వేయి సంవత్సరముల సాధారణ శాంతి కాలములో జరిగిన హింసలు (క్రీ.శ. 320–1079)
ఈ వేయి సంవత్సరములలో హింసలు చెదురుమదురుగా, ప్రపంచమంతట వ్యాపించినందువలన క్రీస్తుకొరకు హతసాక్షులైన కొందరినిగూర్చి మాత్రమే కచ్చితమైన ఆధారములు కలవు. హతసాక్షులైన ప్రతివారు ఒకేరకమైన బాధ, హింసలను అనుభవించి, చివరకు తమ దేవునియందుగల ప్రేమ, విశ్వాసములకై మరణించిరి. వారు ఎక్కడ బాధననుభవించినను దేవుడు వారితో నుండెను.
ఆయన వారికి తన బలమును, శాశ్వత మహిమను పొందువరకు హింసలను భరించు సహనమును అనుగ్రహించెను. ఆయనవలె అట్టి శ్రమను సహించి, ఆయన నామము నిమిత్తము చనిపోవువారికొరకు తన చేతులు చాపి కనిపెట్టుచుండెను. కొందరినిగూర్చిన వివర ములు, వారు ఎక్కడ, ఏ విధముగా క్రీస్తుకొరకు చనిపోయినది పరిశీలించుదము.
పర్షియా : క్రీ.శ. 320
పర్షియా ప్రజలలో అనేకులు సూర్యుని ఆరాధించువారు. సువార్త వారి దేశములో వ్యాపించుట ప్రారంభించినప్పుడు, అన్యమతాచార్యులు ఆ దేశ ప్రజలమీద తమ ప్రభావము పోవునను భయముతో కలవరపడిరి. అందుచే వారు ‘క్రైస్తవులు దేశమునకు విరోధులని, పర్షియనులకు శత్రువులైన రోమీయులకు స్నేహితులని, వారితో జరిగిన ప్రతి యుద్దమునందు పర్షియనులు ఓడిపోవుచున్నార’ని వారి రాజైన సపోర్స్ (Sapores) కు ఫిర్యాదు చేసిరి.
అందుచే సపోర్స్ తన రాజ్యములో క్రైస్తవులెక్కడున్నను వారిని చిత్రహింస చేయుడని ఆజ్ఞాపించెను. ఆ విధముగ, సంఘములో, పర్షియా ప్రభుత్వములో పనిచేయుచున్న దైవభక్తిగల అనేకమంది ప్రజలు బంధింపబడి హతసాక్షులైరి.
పర్షియాలో జరుగుచున్న హత్యల విషయమై కాన్స్టాంటైన్ చక్రవర్తి దృష్టికి రాగా, క్రైస్తవులను హింసించినవారికి సంభవించిన విషాదములు, వారిని బహుగా ఆద రించినవారికి నిరంతరము కలుగు గొప్ప విజయములనుగూర్చి అతడు సపోర్స్ నకు ఒక లేఖ వ్రాసెను. విరోధులైన రోమా చక్రవర్తులపై తన సొంత విజయములను ఉదహరించుచూ ఈలాగు వ్రాసెను :
“క్రీస్తునందలి విశ్వాసమువలనమాత్రమే నేను వారిని ఓడించితిని, ఆ విశ్వాసమునుబట్టియే ప్రతి యుద్దములో దేవుడు నాకు సహాయముచేసి, విజయము కలుగజేసెను. పశ్చిమ మహాసముద్రమునుండి తూర్పున చాల దూరమువరకు నా సామ్రాజ్యమును ఆయనే విస్తరింపజేసెను. ఇవన్నీ పొందుటకు నేను పూర్వికుల దేవతలెవరికి బలి అర్పించలేదు, మంత్ర శక్తులను ఉపయోగించను లేదు. నేను సర్వశక్తిగల దేవునిని మాత్రమే ప్రార్థించి, నాకు పతాకముగా నీయబడిన క్రీస్తు సిలువను అనుసరించి తిని. దీనినంతటిని ఆలోచింపుము, నీవుకూడ మహిమలో ఆశీర్వదించ బడినప్పుడు నేనే సంతోషించెదను, ఎందుకనగా నీవు క్రైస్తవులను చక్కగ ఆదరించితివి. నీవు నేను, నీవు వారు నిరంతర శాంతిని అనుభవించ వలెను.”
కాన్స్టాంటైన్ యొక్క విజ్ఞప్తి ఫలితముగ పర్షియాలో హింసలు కొంతకాలము నిలిచినవి; కాని కొన్ని సంవత్సరముల తరువాత క్రైస్తవులకు వ్యతిరేక మనస్తత్వముగల వ్యక్తి పర్షియాకు రాజైనప్పుడు హింసలు మరల ప్రారంభమైనవి.
