తూర్పు పడమరల యుద్ధము లెట్లు?

తూర్పు పడమరల యుద్ధము లెట్లు?

ప్రశ్న:-

ప్రకటన 16:12-16, 13:11-18 లో నున్న తూర్పు పడమరల యుద్ధము వచ్చునా? ఎప్పుడు వచ్చును?

జవాబు:-

అవును, ప్రకటన 16:11-16 చూస్తే తూర్పునుండి వచ్చు రాజులు అనే గుంపువారు చెప్పబడియున్నారు. వారందరేకమై యుద్ధానికి వచ్చేది నిజము. ప్రకటన 9:16 లో కూడుకొనిన ఆ తూర్పు సైన్యముల లెక్క ఇరువది కోట్లని వ్రాయబడినది. అంతటి గుంపు వచ్చి లోకమును తల్లక్రిందులు పెట్టగా మనుష్యులలో మూడవ భాగము సంహరింపబడునని ప్రకటన 9:15 తెల్పుచున్నది. జరుగకముందుగానే ప్రభువు మనకు సత్యవచనములలో సమస్తమును వివరించి తెల్పుచున్నాడు. ఆయన నామము స్తుతింపబడుగాక.

ఈ గొప్ప సంహారము దేవుని యెరుకలో ఫలాని త్సరము, నెల, దినము, గంట అనే మట్టుకు నిశ్చయింపబడియున్నది. చూడండి. మెప్పుడు జరుగునను ప్రశ్నకు జవాబుగా ప్రకటన 9:15, అపొ. కార్య. 1:7 డి. యెందుకంటే నాకైనను దూతలకైనను తెలియనిది తండ్రి తానే తన చేతిలో నమయమును కాలము నుంచుకొనియున్నాడు. మరియు 1 కొరింథీ 11:3 లోని శిరస్సత్వమును కాపాడుట కొరకు మార్కు 13:32 ప్రకారము కుమారుడైన క్రీస్తుకు కూడ ఆ సమయము తెలియదని వ్రాయబడినది.

దైవత్వముగల క్రీస్తుకు సమస్తమును తెలుసును లెండి. గనుక రెండవ రాకడ సంగతియు క్రీస్తు యెరిగియున్నాడు. అయితే మాదిరికొరకు తండ్రికి లోబడి ఆ సంగతి తండ్రి కప్పగించియున్నాడు. మనముకూడ జరుగబోవు ఆ మహాయుద్ధము సంబంధముగా నెప్పుడు జరుగునో ఫలాని తేదికొరకు వెదకక క్రీస్తు రాకడ కొరకెదురుచూచుచు తత్సమయములో కార్య. 1:8 ప్రకారము ఆయనపరముగా సాక్ష్యమిచ్చుచుండవలయును. క్రీస్తు సంఘమెత్తి వేయబడనిదే ప్రకటన 9, 13, 16 మొ. అధ్యాయములో వ్రాయబడినవి నెరవేరజాలవు.

వెలుగు గాను, ఉప్పుగాను, అడ్డగించుచున్న వాడుగాను పనిచేయుచున్న సంఘము తీసివేయ బడుటతోనే 2 థెస్స. 2:7-9 చొప్పున ధర్మవిరోధి బయలుదేరి వచ్చి పనిచేస్తాడు. వాని దినములలోనే ఈ భయంకరమైన యుద్ధము జరుగును. ఆ యుద్ధములో యూదులు మర్దనపొందుదురు. ఎందుకంటే జెకర్యా 14:1,2 ప్రకారము వారి ముఖ్య పట్టణమైన యెరూషలేము అన్యజనులందరి సైన్యముల చేత చుట్టబడును. సమకూడి వచ్చిన వారొకరితో నొకరును మరియు యూదులతోను భయంకరముగా పోట్లాడుదురు

గనుకనేఆ ఘోర యుద్ధము విశేషముగా జరిగేతావు హెబ్రీభాషలో హార్ మెగిద్దోనని పిలువబడుచున్నది. తెలుగులో సంహార పర్వతమని అర్థము. (పకటన ్ర 16:15). ఈ పేరు రెండవ దిన. 35:22 లో కనబడుచున్న మెగిద్దోఅనబడిన లోయతో సంబంధించి యున్నది. మొన్న పాలస్తీనుకు వెళ్ళినప్పుడీలోయను జూచితిని. ఈ స్థలమున నొక కాలమందు జరిగిన యుద్ధములో రాజైన యోషీయా మరణకరమైన గాయము తగిలి యెరూషలేమునకు వెళ్ళి చచ్చెను.

