హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – శిబిరము వెలుపల

శిబిరము వెలుపల (అధ్యాయము 13)

హెబ్రీ పత్రికయొక్క ముఖ్యోద్దేశము మన ప్రధాన యాజకునిగా మహిమలోనున్న క్రీస్తు అనేక కుమారులను మహిమకు తెచ్చుటయను అంశమును వివరించుట. ఈ అంశముల క్లుప్త సారాంశము దీనిని స్పష్టము చేయును.

మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము క్రీస్తు మహిమల గురించి, పరలోకమందు ఆయన స్థానమునుగురించి వివరించు చున్నది.

ఈ మూడునుండి ఎనిమిదవ అధ్యాయంవరకు తన ప్రజలు భూలోకము నుండి పరలోకమునకు పయనించుచుండగా ప్రధాన యాజకుడుగా వారిని భూలోకమందు నిర్వహించుచున్నట్లు వివరించుచున్నది.

తొమ్మిదవ అధ్యాయంనుండి 10:18 వరకు విశ్వాసికి పరలోకమును తెరచి, దానికి యోగ్యునిగా చేసిన క్రీస్తు బలిని వివరించుచున్నది.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

9:19-23 వరకు మనమిక్కడ ఉండగానే క్రీస్తు ఉన్న పరలోకమునకు ప్రవేశము లభించినట్లు వివరించుచున్నది.

11వ అధ్యాయము – పరలోకమందున్న క్రీస్తునొద్దకు నడిపించు

విశ్వాస పథమును వెల్లడించుచున్నది.

12వ అధ్యాయము – మనము పరలోక పథమునందుండగా మన పాదములు జారకుండునట్లు దేవుడు వినియోగించిన వివిధ పద్దతులు చూడగలము.

13వ అధ్యాయము – విశ్వాస పథము మత లోకమునకు బయట ఉన్నది; పరమునకు చెందినవారి ప్రస్తుత భాగము నిందలు మాత్రమే నని చెప్పుచున్నది.

ఆ విధముగా ఈ పత్రికలో క్రీస్తును పరలోకమందు చూచుచున్నాము. విశ్వాసులు పరలోక ప్రజలుగా పరిగణించబడుచున్నారు.

పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొంది, భూలోకమందు ప్రారంభమై పరలోకమందు అంతమగు పరుగు పందెములో పాల్గొనియున్నారు.

ఈ పత్రికలోని చివరి అధ్యాయములో మనమింకను శరీరమందున్నా మని గుర్తుచేయబడియున్నాము. శరీరముతో ఉన్నాము గనుక బంధక ములు, శ్రమలు తప్పవు. జీవితములో శారీరక సంబంధ బాంధవ్యమును గౌరవించవలెను.

భౌతిక అవసరములు తీర్చుకొనవలెను. మనము భూలోకములో ఉన్నను, మత ప్రపంచమునకు వెలుపల ఉన్నట్లు పరిగ ణించబడియున్నాము.

మనము క్రీస్తుతోకూడా పరలోకమందలి ఆయన స్థానములో పాలుపొందినయెడల, భూలోకమందలి ఆయన నిందలలో కూడా పాలుపొందవలెను. తెరలోపల ప్రవేశించుట మన ఆధిక్యత. అదే సమయములో శిబిరము వెలుపలికి పోవుట మన ఆధిక్యత, బాధ్యత కూడా.

ఆ విధముగా, క్రీస్తుతోకూడా శిబిరము వెలుపల నిందలు అనుభవించుటకు పిలువబడినవారి ప్రవర్తనకు తగిన హెచ్చరికలు ఇవ్వబడినవి. శిబిరము వెలుపల ఉన్నంతమాత్రమున ప్రకృతి సహజమైన వాటికి దూరముగా ఉన్నామని అర్థము కాదు. ఈ సత్యమును స్పష్టముగా గ్రహించుట ఎంతో అవసరము.

(వచనములు 1, 2). క్రైస్తవుల మధ్య ప్రేమ నెలకొని ఉండవలెను అనునది మొదటి హెచ్చరిక. ఇది శరీర సంబంధమగు సహజ ప్రేమ కాదు. అది మంచిదే కావచ్చునుగాని ఇది క్రీస్తునుబట్టి సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ.

ఈ ప్రేమ “నిరంతరము ఉండునట్లు” మనము చూచుకొనవలెను. విషమ పరీక్షలలో, శ్రమలలో చూపిన ప్రేమ దైనందిన జీవితములో తరిగిపోవు ప్రమాదమున్నది.

ప్రతిరోజు ఒకరినొకరు కలుసు కొనుచున్నందున చిన్న చిన్న బలహీనతలు, విపరీత స్వభావము కనిపించు నందున ఒకరిపట్ల మరియొకరికి ప్రేమ చల్లారు అవకాశము కలదు. మనతో ఎక్కువ బాంధవ్యముగలవారితోనే ప్రేమ పరీక్షించబడును.

అట్టివారి మధ్య సహోదర ప్రేమ నిలుచునట్లు జాగ్రత్తపడవలెను. ఆతి థ్యముద్వారా ప్రేమను వ్యక్తపరచవలెను.

(వచనము 3). సహోదర ప్రేమ బంధకములలో ఉన్నవారిపట్లను, కష్టములనుభవించు సహోదరులపట్లను చూపెట్ట వీలగును.

మనము కూడా శరీరములో ఉన్నాము గనుక కష్టములు, బంధకములు అనుభ వించుచున్నవారిని జ్ఞాపకము చేసికొనవలెను. ఎందుకనగా మనముకూడా అట్టి పరిస్థితిని ఎదుర్కొనవలసివచ్చును.

(వచనము 4). లోకములో ఉన్నాము గనుక శరీర సంబంధమగు బాంధవ్యములు తప్పవు. మానవ సంబంధములన్నిటిలో వివాహ సంబం ధము చాలా పటిష్టమైనది.

కనుక, వివాహమును చిన్నచూపు చూడక గౌరవించవలెను. నిష్కల్మషముగా నుండవలెను. పరిశుద్ధతను, లేదా వివాహబంధమును మీరినయెడల ప్రభుత్వపరమైన లేదా నిత్యమైన తీర్పు తప్పదు.

(వచనములు 5, 6). మనము మన భౌతిక అవసరములుకూడా తీర్చుకొనవలసియున్నది. ఈ అవసరములు ధనాపేక్షకు దారితీయ కూడదు.

దేవుడు ప్రస్తుతము మనలను ఏ స్థితిలో ఉంచెనో దానితో తృప్తిపడవలెను. దానికి ఇచ్చిన కారణము చాలా శ్రేష్టమైనది. మన పరిస్థితులు ఏమైనను ప్రభువు మనతో ఉన్నాడు. “నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయన చెప్పియున్నాడు.

ప్రభువే అట్లు చెప్పినయెడల “ప్రభువు నాకు సహాయుడు, నేను భయ పడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?” అని చెప్పగలము. ఈ వచనము వాస్తవముగా ఒక ప్రశ్న – “ప్రభువు నాకు సహాయుడు కాగా, నరమాత్రుడు నాకేమి చేయగలడు?”
(వచనము ‘7).

మనకంటే ముందుగా ఈ లోకమును విడిచివెళ్ళిన మన నాయకులను జ్ఞాపకము చేసికొనవలెను. మూడవ వచనములోని “జ్ఞాపకము చేసికొనుడి” అను మాటకు, ఇక్కడ చెప్పిన “జ్ఞాపకము చేసికొనుడి” అను మాటకు వ్యత్యాసమున్నది.

అక్కడ కష్టములలో ఉన్న వారికి ఏదైనా చేసి జ్ఞాపకము చేసికొనుటను గూర్చియు; ఇక్కడ మరిచిపోవు అవకాశమున్నందున వ్యక్తులను మనస్సుకు తెచ్చుకొనుటనుగూర్చియు వ్రాయబడెను.

వారు జ్ఞాపకముంచుకొనుటకు తగినవారు. ఎందుకనగా వారు మనకు వాక్యమును బోధించిరి. పైగా, వారి ప్రవర్తన ఫలమును మనము తలపోసికొనవలెను. వారు తమవైపుకు ప్రజలను ఆకర్షించుటకు వాక్యము బోధింపలేదుగాని, పరమందున్న ప్రభువువైపుకు ఆకర్షించిరి.

మనము వారి విశేష లక్షణములను, ఆచార వ్యవహారములను లేదా వారి పరిచర్యను కాదుగాని వారి విశ్వాసమును అనుసరించవలెను.

(వచనములు 8, 9). ఈ రెండు వచనములలో మనయొద్దనుండి నిరంతరము జీవించు యేసునొద్దకు వెళ్లిన నాయకులను దాటిపోవు చున్నాము. ఇతరులు వెళ్ళిపోవుదురు, మార్పుచెందుదురు. అయితే “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కరీతిగానే ఉన్నవాడు”.

కొన్ని పర్యాయములు మనము గత కాలమందలి దైవజనులనుగూర్చి, వారు వెళ్ళిపోయినందున మనకిక గొప్ప లోటు అని మాటలాడుట కద్దు.

ఆ విధముగా మాటలాడినందున అనాలోచితముగా క్రీస్తును తక్కువచేయు ప్రమాదమున్నది. వారు వెడలిపోయిరి కాని, నిరంతరము జీవించు క్రీస్తు హృదయములో పరిపూర్ణ ప్రేమ, ఆయన చేతిలో పరిపూర్ణ శక్తి ఉన్నది.

ఆయన తన శరీరమునకు పరిపూర్ణ జ్ఞానమిచ్చు శిరస్సుకూడా అయి ఉన్నాడు. మనము జయించలేని కష్టము, మనలను కాపాడలేని ప్రమా దము, మనకు జవాబు లభించని ప్రశ్నలు ఏమీ ఆయనయందు లేనేలేవు.

ఆయనే మన ఆధారము, సమస్తము. ఈ పత్రిక ప్రారంభమైనది మార్పు లేని క్రీస్తుతోనే. అంతమగునది కూడా ఆయనతోనే, మొదటి అధ్యాయములో “నీవు నిలచియుందువు”,“నీవు ఏకరీతిగా యున్నావు” అని ఆయన ప్రస్తుతింపబడియున్నాడు.

ఇతరులు గతించి పోవుదురు, ఆయన నిరంతరము నిలుచును, ఇతరులు మార్పు చెందుదురు, ఆయన ఏకరీతిగా నుండును. క్రీస్తే మన ఆధారము గనుక “నానా విధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుందముగాక!” ప్రజలు చెప్పుకొనుచున్నట్లు నూతన వెలుగు లేదా తానే వెలుగు కావలెనని చెప్పు దురద చెవులు కలిగి ఉన్నామా?

అట్లయినయెడల మనము అవిశ్రమముగా నూతన విషయమందు ఆసక్తి చూపి క్రీస్తునుండి దూరమై కొట్టుకొనిపోవు ప్రమాదమున్నది, జాగ్రత్త! అన్యబోధలు జ్ఞానయుక్తమైనవిగా కనిపించును.

అవి మానసికమైన పరిచర్యమాత్రమే జరిగించును. వాటియందాసక్తిగల వారికి వాటివలన ప్రయోజనమేమియు చేకూరదు. మన ఆత్మలను బల పరచి, స్థిరపరచునది క్రీస్తు కృప మాత్రమే.

శారీరక వ్యర్థత నూతనమైన వాటి కొరకు అర్రులు చాచును. అంతకు ముందు ప్రకటించిన సత్యము నకు భిన్నముగా తన స్వంతవిధానములో సత్యమును ప్రకటించుటకు ప్రయత్నించును.

ఫలితముగా ముందుగా వెడలిపోయిన నాయకులను కించపరచినట్లగును. యేసుక్రీస్తు మార్పులేనివాడుగానున్న ఆయన స్థానము తప్పిపోవును, మనము అన్యబోధలచేత కొట్టుకొనిపోవుదుము.

ఆ విధముగా ‘క్రీస్తుకు లోకమందు ఉన్న స్థానము’ అను ఈ అధ్యాయముయొక్క గొప్ప అంశములోనికి మనము వచ్చియున్నాము. ఆయన మనతో ఉన్నాడని తెలిసికొనియున్నాము.

ఇప్పుడు మతవ్యవస్థకు సంబంధించి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనబోవుచున్నాము. ఆ విధముగా ఆయనతోబాటు మనమును ఉండగలము.

(వచనములు 10-12). ఈ గొప్ప అంశమును పరిచయము చేయుటకొరకై యూదా మతమునకు క్రైస్తవ్యమునకు ఉన్న వ్యత్యాసము చూపెట్టబడినది. యూదా మత వ్యవస్థలో నిర్ణయించబడిన విధానములో బాహ్యముగా దేవుని సమీపించు ఏర్పాటు కలదు.

అన్యులకు ప్రవేశించు హక్కులేదు. ఇప్పుడు బలిపీఠము – అనగా దేవుని సమీపించు మార్గము. క్రైస్తవులకు మాత్రమే పరిమితము. యూదా మత వ్యవస్థలోనివారికి ఈ బలిపీఠములో ప్రవేశించు హక్కులేదు.

తొమ్మిదవ అధ్యాయము 14వ వచనమునుండి మనము నేర్చుకొనునదేమనగా, మనము నిర్జీవ క్రియల నుండి విడిపించబడి, శుద్ధిచేయబడిన మనస్సాక్షిగలవారమై దేవుని సేవించునట్లు “క్రీస్తు నిత్యుడగు ఆత్మద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనెను”.

“కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పు డును స్తుతియాగము చేయుదము”. (వ 15). క్రీస్తుయొక్క సిలువ మన బలిపీఠము. పాప సమస్యను పరిష్కరించు బలిద్వారా విశ్వాసి ఆరాధకు నిగా దేవుని సమీపించగలుగుచున్నాడు.

యూదా మత బలిపీఠములకు అంటి పెట్టుకొనియుండువారు క్రీస్తు చేసిన గొప్ప అర్పణను తిరస్కరించు చున్నారు. వారు నీడలను అంటిపెట్టుకొని, నిజ స్వరూపమును విస్మ రించుచున్నారు. అట్టివారికి క్రీస్తు లేక ఆయన అర్పణయను క్రైస్తవ బలిపీఠములో పాలులేదు.

అబ్రాహాము సంతానమగు యూదా జాతి బాహ్యముగా దేవుని ప్రజలు. ఆ మత వ్యవస్థలో పాల్గొనవలయునన్నయెడల వారు సహజ ముగా అబ్రాహాము సంతానమై యుండుట ఆవశ్యకము. వారి విషయ ములో నూతన జన్మయను ప్రస్తావన లేదు.

ఆ వ్యవస్థలో దేవుడు మనిషిని మనిషిగా పరీక్షించినందున, ప్రకృతి సహజమైన ఆకర్షణలు అందులో ఉండెను. ఆ మత వ్యవస్థలోని శోభాయమానమైన ఆచారములు, విస్తృత మైన కర్మకాండలు, గొప్ప కట్టడములు ఇవన్నియు ప్రకృతి సహజమైన మనిషిని ఆకట్టుకొనునవి.

అది భౌతికమైన దేవాలయముతో, లౌకిక శోభతో నిండిన లోకసంబంధమగు మతము. అది నిందించబడలేదు సరికదా, లోకమందు దానికి సముచిత స్థానము, భాగము లభించినది. అయితే ఆ వ్యవస్థద్వారా మనిషికి పరలోకములో స్థానముకాని, భాగముకాని లభించలేదు.

క్రైస్తవ్యము ఎంత భిన్నమైనది! మనకు క్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము లభించెను. దానిద్వారా మనకు దేవుని లోకములో దేదీప్యమానమగు స్థానమందు స్థలము లభించినది. దాని అనంత ఆశీర్వాదములు క్రీస్తుమాత్రమే కొలవగలడు.

ఆయన మనకొరకు తండ్రియెదుట ప్రత్యక్షమై ఉన్నాడు. క్రైస్తవ్యముద్వారా పరలోకమందు మనకు క్రీస్తు స్థానము లభించినయెడల, భూలోకమందును ఆయన స్థానము లభించును.

పరలోకమందలి క్రీస్తు సంపదలతోపాటు భూలోక మందలి ఆయన నింద మనకు సంక్రమించినది. క్రీస్తుతో అక్కడ లోపలి స్థానము పొందవలెనంటే, ఇక్కడ క్రీస్తుతోకూడ వెలుపలి స్థానము పొందవలయును.

ఆ విధముగా యూదా మత వ్యవస్థ క్రైస్తవ్యమునకు పూర్తిగా భిన్నమైనది. యూదా మతము మనిషికి లోకములో సమున్నత స్థానము సంపాదించెను గాని పరలోకములో స్థానమును కల్పించలేదు.

క్రైస్తవ్యము విశ్వాసికి పరలోకములో గొప్ప స్థానమును ఇచ్చును గాని, ఈ లోకములో స్థానము ఇచ్చుటలేదు. వారికి ఈ లోకములో లభించునది నిందలుమాత్రమే.

అలాగైన, లోకమందు క్రీస్తు స్థానమేమి? ఈ లేఖన భాగములో 11-13 లో మూడు పర్యాయములు “వెలుపల” అను పదము ప్రయో గించుటద్వారా ఆయన స్థానమేదో వెల్లడించబడినది.

11వ వచనములో “శిబిరము వెలుపల” అను మాట ప్రయోగించబడినది. 12 వ వచన ములో “గవిని వెలుపట”, మరల 13వ వచనములో “శిబిరము వెలుపల” అని ప్రయోగించబడినది.

“శిబిరము వెలుపల” అను పదప్రయోగముద్వారా మనము గ్రహిం చునదేమి? 11 వ వచనములో ముంగుర్తుగాను, 12 వ వచనములో వ్యతిరేక ముంగుర్తుగాను, 13 వ వచనములో విశ్వాసికి వ్యక్తిగత అన్వయముగాను ఈ పదము ప్రయోగించినట్లు గ్రహించిన దీని అర్థము సులభగ్రాహ్యమగును. లేవీయకాండము 4 అధ్యాయము నుండి 11వ వచనము ఉదహరించబడినది.

లేవీయ కాండము 4 అధ్యాయములో కోడెను వధించిన తరువాత యాజకుడు వ్రేలితో రక్తమును తీసికొని యెహోవా యెదుట ప్రత్యక్ష గుడారములో చిలకరించును.

లేవీయ 4-6,12

“పాళెము వెలుపల” అనగా దేవునితోగాని, మనుష్యులతోగాని గుర్తించ గలిగిన సంబంధమేమియు లేని స్థలము. దేవుని దృష్టిలో అది తీర్పు స్థానము కావచ్చును, లేదా మానవుల దృష్టిలో నింద భరించు స్థలము కావచ్చును.

తీర్పు దృష్టితో ఆలోచించినయెడల అది తిరస్కరించబడిన స్థలము, దేవుడు లేని స్థలము. అది వెలుగు రేఖ ఎన్నడూ ప్రసరించని, ప్రేమ ఎన్నడూ వికసింపజేయని “వెలుపలి చీకటి”.

అక్కడ ఆదరణ, కరుణ పిసరంతకూడా ఉండవు. “పాళెము వెలుపల” పాప పరిహారార్థ బలి జంతువును దహించుట పాపముపై పరిశుద్దుడైన దేవుని తీర్పును చక్కగా సూచించుచున్నది. యేసు ఈ స్థలమునకే వెళ్ళెను.