ఐగుప్తు : క్రీ.శ. 325–340
సుమారు క్రీ.శ. 318 లో ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో అరియస్ (Arius) అను క్రైస్తవ బోధకుడు ‘యేసుక్రీస్తు మధ్యలో సృజింపబడిన వ్యక్తియేకాని నిత్యత్వము నుండి ఉన్నవాడు కాదని, కనుక దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాదు’ అని ప్రకటించు ఒక సిద్ధాంతమును ప్రచురించెను. ఆ సిద్ధాంతమును పరిష్కరించుటకు కాన్ స్టాంటైన్ నైసియా (Nicaea) అను పట్టణములో సర్వమతశాఖల సమావేశమును ఏర్పాటు చేసెను. ఆ సమావేశము అరియసు, ‘అరియనిజమ్’ (Arianism) అని పిలువబడు అతని సిద్ధాంతములను తీవ్రముగ విమర్శించి, తండ్రియైన దేవుడు, కుమారుడు ఒక్కటే అనియు, తండ్రియు, కుమారుడును ‘ఒకే మూలమునకు చెందినవారని’ ప్రకటించిరి.

అతని ననుసరించివచ్చిన వాలెన్స్ (Valens) కూడ ఆ సిద్ధాంతమును బలపరచెను. అతడు తన సోదరుడైన మొదటి వాలెన్టిటినియన్ (Valentinian I) తో పాటు పరిపాలనలో భాగస్వామ్యమును తీసికొని సంయుక్తముగా పరిపాలించెను. రెండవ కాన్స్టాంటియస్ సింహాసనమధిష్టించగానే అరియన్స్ విజృం భించి నిష్ఠగల క్రైస్తవులను, ముఖ్యముగ క్రీస్తు దైవత్వములో నమ్మకముగల క్రైస్తవులను హింసించుట మొదలుపెట్టిరి.
అలెగ్జాండ్రియాలో అతనాసియస్ (Athanasius) అను గ్రీకు ప్రధాన గురువు కలడు. అతడు అరియనిజమ్ను పాటించువారినుండి క్రైస్తవ విశ్వాసులను కాపాడువాడు. అతనితోపాటు అనేకమంది బిషప్లుకూడ అలెగ్జాండ్రియా నుండి బహిష్కరింపబడెను. వారి ఉద్యోగములు అరియన్స్కు ఇవ్వబడెను. ఐగుప్తులోని రోమా సైన్యాధిపతియైన అర్తెమియస్ (Artemius) క్రైస్తవ్యమును స్వీకరించినందున అతని ఉద్యోగము, ఆస్తి, చివరకు అతని తలకూడ తీయబడెను.
రోము : క్రీ.శ. 361
క్రీ.శ. 361 లో రెండవ కాన్స్టాంటియస్ చనిపోగా, అతని తరువాత వచ్చిన జూలియన్ (Julian) రోమా చక్రవర్తిగా రెండు సంవత్సరములు పరిపాలించెను. జూలియన్ క్రైస్తవ విశ్వాసములో ఎదిగినప్పటికినీ, చక్రవర్తియైన వెంటనే క్రైస్తవ్యమును విడనాడి, తాను అన్యుడనని, రోమీయుల పురాతన అన్యమతమును పునరుద్ధరించెదనని ప్రకటించెను. క్రైస్తవులకు విరోధముగ బహిరంగ చట్టములు ప్రకటింపలేదు కాని, విగ్రహారాధనను తిరిగి ప్రవేశపెట్టి, బహిష్కరింపబడిన అన్యులను తిరిగి రప్పించెను.
ప్రతి వ్యక్తి తన మతమును యథేచ్ఛగా ఆచరించుటకు అనుమతి ఇచ్చినను, క్రైస్తవులను ప్రభుత్వ, సైనిక ఉద్యోగములనుండి తొలగించి, కాన్స్టాంటైన్ క్రైస్తవ బిషప్లకిచ్చిన అన్ని హక్కులను రద్దుచేసెను.
ఇటలీలోని అరెజ్జా (Arezzo) బిషప్ డొనటస్ (Donatus) ను, సన్యాసి హిలారి నస్ (Hilarinus) ను, మరియు రోమా న్యాయాధిపతి గార్డియన్ (Gordian) లను హింసించి, మరణదండన విధించెను.