ఆరంభములో యెహోషువ మెగిద్దోపద్రేశము నేలుచుండిన అన్యుడైన రాజునోడించి మెగిద్దోను పట్టు కొనెను. (యెహోషువ 12:9-24). అయితేబారాకు దెబోరాలు జీవించిన దినములలో అవసరమునుబట్టివారు జరిపిన యుద్ధము మరల ఆ చోటివరకు వ్యాపించగా మెగిద్దోకాలువల యొద్దశత్రువులపైవారు గొప్ప విజయము నొందిరి. (న్యాయాధి5:19). యూదా రాజైన అహజ్యా ప్రాణము విడిచినది యీ మెగిద్దోఅనబడిన యుద్ధస్థలములోనే. (2 రాజులు 9:27). మరియు యూదులిక బహుగా పల్రాపింపబోవు స్థలము మెగిద్దోఅని జెకర్యా 12:11 తెల్పుచున్నది. ఇదంతయు నొట్టుకు చేర్చి చెప్పితేఈ క్రిందికార్యములు జరుగనైయున్నవని గోచరించుచున్నది.

ఇరువదికోట్లసంఖ్య గల తూర్పు రాజుల సైన్యము యేర్పడికదలి వస్తుంది. (పకటన ్ర 9:16).

ఈ మహా గొప్ప సైన్యముతో కూడ లోకమంతటనున్న రాజులు వారివారిసైన్యములతో చేర్చబడుదురు – ఇందులో చేరక పత్ర్యేకముగా నుందామని ఏ రాజు చెప్ప వీలుపడదు. (పకటన ్ర 16:14). బహుశ ఈ సైన్యములు మృగమనేవాని ఆధీనముక్రింద నుంటవి. (పకటన ్ర 13:7).

మూడవ గుంపుగా నుత్తరమునుండిరష్యా సైన్యములు వచ్చును. యెహెజ్కేలు 38:2 లో చెప్పబడిన రోషు రష్యాయనియు, మెషెకు రష్యా రాజధానియైన మాస్కో అనియు అనుకుంటున్నాము. కాబట్టిదానియేలు 11:44 పక్రారము కడవరిదినము లలో (యెహెజ్కేలు 38:16)
సర్వలోకము మూడు గుంపులుగా విభాగింపబడి

తూర్పు రాజులు – వారిదొక సమూహము

ఉత్తరపు సైన్యము – రష్యావారు.

క్రీస్తు విరోధిసమకూర్చిన పదిమందిరాజుల గుంపువారందరును పాలస్తీనులో బడియూదులను దోచుకొందామని పయ్ర త్నించుదురు. అయితే యూదులకొరకు కొందరు నిలిచి పోట్లాడగా మెగిద్దాలో గొప్ప వధ జరుగును. గనుకనే ఆ స్థలము హర్మగెద్దోనని పిలువబడినది. “మెగిద్దో లోయలో జరిగెడి వధ” అని దాని అర్థము. అందరును యూదులపై పడరు. కొన్ని జనాంగములవారు దాడిగా వచ్చేవారి నెదిరించి జరుగబోవు తీర్పులో మత్తయి 25 ప్రకారము యూదులకు చేసిన యుపకార సహాయ ములనుబట్టి కుడితట్టు ఆశీర్వాదములతో దీవింపబడుదురు. (మత్తయి 25:35-37). రష్యా దోపిడి నెదిరించు సమస్య యెహెజ్కేలు 38:13 లో వివరించబడినది.