తన స్వరక్తముతో తన ప్రజలను పరిశుద్ధపరచునట్లు ఆయన గవిని వెలుపల శ్రమపడెను. క్రీస్తు చనిపోయినప్పుడు యెరూషలేము పాళెము స్థానము వహించినది.

మనము తెరలోపల ఆశీర్వాదము పొందుస్థానము పొంద వలెనంటే, ఆయన గవిని వెలుపల మన స్థానములో తీర్పు పొందవలెను. మనము పాపమునుండి ప్రత్యేకింపబడి, దేవునికి ప్రీతికరమైన జీవితము జీవించకపూర్వము మన పాపములపైకి రావలసిన తీర్పు భరింపవలెను.

క్రీస్తు వెలుపటి చీకటిలోనికి వెళ్ళి పలికిన “నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడచితివి?” అను గంభీరమైన మాటలు మన హృదయ ములలో తలపోసికొనినయెడల అమితాశ్చర్యము కలుగును.

ఆ మాటల భావమేమిటో ఆలోచించుడి. నీతిమంతుడైన ఆయనను (ఆయన ఒక్కడే నీతిమంతుడు) దేవుడు చేయి విడిచిపెట్టుట – అంతకు ముందుగాని, ఆ తరువాతగాని ఏ మానవుడు అట్టి మరణము పొందలేదు.

“నీతిమంతు లను దేవుడు ఎప్పుడైనను విడిచిపెట్టెనా? ఇతరులు యెహోవాయందు నమ్మికయుంచి విడిపించబడిరి. ఇతరులు భయంకరమగు దూషణలు, కొరడా దెబ్బలు అనుభవించిరి.

బంధకములు, చెరసాలలు పొందిరి. మరికొందరు యాతనపెట్టబడిరి. అనాథలైరి, శోధింపబడిరి. అయినను ఏ ఒక్కరుకూడ విడిచిపెట్టబడలేదు. కాని, ఇక్కడ విడిచిపెట్టబడిన ఒక నరుడు ఉన్నాడు.

“నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?” అని దేవునితో చెప్పగలిగినవాడే ఆ నరుడు. ఆయన దేవునికి మొరపెట్టెనుగాని “నీవు నాకుత్తరమియ్యకున్నావు” అనుచున్నాడు.

ఆయన దేవునిచే విడనాడబడినాడు. ఆయనకు దేవునినుండి సహాయములేదు, దేవునినుండి జవాబులేదు. ఆయన ఎందుకు విడనాడబడెను? కేకవేసిన ఆయనమాత్రమే దానికి జవాబు చెప్పగలడు. “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు”.

దేవుడు పరిశుద్ధుడు. సిలువను విడిచిపెట్టుటకు మహోన్నత మగు జవాబు అక్కడ ఉన్నది. మానవుడు చెడ్డవాడు అను విషయము కాదు ఇక్కడ ప్రాముఖ్యము. దేవుడు పరిశుద్ధుడు.

క్రీస్తు భయంకరమైన, విడిచిపెట్టిన సిలువయెదుటికి వెళ్ళినప్పుడు నీతిమంతుడైన ఆయన యెదుట ఉన్నది మనిషి కాదు – దేవుడే. స్తోత్రముచేయు ప్రజల మధ్య నివసించుట దేవుని ఉద్దేశ్యము.

క్రీస్తు సిలువ కార్యమునుబట్టి ప్రజలు యోగ్యులుగాను, దేవునియెదుట నిలబడగలుగునట్లుగాను చేయబడిరి.

ఈ ప్రజలు దేవునికి ప్రీతిపాత్రులగునట్లు క్రీస్తు సిలువలో విడనాడబడెను. ఆయన తన ప్రాణమును పాపక్రయధనముగా అర్పించినప్పుడు దేవుని చేతిలో ఆనందము అధికముకాజొచ్చెను.

సకల యుగములలో ఆయన మహిమకు కీర్తి కలిగించు ప్రజలు తెరలోపల నిలిచియుందురు, ఎందు కనగా యుగముల పూర్వమే యేసు గవిని వెలుపల విడనాడబడెను.

(వచనము 13). ఆ విధముగా మనము “మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుదము” అను ఆచరణాత్మక హెచ్చరికకు వచ్చియున్నాము.

ఇక్కడ ఒక విషయము మనము జాగ్రత్తగా గమనించవలెను. ఈ వెలుపలి స్థలమును దేవుడు ఎంతమాత్రము తీర్పు స్థలముగా చూచుట లేదు.

మానవునివైపునుండి నింద భరించు స్థలముగా దానిని ఎంచుచున్నాము. దేవుని తీర్పు భరించుటకే మనము శిబిరము వెలుపలికి వెళ్ళము. మానవుల నిందను సంపూర్ణముగా భరించుటకు మనము పిలువబడియున్నాము.

ఆయన దేవుని తీర్పుక్రింద పరిశుద్ధ బలిపశువుగా వధింపబడెను. సహనశీలియైన హతస్సాక్షిగా మానవుల నిందను సహించెను. దేవుని చేతినుండి ఆయన శ్రమలలో మనము పాలుపొందలేముగాని, మానవుల చేతిలో ఆయన పొందిన అవమానములలో పాలుపొందుట మన ఆధిక్యత.

మన తీర్పును భరించుటకు ఆయన శిబిరము వెలుపలికి వెళ్ళెను. ఆయన నిందను భరించుచు మనము శిబిరము వెలుపలికి వెళ్ళుదము.

కీర్తన 69-7,9

దేవుని ద్వేషించు జనాంగము మధ్య ఆయన దేవునిపట్ల ఆసక్తిగానుండెను. అందువలన ఆయనను “అన్యుడు”గాను, “పరుడు”గాను పరిగణించిరి. ఆయన ఆసక్తి ఆయనను నింద, అవమానముల స్థలమునకు నడిపించెను.

దేవుని ద్వేషించిన లోకమందు ఆయన దేవుని ప్రతినిధి. మానవులు ద్వేషమును వెళ్లగ్రక్కుటకు మానవుల మధ్య ఆయన నివసించుట కారణమాయెను.

“నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని” అనియు, “నిన్ను నిందించిన వారి నిందలు నామీద పడియున్నవి” అనియు చెప్పినట్లుగా వారు దేవునిపై చూపు ద్వేషమును క్రీస్తుపై వెళ్ళగ్రక్కిరి.

క్రీస్తుకు ఈ లోకము ఏ స్థానమునిచ్చెనో దానిని క్రైస్తవుడు స్వీకరించు టకు పిలువబడియున్నాడు. కనుక, ప్రకృతి

సంబంధియైన మానవునికి ఆకర్షణీయముగానున్న మత వ్యవస్థనుండి, ఈ భాగములో చెప్పినట్లు శిబిరము వెలుపలికి వెళ్ళవలెను.

మనమింతకుముందే గమనించినట్లు శిబిరములో దేవునితో భౌతికమగు సంబంధము కలిగిన ప్రజలున్నారు. వారి మతము భూసంబంధమైన క్రమముతో కూడినది. దేవునికి మనిషికి మధ్య నిలుచు యాజకులు వారికున్నారు.

భూసంబంధమగు దేవాలయము, క్రమమైన ఆచారములున్నవి. ఆ వ్యవస్థ హెబ్రీ 9:1-10 లో సంక్షేపముగా వ్రాయబడినది. దానిద్వారా దేవుని సమీపించుట వీలుకాదనియు, ఆరాధ కునికి మనస్సాక్షి విషయములో అవి సంపూర్ణసిద్ధి కలుగజేయలేవనియు గ్రహించుచున్నాము. అంతేకాదు, ఆ వ్యవస్థలో నిందకూడా లేదు.

హెబ్రీ 9-1-10

యూదా శిబిరముతో పోల్చినయెడల, క్రైస్తవ సమూహములోని ప్రజలు శరీర జన్మద్వారా దేవునితో బాహ్యమగు సంబంధముగలవారు కాదు. క్రొత్త జన్మద్వారా విశేషమైన సంబంధము కలిగియున్నారు.

యాజకులని ఒక ప్రత్యేక వర్గము లేదు, విశ్వాసులందరూ యాజకులే. భూసంబంధమగు దేవాలయమునకు బదులు క్రైస్తవుడు పరలోకమునే పొందియున్నాడు. పైగా, క్రైస్తవ్యములో శుద్ధిచేయబడిన మనస్సాక్షివలన దేవుని దగ్గరకు ప్రవేశము లభించినది.

క్రైస్తవ్యములో ప్రకృతి సంబంధి యగు మానవుని ఆకర్షించునది ఏదీ లేదు. ఎందుకనగా శరీరమును ఇవి ప్రక్కనపెట్టును. అందువలననే క్రీస్తును తృణీకరించిన లోకములో మనము ఆయన నిందను భరించుచున్నాము.

యూదా శిబిరమునకు, క్రైస్తవ సమూహమునకు ఉన్న వ్యత్యాసము లను మనస్సులో ఉంచుకొనినయెడల, నేడు క్రైస్తవ లోకమందలి మత వ్యవస్థను పరీక్షించుట కష్టము కాదు.

నేటి మత వ్యవస్థలలోనున్నది శిబిరము లక్షణములా లేక క్రైస్తవ లక్షణములా? నిస్సందేహముగా నేటి మత వ్యవస్థ అంతయు శిబిరము నమూనాలోనే రూపొందించబడి యున్నది.

లోక సంబంధమైన దేవాలయములు, దేవునికి మానవులకి మధ్య నిలుచుండు మానవ కల్పితమగు యాజక వ్యవస్థ వారికున్నది. ఈ వ్యవస్థలద్వారా మనస్సాక్షికి శుద్ధిగాని, పరలోకమందున దేవుని యొద్దకు ప్రవేశముగాని లభించదు.

వారు శరీరసంబంధియగు మానవుని గుర్తించి, శరీరసంబంధిని ఆకర్షింపజూతురు. మానవునికి హత్తుకొను లాగున ఈ వ్యవస్థ రూపొందించబడినందున, ఈ వ్యవస్థలలో నిందకు తావులేదు.

ఆ వ్యవస్థలు శిబిరము అని మనము భావించగలమా? నిజము చెప్పాలంటే అవి కానేకావు. ఒక విధముగా చెప్పాలంటే అవి శిబిరము కంటే హీనమైనవి. ఎందుకనగా, వాటిని శిబిరము నమూనాలో కొన్ని క్రైస్తవ లక్షణములు జోడించి రూపొందించియున్నారు. ప్రారంభములో శిబిరమును దేవుడే నెలకొల్పెను.

అయితే చెడిపోయినందున దేవుడే దానిని ప్రక్కకు నెట్టివేసెను. ఈ గొప్ప వ్యవస్థలన్నియు భక్తి గలిగినవారు సదుద్దేశ్యముతోనే ప్రారంభించి ఉండవచ్చును.

యూదా విశ్వాసులనే దేవుడు శిబిరము వెలుపలికి వెళ్ళమని చెప్పినయెడల, కేవలము శిబిరము నకు అనుకరణయైనదానినుండి నేడు విశ్వాసి మరి నిశ్చయముగా వెలుపలికి వెళ్ళవలెనుగదా!

ఈ గొప్ప మత వ్యవస్థలలో ఎందరో నిజమైన క్రైస్తవులున్నారుకదా! వారి మాటేమిటి? అనే ప్రశ్న అనేకుల మనస్సులలో తలెత్తవచ్చును. యథార్థమైన భక్తిగల క్రైస్తవులనేకులు ఉన్న వ్యవస్థలో ఉండుట తప్పా? అని కొందరు వాదించుదురు.

ఈ చిక్కు సమస్యకు జవాబుగా ఒక ప్రశ్న అడుగవచ్చును. మనము అనుసరించవలసినది దేవుడు చెప్పిన మాటనా, మనుష్యులు పాటించుదానినా? దేవుని వాక్యమునకు విధేయులగుట ప్రతి విశ్వాసి విధి.

ఎవరైనను దేవుని వాక్య వెలుగులేక విధేయత మూలముగా కలుగు నిందలు, శ్రమలు ఎదిరించి ధైర్యము చాలక దేవుని వాక్యము ఖండించు వ్యవస్థలో ఉండిపోవచ్చునా? ఎంతమాత్రము వీలులేదు.

ఈ నిర్జీవమగు వ్యవస్థలలో దేవునియందు భయభక్తులుగలవారు లేకపోలేదు. అట్టివారు ఆ వ్యవస్థలో ఉండిపోవుటకు కారణము ఆ వ్యవస్థ కాదు. ఈ వ్యవస్థకు భిన్నముగా పనిచేయు దేవుని మహా కృప.

పరిశుద్ధులు ఆ వ్యవస్థ మూలముగా పుట్టలేదు. వారు ఆ వ్యవస్థకు ప్రాణము పోయరు. అట్టివారి స్థితిని తుయతైర పట్టణములోవున్న భక్తిగల శేష జనాంగముతో మరియొకరు పోల్చిరి.

ఆ సంఘములోనివారు యెజెబెలు, ఆమె సంతాన లక్షణములుగలవారు. అయితే తుయతైర పట్టణములో యెజెబెలు సంతానము కాని వారున్నారు. వారు ఆ దుష్ట వ్యవస్థమూలముగా పుట్టిన వారు కారు. అట్టి లక్షణములు వారిలో లేవు.

మనిషి రూపొందించు కున్న వ్యవస్థలలో ఉన్న పరిశుద్ధుల స్థితికూడా అట్టిదే. అయితే దేవుని వాక్యము తేటగా శిబిరము వెలుపలికి వెళ్ళమని హెచ్చరించుచున్నది. వెలుపలికి వెళ్ళక నిలిచియుండువారి ఉద్దేశ్యములను తీర్పు తీర్చుట మన పని కాదు.

సత్యము ఎరుగకపోవుట, సరళమైన విశ్వాసము లేకపోవుట, మనుష్యుల భయము, పరిణామములనుగూర్చి భయపడుట, మతపరమైన శిక్షణ, సంస్థలయొక్క అపోహలు … ఈ విధముగా ఎన్నైనా ఉద్దేశ్యములు చెప్పుకొనుచు పోవచ్చును.

ఇవి మనిషిని శిబిరము వెలుపలికి పోకుండా ఆపివేయును. పరిశుద్ధులు ఈ వ్యవస్థనుండి వెలుపలికి రాకుండుటకు మరియొక బలమైన కారణము నిందింపబడుదుమను సహజమైన భయము కావచ్చును.

క్రైస్తవలోకములోని మత వ్యవస్థలనుండి వెలుపలికి వెళ్ళి తృణీకరించబడిన క్రీస్తుతో, ఈ లోక సంబంధముగా పేదలు, బలహీనులు, ఎన్నికలేనివారితో సమైక్యమగుటలో నింద ఉన్నది. అందు వలన అనేకులు వెనుకాడుదురు.

నిందకు భయపడి వెనుకడుగు వేయు స్థితిని జయించు శక్తి ఏదియు లేదా? తప్పక ఉన్నది. అది క్రీస్తునందుగల అనురాగమే. అందువలననే “ఆయనయొద్దకు వెళ్ళుదము” అని చెప్పబడినది. ఇది చాలా ప్రాముఖ్య మైన మాట.

మనము శిబిరము వెలుపలికి వెళ్ళుటకు ప్రాధ్యాన్యతా క్రమములో ముఖ్యమగు కారణము ఇదే. ఇంతవరకు మనము నేర్చుకొనిన దానిని విడిచిపెట్టుట వ్యతిరేకభావము. ఎవరును ప్రతికూలమైనవాటితో జీవించరు.

“శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు మళ్ళుట”లో చెడుగు నుండి ప్రత్యేకింపబడుట ఇమిడి ఉన్నది. అంతకంటే మించి మనము క్రీస్తుకొరకు ప్రత్యేకించుకొనుటవలన మనకు రూఢియైన గురి ఏర్పడినది.

క్రీస్తును గురిగా కలిగి ఉండుట మినహా, ప్రత్యేకింపబడుట విమతము నకు దారితీయును. ఆ విధముగా చేయుట ఒక గుంపును వదలి మరియొక సంస్కరింపబడిన గుంపులో చేరినట్లగును.

అనేక విమతముల ఉద్యమ చరిత్ర అక్షరాలా ఇదే. నిజమైన క్రైస్తవులను వారి అనుబంధముగా నున్న చెడుగు, భ్రష్టత్వములను గూర్చి క్రైస్తవులను జాగృతము చేసినప్పుడు, వారు కొన్ని ప్రాముఖ్యమైన సత్యములను గట్టిగా చేపట్టి, తామున్న గుంపును వ్యతిరేకించి, చెడుగును విడిచిపెట్టి, సత్యమును అవలంబించె దరు.

అయితే వారు విడిచిపెట్టి వచ్చిన చెడుగులన్నియు తిరిగి ఇందులో ప్రవేశించి, ఇదియును అట్టి గుంపుగానే పరిణమించును. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన సత్యము కావచ్చును, పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఒకే శరీరమను సత్యము కావచ్చును.

ఆ సత్యము ఎంత శ్రేష్టమైనదైనను మనము మత వ్యవస్థనుండి ఈ గొప్ప సత్యములను అవలంబించుటకు వేరుపడుటవలన మనము మత శాఖలను ఏర్పరచుచున్నాము.

ప్రతిచోటా ఇది జరుగుచున్నట్లు గమనించగలము. క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉండు టకు పిలువబడియున్నారు. కనుక పరిశుద్దుల గుంపు ఒకటి తయారైనది. పరిశుద్ధాత్మనుగూర్చిన సత్యము కొందరు గుర్తెరిగిన ఫలితంగా పెంతెకొస్తు గుంపు పుట్టుకొచ్చినది.

ప్రభువు రాకడ సత్యము గుర్తెరిగిన కొందరు “సంఘము ఒకే శరీరము” అను సత్యమును పట్టుకొని, దానిని అవలం బించు ఒక శాఖగా జారిపోయిరి. అయితే శాఖలుగా చీలిపోక, సత్యమును అవలంబించుచు చెడుగు నుండి ప్రత్యేకింపబడుటకు ఒకే ఒక్క మార్గమున్నది.

అని ప్రభువు చెప్పిన మాటలో గొప్ప హెచ్చరిక, బోధ, ఎంతో అర్థము దాగియున్నవి. జె. యన్. డార్బీ అనే ప్రియమైన దైవజనుడు ఈ వచనముపై వ్యాఖ్యానించినదేమనగా “దేవుని కేంద్ర బిందువు క్రైస్తవులు కాదు, క్రీస్తు.

లూకా 11-23

క్రైస్తవులు ఒకచోట సమకూడవచ్చును. కాని, క్రీస్తు కేంద్రముగా సమకూడనియెడల అది చెదరగొట్టుట యగును. యేసుక్రీస్తు తప్ప మరి ఏ కేంద్రస్థానము దేవునికి తెలియదు. ఆయనే గురి, క్రీస్తే కేంద్రబిందువు.

ఆయన చుట్టూ, ఆయనకొరకు, ఆయననుబట్టి సమకూడని దంతయు చెదరగొట్టుటయే. సమకూడుట జరగవచ్చునేమో గాని, “నాతో” కానియెడల అది చెదరగొట్టుటయే. మనము సహజముగా చీలికల స్వభావముగలవారము. దీనిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండవలెను.