అంకారా (టర్కీ) : క్రీ.శ 362
విగ్రహారాధనను తీవ్రముగ వ్యతిరేకించినందుకు తూర్పు అంకేరా లేక అంకారా (Ancyra or Ankara) పట్టణ బిషప్ బాసిల్ (Basil) ను కారాగారములో బంధిం చిరి. అతడు కారాగారములోనుండగ జూలియన్ చక్రవర్తి అంకారా వచ్చి, తానే స్వయముగ విచారించు నిమిత్తము బాసిల్ను తన యెదుటకు రప్పించి, విగ్రహారాధనకు వ్యతిరేకమైన చర్యలనన్నింటిని మానుకొనుమని హెచ్చరించెను.
కాని బాసిల్ అంగీక రించలేదు. పైగా నీవు శాశ్వతముగా బాధననుభవించుదువని చక్రవర్తి మరణమును గూర్చి బాసిల్ ప్రవచించెను. అది వినిన జూలియన్ మండిపడి బాసిల్ శరీరములో ఏడు వేర్వేరు ప్రదేశములలో ప్రతి దినము చర్మము మాంసమునుండి వేరగునంతవరకు ఒలిచి వేయుమని ఆజ్ఞాపించెను. అయితే ఆ పరిస్థితి సంభవింపకముందే తీవ్రమైన బాధతో బాసిల్ చనిపోయెను. ఇది క్రీ.శ. 362 జూన్ 28న జరిగినది.
పాలస్తీనా : క్రీ.శ. 363
పాలస్తీనాలో హతసాక్షులైనవారియొక్క వ్యక్తిగత సమాచార గ్రంథములేమియు లేవు. సామాన్యరీతిలో వారందరు తమ జీవితములను క్రీస్తునకు అర్పించిరి. కొందరు సజీవ దహనము గావింపబడిరి, కొందరు తమ కాళ్లు బంధింపబడి దిగంబరులుగా వీధుల వెంబడి ఈడ్చుకొనిపోవుటవలన రక్తము స్రవించి, బాధతో చనిపోయిరి. మిగిలినవారు కాల్చి చంపబడిరి లేక రాళ్ల దెబ్బలచే చంపబడిరి, మరి అనేకులను కఱ్ఱలతో తలలమీద మోదినప్పుడు మెదడు బయటికివచ్చి చనిపోయిరి.
అలెగ్జాండ్రియా : క్రీ.శ. 363
అలెగ్జాండ్రియాలో హతసాక్షులైన క్రైస్తవులను లెక్కింపనలవికాదు. కత్తులతో పొడవబడి, కాల్చబడి, రాళ్లు రువ్వబడినందున కొందరు చనిపోయిరి. కొందరి పొట్ట(ఉదరము)లు కోసి వాటియందు ధాన్యము కూర్చి, ఆ ధాన్యమును వారి ప్రేగులతో పాటు తినుటకు పందులను వదలిరి. ఎంతసేపు వారు ఆ బాధతో జీవించిరనునది పందుల ఆకలిమీద ఆధారపడియున్నది!
థ్రాస్ : క్రీ.శ. 363
ఎమిలియానస్ (Emilianus) అను క్రైస్తవుని స్తంభమునకు కట్టి కాల్చివేసిరి, హంతకులబారినుండి దాగుకొనుటకు గుహలోనికి పరుగెత్తిన డొమిటియస్ (Domi tius) అను మరియొకనిని కత్తులతో పొడిచి చంపిరి.
క్రీ.శ. 363 లో జు అన్ (Ju an) చక్రవర్తి పర్షియాతో జరిగిన యుద్దములో గాయపడి మరణించెను. అతని తరువాత వచ్చిన జోవియన్ (Jovian) టైగ్రిస్ నదికి ఆవలనున్న రోమా ప్రాంతములన్నిటిని ఇచ్చివేసి, పర్షియనులతో సంధిచేసికొనెను. జోవియన్ ఒక్క సంవత్సరము మాత్రమే పరిపాలించినను సంఘమునకు తాత్కాలిక శాంతిని తిరిగి తెచ్చెను.
క్రీ.శ. 364 లో మొదటి వాలెన్టిటినియన్ పశ్చిమ రోమా చక్రవర్తియై తన సోదరుడైన వాలెన్స్తో కలసి తూర్పుప్రాంతమును సంయుక్తముగా పరిపాలించెను. వాలెన్స్ అరియనుడు, కనుక మరియొకసారి దేవుని నిజసంఘము శ్రమలపాలైనది. మొదటి వాలెన్టిటినియన్ పశ్చిమ ప్రాంతమును క్రీ.శ. 364 నుండి క్రీ.శ. 375 వరకు పరిపాలింపగా, వాలెన్స్ తూర్పు ప్రాంతములో క్రీ.శ. 364 నుండి క్రీ.శ. 378 వరకు పరిపాలించెను.