ఏది ఎట్లును లోక జనులలో మూడవ భాగము జనులు సంహరింపబడగా కట్టకడపటి మూడు శ్రమలలో రెండవ గొప్ప శ్రమ సంభవించినట్లుండును. (ప్రకటన 19:12).

దయ్యముల సహాయముతో లోకాధిపతులు ప్రేరేపింపబడి ఈ మహా యుద్ధమునకు వచ్చెదరు. (ప్రకటన 16:14-15). ఆ వేళ హిందూ దేశము ఆ తూర్పు రాజులతో నిలుచునా, లేక పదిమంది రాజులతో నిలుచునా లేక రష్యాతో సంయోజితమై నిలుచునా, యెవరు చెప్పగలరు? అయితే నిప్పుడు ఆ కష్టకాలము రాకపూర్వమే క్రీస్తు సువార్తచేత అనేకులు ఇండియాలో రక్షింపబడుదురుగాకని ప్రార్థించు చున్నాము. దానికి తగినట్లు కూడ కృషి చేయవలెను.

క్రమక్రమేణ మెగిద్దోలో జరిగిన పోరు దక్షిణముగా వచ్చివచ్చి ప్రబలముగా యెరూషలేము పట్టణమే ముట్టడివేయబడును. (జెకర్యా 14:1). శత్రువులు పోరాడగా యూదులోడిపోయినట్టు సూచనగా పట్టణము పట్టబడును. ఇండ్లు కొల్లపెట్టబడును. సిపాయిలు హద్దులేక ఆ యూదా స్త్రీలను చెరుపుదురు. యూదులు ఓడిపోయినట్లే కనబడుతుంది. అయ్యో పాపము!

శత్రువులు జయఘోష చేయుచుండగానే అబ్బో యెన్నడు లేవనిరీతిగా ప్రభువైన క్రీస్తుయేసు అను యెహోవా తానే ప్రస్తుతము కూర్చుండియున్న దానిలోనుండి లేచి రెండవసారి మహిమతో వచ్చి అందరి కగుపడి ఆ శత్రుసైన్యములను నలుదిక్కులు చెదరగొట్టి కొనకు గొప్ప రక్షణతో తన ప్రజలను రక్షించును. ఆయన పాదములు ఒలీవ కొండమీద నిలువగా నింత పని జరుగును. జెకర్యా 14 వ చదివితే అధ్యా పంచాంగమిట్లు భవిష్యత్తు చెప్పుచున్నదని గ్రహించుకుంటారు.

ఈ సంగతులు నిశ్చయము. అటు తరువాత మిగిలిపోయినవారికి తీర్పుతీర్చి క్రీస్తు సర్వలోకమునకు రాజు అగును. (జెకర్యా 14:9). తూర్పు సైన్యములను సంబంధించినట్లు సారిసారి ఫరాతు నది ప్రకటన 16:12 లోను 9:13,14 లోను సూచింపబడి నందున అరబీవారే ఈ కడపటి యుద్ధమునకు కారకులై యుంటారని యూహించుచున్నాము. ఎందుకనగా ప్రస్తుతము ఫరాతు నది ప్రాంతము వారి వశములోనే యున్నది. మరియు అరబీవారు యూదులమీద పట్టినపట్టు అతి తీవ్రమైనదని యెల్లరమెరిగియున్నాము. సందేహము లేకుండ తూర్పు పడమరల మహా యుద్ధము రానైయున్నది.

ఆ దినమున మీరెచ్చట నుంటారు? ప్రాణముతోనుండి ఆ సమస్యలో చేరుతారా, ఏ ప్రక్కను? యూదుల పరముగా వారికి విరుద్ధ పక్షముగానా? లేక బూర మ్రోగగా క్రీస్తుతో సదాకాల ముండుటకు మేఘములమీద కొనిపోబడుదురా? క్రీస్తులో నున్నారా? రక్షింపబడి యున్నారా? ఆలాగుంటే వచ్చే ఈ కష్టాలనెదిరించి తలయెత్తి సిద్ధపడియుండగలరు. (లూకా 21:26-28).

Leave a Comment