క్రీస్తు నా ఆలోచనల కేంద్రము కానియెడల, నా ప్రయత్నముల కేంద్రము ఆయన కాజాలడు.” ప్రభువు తన ప్రజలతో వ్యక్తిగతముగా ఉందునని వాగ్దానము చేసెను గాని, తన ప్రజలు లోక సంబంధమైన వ్యవస్థలలో ఉంటే తన సన్నిధిని అనుగ్రహించెదనని ప్రభువు వాగ్దానము చేయలేదు.

అందుకు భిన్నముగా ఆయన నింద భరించుచు శిబిరము వెలుపల ఉన్నాడు. ఆయన మనతో వ్యక్తిగతముగా ఉన్నమాట నిజమే. కాని, మనము సామూహికముగా ఆయనతో ఉన్నామా? “వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుదము” అనుటలో క్రీస్తు నామమునకు చేరిన సమూహము అని అర్థమిచ్చుచున్నది.

(వచనములు 14-21). “శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుమని” హెచ్చరించిన తరువాత, ఆ హెచ్చరికకు విధేయులైనందున కలుగు ఆశీర్వాదములు, ఆధిక్యతలు రచయిత వివరించుచున్నాడు.

వెలుపలి స్థలములోనే అనేక ఆధిక్యతలు అనుభవించవచ్చును, లేఖనము లోని అనేక ఆజ్ఞలను పాటించవచ్చును, శిబిరములోనున్న వస్తుక్రమములో పొందని పరిపూర్ణతను అనుభవించవచ్చును. కనుక, క్రీస్తుతోకూడా శిబిరము వెలుపల సమకూడువారికి కొన్ని లక్షణములున్నట్లు స్పష్టమగు చున్నది.

1. వారు యాత్రికులు : “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదానికోసము ఎదురుచూచుచున్నాము” శిబిరము వెలుపల మాత్రమే మనము యాత్రికుల, ప్రయాణికుల లక్షణములు కలిగియుండగలము.

ఈ లోకములో స్థిరమైన పట్టణము లేని వ్యక్తి యాత్రికుడు. రాబోవు పట్టణముకోసము కనిపెట్టువాడు ప్రయాణికుడు. నిజమైన యాత్రికుని లక్షణములు శిబిరము వెలుపల మనలో చోటుచేసు కొననియెడల, శిబిరములో అట్టిది అసాధ్యము. (వ. 14).

2. వారు ఆరాధించు సమూహము : “దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగము చేయుదము”. శిబిరములో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కష్టము. వెలుపల ఆరాధించు వ్యక్తులే కాదు, ఆరాధించు సమూహమునే చూడవచ్చును. (వ.15).

3. శిబిరము వెలుపలనున్న ప్రజలు: శరీర విషయమై శ్రద్ధ తీసుకొందురు. అందువలననే ఉపకారము, ధర్మము చేయుట మరువ వద్దని హెచ్చరింపబడియున్నాము. (వ. 16).

4. ఇక్కడ ఆత్మలను కాపు కాయుటకూడ జరుగును : కనుక మనపైని నాయకులుగా ఉన్నవారికి లోబడి, మన ఆత్మల క్షేమము కోసము పాటుబడువారి మాట వినవలెను. (వ.17).

5. అది ప్రార్థించు సమూహము : వారి ఆత్మల క్షేమము కోరు నాయకులను బలపరచునది పరిశుద్ధుల ప్రార్థనలే. పరిశుద్ధులకు నాయకుల పరిచర్య అవసరమైతే నాయకులకు పరిశుద్ధుల ప్రార్థనలు అవసరము. (వ. 18, 19).

6. ఈ సమూహము దేవుని చిత్తమును జరిగించువారు : గనుక వారు దేవుని దృష్టికి అనుకూలమైనదానిని జరిగింతురు. (వ.20,21).

7. చివరగా ఈ సమూహము యేసుక్రీస్తుకు మహిమ కలిగించినది: “యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక!” (వ.21).

ఈ పత్రిక క్రీస్తు మహిమతో ప్రారంభమైనది. ఆ తరువాత మహిమకు కొనిరాబడిన సమూహమును చూచాము. ముగింపులో ఇప్పుడు, మహిమను పొందబోవువారు ఈ లోకమందు క్రీస్తుతోకూడా శిబిరము వెలుపలికి వెళ్ళవలెను. ఆ విధముగా కాలమందును, యుగయుగములు దేవునికి మహిమ కలిగించవలెను అని నేర్చుకొనుచున్నాము.

లేఖనములలో ఈ గొప్ప సత్యము ఎంత చక్కగా వివరించబడినది! క్రీస్తునొద్దకు వెలుపలికి వెళ్ళిన సమూహము, ఆయన నిందను భరించుచు యాత్రికుల లక్షణములు కలిగి, ఆరాధించు సమూహముగా శరీరముల విషయమై శ్రద్ధ తీసికొనుచు, ఆత్మలను కాపు కాయుచు, ప్రార్థన చేయుచు నుండుట ఇక్కడ దేవునికి ఇష్టమైనది, మహిమ కలిగించునది. మనలో ఎన్ని వైఫల్యములున్నను మన యెదుట సత్యమును మాత్రమే ఉంచుకొని, ముందుకు సాగిపోవుదముగాక!

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – విశ్వాస పథములో మనలను నిలుపు దేవుని సాధనములు

విశ్వాస పథములో మనలను నిలుపు దేవుని సాధనములు (అధ్యాయము 12)

క్రైస్తవుడు తాను జీవించుచున్నట్టి ఈ లోకముయొక్క నిజమైన అంచనాను కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే తాను వెళ్ళనైయున్న శ్రేష్టమైన దేశపు ఆశీర్వాదములనుకూడ తన యెదుట ఎప్పుడూ ఉంచుకొనవలెను.

మన మనస్సుల నిండా పెరిగిపోవుచున్న ఈ లోకపు దుష్టత్వము తీర్పుకు సిద్ధమైయుండగా, మరొకవైపు క్రైస్తవ లోకము దుస్థితిలో ఉండి, క్రీస్తు నోటనుండి ఉమ్మివేయబడుటకు సిద్ధముగా నుండగా, దేవుని ప్రజలలో గందరగోళము నెలకొని చెల్లాచెదురై ఉండగా, మనముకూడా కొన్నిసార్లు కృంగిపోయి, గుండె బెదరునుండి తప్పించుకొనలేము.

హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయములో క్రైస్తవులుకూడా శ్రమలలో కృంగి పోవుదురు అను వాస్తవమును గుర్తించుట జరిగినది. అయితే ఈ ఉరిని ఎదుర్కొను సత్యము వెల్లడించబడినది.

హెబ్రీయులకు పత్రిక విశ్వాసంలో నిలుపు దేవుని సాధనములు

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

ఈ పత్రికను అందుకొన్న పాఠకులు శోధనల ఒత్తిడికి లొంగిపోయి, శత్రువుతో పోరాడుటలో వాటికి అవకాశ మిచ్చియున్నట్లు అపొస్తలుడు గమనించెను. కృంగదీయు “భారములను” సుళువుగా చిక్కులుబెట్టు పాపములను, క్రైస్తవులకు ఎదురగు కష్టములను అపొస్తలుడు వివరించుచున్నాడు.

శ్రమలలో విశ్వాసులు తమ యెదుట ఉంచబడిన పరుగు పందె ములో అవరోధములు కలిగి తప్పిపోవు ప్రమాదమున్నట్లు గ్రహించెను. శత్రువుతో పోరాడుటలో వారు అలసిపోవచ్చును. ప్రాణములు విసుక వచ్చును.

ప్రభువుచేయు శిక్షను తృణీకరించవచ్చును. ప్రభువు పనిలో వారి చేతులు బలహీనమగునేమో, వారి మోకాళ్ళు సడలునేమో, వారి వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు తుదకు వారి పాదములను ప్రక్కకు తిప్పి వక్రమార్గము అవలంబించునట్లు చేయునేమో అని రచయిత ఆందోళన చెందుచున్నాడు.

మనము కీడుచేత జయింపబడకుండునట్లు అపొస్తలుడు కొన్ని శ్రేష్ఠమగు సత్యములను మన గమనమునకు తెచ్చుచున్నాడు. వాటిని గట్టిగా చేపట్టినయెడల ఎన్ని శోధనలు, వ్యతిరేకతలు ఎదురైనను భూలోకమునుండి పరలోకమునకు వెళ్ళు మన పరుగులో అవి మనలను బలపరచును, ప్రోత్సాహమిచ్చును.

(వచనము 1). మనము విడిచిపెట్టి, వెన్ను చూపిన ప్రస్తుత లోకము, మనము దృష్టి నిలిపియున్న ఆ రాబోవు లోకముమధ్య మన పాదము లున్నవి. ఇదే “పరుగు పందెము”గా వర్ణింపబడినది.

ఇది మనము మన యెదుట ఉంచుకొనిన ఒక పరుగు పందెము కాదు. అది మనయెదుట ఉంచబడియున్నది. రక్షింపబడుటకు ఒకే మార్గమున్నను, ఈ లోకము గుండా ప్రయాణము చేయుటకు అనేక మార్గములున్నవి.

ప్రతి క్రైస్తవుడు తనకు నచ్చిన మార్గములో ప్రయాణముచేయు స్వేచ్ఛ ఉన్నది అని అనేకులు భావించుచున్నారు.

దేవుడు ప్రజలను లోకమునుండి రక్షించు దేవుని మార్గమును, ఈ లోకముగుండా సురక్షితముగా నడిపించు మార్గమును లేఖనములయందు వివరించబడియున్నవి.

మన విధి ఏమనగా ఆ మార్గమును గుర్తించి, మన యెదుట ఉంచిన పరుగు పందెములో పరుగెత్తవలయును. హెబ్రీ పత్రిక చదువుచుండగా మనకు ఒక విషయము స్పష్టమగును.

దేవుడు తన ప్రజలకొరకు ఏర్పాటుచేసిన మార్గము పూర్తిగా యూదా శిబిరమునకు వెలుపల ఉన్నది. అయితే క్రైస్తవ లోకము ఆ శిబిరమునొద్దకే తిరిగి వెళ్లినట్లు స్పష్టమగుచున్నది.

అందువలననే ఈ అధ్యాయములో “శిబిరము వెలుపలికి వెళ్ళుదము” అని ఇచ్చిన హెచ్చరిక ఈ కాలమునకు అన్వయించునదే.

ఆ కాలమందు ఏలాగో, నేటి కాలమందుకూడా మనము శిబిరమునుండి వెలుపలికి వెళ్లవలెనంటే నిందలు, శ్రమలు తప్పవు. నిందలు శ్రమలు కలిగినప్పుడు కృంగిపోవుటయు సహజమే.

ఈ మార్గము నవలంబించుటలో అవరోధములున్నవి. అందువలననే అపొస్తలుడు “ప్రతి భారమును, సుళువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టు”మని హెచ్చరించుచున్నాడు.

దేవుడు నిర్ణయించిన మార్గమును అవలంబించుటలో రెండు అవరోధములు ఎదురగును. మొదటిది “భారములు”, రెండవది “పాపము”. భారములు నైతిక పొరపాట్లు కావు.

దేవుని మార్గమును అంగీకరించుటలో ప్రతిబంధకముగా నుండునది లేదా మార్గమందుండగా ఓపికతో పరుగెత్తకుండా చేయునది భారము. మన ఆత్మీయ పురోగతికి అడ్డుగానున్నదేదో త్వరగా పసిగట్టవలెనంటే వెంటనే పరుగెత్తడము ప్రారంభించవలయును.

పందెములో పరుగెత్తువాడు తనకు భారముగా ఉన్న బట్టలన్నియు తీసివేయవలెను. సాధారణ జీవిత ములో ఎంతమాత్రము బరువుగా అనిపించనివైనను పరుగు పందెములో బరువుగా నుండును.

“ప్రతి భారమును” విడిచిపెట్టుమని హెచ్చరింపబడి యున్నాము. మనము కొన్ని భారములను వెంటనే విడిచి పెట్టుదుము కాని, మరి కొన్నిటిని అంటిపెట్టుకొనియుందుము.

మరియొక అవరోధము పాపము. ఇక్కడ చెప్పిన పాపము అక్రమము లేదా మన ఇష్టమును నెరవేర్చుకొనుట. అవమానమను వెలుపలి మార్గమును అవలంబించుటలో ముఖ్యమైన అవరోధము అదుపులేని అహంభావము.

దేవుని మార్గములో మానవుని తలంపులకు అవకాశమే ఉండకూడదు. ఈ అవరోధములను అధిగమించవలెనంటే బలము, ఓరిమి అవస రము. అందువలననే అపొస్తలుడు “ఓపికతో పరుగెత్తుదము” అని హెచ్చ రించుచున్నాడు.

పరుగెత్తుటకు ఆత్మీయ సత్తువ, దానికి తోడు ఓపిక అవసరము. బలముగా ప్రారంభించుట సులభమే కాని, దినదినము ఎదురగు కష్టములలో, నిరుత్సాహములలో ఓపిక ఎంతైనా అవసరము.

హెబ్రీయులకు పత్రిక దేవుడు మనలను నిలుపు మార్గాలు

మనము అవరోధములను అధిగమించి, మనయెదుట ఉంచబడిన పందె ములో ఓపికతో పరుగెత్తుటకు కావలసిన శక్తిని అమలులో పెట్టుటకు కావలసిన సాధనములను ఈ అధ్యాయములో దేవుని ఆత్మ మన గమన మునకు తెచ్చుచున్నాడు.

మొదటిది – మనలను ప్రోత్సహించుటకు గొప్ప సాక్షి సమూహము యొక్క విశ్వాస పథమునుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.

మనలను ఎదిరించు శత్రువులున్నను, శోధనలు ఎదుర్కొనవలసినను, కష్టములను అధిగమించవలసినను, మనకంటే ముందుగా ఎందరో ఈ విశ్వాస పథమునందు సాగిపోయిరని మననము చేసికొనవలెను. కొందరు రానున్న లోకపు మహిమ వెలుగులో నడచుకొనిరి.

మరికొందరు విషమ పరీక్షలు ఎదుర్కొనవలసి వచ్చెను. కౄరమైన దూషణలు, బంధకములు, చెర, చిత్రహింసలు, మరణము అనుభవించియు వారు విశ్వాసముద్వారా జయించిరి.

ఆ విధముగా ప్రస్తుత లోకమందలి అన్ని విధముల శ్రమలను అధిగమించి, వేరొక లోకమునకు నడిపించు పరుగునందు ఓపికతో పరుగెత్తునట్లు విశ్వాసమునకు సాక్ష్యమిచ్చుటకు గొప్ప సమూహము మనచుట్టూ ఆవరించియున్నది.

(వచనము 2). రెండవదిగా – భూసంబంధమైన సాక్షులందరికంటే ఎంతో ఉన్నతముగా విశ్వాస పథములో మనలను ప్రోత్సహించుటకు మహిమలో ప్రభువైన యేసు ఉన్నాడు.

“విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన” ఆయనపై మన దృష్టి నిలుపబడినది. శిబిరము వెలుపలి మార్గమును అవలంబించినమీదట మన స్వంత శక్తితో అంతటా కొనసాగగలమని అపొస్తలుడు భావించుటలేదు.

అందుకు భిన్నముగా ఆయన హెచ్చరికతో మనకు అర్థమగునదేమనగా అవరోధములను అధిగమించి, పరుగు ప్రారంభించిన తరువాత యేసువైపు దృష్టి నిలిపి నప్పుడే మనము కొనసాగగలము.

శిబిరము వెలుపలికి మనలను ఆకర్షించినది ఆయనే, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు బలపరచువాడుకూడా ఆయనే. ఇతరులు ఈ విశ్వాస పథమందు నడిచిరి గాని, అంతిమ గమ్యము చేరలేదు.

ఎందుకనగా వారు యింకను సంపూర్ణులు కాలేదు. (11:40). యేసువైపు చూచునప్పుడు ఆ మార్గములోని ప్రతి అడుగును దాటి, గమ్యము చేరిన వ్యక్తిని చూచుచున్నాము. పాత నిబంధన భక్తు లందరూ దేదీప్యమానమగు ఆదర్శమైనను, వారు “నాయకులు” కాదు, “సంపూర్ణులును” కాదు.

కానీ ఆ రెండుకూడా ప్రభువైన యేసే. విశ్వాస పథములో ఎదురైన అవమానములను, శ్రమలను తన ఎదుట ఉన్న ఆనందముకొరకు ఆయన నిర్లక్ష్యము చేసెను.

ఆయన ఆ మార్గమున నడచినందున “నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు గలవు” అని చెప్పగలిగెను.

హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోని సాక్షులందరూ తమ ఆదర్శము ద్వారా మనలను ప్రోత్సహించుచున్నను, వారిలో ఏ ఒక్క సాక్షియు మన విశ్వాసమునకు ఆస్పదము కాజాలడు, అవసరతలో సహాయము చేయు నట్లు కృపా పరిచర్య జరిగించలేడు.

యేసైతే ఆ మార్గమందు నడచుట మాత్రమే కాదు, దాని గమ్యముకూడా చేరిన పరిపూర్ణ ఆదర్శము. అంతే కాదు, “తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై యున్నందున ఆ మార్గ మందున్నవారిని బలపరచ శక్తిగలవాడై యున్నాడు.

ఆ గొప్ప సాక్షి సమూహము తెరమరుగైపోయిరి, వారు దేవునికొరకు జీవించిరి, లోక సంబంధముగా ఆలోచించినయెడల వారిప్పుడు మృతులు, యేసు సదా జీవించుచున్నాడు. మనవెనుక అద్భుత ఆదర్శములును, మనయెదుట జీవించు వ్యక్తియు ఉన్నారు.

ఈ పత్రికలో పదే పదే మన ప్రభువైన యేసు అను వ్యక్తిగత నామము ప్రస్తావించబడియున్నది. (చూడండి 2:9; 3:1; 4:14; 6:20; 9:19; 12:2; 13:12). దీనికి కారణము మన మనస్సులపై ఒక గొప్ప సత్యమును ముద్రించుటకొరకు కావచ్చును.

మహిమా ప్రకాశములతో అలంకరించబడిన, మన అపొస్తలుడు, ప్రధాన యాజకుడు మరెవరో కాదు. మనమధ్య దీనుడై నివసించిన ఆయనే.

ఆయన స్థానము, పరిస్థితులు ఎట్లు మారెనో మనమెరుగముకాని, మనము మాత్రమే ఆయనవైపు తదేకముగా చూడవలెనని చెప్పబడియున్నది. ఆయన మనలను చూచుచున్నాడు. మనము ఆయనవైపు తేరిచూడవలెను.

(వచనములు 3, 4). మూడవదిగా యేసు నడచిన సంపూర్ణ మార్గము మనలను ప్రోత్సహించుచున్నది. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయనవైపు చూడుమని హెచ్చరించుటమాత్రమే కాదు, ఆయన గతమునుకూడా తలంచుకొనవలెను.

“బాగుగా తలంచుకొనుడి” అనునది సరియైన తర్జుమా. ఆయన మార్గమును తలంచుకొనినప్పుడు మొదటి నుండి చివరివరకు “పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కారము” చేసినట్టే గమనించగలము.