ఆడ్రియానోపిల్ (Adrianople) పట్టణ సమీపమున విసిగోత్స్ (Visigoths) తో జరిగిన యుద్ధములో క్రీ.శ. 378 లో అతడు చంపబడెను. గోత్స్ (గోత ప్రజలు) లలో అనేకులు క్రైస్తవులు. గోత్స్నండి క్రైస్తవ్యమును స్వీకరించిన భక్తిగల విద్యావేత్తయైన ఉల్ఫిలాస్ (Ulfilas) ద్వారా అనేకుల మధ్య క్రైస్తవ్యము వ్యాపించెను. అతడు నలుబది సంవత్సరములకు పైగా కృషిచేసి, గోతిక్ భాషకు ప్రప్రథమముగా వర్ణమాల తయారుచేసి, బైబిలును ఆ భాషలోనికి తర్జుమా చేసి, క్రీస్తు సువార్తను వారికి ప్రకటించెను.
అలెగ్జాండ్రియా : క్రీ.శ. 386
అరియన్ బిషప్న జార్జ్ల్కు అలెగ్జాండ్రియా పట్టణములోని భక్తిగల క్రైస్తవులను హింసించుటకు చక్రవర్తి అధికారమియ్యగా, చాల దుష్టత్వముతో అతడు క్రైస్తవులను హింసించెను. ప్రభుత్వ నాయకులలో అనేకులు, ఐగుప్తు సైన్యాధిపతి, పెద్ద హోదాకలిగిన రోము అధికారి అతనికి సహాయపడిరి.
హింసాకాలములో నిష్ఠగల బిషప్లను అలెగ్జాండ్రియానుండి తరిమివేసి, వారి దేవాలయములను మూసివేసిరి. క్రైస్తవులకు ఎంతో క్రూరమైన శిక్షలు విధించిరి. శిక్షనుండి క్రైస్తవుడెవరైన పారిపోయినట్లయితే, అతని కుటుంబ సభ్యులందరిని ఉరితీసి, వారి ఆస్తిని స్వాధీనపరచుకొనిరి.
స్పెయిన్ : క్రీ.శ. 586
హెర్మెనిజిల్డస్ (Hermenigildus) గోత్స్ రాజైన లియోవిజిల్డస్ (Leovigildus) యొక్క పెద్ద కుమారుడు. మొదట అతడు ఆరియన్ అయినప్పటికి దైవభక్తిగల అతని భార్య ఇంగొండా (Ingonda) ద్వారా నిజదేవుని తెలిసికొనెను. అతని తండ్రి అతని మతము మార్పునుగూర్చి వినినప్పుడు నైరుతి స్పెయిన్లోని సెవిలే (Seville) పట్టణ గవర్నర్ పదవినుండి అతనిని తొలగించి హతమార్చెదనని బెదరించెను. కాని హెర్మెనిజిల్డస్ క్రీస్తునందలి విశ్వాసమును వదులుకొనలేదు.
మరణశిక్షను తప్పించుకొనుటకు హెర్మెనిజిల్డస్ తనకొరకు పోరాడు బలమైన విశ్వాసుల సైన్యమును సమకూర్చుకొనెను. తిరుగుబాటు చేసినాడను కక్షతో, రాజు విశ్వాసులనందరిని హతమార్చ ప్రారంభించి, ఒక బలమైన సైన్యమును సెవిలేవైపునకు పంపించెను. మొదటిలో హెర్మెనిజిల్డస్ సెవిలేలో ఆశ్రయము పొంది, యుద్ధము తీవ్రమైనప్పుడు అసైటా (Asieta) కు పారిపోయెను. కాని అచ్చట అతనిని బంధించి, సెవిలేకు తిరిగి తీసికొని వచ్చిరి. ఈస్టరు విందురోజు ఆరియన్ బిషప్ వద్దనుండి దైవప్రసాదము తెచ్చిన దూతను చేర్చుకొనుటకతడు నిరాకరించినందున తండ్రి ఆజ్ఞప్రకారము సైనికులు అతనిని ఖండఖండములుగ చీల్చి చంపిరి. అది క్రీ.శ. 586 ఏప్రిల్ 13వ తేదిన జరిగినది.
లొంబార్డి (ఇటలీ) : క్రీ.శ. 683
లొంబార్డి ప్రాంతములోని బెర్గమో (Bergamo) పట్టణ బిషప్ యైన జాన్ అరియనిజమ్ సిద్ధాంతములను సంఘమునుండి తుడిచివేయుటకు మిలాన్ పట్టణ బిషప్ తన సైన్యమును జతపరిచెను. వారిద్దరు మతవ్యతిరేక శక్తులను అణచుటలో కృతకృత్యులైరి. అయితే క్రీ.శ. 683 జూలై 11న జాన్ హత్యచేయబడెను.
