండ్ (Ferdinand II), కేసైల్ నివాసి మొదటి ఇసబెల్లా (Isabella I) ల ప్రేరణతో పోప్ నాల్గవ సిక్స్త్స్ (Pope Sixtus IV) స్పెయిన్కు ఒక స్వతంత్ర మత న్యాయస్థానమును ఏర్పాటుచేసెను. క్రీ.శ. 1487 లో పోప్ ఎనిమిదవ ఇన్నోసెంట్ (Pope Innocent VIII) డొమినికన్ సన్యాసియైన థామస్ డి టార్క్ మడా (Tomas de Torquemada) ను ప్రధాన న్యాయమూర్తిగా నియ మించెను. అతని నాయకత్వములో వేలకొలది క్రైస్తవులు, యూదులు, మహమ్మ దీయులు, ఇంక అనేకులు హింసింపబడి మరణించిరి.

కఠినత్వము, మతమౌఢ్యము, అసహనము, ద్వేషములకు మారుపేరైన టారడా స్పెయిన్ ప్రజలందరని హడలగొట్టెను. క్రీ.శ. 1487 నుండి క్రీ.శ. 1498 మధ్యగల అతని భయంకర పరిపాలనా కాలములో అతని వ్యక్తిగత ఆజ్ఞమీద సుమారు 2000 మందిని కొయ్యస్తంభములకు కట్టి కాల్చివేసిరి. ఏడాదికి అతనివలన 181 మంది మరణించగ, స్పెయిన్ న్యాయస్థానమువలన ఏడాదికి 10 మందిమాత్రమే కాల్చి చంపబడిరి.

రోమన్ కేథలిక్ పాలకుల సహకారముతో మొదటి స్పానిష్ విచారణకర్తలు ప్రజలను కాల్చిచంపుటకు భయంకరమైన పద్ధతులను అవలంభించిరి. క్రీ.శ. 1492లో మతన్యాయస్థానము యూదులను, మూరులను (Moors) స్పెయిన్ నుండి వెళ్లగొట్టెను. లేదా రోమన్ కేథలిక్ మతములోకి మారవలసినదిగా వారిని బలవంతము చేసెను.

టార్క్మడా

రాజకీయ కారణములననుసరించి విచారణకర్తలు వలసల మధ్య కఠిన చర్యలు చేపట్టి అమెరికాలోని స్పెయిన్ వలసలలోనున్న భారతీయులను తమ మతములోకి మార్చిరి. క్రీ.శ. 1821 పోర్చుగల్లోనూ, క్రీ.శ. 1834 స్పెయిన్ లోనూ అనగా 19వ శతాబ్దము తొలిభాగము వరకు మతన్యాయస్థానముయొక్క క్రూరత్వము తగ్గిననూ, ఏదో ఒక రకముగా హింసలు కొనసాగించెను. తరువాత దాని పేరు మారినది కాని దారుణములు తగ్గలేదు.

క్రీ.శ. 1908 లో పవిత్ర కార్యాలయ సంఘము (Congregation of the Holy Office) అను పేరుతో మత న్యాయస్థానము పునర్నిర్మాణము గావింపబడెను. క్రీ.శ. 1965 లో పోప్ ఆరవ పాల్చే విశ్వాస సిద్ధాంత సమాజము (Congregation for the Doctrine of the Faith) అను పునర్నిర్వచనము రెండవ వాటికన్ కౌన్సిల్లో చెప్పబడెను. మతద్రోహమును “నిందించుట”కంటే సరియైన సిద్ధాంతములను అను కూలమైన పద్దతిలో ప్రవేశపెట్టి అమలుపరచుటయే నేటి కర్తవ్యమని నిర్ణయించిరి.

Leave a Comment