హెబ్రీయులకు పత్రిక మరియు విశ్వాసంలో నిలకడ

మనముకూడా విశ్వాస పథము అవలంబించి పందెములో పరుగెత్తుటకు శిబిరము వెలుపలికి వచ్చినయెడల, అడు గడుగునా మనుష్యుల మూర్ఖత్వమును ఎదుర్కొనుట తప్పదు.

క్రీస్తుకు వ్యతిరేకముగా పాపాత్ములు చేసిన తిరస్కారము, దేవుని ప్రజలు ఆయన అవమానములో పాలుపొందునప్పుడు అలసట కలిగించును. అలసి నప్పుడు విసిగిపోయి వెనుకంజవేయు అవకాశమున్నది.

కీర్తన 102-8

కనుక, మనము విసుకక యుండునట్లు “ఆయనను తలపోసికొందము”. పాపాత్ముల వ్యతిరేకతను, తప్పిపోవు విశ్వాసులను ఆయన సంపూర్ణముగా ఎదుర్కొని యున్నందున మనము ఎదుర్కొనవలసినదేమియు లేదు. అని ఆయన చెప్పగలుగు చున్నాడు. మనమింకను రక్తము కారునంతగా పాపముతో పోరాడలేదు.

పాపాత్ముల వ్యతిరేకతకు కృంగిపోయి, దేవుని చిత్తమునకు విధేయు లగుటలో తప్పిపోకుండునట్లు ప్రభువు తన రక్తమునే కార్చియున్నాడు.

సిలువచుట్టూ మూగియున్న పాపాత్ములు “నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి క్రిందకు దిగిరా” అని పలికిరి. ఆయన ఆ పని చేసినయెడల తండ్రి చిత్తమును నెరవేర్చుటలో విఫలమై, తనకు అప్పగించిన పనిని సమాప్తము చేయలేకపోయి ఉండును.

(వచనములు 5-11). నాలుగవదిగా – ఆ మార్గమందు మన పాదములు నిలుచునట్లు, తండ్రి ప్రేమతో శిక్షించు విధానములున్నవి. మనము పాపముతో పోరాడునప్పుడు, హతసాక్షిగా మరణించవలసి వచ్చిన, మనమెన్నటెన్నటికిని శరీరమునుండి విడిపించబడుచున్నాము.

ఒకవేళ మనము రక్తము ఒలికించుటకు పిలువబడనియెడల, మనలను శరీరసంబంధమైన శక్తినుండి విడిపించి, పరిశుద్ధతలో పాలుపొందునట్లు ఆయన మరియొక పద్ధతిని అవలంబించును.

అవసరమైనయెడల మనలను సరిదిద్దుటకు శోధనలు అనుమతించును. దేవుడు మనతో వ్యవహరించునప్పుడు రెండు ప్రమాదములున్నట్టు హెచ్చరింపబడియున్నాము. ఒకటి, శిక్షను తృణీకరించుట.

రెండవది, శిక్షాసమయములో కృంగిపోవుట. ‘శోధనలు మానవులందరికీ సహజ మేలే’ అని కఠినమైన మనస్సుతో లోపల గర్వించకూడదు.

లేదా శ్రమలలో నిరాశానిస్పృహలతో కృంగిపోకూడదు. (వచనములు 6-8). ఈ రెండు ప్రమాదములను హెచ్చరించిన తరువాత రెండు సత్యములను మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.

దానిద్వారా మనము ప్రతికూల పరిస్థితిలో కృంగిపోవుటగాని, ‘శిక్షను తృణీకరించుటగాని చేయక యుండగలుగుదుము. ప్రతి పరీక్ష వెనుక ప్రేమ ఉన్నదని చెప్పబడియున్నది.

“ప్రభువు తాను ప్రేమించినవారిని శిక్షించును” అని వ్రాయబడియున్నది. ప్రేమించు హృదయమే దెబ్బకొట్టు చేతిని కదలించును. పరిపూర్ణమైన ప్రేమ యోగ్యమైనదేదో చేయుచున్న ప్పుడు నేనెట్లు తృణీకరించగలను? నేనెందుకు అలసిపోవలెను.

శిక్షను అనుమతించిన ప్రేమ నన్ను బలపరచదా? రెండవది, మన పరీక్షలలో దేవుడు కుమారులతో వ్యవహరించినట్లు మనతో వ్యవహరించుటను చూడగలము. మన పిల్లలలో కూడా వారి స్వేచ్ఛావర్తనమును, ఖండించ వలసిన దుర్గుణములను గమనించగలము.

అదేవిధముగా దేవుడు తన పిల్లలలో తన పరిశుద్ధతకు వ్యతిరేకమగు ధోరణులను కనిపెట్టును, మన చెడుపోకడలు, అలవాట్లు, అసహనము, చిరచిరలాడుట, క్షుద్రమగు వ్యర్ధత, గర్వము, డంబము, స్వశక్తిమీద ఆధారపడుట, స్వార్థము మొదలైన వాటిపట్ల కఠినముగా వ్యవహరించి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందునట్లు చేయును.

మనలో తన పరిశుద్ధ స్వరూపమేర్పడుటకు తండ్రి ఎంత శ్రమపడెనో గమనించినయెడల, దానికంతటికిని కారణము తన బిడ్డలపట్ల ఆయనకున్న గొప్ప ప్రేమయే. దేవుని ప్రేమ కేవలము అనుభవ పూర్వకము కాదు.

మన పక్షముగా ఆయన ప్రేమ ఆచరణాత్మకమైనది. ఏదైనా కష్టమునుండిగాని, శోధననుండిగాని తప్పించబడినప్పుడు దేవుని ప్రేమనుగూర్చి ఆలోచించుదుము.

మాటలాడుదుము. ఇది ఆయన సున్నిత మైన ప్రేమ, దయ కావచ్చును. అయితే ఆయన మనకు అనుమతించు శ్రమలుకూడా ప్రేమతోనే అని గ్రహించుట అవసరము.

అపొస్తలుడు శిక్షించుటనుగూర్చి, దండించుటనుగూర్చి మాటలాడు చున్నాడు. దండించుట దేవుని అధికారపూర్వకమైన వ్యవహారము కావ చ్చును. స్పష్టమైన వైఫల్యమును సవరించుటకు చేయు గద్దింపు దండన.

శిక్షించుట ఏదేని పాపము మూలముగానే అనుకొను అవసరములేదు. దేవుడు తన స్వభావముననుసరించి మనలను వృద్ధిపొందించుటకు తన పరిశుద్ధతలో పాలుపొందునట్లు చేయునది కావచ్చును.

హెబ్రీయులకు పత్రికలో దేవుని సాధనములు

(వచనములు 9-11). దేవుడు మనలను శిక్షించుటద్వారా మనము మేలుపొందు రెండు సత్యములు వివరించబడినవి. మొదటిది, “ఆత్మలకు తండ్రియైనవానికి లోబడవలసినదని” చెప్పబడియున్నాము.

భూసంబంధు లైన తండ్రులు మన శరీరములను శిక్షించిరి, ఆత్మల తండ్రి మనము తనకొరకు జీవించునట్లు మనలో సవ్యమైన వైఖరి అలవడునట్లు శిక్షించును.

ఈ శిక్షద్వారా కలుగు ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించవలెనంటే ఆయన అనుమతించినవాటన్నిటికిని పూర్తిగా లోబడవలెను. శ్రమలలో మనము దేవునికి లోబడుటద్వారా శ్రమకు, మనకు మధ్య దేవుడున్నాడు.

తిరుగుబాటుచేసి దేవుని మార్గమును ప్రశ్నించినయెడల దేవునికి, మనకు మధ్య శ్రమ వచ్చును. మన జీవితములు బలము పొందుటకు బదులు చీకటిలో పడిపోవును.

రెండవదిగా, దేవుడు అనుమతించినవాటికి లోబడుటద్వారా “దాని యందు అభ్యాసము” పొందుచున్నాము. రానైయున్న దినమున … ఆయన మనలను ఏలాగు శ్రమలలోగుండా నడిపించెనో మనకు శిక్షణ నిచ్చి, ఆయన ఏలాగు ఆశీర్వదించెనో దానిని పూర్తిగా గ్రహించుదుము.

ఇదంతయు వాస్తవమైనను, దేవుడు మనలను శిక్షించుటనుబట్టి ప్రస్తుత కాలమందును మనము ఆశీర్వాదములు అనుభవించవలెనని కోరుచున్నాడు. దీనికి మనకు ప్రస్తుతము అభ్యాసము అవసరము.

మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందుట, సమాధానకరములగు నీతిఫలముల ననుభవించుటే ఆ ఆశీర్వాదములు. పదియవ వచనములో అపొస్తలుడు ప్రస్తావించిన పరిశుద్దత దాని లక్షణమును సూచించుచున్నది.

దీనిద్వారా మనము అపరిశుద్దతకు దూరముగా నుండుటయే గాక, దేవుని వలెనే అపరిశుద్ధతను అసహ్యించుకొందుము. చెడుగును అసహ్యించు కొనుటవలన నీతి అనుభవములోనికి వచ్చును.

ఫలితముగా సమాధాన ఫలములు పండును. అందుకు భిన్నముగా మనము ఇప్పుడు నివసించు చున్న నీతిబాహ్యమగు లోకము అశాంతితో అలమటించును.

(వచనములు 12-17). విశ్వాస పథము అవలంబించినవారి మధ్య ఉత్పన్నమయ్యెడి ప్రత్యేక ప్రమాదములను, కష్టములను ఎదుర్కొనుటకు కొన్ని ఆచరింపదగిన హెచ్చరికలు మన ప్రోత్సాహముకొరకు ఇవ్వబడినవి.

దేవుని వాక్యమునకు విధేయులై నడచుకొనుచు దేవుని వాక్య ప్రమాణ మును తగ్గించుటకు ఇష్టపడక ఉన్నప్పుడు, బలహీనతలు, వైఫల్యము లేని ప్రజల సహవాసము లభించునని కోరుకొనుట కూడదు.

ప్రాముఖ్య మైన ఆత్మీయ సత్యములు లోపించిన ప్రజల సహవాసము కోరుకొని నందున, చివరకు మనము చేరే గుంపు స్వార్ధపరులును, తమలో తాము తృప్తిచెందిన పరిశుద్ధులునై యుందురు.

ఈ లేఖన భాగమునుబట్టి క్రైస్తవ మార్గములో కొన్ని వర్గముల ప్రజలను చూడగలము.

  1. క్రైస్తవ శక్తి లోపించినవారు కొందరు వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు గలవారు.
  2. వంకర మార్గమున నడచువారు కొందరు.
  3. భేదములు పుట్టించువారు కొందరు.
  4. పరిశుద్ధతను ఆచరించుటలో విఫలులైనవారు.
  5. దేవుని కృపను పోగొట్టుకొనినవారు.
  6. లోకములో అపరిశుద్ధమైన సంబంధములు పెట్టుకొనినవారు.
  7. దైవిక విషయములను సాధారణమైనవిగా భావించువారు మరికొందరు.

ఇన్ని చెడుగులమధ్య దేవుని కృప లేనియెడల తప్పిపోకుండుట ఎట్లు సాధ్యము?

(వచనము 12). మొట్టమొదట “వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి” అని అపొస్తలుడు చెప్పుచున్నాడు. ఆత్మీయ శక్తి కొరవడినయెడల నీ చేతులను పైకెత్తి ఇతరులను ప్రోత్సహించుము.

దీనిని మనము ప్రార్థనకు అన్వయించవచ్చును. తిమోతికి పౌలు వ్రాయుచు చెప్పినదేమనగా, నని కోరుచున్నాడు.

1 తిమోతి 2-8

వడలిన చేతులు సడలిన మోకాళ్ళు, ప్రార్థన చేయని చేతులను ప్రార్థనకు వంగని మోకాళ్ళను సూచించుచున్నవి. పూర్వకాలపు ప్రవక్త ఇట్లు చెప్పెను:

వ్యక్తిగత జీవితములో ప్రార్థన లేమివలన, బహిరంగ జీవితములో శక్తిహీనులుగా కనిపించుట లేదా?

యెషయా 40-30,31

(వచనము 13). రెండవదిగా – ప్రార్థనవెంట అభ్యాసము ఉండ వలెను. “మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి” అని తరువాత చెప్పబడినది. అనేకులు దారి తప్పి వంకర త్రోవలలో తిరుగు లాడు దినములందు మన పాదములను తిన్నని మార్గములందు నడుచు నట్లు జాగ్రత్తపడుదము.

దానివలన ఎవరును దారితప్పక యుందురు. అనేకులు తమ నడకలో కుంటికాలు, బెణకిన కాలు గలవారై యుండ వచ్చును. వారు నడచుచున్న మార్గము వారికి సరిగా తెలియదు.

ప్రస్తు తము ఎక్కడ ఉన్నారోకూడా స్పష్టమైన అవగాహన వారికి లేదు. అట్టివారు చిన్న కారణమునకే దారి తప్పవచ్చును. అలాగైన మార్గమధ్యమందు మనలను మభ్యపెట్టు మార్గములవైపు మళ్లకుండుట ఎంతో ముఖ్యము.

పెద్దవాడైన పరిశుద్ధుడు ఒకడు అజ్ఞాన కార్యము జరిగించినందున, యౌవ నస్థులైన పరిశుద్ధులు దాని నవలంబించి మార్గము తప్పిపోవచ్చును.

(వచనము 14). మూడవది ఎవరైనను భేదమును కలిగించు మార్గమును అనుసరించినను, మనము అందరితో సమాధానముగా నుండుటకు ప్రయత్నించుదము.

క్రైస్తవులముగా ఈ లోకసంబంధమగు రాజకీయాలలో జోక్యము కలిగించుకొనక, లోకమందు యాత్రికులముగా నున్న మనము గట్టి అభిప్రాయములు వ్యక్తముచేయుట మన పనికాదు.

ప్రశాంతముగా ఈ లోకయాత్రను కొనసాగించవలెను. పతనమైన మానవ స్వభావంలో గొడవలలో తలదూర్చు లక్షణమున్నది. క్రైస్తవుడు జగడములు పుట్టించువాటికి దూరముగా నుండుటయేగాక, సమాధానమును వెంటాడి, సమాధానము పెంపొందు మార్గమును అవలంబించవలయును.

నాలుగవది – మనము పరిశుద్ధత కలిగియుండవలెను. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మహిమాప్రభావములతో అలంకరించబడిన యేసును చూచుచున్నాము అని అపొస్తలుడు చెప్పు చున్నాడు.

దీని అర్థము మనము సహజముగా పరిశుద్ధులముగా జీవించ వలెను. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. ప్రయాణములో సమాధానము, పరిశుద్ధత అను రెంటిని చేపట్టవలెను.

హెబ్రీయులకు పత్రిక గురించిన బోధలు – విశ్వాసం నిలుపు ప్రభావం

లేనియెడల పరిశుద్ధతను ఫణముగా పెట్టి సమాధానమును లేదా సమాధానము లేకుండా పరిశుద్ధతను వెంబడించు ప్రమాదమున్నది.

(వచనము 15). అయిదవది – ఎవడైనను దేవుని కృపను పొంద కుండ తప్పిపోవునేమో జాగ్రత్తగా చూచుకొనుడి అని అపొస్తలుడు హెచ్చరించుచున్నాడు. దేవుని కృపను తప్పిపోవుట అనగా దేవుని కృపలో నమ్మకము తగ్గిపోవుట.

దేవుడు మనకు ఏమైయున్నాడో దానిని అనుభ వించలేకపోవుట. ఫలితముగా చేదు వేరు ఏదైనను మొలిచి, పరిశుద్దులను కలవరపరచవచ్చును. ఒకరిపైనొకరు వైరముతో కూడిన ఆలోచనలకు తావిచ్చినందున అనేకులు అపవిత్రులగుదురు.

(వచనములు 16, 17). ఆరవది – లోకముతో అపరిశుద్ధమైన సంబంధము కల్గియుండు విషయము జాగ్రత్తగా ఉండవలెను. అట్టి సంబంధము వ్యభిచారమునకు ముంగుర్తుగా చూపెట్టబడినది.

చివరిగా దైవికమగు విషయములను-సాధారణముగా పరిగణించు విషయము హెచ్చరించబడియున్నాము. ఇదే భ్రష్టత్వము.

ఏశావు దీనికి ప్రబల నిదర్శనము. ఏశావు తాత్కాలిక ప్రయోజనముకొరకు జ్యేష్టత్వపు హక్కును చిన్నచూపు చూసెను.

ఇది హెబ్రీయులకు, ఆ మాటకొస్తే క్రైస్తవ్యమును ఒప్పుకొనిన ప్రతి ఒక్కరికీ, క్రైస్తవ్యములోని ఆశీర్వాదములను తక్కువగా ఎంచి, త్రోసివేయువారికి గొప్ప హెచ్చరికగానున్నది.

క్రైస్తవ లోకము రాను రాను ఏశావు భ్రష్టత్వములోనికి దిగజారిపోవుట విచారకరము. ఏశావు ఆ తరువాత శ్రద్ధతో వెదకినది పశ్చాత్తాపముకొరకు కాదుగాని అంతయు అయిపోయిన తరువాత ఆశీర్వాదముకొరకు వెదకెను.

భ్రష్టత్వ ములో పశ్చాత్తాపమునకు తావులేదని క్రైస్తవ లోకము గ్రహించును. దైవిక ఆధిక్యతలను చిన్నచూపు చూచుటవలన భ్రష్టత్వములో పూర్తిగా కూరుకుపోకముందు అపచారములో పడిపోవుదురు.

ప్రభు రాత్రి భోజనము మూలముగా మనము రక్షింపబడలేదు కనుక దానిని చిన్నచూపు చూచి, ప్రక్కకు నెట్టువారున్నారు. ఇది ఆధునిక సమాజపు అపచారమునకు నిదర్శనము కాదా?

(వచనములు 18-21). చివరిగా ఈ లోకమందలి శ్రమలకు దుఃఖములకు ప్రస్తుత లోకసంబంధమగు సాధనములకు పైగా మన ఆత్మలను ఎత్తుటకు అపొస్తలుడు మనయెదుట రాబోవు లోకమును ప్రత్యక్షపరచెను.

ప్రస్తుతము ఈ లోకమందలి సౌఖ్యములు, రాబోవు లోకము దృష్టికి వెలుపల ఉన్నవి. అందువలన ఈ గొప్ప వాస్తవిక సత్యముయొద్దకు మనము వచ్చియున్నామని అపొస్తలుడు చెప్పుటలో అవి మనకు విశ్వా సముద్వారా గ్రాహ్యమైనవని భావము.

రెండవ అధ్యాయము 5వ వచనములో అపొస్తలుడు రాబోవు లోకమును ప్రస్తావించి యున్నాడు. ఇది వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు స్వతంత్రించుకొను అంతులేని స్వాస్థ్యమును సూచించుచున్నది.

క్రీస్తు నరునిగా అధికారము కలిగి ఉన్నదంతయు ఇందులో నుండును. అవి పరలోకసంబంధము లేదా ఇహ సంబంధము కావచ్చును. రాబోవు లోకమునకు ఇహము, పరము అను రెండు పార్శ్వములున్నవి.