వేయి సంవత్సరముల … శాంతి కాలములో జరిగిన హింసలు
జర్మనీ : క్రీ.శ. 689
జర్మనీలోని ఫ్రాంకోనియా (Franconia) లోని అన్యులకు కిఫెన్ (Kiffien) అను పవిత్ర రోమా బిషప్ దేవుని వాక్యమును బోధించెను. అతడు వర్జ్బర్గ్ (Wurz burg) గవర్నరైన గోజెబెర్ట్ (Gozbert) ను, ఆ పట్టణ పౌరులలో అనేకులను క్రైస్తవ్యము లోనికి నడిపించెను. క్రీ.శ. 689 లో కిఫెన్ శిరచ్ఛేదము గావించబడెను.
స్పెయిన్ : క్రీ.శ. 850
పెర్ఫెక్టస్ (Perfectus) స్పెయిన్ లోని కార్డుబా (Corduba) లో పుట్టి, క్రైస్తవ విశ్వాసములో పెరిగెను. అతడు గొప్ప పండితుడు, భక్తిపరుడు. ప్రచురింపబడిన పుస్తకములన్నిటిని చదివి జ్ఞానము సంపాదించుకొనెను. చిన్నతనములోనే పాస్టర్గా అభిషేకింపబడి తన బాధ్యతలను అందరు మెచ్చతగిన విధముగ నెరవేర్చెను. క్రీ.శ. 850 లో అతడు మహమ్మద్ను వంచకునిగా ప్రకటించగా, దానికి వెంటనే మహమ్మ దీయులు అతని శిరస్సు ఖండించిరి.
పర్షియా : క్రీ.శ. 997
ప్రాగ్ (Prague) బిషప్ యైన అడాల్బర్ట్ (Adalbert) విగ్రహారాధికులను మార్చుటలో ఎక్కువ భారము కలిగియుండెను. పర్షియాలోని ఒక పట్టణములో పర్యటించి చాలమందిని మార్చి, బాప్తిస్మమిచ్చెను. అన్యమత గురువులకిది అమిత కోపము పుట్టించుటచే వారు అతనిని పట్టుకొని, బాణములతో కొట్టి చంపిరి.
పోలండ్ : క్రీ.శ. 1079
పోలండ్ రెండవ రాజైన బోలిస్లాస్ (Bolislaus) రాజ్యములో దుర్మార్గపు కార్యములు చేయుచుండెను. విస్తుల నది ఒడ్డునగల క్రాకో పట్టణ బిషప్ యైన స్టానిస్లాస్ (Stanislus) ధైర్యము తెచ్చుకొని, వ్యక్తిగత సంభాషణలో ప్రజలను హింసించుట మాని, తన తప్పులను సరిదిద్దుకొనవలసినదిగా రాజునకు మనవిచేసెను. రాజు తన తప్పులను నిర్హేతుకముగా అంగీకరించినప్పటికిని, బిషప్ మాటిమాటికి దెప్పు చున్నందువలన బోలిస్లాస్కు కోపము వచ్చి, బిషపు సంహరించు అవకాశముకొరకు కనిపెట్టుకొని యుండెను.
ఒక రోజున సమీపమునగల గుడిలో బిషప్ ఒంటరిగా ఉన్నాడను విషయము రాజు విని, అతనిని కనుగొని చంపుటకు, సైనికులను పంపెను. వెళ్లిన సైనికులు అత్యంత గౌరవనీయుడైన ఆ బిషప్ ఒంటరిగా ఉండుట కనుగొనిరి కాని అతని దైవిక ప్రత్యక్షతను చూచి కలవరపడి, చంపుటకు భయపడిరి.

క్రైస్తవులను హింసించుటలో వెయ్యి సంవత్సరముల విరామము తర్వాత సాతానుడు రోములో మరల విజృంభించెను. యేసుక్రీస్తు సంఘమును ఒక ప్రణాళిక ప్రకారము నాశనము చేయుటకు అతడు తన పనివారిని నియమించెను. ఈసారి మాత్రము హింసలు అన్యులయొద్దనుండి రాలేదుగాని, క్రైస్తవులని పిలువబడుచున్నవారే దేవుని సంఘమును హింసించిరి. వారు ఊహకందని రీతిలో తమ దుర్మార్గమును నిజ క్రైస్తవులయెడల ప్రదర్శించి, వారిని చిత్రహింసలపాలు చేసిరి.