ఈ వాస్తవములను వివరించక ముందు రచయిత 18-21 వచనము లలో ఇశ్రాయేలీయులు దేనియొద్దకు వచ్చిరో, క్రైస్తవులు దేనియొద్దకు రాలేదో వాటి వ్యత్యాసమును చూపుచున్నాడు.

ద్వితీ. 4-10-13

అందువలననే దేవుడు భూమిమీద ప్రత్యక్షమైనప్పుడు, పాపమునకు అవిధేయతకు వ్యతిరేకముగా తీర్పు విధించు గంభీర సంకేతములతో ప్రత్యక్షమాయెను.

ఈ సంకేతములైన అగ్ని, కారుమేఘము, గాఢాంధకారము, తుపాను మనుష్యుల హృదయములలో భయము పుట్టించెను. సీనాయి దగ్గర ఉన్న ప్రతిదీ మనకు వ్యతిరేకముగా ఉన్నది.

మొదటి పర్వతము దగ్గర నున్నవన్నియు దృష్టిని, బుద్ధిని ఆకర్షించెను. క్రైస్తవులమగు మనము “స్పృశించి తెలుసుకొనదగినట్టి” కొండకు రాలేదు. (వ.18). వినికిడి సంబంధమగు “బూర ధ్వనికి, మాటల ధ్వనికి” వచ్చియుండలేదు. (వ.19). కంటికి కనిపించు వస్తువులయొద్దకును రాలేదు. (వ.20).

ప్రకృతి సంబంధియగు మనిషి దేవుని సన్నిధికి తాళుకొనలేడు. దేవుని మహిమా ప్రత్యక్షత కొంచెమైనను, దానికి మనిషి కోరునది జతచేయబడిన యెడల దానిని భరించుట కష్టము. ఇశ్రాయేలీయులు దానిని సహించలేక పోయిరి.

మోషే చూచినప్పుడు ఆ దృశ్యము ఎంతో భయంకరముగా నుండెను గనుక “నేను మిక్కిలి భయపడి వణకుచున్నాను” అనెను. క్రైస్తవ్యములో మనము వచ్చినట్టి గొప్ప వాస్తవములను ప్రకృతి సంబంధి స్పృశించలేడు, వినలేడు, చూడలేడు.

హెబ్రీయులకు పత్రిక అధ్యాయాలు 10-12 వచనాలు

అవి విశ్వాసముద్వారా మాత్రమే గ్రాహ్యములు. యూదా మత వ్యవస్థలో ప్రతిదీ కూడా శరీరమునకు ఆకర్షణీయముగా రూపొందించబడినది. దీనికి అలవాటుపడియున్న యూదా విశ్వాసులకు ఈ సత్యములు గొప్ప పరీక్షగా పరిణమించినవి.

ఇప్పుడు వారికి పరిచయము చేయబడినది పూర్తిగా నూతనమైనది, దృష్టిని ఆకర్షించుదానికి పూర్తిగా వెలుపలిది. యూదా మతములోనివన్నియు ఛాయలు, క్రైస్తవ్యములోని అదృశ్యమైనవన్నియు నిజస్వరూపములని వారు తెలుసుకొనవలెను.

దృశ్యమానమైనవన్నియు గతించి, వారును, మనమును ఇప్పుడు అద్భుతమగు ఆశీర్వాదముల పరిధిలోనికి ప్రవేశించు చున్నాము. అవి విశ్వాసముద్వారానే గ్రహింప వీలగును.

(వచనములు 22-24). మనయెదుట తెరువబడిన విశాలమైన ఆశీర్వాదశాలలోనికి మనము వచ్చియున్నట్లు చెప్పబడు 8 అంశములు ఉన్నవి :

  1. సీయోను కొండ.
  2. జీవముగల దేవుని పట్టణము, అనగా పరలోకపు యెరూషలేము.
  3. వేవేలకొలది దేవదూతలయొద్దకు, ఇది సార్వత్రిక సమావేశము. 4. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకు.
  4. అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకు.
  5. సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకు.
  6. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకు.
  7. హేబెలుకంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు,

1. సీయోను కొండ – మన ఆత్మయందలి విశ్వాసముతో రాబోవు లోకమును చూచినప్పుడు, దేవుని ఆత్మ మనలను భూలోకమందలి పరిశుద్దులకు ప్రతినిధిగానున్న భూసంబధమగు యెరూషలేమునకు, అనగా సీయోను కొండకు తీసికొనివచ్చును.

భూలోకమందుగాని, పరలోక మందుగాని ఉన్న పరిశుద్ధులందరికిని ఆశీర్వాద కారణము ఆ సీయోను కొండ అని సూచించుచున్నది. సీయోను కొండ ఆత్మీయ ప్రాముఖ్యతను 78 మరియు 132 కీర్తనలు వివరించుచున్నవి.

బాధ్యతల విషయములో ఇశ్రాయేలీయులు పూర్తిగా విఫలులైన విషయము కీర్తన 78 వెల్లడించుచున్నది. తమ క్రియల ఆధారముగా సమస్తము పోగొట్టుకొనిరి. వారి ప్రత్యక్ష గుడారము విడిచిపెట్టబడెను. (వ. 60); మందసము విరోధుల చేతిలోనికి పోయెను. (వ. 61); దేశము తీర్పునకు గురియాయెను.

ప్రజలు నశించిపోయిరి. (వ. 62-64). అప్పుడు 65వ పాదములో వ్రాయబడినరీతిగా “నిద్రనుండి మేల్కొను ఒకనివలె” ఆయన “పరాక్రమశాలివలె” దాని చేయ ప్రారంభించును. అప్పుడు ప్రజల స్థితిగతులలో గొప్ప మార్పు చోటు చేసుకొనును, అది యెహోవావలననే జరుగును.

ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలీయుల చేతి పనులనుబట్టి వ్యవహరిం చుచు వచ్చెను. వారెప్పుడైతే పూర్తి నాశనమునకు తొలగిపోయిరో అప్పుడు దేవుడు తన సార్వభౌమత్వమునుబట్టి వెనుకతీసి తన స్వంత విధానములో పనిచేయ మొదలుపెట్టెను.

అందువలననే ఆయన యూదా గోత్రమును, తాను ప్రేమించిన సీయోను పర్వతమును, “మరల దావీదును కోరు కొనెను” అని చెప్పబడినది. దేవుడు తన కృపలో ఎన్నుకొను విధానమిది. పర్వతము శక్తికి నిదర్శనముగా నున్నది. సీయోను పర్వతము దేవుని కృప అమలుపరచుటకు నిదర్శనముగా ఉన్నది.

132వ కీర్తన సీయోను పర్వత విషయమై మరికొంత గొప్ప సత్య మును వెల్లడించుచున్నది. దావీదు మందసమును తిరిగి సీయోనుకు తెచ్చిన సందర్భమును ఈ కీర్తన కొనియాడుచున్నది.

మందసమును శత్రువుల చేతినుండి విడిపించుట మాత్రమేకాదు, దాని అసలైన స్థాన మందు అనగా సీయోను కొండపైన నిలుపుట జరిగినది. “యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు.

ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమస్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను” (వ. 13) అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు.

మందసము సీయోను కొండమీద స్థాపించిన వెంటనే ఆశీర్వాదములు ప్రజలపై ప్రవహించుట చూడగలము. “దానిలోని ఆహారమును నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు”.

ఇక్కడ మరల సీయోనుకు అనుబంధముగా దైవిక ఎన్నిక ప్రస్తావించ బడినది. మందసమును గూర్చిన ఆలోచన జోడించబడినది. మందసము, దానిపైనున్న కరుణాపీఠము క్రీస్తును సూచించుచున్నది.

ఆ విధముగా సీయోను కొండనుగూర్చిన సంపూర్ణ సాదృశ్యభావము మానవునికి ఆశీర్వా దములు క్రీస్తుద్వారానే దైవకృప పనిచేయుటవలన సంక్రమించునని నేర్చుకొనుచున్నాము.

మానవుడు వైఫల్యము చెందినందున సమస్తమును పోగొట్టుకొన్నాడు. అయితే అవన్నియు క్రీస్తు ఏమైయున్నాడో, ఆయన ఏమి చేసెనో దాని ఆధారముగా దైవకృపద్వారా మనిషికి ప్రవహించు చున్నవి.

మనము నిలుచున్న ఆశీర్వాదముల ఆధారమగు రాబోవు లోకము అట్టిది, మనము అట్టిదానియొద్దకు విశ్వాసముతో చేరుకొనియున్నాము.

విశ్వాసంలో నిలుపు దేవుని పద్ధతులు

2. జీవముగల దేవుని పట్టణము అనగా నూతన యెరూషలేము మానవుడు సంపూర్ణముగా పతనమైయుండగా అతని అవసరతను తీర్చు దేవుని ఉచిత కృపతో ప్రారంభమై, ఇప్పుడు పరలోక ప్రదేశములలో ప్రవేశించి, దేవుని పట్టణములో, అనగా పరలోక సంబంధమగు యెరూష లేములో ఉన్నట్లు గ్రహించుచున్నాము.

ఈ పట్టణము రానున్న లోకములో నుండు పరిశుద్దులకును, వారి నివాసములకును సాదృశ్యముగానున్నది. వెయ్యేండ్ల పాలన కాలములో భూసంబంధమగు ఆశీర్వాదము అందించ బడును.

సమస్త జాతులు దాని వెలుగులో నడచుకొందురు. భూలోక పట్టణములకు భిన్నముగా అది జీవముగల దేవుని పట్టణమని పిలువ బడినది. భూలోక నగరములలో నివసించు మనుష్యులు మరణించెదరు.

వారి నగరములును వారివలెనే కనుమరుగై నశించును. ఈ పట్టణమునకు జీవాధారము దేవుడే గనుక ఇది ఎంతమాత్రము నాశనమునకు గురికాదు. ఈ నగరమును విశ్వాసముతో మన కళ్ళెదుటే చూడగలము.

వెలిచూపుతో మన చుట్టూ చూచిన మనకు కనిపించునది లోక పట్టణములలో వేదన, విచ్చలవిడితనము, భ్రష్టత్వము.

అయితే పాపపంకిలమైన పాదము లెన్నడూ నడవని ఆ మహిమగల పట్టణమును విశ్వాసముతో చూచు చున్నాము. లోకమందలి సకల జనాంగము రానైయున్న లోకపు వెలుగులో నడచినయెడల వారి వేదన మటుమాయమగును.

రానైయున్న లోకము యొక్క ఆశీర్వాదములు స్థాపించబడునని ఎరుగుటవలన మన హృదయ ములు ఆదరణ పొందును.

3. వేవేల కొలది దేవదూతలయొద్దకు, అనగా సార్వత్రిక సభ – పరలోకమునకు వచ్చినప్పుడు అసంఖ్యాకులగు దేవదూతల సమూ హములో మనమున్నట్లు గ్రహించుదుము.

ఇది ఆత్మీయ ప్రాణుల సార్వత్రిక సభ. అన్ని వర్గముల, స్థాయిల దేవదూతలు అక్కడ ఉందురు. వేవేలకొలది దేవదూతల సమూహము ఇదివరకే ఉన్నారు. అయితే మనము విశ్వాసముతో వారి ఉనికిని గుర్తించుచున్నాము.

దేవదూతలు దేవుని ప్రజలకు సేవచేయు ఆత్మలు, కాపలాదారులు. రాబోవు లోకమందుకూడా వారు ఈ ప్రత్యేక పరిచర్య నిర్వహించుదురు. దేవదూతలు కావలికాయు పరిచర్య వెల్లడించబడినది.

కీర్తన 34-7, 2 రాజులు 6-17, దానియేలు 6

ఎలీషా జీవితము ఈ కావలి పరిచర్యకు చక్కటి ఉదాహరణ. దోతానులో శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఎలీషా పనివాడు భయముతో వణకిపోయెను. అయితే ఎలీషా చెప్పినదేమనగా.

ప్రార్థనకు జవాబుగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని రథములతోను, గుఱ్ఱములతోను నిండియుండుట చూచెను..

ఎలీషా వాటియొద్దకు ముందే విశ్వాస ముతో వచ్చెను. పనివాడు వెలిచూపువలన వచ్చెను.

ఎందుకనగా అతనికి హాని ఏమియు చేయకుండునట్లు దేవదూత పంపబడి, సింహముల నోళ్లు మూసివేసెను. ప్రభువు మానవునిగా దేవదూతల కావలి పరిచర్య అనుభవించెను.

కీర్తన 91-9-12

ఆయన జన్మ సందర్భమున దేవదూతలు కనిపెట్టుకొనియుండిరి, శోధన సమయములో దేవదూతలు పరిచర్య చేసిరి. గెత్సేమనే తోటలో ఒక దేవదూత ఆయనను బలపరచెను. దేవదూతలు ఆయన సమాధిని కావలి కాచెను. ఆయన ఆరోహణ సమయంలోకూడా వారు ఆయనతో నుండిరి.

ప్రస్తుతము విశ్వాసులు దేవదూతల కావలి పరిచర్యలోనున్నారు. “వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయు టకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?” అని చెప్పబడియున్నది.

రాబోవు లోకమందును వారు ఈ పరిచర్య కొనసాగింతురు. దేవదూతలు పరలోక పట్టణపు ద్వారమునొద్ద నిలుచుందురు, పరలోకమునకు భూమికిని మధ్య తిరుగుచు మనుష్య కుమారునిపైగా ఎక్కుచూ దిగుచూ నుందురు.

4. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము – మనము విశ్వాసముతో మరికొంత దూరము మహిమ లోతులలోనికి పయనించిన యెడల పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము చేరు కొందుము.

ఈ విశాల పరలోక మహిమలో ప్రత్యేక స్థానము పొందినవారు కొందరున్నారు. వారే అధికులన్న భావముతో జ్యేష్ఠులు అని చెప్పబడి యున్నారు. క్రీస్తు ఆదిసంభూతుడు అని లేఖనములలో ఏడు పర్యాయ ములు చెప్పబడియున్నది. ఎందుకనగా ఆయన ఎప్పుడూ ప్రథముడుగా ఉండవలెను.

ఇక్కడ బహువచన పదము ప్రయోగించబడినది. ఇది పరిశుద్దుల సహవాసమైన సంఘమును సూచించుచున్నది. ఈ జ్యేష్ఠుల పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవి.

అది వారి పరమ నివాసము. మన పేర్లు ఎక్కడ ఉండునో దానికే మనము చెందియుందుము. పరలోకపు యెరూషలేముగా సంఘము భూసంబంధమగు ఆశీర్వాదములు అంద జేయుచున్నట్లు చూడగలము. జ్యేష్ఠుల సంఘము పరలోక సంబంధముగా ఆరాధనను సూచించుచున్నది.

నిర్గమ 4-22

5. అందరి న్యాయాధిపతియైన దేవుడు – మనము విశ్వాసముతో మరింత ఎత్తుకు వెళ్ళినచో “అందరి న్యాయాధిపతియగు దేవుని” చేరు కొందుము. “క్రిందనున్నవాటన్నిటిని తీర్పు తీర్చుటకు ఆయన చూచు చున్నట్లు” దేవునిగూర్చి చెప్పబడినది.

ఇది దేవుని ధవళ సింహాసనముపై నుండి పాపులకు తీర్పు తీర్చుటను గూర్చిన ప్రస్తావన కానే కాదు. భూ లోకముపై నీతి పాలన చేయువానిగా ఆయనను చూడగలము.

అందు వలననే అబ్రాహాము దేవుని న్యాయనిరతినిగూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. కనుక రాబోవు లోకమందు ప్రజలు ఈలాగు చెప్పుదురు – “నిశ్చయముగా నీతిమంతులకు బహుమానము కలుగును.

దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చుట నిశ్చయము.” మరియొకచోట ఈలాగు చెప్పబడినది.

మనుష్యుల పరిపాలనలో నీతి న్యాయములు కనుమరుగై పోవుచున్నవి. అందరికీ న్యాయాధిపతియైన దేవుని పరిపాలనలో న్యాయముతో తిరిగి నీతి నెలకొనును.

ఆది. 18-25, కీర్తనలు 58-11, 84-2, యెషయా 11-3-5

6. సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకు – రాబోవు లోకము పాత నిబంధన పరిశుద్ధులు లేకుండా సంపూర్ణము కాదు. సీయోను కొండ కేంద్రముగానున్న భూసంబంధమగు పరిశుద్ధులు, పరలోకమందలి పరిశుద్ధులలో ముఖ్యులైన జ్యేష్ఠుల సంఘము, వీరిలో సిలువకు ముందు అన్ని యుగములలోనున్న భక్తులెల్లరూ ఉన్నారు.

వారు సంపూర్ణ సిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మలు అని చెప్పబడియున్నారు. అంటే వారు మరణమును దాటి అనాచ్చాదిత స్థితిలో ఉండి ఇప్పుడు మహిమ దేహములు పొందియున్నారన్నమాట.

7. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకు – మన ఆత్మల యందలి విశ్వాసముతో మనము యేసునొద్దకు చేరియున్నాము. రాబోవు లోకమందలి ఆశీర్వాదములు అవి భూసంబంధమైనవైనను, పరసంబంధ మైనవైనను, ఆయనద్వారా సమకూడినవి. యేసు లేకుండా రాబోవు లోకమెట్లుండును? ఆ ఆశీర్వాదములన్నిటికీ కేంద్రము ఆయనే. పరిశుద్ధుల హృదయములను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని మహి మార్థమై తన రాజ్యమును నిర్వహించువాడుకూడా ఆయనే.

8. హేబెలుకంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు – చివరగా మనము హేబెలు రక్తముకంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చియున్నాము. రాబోవు లోకమందలి ఆశీర్వాదములకు నిత్యమగు నీతి ఆధారమిదే. హేబెలు రక్తము భూమిమీద ఒలికించబడినది.

రక్తము చిందించిన వ్యక్తిపై పగతీర్చుమని ఆ రక్తము దేవునికి మొర పెట్టినది. క్రీస్తు రక్తము దేవుని కన్నులయెదుట కరుణాపీఠముపై ప్రోక్షింప బడినది. పగతీర్చునట్లు మొరపెట్టక, రక్తము చిందించినవారి క్షమాపణ కొరకు ఆ రక్తము మొరపెట్టెను.

దేవుడు రక్తమును అంగీకరించినాడన్న సత్యమందు విశ్వాసముంచినవారందరును ఆ రక్తముద్వారా సంక్రమించు ఆశీర్వాదములు పొందుదురు. రాబోవు లోకమందు వారికి పాలుండును.

ఆ విధముగా కాల పరిపూర్ణతలో క్రీస్తు మహిమనుగూర్చిన దేవుని ఆలోచనలు మన ఆత్మలయెదుట అద్భుతరీతిలో తెరువబడియున్నవి. పరిశుద్ధుల ఆశీర్వాదములు సాఫల్యత చెందును.

మన ఆత్మలయందలి విశ్వాసము, అనురాగములతో భూలోకమందలి పరిశుద్ధులను, పరలోక మందలి పరిశుద్ధులను, పాత నిబంధన భక్తులను అసంఖ్యాకములగు దేవదూతల సమూహములను అందరికంటే పైన దేవుని ప్రతి ఆశీర్వాద ములకు ఆధారమగు ఆయన ప్రశస్త రక్తమును చూచుటకు అనుమతించ బడియున్నాము.

(వచనములు 25-29). విశ్వాసి పొందనైయున్న మహిమగల లోకమును విశ్వాసముతో ఇప్పటికే చేరుకున్నట్లు వివరించిన తరువాత ఇప్పుడు అపొస్తలుడు ఒక గొప్ప హెచ్చరిక చేయుచున్నాడు.

విశ్వాసంలో నిలుపు దేవుని పద్ధతులు

ఈ సంగతు లనుగూర్చి పరలోకమునుండి మాటలాడుచున్న ఆయననుండి ప్రక్కకు తొలగు ప్రమాదమునుగురించి హెచ్చరించుచున్నాడు.

మనిషినుండి నీతిని కోరి భూలోకమందు దేవుడు మాటలాడినప్పుడు అవిధేయులైనవారికి తీర్పు తప్పని పక్షములో, పరలోకమునుండి ఆశీర్వాదముల నిచ్చునట్లు కృపతో మాటలాడుచున్న దేవుని స్వరమునకు అవిధేయులైనయెడల తీర్పు మరింత నిశ్చయముగా విధించబడునుగదా.

“ధర్మశాస్త్రపు శిక్షకంటే, సువార్త శిక్ష మరింత తీవ్రమైనదని” సామ్యూల్ రూథర్ఫోర్డ్ చెప్పి యున్నారు. రాబోవు తీర్పులో ఇమిడి ఉన్నవాటి విషయమై మనము హెచ్చరింప బడియున్నాము.

సీనాయియొద్ద భూమిని వణకించుటద్వారా దేవుని తీర్పులోని పరిశుద్ధత సాదృశ్యముగా వెల్లడించబడినది. భవిష్యత్తులోని తీర్పు భూమినిమాత్రమే కాదు, ఆకాశమును కూడా చలింపజేయును.

చలింపజేయబడునవి బొత్తిగా తీసివేయబడునని చలింపజేయుటద్వారా స్పష్టమగుచున్నది. దేవుని కృప మూలము కాని ప్రతిదీ తీర్పుద్వారా తొలగించబడును.

దేవుని కృపాకార్యమగు నూతన సృష్టిమాత్రమే మిగులు నట్లు చివరకు పాపమువలన పాడైపోయిన పాత సృష్టి తొలగించబడును. క్రైస్తవులు పొందిన రాజ్యము నీతితోను, దేవుని కృపతోను స్థాపించబడి నందున అది తీసివేయబడదు.

అలాగైన మనము ఏశావువలె దైవికమగు విషయములను సాధారణమైనట్లుగా భావించక, భయముతోను, వణకు తోను దేవునికి సంబంధించిన విషయములు పవిత్రమైనవిగా ఎంచి, ఆయనను సేవించుదము.

మనము కృపనుబట్టి దేవుని ఎరిగినను మన దేవుడు దహించు అగ్ని అని మరచిపోకూడదు. తనకు ప్రతికూలమగు ప్రతిదానిని ఆయన దహించివేయును. అది తన ప్రజలలోనున్న శరీర సంబంధమైనది కావచ్చును లేదా పాపముతో పాడైపోయిన సృష్టి కావచ్చును, ఆయన సమస్తమును దహించును.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – క్రీస్తు శ్రమలు, యాజకత్వమునకు పిలుపు

క్రీస్తు శ్రమలు, యాజకత్వమునకు పిలుపు (అధ్యాయము 5:1-10)

క్రీస్తు యాజకత్వ పరిచర్య జరిగించిన పరిధిని అనగా దేవుని ఇంటిని అపొస్తలుడు మనకు చూపెట్టియున్నాడు. ఆయన యాజకత్వ పరిచర్యకు కారణమైన ఆ ప్రజల స్థితిని – అనగా అరణ్య ప్రయాణమును చూపెట్టి యున్నాడు.

ఇప్పుడు క్రీస్తు తన యాజక పరిచర్యనుబట్టియు, ఆ పదవికి తగిన పిలుపునుబట్టియు ఆయన పొందిన శ్రమలను మన యెదుట చూపెట్టుచున్నాడు.

(వచనములు 1-4). యేసుక్రీస్తుయొక్క శ్రేష్టమగు యాజక పరిచర్యను వివరించుటకు అపొస్తలుడు అహరోను యాజకత్వమును ఉదహరించెను. యాజక సేవకు సంబంధించిన సాధారణ సూత్రములనుకూడ వివరిం చెను.

అదే సమయములో అహరోనుకంటే క్రీస్తు యాజకత్వము ఎంత శ్రేష్టమైనదోకూడ పోల్చి చెప్పెను. ఈ నాలుగు వచనములు క్రీస్తు పరలోక యాజకత్వమును సూచిం చుటలేదు.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

గాని భూసంబంధమగు అహరోను యాజకత్వమును సూచించు చున్నవని మనము గ్రహించవలెను.  భూసంబంధమైన యాజకుని వ్యక్తి త్వము, పని, అనుభవము, నియామకము మొదలగు విషయములను అపొస్తలుడు ఇక్కడ వివరించియున్నాడు.

వ్యక్తిగా ప్రధానయాజకుడు మనుష్యులలోనుండి ఎన్నుకొనబడిన వాడు. యేసుక్రీస్తు యాజకత్వము అందుకు పూర్తిగా భిన్నమైనది. క్రీస్తు మానవుడే, కాని ఆయన అంతకంటే అధికుడు. మన ప్రధానయాజకు డగు క్రీస్తు మరెవరోకాదు.

నిత్యుడగు కుమారుడని రచయిత సాక్ష్య మిచ్చుచున్నాడు. పని విషయములో భూసంబంధమైన యాజకుడు మనిషికొరకు దేవుని విషయములో కార్యములు జరిగించుటకు నియమింపబడెను.

పాపముల కొరకు బలులు అర్పణలు అర్పించుటకును, అజ్ఞానుల, పాపుల పక్షమున క్షమాపణను సంపాదించుటకును నియమింపబడెను. ఇక్కడ క్రీస్తు యాజక పరిచర్యను ఛాయగా చూడగలము.

ప్రధాన యాజకునిగా క్రీస్తు మనుష్యుల పక్షముగా పనిచేయుచున్నాడు. తాను మహిమలోనికి తీసుకొని రాబోవు చున్న అనేకులగు కుమారుల పక్షముగా పనిచేయుచున్నాడు.

వారు దేవునితో నడచునప్పుడు తప్పిపోకుండునట్లు భద్రపరచుచున్నాడు.తన ప్రజలు దేవునితో సంబంధము కలిగియుండునట్లు క్రీస్తు పాపములకొరకు బలులను, అర్పణలను అర్పించెను.

పాపములను తీసివేయు ఆ గొప్ప కార్యమును జరిగించి, అజ్ఞానులును పాపులును అయిన తన ప్రజలకు సానుభూతి తాలిమి చూపగలుగునట్లు యాజక పరిచర్యగా విజ్ఞాపన చేయుచున్నాడు.

యాజకుని వ్యక్తిగత అనుభవము విషయము “తానుకూడ బల హీనతచేత ఆవరించబడియున్నందున ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో అలాగే తనకొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు” అని వ్రాయబడియున్నది.

ఇక్కడ క్రీస్తు యాజకత్వమునకు పాక్షిక సామ్యము, స్పష్టమైన వ్యత్యాసము చూపబడి నది. శరీరధారియైయున్న దినములలో ఆయన బలహీనుడుగా ఉండు పరిస్థితులు సంభవించెను.

అయినను, ఆయన బలహీనత అహరోను బలహీనతవంటిది కాక, పాపము లేనిది. అందువలన తన పాపముల కొరకు బలులు అర్పించెనని చెప్పబడలేదు.

భూసంబంధమైన యాజకుని నియామకము విషయము –  నేడు క్రైస్తవ లోకములో దేవుని పిలుపు లేకుండా అనేకులు తమకు తామే యాజకత్వమునకు నియమించుకొని కోరహు వలెనే నశించియున్నారని యూదా హెచ్చరించుచున్నాడు.

సంఖ్యా 16-3, 7,10, యూదా 11

ఇక్కడి భూసంబంధమైన యాజక పరిచర్య లక్షణములు చారిత్రక ముగా విఫలులైన ఇశ్రాయేలు ప్రజలనుబట్టిగాక, దేవుని ఆలోచననుబట్టి ఎట్లుండవలెనో చూడగలము.

ఇశ్రాయేలు చరిత్రలో ఇద్దరు దుర్మార్గులైన వ్యక్తులు ప్రధాన యాజకుని స్థానము వహించి తమ మెస్సీయాను సిలువవేయుటకు కుట్రచేయుటతో ఇక ఈ వ్యవస్థ అంతమొందినది.

(వచనములు 5, 6). 5వ వచనమునుండి క్రీస్తు ప్రధానయాజకుడని రచయిత చెప్పుచున్నాడు. యాజకుడుగా పిలువబడిన ఆయన వ్యక్తిత్వపు గొప్పతనము, యాజక పదవి నధిష్టించుటకు ఆయన పొందిన అనుభ వము, ఆ పరిచర్య స్థలమునకు దేవుడు నియమించుట రచయిత మనయెదుటికి తెచ్చియున్నాడు.

ఆయన వ్యక్తిత్వపు మహిమ: ప్రధాన యాజకత్వమునకు పిలువ బడిన క్రీస్తు మనుష్యుల పక్షముగా పనిచేయుటకు మనుష్యులలోనుండి యాజకుడుగా పిలువబడియున్నాడు.

అయితే, మానవునిగా శరీరముతో నున్న కాలములో ఆయన కుమారునిగా గుర్తించబడియున్నాడు. “నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను” అని చెప్పబడియున్నది. ఈ మహిమగల వ్యక్తి నిజముగా దేవుడు, నిజముగా మానవుడు. దైవ త్వము, మానవత్వము ఆయనయందు పరిపూర్ణముగా వ్యక్తపరచబడినవి.

ఈ యాజకత్వ క్రమముయొక్క లక్షణముల విషయము రచయిత ఎంతో చెప్పవలసి ఉన్నది. ఇక్కడ యాజకుని గొప్పతనము మాత్రమే కాదు, యాజకత్వముయొక్క హుందాతనమును సూచించుటకు కీర్తనలు 90:4 వచనమును ఉదహరించియున్నాడు.

కీర్తనలు 90-4

(వచనములు 7, 8). క్రీస్తు యాజకధర్మము నిర్వర్తించునట్లు ఆయన పొందిన అనుభవమును ఆ తరువాతి వచనములలో నేర్చుకొందము. పరలోకమందు యాజకధర్మము జరిగించుటకు ఆ మహిమగల వ్యక్తి అనగా, కుమారుడు ఎంత అవశ్యకమాయెనో గదా! అయితే అంతటితో సరిపోదు.

అరణ్యయాత్రయందు తన ప్రజలను పోషించి, సహాయపడ వలసియున్నయెడల ఆయన తానే మార్గమందు పొందవలసిన బాధ, దుఃఖము అనుభవించి ప్రవేశించవలెను.

అందువలననే అపొస్తలుడు వెంటనే “శరీరధారియైయున్న దినముల”ను మన దృష్టికి తెచ్చియున్నాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవమును పొందెను. మనము నడచు బాటలో ఆయన ముందుగా నడచెను.

మనము ఎదుర్కొనవలసి యున్న శోధనలను ముందుగా తానే ఎదుర్కొనెను. మనవలెనే బలహీన తలచేత ఆవరించబడియుండెను. రచయిత ప్రత్యేకముగా క్రీస్తు చివరి కాలపు శ్రమలను ప్రస్తావించెను.

లూకా 4

గెత్సేమనే వనములో మరణముయొక్క భయంక రత్వమును ఆయనకు తెలియజేసి విధేయతా పథమునుండి ఆయనను తప్పించవలెనని శత్రువు యత్నించెను.

ఈ భయంకర శోధనలో ప్రభువు పరిపూర్ణ మానవునిగా వ్యవహరించెను. ఆయన తన దైవికశక్తిని వినియో గించి సాతానును తరిమివేయుటగాని, తనకైతాను మరణమునుండి తప్పించుకొనుటగాని చేయలేదు. పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడిన మనిషిగా శోధననెదుర్కొని అపవాదిని జయించెను.

అయినను, ఆయన మానవ పరిపూర్ణత తన యెదుటనున్న భయంకర విషయములనుబట్టి భయపడి తన ఉద్దేశ్యములను మహారోదనతో, కన్నీటితో వ్యక్తపరచునట్లు చేసెను.

దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి ఆయన శోధనను ఎదుర్కొనెను. తనను మరణమునుండి రక్షింపగల దేవునియందు నమ్మికయుంచెను. ఈ భయంకర శోధనలన్నింటిలో దేవుడు ఆయన ప్రార్థన నాలకించు టకు కారణము ఆయన భక్తియే. ఆయనపై ఆధారపడి, నమ్మికయుంచుట వలన దేవుడు ప్రతి పరిస్థితిలో జోక్యము కలిగించుకొనెను.

ఆయన ప్రార్థనలు అంగీకరించబడినట్టే శారీరక బలహీనతలో ఆయన బలపరచ బడెను. ఆ విధముగా తననుతాను సమర్పించుకొని తండ్రిచేతినుండి పాత్రను అందుకొనగలిగెను.

ఆ విధముగా ఆయన సాతాను అధికారమును జయించెను. కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొనెను. మనకు చెడ్డమనస్సు ఉన్నందున విధేయత నేర్చు కొనవలసియున్నది.

ఆయన సమస్తముపై దేవుడుగా ఉండి, నిత్యత్వము నుండి సమస్తమును శాసించుచున్నాడు. అవిధేయత మూలముగా మన మీదికి కష్టములను కొనితెచ్చుకొని వాటిద్వారా మనము తరచు విధేయత నేర్చుకొందుము.

క్రీస్తు విషయమైతే – ఆయన దేవుని చిత్తమునకు విధేయుడైనందున శ్రమలు కలిగెను. వాటిద్వారా ఆయన విధేయత నేర్చుకొనెను. ఆయన అనుభవపూర్వకముగా విధేయతకు మూల్యమెంతో నేర్చుకొనెను.

శ్రమ ఎంత తీవ్రమైనదైనను, సంపూర్ణ విధేయతా పథము నుండి ఆయనను ఆ శ్రమ తప్పించలేకపోయెను. “ఆయన సమస్తమునకు లోబడెను. అన్ని విషయములలో లోబడెను. అన్ని విషయములలో దేవునిపై ఆధారపడెను” అని ఒక భక్తుడు చెప్పియున్నాడు.

అపొస్తలుడు సూచించిన శ్రమలు “ఆయన శరీరధారియైయున్న” దినములలోనివే. కాని ఆయన మరణ దినము కాదు. సిలువ దగ్గర ఆయన దేవుని ఉగ్రతను భరించుచు శ్రమను అనుభవించెను. అక్కడ ఆయన ఒంటరిగా ఉండవలసినదే.

ఆయన ప్రాయశ్చిత్తార్థమగు శ్రమలలో ఎవరును ప్రవేశింపలేరు, ఎవరును భరించలేరు. గెత్సేమనే తోటలో ఆయన శత్రువులవలన శ్రమననుభవించెను. అక్కడ ఆయనలో ఇరువురు ఉన్నారు.

మనకున్న కొద్ది పరిమాణముమేరకు అపవాదిచేత శోధింపబడి నప్పుడు శ్రమలను అనుభవించగలము. అప్పుడు మనకంటే ముందుగా శ్రమపడిన ఆయన సానుభూతి, సహాయము మనకుండును.

(వచనము 9). గెత్సేమనే తోటలోమాత్రమే దేవుడు ఆయన ప్రార్థన వినుట కాదుగాని, శ్రమననుభవించినందున పునరుత్థానమందుకూడా ఆయన ప్రార్థన వినెను. ఆ విధముగా ఆయన మహిమలో సంపూర్ణసిద్ధి పొందెను. ఆయన మహిమగల మనిషిగా తన స్థానము నాక్రమించు చున్నాడు. ఆయన స్వయముగా చెప్పినదేమనగా

లూకా 13-32

ఆయన వ్యక్తిగత పరిపూర్ణతకు ఏదీ కలుపనవసరము లేదు. శరీరధారియై యున్న దినములలో శ్రమలగుండా వెళ్ళి సిలువ కార్యమును ముగించి, తిరిగి లేచుటద్వారా మహిమపరచబడినందున మహిమకు అనేకులగు కుమారుల పక్షముగా ప్రధానయాజకుని పరిచర్య నిర్వర్తించుటకు ఆయన తగ్గియున్నాడు.

పరిపూర్ణ సిద్ధి పొందినందున దేవుడు ఆయనను మెల్కీ సెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా పిలిచెను. శరీరధారియై నప్పుడు మెల్కీసెదెకు యాజకత్వమును స్వీకరించవలసినదిగా పిలువబడి యున్నాడు.

(5 వచనము). పునరుత్థానుడై మహిమలో పరిపూర్ణ సిద్ధి పొందిన తరువాత మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని
పిలువబడెను. (10 వచనము).

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – పరిచయము

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక పరిచయము

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాస ముంచిన యూదుల నుద్దేశించి వ్రాయబడినది. ఇందలి విషయములను బట్టి స్పష్టమగునదేమనగా – విశ్వాసులను క్రైస్తవ సత్యమందు, తదను గుణమైన ఆశీర్వాదములు మరియు ఆధిక్యతలయందు స్థిరపరచుట.

ఆ విధముగా వారిని పుట్టుకతో సహజముగా సంక్రమించిన యూదా మత వ్యవస్థనుండి తప్పించుటయే ఈ పత్రిక ముఖ్యోద్దేశము.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్‌లో

Psalm23.infoKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPsalm91.infoSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveBible Study Act

ఈ పత్రికయొక్క ప్రాధాన్యతను గ్రహించవలెనంటే, యూదా శేషిత జనాంగము; వారికి సంబంధము కలిగి ఉన్న మత వ్యవస్థ లక్షణములను మనము అర్థము చేసికొనవలెను.

యూదా మతము అబ్రాహాము సంతానమునకు అనువంశికముగా ఇవ్వబడినది. ఇందులో క్రొత్త జన్మనుగూర్చిన ప్రస్తావనే లేదు. ఇది పూర్తిగా భూసంబంధమైనది. పరలోక విషయమై ఇది మౌనముగా ఉన్నది.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

మనిషి దేవునితోను, సాటి వ్యక్తులతోను ఎలాంటి సంబంధము కలిగి ఉండవలెనో ఈ యూదా మతము నిర్దేశించుచున్నది. ఈ మతానుసారులకు భౌతిక జీవము, తదనుగుణమైన ఆశీర్వాదములు సంక్రమించును.

ఈ మతమునందలి కేంద్రాకర్షణ – దృశ్యమానమైన దేవాలయము. ఇది మానవ నిర్మిత కట్టడములలోకెల్లా మనోజ్ఞమైనది. ఇందలి బలి పీఠములు పదార్థ నిర్మితములు. ఇందు ఒక ప్రత్యేక సమూహమైన యాజకులచే అర్పింపబడు భౌతిక బలులు, బాహ్యమైన ఆరాధన, దానివెంట విస్తారమైన కర్మకాండలు నిర్దేశింపబడినవి.

దేవుని మంచితనమునకు బదులుగా ప్రకృతి సంబంధియైన మనిషి యొక్క శరీరమందు ఏమైనా ఉన్నదా? అని ఋజువు చేయుటకు ఈ మతము ఉద్దేశపూర్వకముగా నిర్దేశింపబడినది.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం తెలుగులో

ఈ మతము మనిషి జీవితములోని ప్రతి విషయమునూ నియంత్రించును. భూసంబంధమైన వృద్ధి, సుఖ సౌఖ్యములు బాల్యమునుండి వృద్ధాప్యమువరకు సంక్రమించు విధము ఈ మతావలంబులకు సంక్రమించును.

ఫలితముగా ప్రకృతి సంబంధియై, తిరిగి జన్మించని వ్యక్తిలో దేవునికి బదులుగా ఏమీ లేదని స్పష్టమైనది. అందువలన దేవుడే స్వయముగా స్థాపించిన ఈ యూదా మత వ్యవస్థ కాలక్రమములో మనిషి చేతిలో భ్రష్టమైపోయినది. తుదకు ఈ వ్యవస్థలోని దుష్టత్వము వారి రక్షకుడైన మెస్సీయాను తిరస్కరించి, హత్యగావించుటతో పరాకాష్టకు చేరినది.

యూదులు ఆ విధముగా తమ దుర్మార్గతయను పాత్రను నింపుకొని, తీర్పుకు సిద్ధముగా ఉన్నారు. మానవుని చేతిలో దేవుని కుమారుడే హత్యగావింపబడునంతగా దిగజారిన వ్యవస్థను పరిశుద్ధుడైన దేవుడు దీర్ఘకాలము సహించుట తన నీతికి కళంకము తెచ్చుకొనుట, పాపమును విస్మరించుటయే యగును. అందువలననే తీర్పు విధించబడినది. తరు వాతి కాలములో యెరూషలేము పట్టణము నాశనము గావించబడి, ఆ యూదా జాతి చెదరగొట్టబడినది.

అయితే ధర్మశాస్త్ర ఉద్దేశ్యము మరియొక విధముగా ఉన్నది. దేవుని యెడల, సాటి మానవుల యెడల మనిషి బాధ్యతను చూపెట్టుట, అతని జీవితమును నియంత్రించుటమాత్రమే కాదు. ఈ వ్యవస్థ యావత్తు రాబోవుచున్న మేలులయొక్క ఛాయగా ఉన్నది.

ప్రత్యక్ష గుడారము పర లోకమందలి వస్తువుల నమూనా, దాని యాజకత్వము యేసుక్రీస్తుయొక్క యాజకత్వమును చూపెట్టుచున్నది. దాని బలులు క్రీస్తు చేయనైయున్న గొప్ప బలివైపు ఎదురుచూచుచున్నవి.

రాబోవుచున్నవాటన్నిటి ఛాయయగు క్రీస్తు వచ్చుటద్వారా యూదా వ్యవస్థలోని ఆ నమూనా, వస్తువులన్నిటికిని పూర్ణ నెరవేర్పు కలిగినది. అందువలన అది ప్రక్కన పెట్టబడినది. మొదటిది – మనిషి దానిని భ్రష్టము చేసెను; రెండవది – క్రీస్తు దానికి పరిపూర్ణ నెరవేర్పయియున్నాడు.

మనము మరియొక విషయము మనస్సులో ఉంచుకొనవలెను. యూదా మత వ్యవస్థ శరీర సంబంధియైన మనిషిని ఉద్దేశించి మాటలాడు చుండగా, దేవునితో బాహ్యరీతిగాను, లేక సంప్రదాయ సంబంధము కలిగిన అధిక సంఖ్యాకులు వెలుపలనే ఉండిపోవుచున్నారు. అయితే ఈ వ్యవస్థయందుకూడా కొందరు విశ్వాసముగలవారై దేవునితో సవ్యమైన సంబంధము కలిగియున్నారు.

క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయనను మెస్సీయాగా గుర్తించిరి. సంఖ్యాపరముగా వారు కొద్దిమందే అయినను ఈ పత్రికలో వారు గుర్తింపబడినవారై క్రైస్తవ్యము స్థాపింపబడక పూర్వమే వారు దేవునితో సంబంధము కలిగి ఉన్నట్టు చూడగలము.

అట్టి దైవభక్తిగల శేషమునుద్దేశించియే ఈ పత్రిక వ్రాయబడినది. ఎందుకనగా వారు భూసంబంధమైన యూదా మతమునుండి వేరై క్రైస్తవ్యమను నూతన మరియు పరలోక సంబంధములో స్థిరపరచబడ వలెనని దేవుని అభీష్టము.

ఈ విధముగా మనుష్యుల చెడుతనమునుబట్టియు, క్రీస్తు ఆగమనము ద్వారా యూదా మత వ్యవస్థను ప్రక్కన పెట్టుటవలనను క్రైస్తవ్యము ఈ లోకమున ప్రవేశించుటకు ద్వారము తెరువబడినది.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక గురించి వివరణ

దేవుడు పాతదానిని ప్రక్కన పెట్టినట్లయిన అంతకంటే శ్రేష్టమైనదానిని తెచ్చుటకే అట్లు చేయును గదా! పాత వ్యవస్థను ప్రక్కన పెట్టునప్పుడు ఆయన యూదులలోనుండి విశ్వసించు ఆ కొద్ది శేషమును సంపాదించుకొని, క్రైస్తవ పరిధిలోనికి వారిని తెచ్చెను. ఈ యూదా జనాంగమునకు వారి పితరుల మతముతో బలమైన సంబంధముండుట సహజము.

భవబంధములు, దేశభక్తి, భౌతిక ఆశీర్వాదములు, విద్య, శిక్షణ మొదలగువాటినిగూర్చిన అతిశయము, అన్నీ కలసి దేవుడు ప్రక్కకు నెట్టిన ఆ వ్యవస్థ వారిని అంటిపెట్టుకొని ఉండు నట్లు చేసెను.

అందువలన పరలోక సంబంధమైన క్రైస్తవ్యంలోనికి ప్రవే శించుట వారికెంతో దుర్లభమనిపించినది. పైగా, దేవాలయం అట్లే నిలచి యుండగా మరియు అహరోను వంశమువారైన యాజకులు దృశ్యమాన మగు బలులింకను అర్పించుచుండగా, క్రైస్తవ్యమును స్వీకరించినవారు తిరిగి యూదా మతమునకు వెనుతిరిగెడి ప్రమాదము ఎల్లప్పుడు ఉన్నది.

ఇట్టి ప్రమాదమును ఎదుర్కొని, మన ఆత్మలను క్రైస్తవ్యములో స్థిర పరచుటకు ఆత్మ దేవుడు ఈ పత్రికలో మనయెదుట ఉంచిన విషయ ములను కొన్నింటిని గమనింతము :

మొదటిది – క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు, పరలోకములో ఆయన స్థానము. (1, 2 అధ్యాయములు).

రెండవది – పరలోకమునకు ప్రయాణమైయున్న తన ప్రజలను నడిపించు క్రీస్తు యాజకత్వము. (3-8 అధ్యాయములు).

మూడవది – క్రీస్తు బలి విశ్వాసికి పరలోకమును తెరచుట, విశ్వాసిని పరలోకమునకు తగినవాడుగా చేయుట. (9, 10 అధ్యాయములు).

నాలుగవది – ప్రస్తుతము క్రీస్తుయేసు ఉన్న పరలోకమునకు ప్రవేశము. (10వ అధ్యాయము).

అయిదవది – పరలోకమందున్న క్రీస్తునొద్దకు తీసుకొనివెళ్లు విశ్వాస ద్వారము. (11వ అధ్యాయము).

ఆరవది – పరలోకమందున్న క్రీస్తునొద్దకు పోవు మార్గములో దేవుడు మన పాదములను భద్రపరచు వివిధ మార్గములు. (12వ అధ్యాయము).

ఏడవది – భూమిమీద క్రీస్తుతోకూడ గవిని వెలుపల శ్రమపడు ఆశీర్వాదకరమైన అనుభవము. (13వ అధ్యాయము).

ఈ విధముగా హెబ్రీ పత్రికలో పరలోకము ఎల్లప్పుడు మన యెదుట ఉంచబడుట చూడగలము. ఇది తెరువబడిన పరలోకపు పత్రిక. మాన వుని పురోభివృద్ధికై క్రైస్తవ్యమును లోక వ్యవస్థకు దిగజార్చిన ఈ రోజులలో క్రైస్తవ్యముయొక్క పరలోక లక్షణములను వెల్లడించు ఈ పత్రిక ఎంతో ప్రత్యేకమైనది.

బైబిల్‌లో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ప్రాముఖ్యత

మరియు దేవుని ఆత్మ ఈ గొప్ప పరలోకపు సత్యములను మన ఆత్మలయెదుటికి తెచ్చునప్పుడు, ముందు వచ్చినవాటికంటే ఇవి ఎంత ఉన్నతమైనవో, ఏ విధముగా ముందున్నవాటిని ప్రక్కన పెట్టినవో చూడ గలము. సృష్టించబడినవి ఏవైనను, అనగా ప్రవక్తలైనను, దేవదూతలైనను క్రీస్తు మహిమయెదుట వెలవెలబోవును.

క్రీస్తు యాజకత్వము అహరోను యాజకత్వమును ప్రక్కనబెట్టినది. క్రీస్తు బలి ధర్మశాస్త్రము క్రింద ఉన్న బలులన్నిటినీ ప్రక్కనబెట్టినది. దేవునియొద్దకు తక్షణ ప్రవేశము దేవాలయ మును, అందలి తెరను ప్రక్కనబెట్టినది.

విశ్వాస పథము దృశ్యమాన మగు వ్యవస్థ అంతటిని ప్రక్కనబెట్టినది. అట్లే గవిని వెలుపలి స్థలము “శిబిరము”ను, తత్సంబంధమైన భూలోక మతమును ప్రక్కనబెట్టినది.

ఈ పత్రికలో గమనించగల మరియొక ముఖ్య విషయమేమనగా – ఇందు సంఘమును గూర్చిన ప్రస్తావన లేదు. అది ఒకే ఒక పర్యాయము ప్రస్తావించబడినది. అదికూడా మనము కొన్ని విషయములయొద్దకు వచ్చితిమని చెప్పు సందర్భములో వాటిలో ఒకటిగా ప్రస్తావించబడినది.

కీర్తన 22

క్రీస్తు మహిమ, ఆయన యాజకత్వము, ఆయన బలి, దేవుని సముఖమునకు చేరుట, విశ్వాసపథము, పరలోక ప్రయాణము, మనము చేరుకున్న సమస్తము విశ్వాసముద్వారా మాత్రమేనని చూడ
గలము మరియు తెలిసికొనగలము.

క్రైస్తవ్యముయొక్క ఫలము, దానికి సంబంధించిన ఫలితము రక్షింప బడని వ్యక్తులలోకూడా కనిపించ వచ్చును. అయితే క్రైస్తవ్యమునకు చెందిన గుణములన్నియు కంటికి కనిపించునవి కావు. అదే యూదా మతములో నైతే సమస్తమును కంటికి కనిపించును, తాకి చూడవచ్చును. అయితే పరసంబంధమైనవి, విశ్వాస సంబంధమైనవి, దేవుని ఎదుట ఉండెడివి.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ముఖ్య వచనాలు

అవన్నియు నిశ్చలమైనవి. వాటియొద్దకు మనము వచ్చియున్నాము. మన చుట్టూ ఉన్నవన్నియు గతించిపోవునవి, మార్పుచెందునవి, కదలి పోవునవి. క్రైస్తవ్యములో మార్పు చెందని, గతించని, ఎన్నడూ కదలని వాటి యొద్దకు మనము కొనిరాబడియున్నాము. క్రీస్తు మార్పులేనివాడు, ఆయన నిరంతరము ఏకరీతిగానున్నాడు. ఆయన నిత్య విమోచన స్థిర మైనది, ఎన్నడూ చలించనిది.

ఈ పత్రిక మనకు ముఖ్యముగా, ఆచరణాత్మకముగా నేర్పించునదే మనగా – భూసంబంధమైన మతమునుండి మనలను వేరుపడమని. అది యూదా మతమైనా కావచ్చు, యూదా మత నమూనాలో స్థాపించిన భ్రష్ట క్రైస్తవ్యము కావచ్చు.

ఏదైనను దానినుండి వేరుపడవలసినదే. అంతేకాదు, ఈ లోకములో మనము గవిని వెలుపల ఉన్నచో పరలోకము నందు తెరలోపల స్థలము లభించును. కావున ఈ లోకయాత్రలో మనము పరదేశులము, యాత్రికులముగా నుందము.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు

క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు (అధ్యాయములు 1, 2)

ఈ పత్రికయొక్క రచయిత ఎవరో వ్రాయబడలేదు. అందువలన ఎవరు వ్రాసినది మనకు అంత ప్రాముఖ్యము కాదు అని గ్రహించవలెను.

2 పేతురు 31-5,16

రచయిత పేరు లేకపోవుటకు కారణము పత్రికలోని ప్రత్యేక లక్షణ ములు కావచ్చును. దేవుడు మనుష్యులద్వారా ఇక ఎంతమాత్రము మాట లాడుటలేదు. క్రీస్తుయేసు అను వ్యక్తిద్వారా నేరుగా కృపతో మాటలాడు చున్నాడని తెలియజేయుట ఈ పత్రిక ముఖ్యోద్దేశము.

అంతేకాక దేవుడు మనుష్యులతో ఏ అపొస్తలులద్వారా మాటలాడి నాడో ఆ అపొస్తలుడు క్రీస్తేయని ఈ పత్రిక తెలుపుచున్నది. అందువలన కొంత తక్కువ హోదాలో అనేకమంది అపొస్తలులుగా పిలువబడినను క్రీస్తు వారినందరినీ అధిగమించుచున్నాడు.

ఈ పత్రికయొక్క పరమావధి విశ్వాసులను క్రైస్తవ్యపు పారలౌకిక లక్షణములందు స్థిరపరచి, బాహ్యమైన భూసంబంధమైన మతాచారముల నుండి విడుదలచేయుట.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

క్రైస్తవ్యములోని సమస్తము – అనగా దానిద్వారా దేవునికి కలుగు మహిమ, విశ్వాసికి సంక్రమించు ఆశీర్వాదములు మున్నగునవి క్రీస్తు వ్యక్తిత్వము, ఆయన పనిమీదనే ఆధారపడియుండును.

అందువలననే ఈ పత్రిక క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలతో ప్రారంభమగు చున్నది. మొదటి అధ్యాయములో కుమారునిగా క్రీస్తుయొక్క మహిమ; రెండవ అధ్యాయము 1-4 లో ఆయన వాక్యాధికారములు; 2:5 – 18 లో ఆయన మానవత్వపు మహిమ వెల్లడియగుచున్నది.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం

కుమారునికి మహిమ (అధ్యాయములు -1)

పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా దేవుడు మన పితరులతో మాటలాడి యున్నాడు. (1:1-3). మనుష్యులపైన తనకున్న అధికారమును తెలుపుచు దేవుడు మోషేతో ధర్మశాస్త్రమందు మాటలాడెను.

ఇతర సమయములలో దేవుడు తన అనుగ్రహముచొప్పున దేవదూతలద్వారా తన ప్రజలతో మాటలాడెను. తరువాత తిరుగుబాటు చేయు ప్రజలను తనయొద్దకు రమ్మని ప్రవక్తలద్వారా మాటలాడెను. కుమారునికి ముందు ప్రవక్తలు వచ్చినట్లు ప్రత్యేకముగా ప్రస్తావించబడినది.

“దినముల అంతమందు” అనగా ప్రవక్తల కాలము ముగింపులో కుమారుడు వచ్చెను. పూర్వకాలమందు దేవుడు మనిషికి ఇచ్చిన సాక్ష్య మును క్రీస్తుయేసునందు కొనసాగించెను. కుమారుడు వచ్చినప్పుడు మాట్లాడినది దేవుడే.

ప్రవక్తలు దేవుని ఆత్మచేత నడిపింపబడి ఆయన సాధనములుగా పలికిరి. కుమారునియందు దేవుడు మానవునికి సమీపముగా వచ్చెను. ఇప్పుడు ప్రవక్త లేదా యాజకుని ప్రమేయము లేకుండానే మానవులు దేవుని సమీపింప వీలగుచున్నది.

ఏదేని ఒకదానియొక్క ప్రాధాన్యత దానినిగూర్చి మాటలాడు మనిషి యొక్క మహిమ మరియు అతని వ్యక్తిత్వములపై ఆధారపడి ఉండును. నిత్యకుమారుడగు యేసుక్రీస్తుయొక్క మహిమగల నామములో దేవుడు మనతో మాటలాడియున్నాడు.

మాట్లాడిన వ్యక్తి గొప్పతనము, మాట్లాడిన సందేశముయొక్క ప్రాధాన్యత మనము గ్రహించగలుగునట్లు ఆత్మ దేవుడు మనయెదుట ఆ కుమారునియొక్క ఏడు విధములైన మహిమను ఉంచు చున్నాడు.

ఒకటి : కుమారుడు సమస్తమునకు వారసునిగా నియమింపబడి యున్నాడు. కుమారత్వము, వారసత్వము అనునవి లేఖనములలో ఒకదానికొకటి సంబంధము కలిగియున్నవి.

మనుష్యులు భూమిని స్వాధీనము చేసుకొని, సముద్రమును పాలించి, వాయువును కూడ జయించ ప్రయత్నించుచున్నారు. వారు అధికారము, ఆస్తిపాస్తులు, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, ఆశీర్వాదములను చేజిక్కించు కొనుటకు ప్రయాసపడుచున్నారు.

కుమారునిగా క్రీస్తు వీటన్నిటిని వార సత్వముగా పొందియున్నాడు. ఎందుకనగా ఆయన సమస్తమునకు వారసునిగా నియమింపబడియున్నాడు. సమస్తమునకు యోగ్యుడుకూడా ఆయనే. మనిషి వీటన్నిటిని వారసత్వముగా పొందుటకు ఎంత మాత్ర మును తగినవాడు కాదని ప్రపంచ సుదీర్ఘ చరిత్ర రుజువుపరచుచున్నది.

ఇవన్నియు ఏ పరిణామములో మనిషి అందుబాటులోనికి వచ్చినను, అతడు వాటిని దుర్వినియోగపరచి, తనను హెచ్చించుకొని దేవునిని వెలుపల ఉంచుచున్నాడు.

తన సంకల్పమును వెల్లడించుటకు అధికార మును, దేవుడు లేకుండా సంతోషముగా ఉండుటకు ఆస్తిపాస్తులను, దేవుని ఆయన సృష్టినుండి దూరము చేయుటకు జ్ఞానమును, దేవుడు లేకుండా స్వతంత్రముగా వ్యవహరించుటకు బలమును, తనను తాను హెచ్చించుకొనుటకు ఘనతను, తనను తాను చూపెట్టుకొనుటకు మహి మను, స్వార్థ ప్రయోజనముకొరకు ఆశీర్వాదమును మనిషి వినియో గించుకొనుచున్నాడు.

క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

సమస్తమునకు వారసునిగా నియమించబడిన వానిని ఈ మనిషి పూర్తిగా తృణీకరించి, ఆయనను మేకులతో సిలువకు కొట్టియున్నాడు.

అయినను క్రీస్తు తన స్వాస్థ్యమైన సమస్తమందు ప్రవే శించునప్పుడు పరలోక వాణి ఈలాగు ఆనందముతో ప్రకటించును “వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు స్తోత్రము పొందనర్హుడు”.

ఆయన సమస్తమును తండ్రియైన దేవుని మహిమార్ధము మానవుని ఆశీర్వాదముకొరకు విని యోగించును. క్రైస్తవ్యములో మనము సమస్తమునకు వారసుడైనవానితో సమైక్యపరచబడియున్నాము. యూదా విశ్వాసులవలెనే శ్రమపెట్టబడి, దోచుకొనబడినవారికి ఇది ఎంత ఆదరణ కలిగించునో కదా!

రెండు : కుమారునిద్వారానే సర్వ ప్రపంచము నిర్మించబడినది. “ఆయన ప్రపంచములను నిర్మించెను”. కేవలము ఈ ప్రపంచము మాత్రమే కాదు. ఈ అనంత విశ్వములోని విశాల వ్యవస్థనంతటినీ ఆయనే నిర్మించెను.

ఆయన సమస్తమునకు వారసునిగా నియమింపబడి నందున, ఆయనకొరకు మనము ఎదురుచూచుచున్నాము. సమస్తమును, అనగా చిన్నవైనను, పెద్దవైనను అన్నింటినీ సృష్టించినది ఆయనే. కుమారునియొక్క ముద్ర సృష్టియావత్తుపైనను ఉన్నది.

మూడు : కుమారుడు దేవుని మహిమను ప్రకాశింపజేయు ఆయన తేజస్సు. కుమారుడు శరీరమును ధరించుటద్వారా దేవుని మహిమను పూర్ణముగా వ్యక్తపరచుచున్నాడు. దేవుని లక్షణములన్నిటిని ఈ మహిమ వెల్లడించుచున్నది. దేవుని లక్షణములన్నియు మనయెదుట తేటగా ప్రదర్శితమగునట్లు కుమారుడు మనకు సమీపముగా ఉన్నాడు.

నాలుగు : కుమారుడు “దేవుని తత్వముయొక్క మూర్తిమంతమునై యున్నాడు”. ఇది దేవుని గుణములను ప్రకాశించుటకంటే మించినది. ఇది దేవునినే వెల్లడించుచున్నది. ఆయన మూర్తిమత్వమును చూపెట్టుట అనగా ‘కుమారుడు మానవుడగుటద్వారా అదృశ్యముగానున్నవానియొక్క దృశ్యమానమగు ప్రతినిధిగా మన ఎదుట నిలుచుట’ అని అర్ధము.

ఒక వ్యక్తి ప్రతినిధి కాకుండగనే, ఆ వ్యక్తి గుణములను ధరించుట సాధ్యమే. అయితే కుమారునిలో దేవుని గుణ లక్షణములు ప్రవేశించుట మాత్రమే కాదు, సృష్టిలో ఆయన దేవుని ప్రతినిధి. ఆయన పనులన్నియు దేవుడు మనతో ఉన్నాడని వెల్లడించినవి.

ఐదు : కుమారుడు తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నాడు. సృష్టికి ప్రథమ కారణమున్నదని ప్రజలు అంగీక రించినను, ప్రస్తుత చరాచర సృష్టినుండి దేవుని మూసివేయుచున్నారు. “సృష్టి అనునది ఒక పరిపూర్ణ యంత్రము, దాని నిర్మాత ప్రమేయము లేకుండానే అది అనంతకాలము మనగలదు” అని ఒకడు చెప్పిన మాట ప్రజలు నమ్ముచున్నారు.

అసలు సత్యమేమనగా ఈ చరాచర జగత్తును కుమారుడు ఉనికిలోనికి తెచ్చుట మాత్రమే కాదు, దానిని నిర్వహించు వాడు ఆయనే. ఆయన లేకుండా ఒక్క నక్షత్రముకూడా తన గతిలో పయనించలేదు. ఒక్క పిచ్చుక నేల వ్రాలదు!

ఆరు : కుమారుడు పాపములకు శుద్దీకరణము చేసెను. ఆయన ప్రపంచమునకు సృష్టికర్తమాత్రమే కాదు. పతనమైన జగత్తును విమోచించు వాడు ఆయనే. ఆయన “తానే” పాపములకు ప్రాయశ్చిత్తము చేసినందున మన పాపములు క్షమింపబడి, అవి దేవుని యెదుటనుండి తొలగింప బడుచున్నవి.

ఏడు : కుమారుడు ఇప్పుడు ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండుటద్వారా ఆయన వ్యక్తిత్వపు మహిమ మరింత తేటగా వెల్లడియగుచున్నది.

ఈ పత్రికలో మొత్తముమీద నాలుగు పర్యాయములు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండినట్లు చెప్ప బడియున్నది. ఇక్కడ దీని కారణము ఆయన వ్యక్తిత్వపు మహిమయే.

ఎనిమిదవ అధ్యాయములో మహా ప్రధాన యాజకుడిగా ప్రస్తుతము ఆయన జరిగించు పని మూలముగా ఆయన అట్లు కూర్చుండెనని వివరింపబడినది. తొమ్మిదవ అధ్యాయములో సిలువపైన ఆయన ముగించిన కార్యముయొక్క ఫలితమే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని యున్న ఆయన ప్రస్తుత స్థితి అని వివరించబడినది. పన్నెండవ అధ్యాయ ములో విశ్వాస పథము చివరకు చేరిన సందర్భము చెప్పబడియున్నది.

కాలమంతటియందు ఉండిన కుమారునియొక్క మహిమలను నొక్కి చెప్పి, ప్రస్తుతము దేవుని కుడిపార్శ్వమున ఆయన స్థానమును వివరించి, అటుపైన దైవాత్మ మనయెదుట క్రీస్తు శరీరధారిగా నున్నప్పుడు ఆయన వారసత్వముగా పొందిన అంతులేని మహిమాన్విత నామమును ప్రదర్శించు చున్నాడు.

వాక్యములో నామమనునది ఒక వ్యక్తిని ఇతరులకంటే వేరుగా ప్రత్యేకముగా అతని కీర్తిని తెలుపును. సృష్టమైన ఏ వస్తువు లేక ఏ జీవి నామముకంటే క్రీస్తునకు అత్యున్నతమైన నామమున్నదని చూపుటకు పాత నిబంధననుండి ఏడు వాక్య భాగములు ఎత్తి వ్రాయబడినవి.

(వచనములు 4, 5). క్రీస్తుకు దేవదూతలకంటే హెచ్చగు నామము మరియు స్థానము కలదు. క్రీస్తు లోకములోనికి వచ్చుటద్వారా సృష్టింప బడిన జీవులన్నిటికంటే అత్యున్నత స్థానమును గైకొనినట్లు ఋజువు పరచుటకు కీర్తన 2 ఉదహరింపబడియున్నది. దేవదూతల స్థానము ఎంత శ్రేష్టమైనదైనను, వారుకూడ సేవకులుమాత్రమే. కాని, క్రీస్తు కుమారుడు. ఎందుకనగా “నీవు నా కుమారుడవు.

నేను నేడు నిన్ను కనియున్నాను” అని దేవదూతలతో దేవుడు ఎప్పుడూ చెప్పియుండలేదు. నిత్యత్వమునుండి క్రీస్తు కుమారుడని లేఖనము స్పష్టముగా చెప్పుచున్నది.

అయితే ఆయన కాలపరిమితికి లోనై జన్మించినప్పుడు కుమారునిగా ఆయన ఆహ్వానింపబడెను. “ఆయన ఎప్పటికిని కుమారుడైయుండెను. ఎన్నటెన్నటికీ కుమారునిగానే ఉండును. ఆయన మానవునిగా ఇక్కడ కుమారుడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ

నిత్యత్వమంతటిలోకూడా ఆయన కుమారునికంటే ఏమియు తక్కువవాడు కాదు” అని ఒకరు చెప్పినది ముమ్మాటికీ నిజము. నిత్యుడగు కుమారునికి, కాలమందు జన్మించిన కుమారునికి పరిస్థితులలో మినహా మరి దేనిలోనూ తేడా ఏమియు లేదు.

2 సమూయేలు 8-14

(వచనము 6). క్రీస్తు లోకములోనికి వచ్చినప్పుడు ఆయన గైకొనిన స్థానము దేవదూతలకంటే ఎంతో హెచ్చయినదని చూపుటకు మరియొక లేఖనభాగముకూడా ఉదహరించబడినది.

కీర్తన 97-7

పరలోకమందుమాత్రమే ఆయన పూజార్హుడు కాదు; గతమందు దీనుడై వచ్చినను, భవిష్యత్తులో వెయ్యేండ్ల పాలన మహిమతో వచ్చునప్పుడును దేవదూతల సమూహముల ఆరాధనలు అందుకొనువాడు ఆయనే. ఈ గౌరవమంతయు ఆయన మహిమను చెప్పకయే చెప్పుచున్నది. ఆయన దైవికమగు వ్యక్తి కానియెడల ఈ ఆరాధన అంతయు అయోగ్యమగును.

(వచనములు 7, 8). ఆయన లోకములోనికి వచ్చినప్పుడు అధిష్టించిన సింహాసనము అన్ని సింహాసనములకంటే హెచ్చయినది. దేవదూతలు సృష్టించబడిన ఆత్మలు. కుమారుడైతే సృజింపబడినవాడు కాదు. ఆయన దేవునిగా సంబోధించబడెను, భూలోక రాజుల సింహాసన ములతో పోల్చగా ఆయన సింహాసనము ఎన్నటెన్నటికిని నిలుచునది.

ఈ లేఖన భాగము 45వ కీర్తన నుండి ఉదహరించబడినది. అది ఒక “రాజునుగూర్చి” తెలుపుచున్నది. ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలించనై యున్న ఈ రాజు మరెవ్వరో కాదు, దైవిక వ్యక్తియైన కుమారుడే. మనుష్యుల సింహాసనములు ఉనికిలోకి వచ్చి ఒకనాడు అంతమొందును. ఎందుకనగా అవి నీతిపునాది గలవి కావు. కుమారుని సింహాసనమైతే నిరంతరము నిలుచును. కారణము ఆయన పాలన న్యాయార్థమైనది.

(వచనము 9). ఆయన కృపతో ఇతరులను సహచరులుగా ఏర్పరచుకొనినను, 45వ కీర్తన తన తోటి వారికంటే హెచ్చగు స్థానము ఆయనకున్నట్టు తెలియజేయుచున్నది. ఆయనను దేవునిగా సంబోధించి నను భూమిమీద పరిపూర్ణ మానవునిగా ఆయన అగుపడెను.

అందువలననే ‘నీ దేవుడు నిన్ను అభిషేకించెను’ అని చెప్పబడినది. ఆయన నైతిక పరి పూర్ణత, నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట, కృప తాను సమైక్య పరచుకొనిన తోటివారందరికంటే ఆయనను హెచ్చగునట్లు చేసెను.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ

(వచనములు 10, 11). సృష్టికర్తగా సంబోధింపబడిన ఈ మహిమగల వ్యక్తి యెదుట నిలువలేక సృష్టి యావత్తు ప్రక్కకు తొలగినది. వేదనతో, కన్నీళ్ళతో నిండిన వ్యక్తిగా తగ్గించుకొన్నవాడు ఎవరో కాదు, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ప్రభువే అని ఋజువు చేయుటకు కీర్తన 102 ఉదహరించబడినది. సృష్టియావత్తు పాతగిలి, నశించుపోవును గాని ఆయన నిరంతరము నిలుచును.

(వచనము 12). కాల ప్రవాహములో మార్పులు వచ్చును, చివరకు అంతము వచ్చును. కాని ఈ మహిమగల వ్యక్తి ఏకరీతిగానే ఉండును. ఆయన సంవత్సరములు తరగవు అని కీర్తన 102 తెలియ జేయుచున్నది.

(వచనము 13). ఏ శత్రువు ఆయన యెదుట నిలువలేడు. శత్రువులందరూ ఆయన పాదపీఠముగా చేయబడుదురని తెలియజేయు టకు కీర్తన 110 ఉదహరించబడినది. ఆయన శరీరముతోనున్న దినములలో శత్రువులాయనను సిలువకు మేకులతో కొట్టిరి. ఆయన మహిమతో వచ్చు దినమున వారాయన పాదపీఠముగా చేయబడుదురు.

(వచనము 14). క్రీస్తు మానవుడిగా తన స్థానము గైకొనినను, కీర్తన 110 ప్రకారము ఆయన దేవదూతలందరికంటే హెచ్చయినవాడు. ఆయన పరిపాలించునట్లు సింహాసనముపై కూర్చుండబెట్టబడియున్నాడు.

దేవదూతలైతే రక్షణయను స్వాస్థ్యమును పొందబోవువారికి సేవ చేయు ఆత్మలుగా పరిచర్య చేయుటకు పంపబడియున్నారు. ఆ విధముగా కుమారుడు శరీరమును ధరించినను, ఆయన మహిమ అతిజాగ్రత్తగా భద్రపరచబడినది.

మహిమలన్నిటిలోకెల్లా ఆయన నామము ఎంత శ్రేష్ఠమో చూడగలము. ఆయన ఖ్యాతి దేవదూతలను మించినది. ఆయన సింహాసనము అన్ని సింహాసనములకంటే ఉన్నతమైనది. సృష్టి నశించిన నశించవచ్చును, ఆయన నిరంతరముండును.

కాలము స్తంభిం చిన స్తంభించవచ్చును, ఆయన సంవత్సరములు తరగవు. ఆయన శత్రు వులు ఆయనకు పాదపీఠములుగా చేయబడిరి. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి నడిపించుచున్నాడు. ఇతరులు సేవచేయుచున్నారు. ఆయన లోకములోనికి వచ్చినయెడల సృష్టియావత్తూ ఆయనకు దాసోహ మనవలసినదే!

కుమారుని వాక్యాధికారము (2:1-4)

లోకములోనికి వచ్చునప్పుడు కుమారునియొక్క ఖ్యాతిని గూర్చి మొదటి అధ్యాయము తెలియపరచినది. వక్తయొక్క అధిక మహిమనుబట్టి వినువారు అతి జాగ్రత్తగా అతడు చెప్పినది వినవలెను.

వినినామని చెప్పుకొనుచు, ఆ మీదట ప్రభువు ప్రకటించిన గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి, తిరిగి యూదా మతములోనికి మళ్ళుట ప్రమాదకరము.

ఈ ఉరిలో తగులుకొన్నవారు కేవలము విన్నవాటిని విడిచిపెట్టుటమాత్రమే కాదు, వినినట్లు నటించి క్రైస్తవ్యమును వదలి తిరిగి యూదా మతములోనికి వెళ్ళిపోవు గొప్ప ప్రమాదములో చిక్కుకొందురు. ఇదే భ్రష్టత్వము.

ఈ పత్రిక అంతటిలో రచయిత క్రైస్తవ్యమును అంగీకరించిన యూదు లను సంబోధించుచున్నాడని మనము గుర్తుంచుకొనవలెను. వారిలో తానుకూడా ఒకడు. మొదటి అధ్యాయములో దేవుడు “మనతో మాట లాడినట్లు” చెప్పియున్నాడు. ఈ అధ్యాయములో “మనము శ్రద్ధగా విన వలెను” అని చెప్పుచున్నాడు.

ఈ పత్రికలో సంఘ ప్రస్తావన లేదు, విశ్వాసులు వ్యక్తిగతముగా సంబోధించబడియున్నారని కొందరి అభిప్రా యము. వారు అంగీకరించినది యథార్థమే అని గ్రహించవచ్చును. లేని యెడల వారు క్రీస్తునుండి వెనుదిరిగిపోవుదురు. అది కేవలం బాహ్యమైన ఆచారమని ఋజువగుచున్నది.

దేవదూతలద్వారా అనుగ్రహింపబడిన వాక్యమును స్థిరపరచినందున ప్రతి అతిక్రమమునకు, అవిధేయతకు న్యాయమైన శిక్ష విధించుటద్వారా దేవుడు “పలుకబడిన వాక్యము”నకు అధికారము ఇచ్చెను.

అలాగైతే కుమారునిద్వారా పలుకబడిన వాక్యమునకు దేవుడు మరెంత అధికారము ఇచ్చునో కదా! దేవదూతలు పాపముచేసి అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము నకు అవిధేయులై దాని పర్యవసానమునుండి తప్పించుకొనలేక పోయిన యెడల, నామకార్థముగా క్రైస్తవ్యమును అంగీకరించి, క్రీస్తు వాక్యమును నిర్లక్ష్యముచేసి, యూదా మతమునకు మరలిపోయినవారు తప్పించు కొనుట మరింత అసాధ్యముకదా?

ఈ పత్రికలో రచయిత వివరించు రక్షణ ఇప్పుడు మనము ప్రకటించు కృపా సువార్త కాదు. లేదా పాపి సువార్తపట్ల చూపు విముఖతనుకూడా ఇది వివరించుట లేదు. దీనిని వ్యక్తిగతంగా అన్వయించుకొనవలెను. సువార్తను నిర్లక్ష్యము చేయువారు దండన తప్పించుకొనజాలరు.

ఇక్కడ ప్రభువు ప్రకటించిన సువార్త యూదులకొరకు. వారు విశ్వసించినయెడల జాతిపైకి రాబోవు తీర్పును విశ్వసించు శేషము తప్పించుకొందురు.

ఈ సువార్తను తరువాత పేతురు, ఇతర అపొస్తలులును బోధించిరి. అపొస్త లుల కార్యములు ప్రారంభ అధ్యాయములలో మూర్ఖులైన వక్రజనము నుండి వేరై రక్షణ పొందుమని వారు ప్రకటించిరి.

బైబిల్‌లో క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు వివరణ

ఈ రక్షణ సాక్ష్యమును దేవుడు “సూచక క్రియలచేతను, మహత్కార్యములతోను, నానావిధములైన అద్భుతములతోను” ధృవపరచెను. సంఘము సంపూర్తియైన తరువాత ఈ రాజ్య సువార్త మరల ప్రకటించబడును.

ధర్మశాస్త్రమును అతిక్రమించుట భయంకరము, కృపావాక్యమునుండి ప్రక్కకు తొలగుట అంతకంటే చెడ్డది. దేవుని వాక్యమును వినినట్లు విని, ఆ మీదట దానిని నిర్లక్ష్యము చేసి, విడిచిపెట్టి, యూదా మతమునకు గాని మరే మతమునకుగాని మళ్ళుట అతి భయంకరము. ఇదే భ్రష్టత్వము. భ్రష్టుడైన వ్యక్తికి లేఖనములలో నిరీక్షణే లేదు.

మనుష్య కుమారుని మహిమ (2:5 -18)

కుమారుని వాక్య అధికారమును వివరించి, ఆయన వాక్యమును నిర్లక్ష్యము చేసినయెడల కలుగు ప్రమాదమునుగురించి హెచ్చరించి, రచయిత యింకను క్రీస్తు మహిమలను వెల్లడించుచున్నాడు.

నిత్యత్వము నుండి దేవుని కుమారునిగా, శరీరధారియైనప్పుడు ఆయన మహిమలను దేవుడు మన యెదుట ఉంచియున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుని మహిమలను మనము చూడవలెను.

(వచనము 5). యేసుక్రీస్తు మహిమ ప్రభావములు ధరించినట్లు ఇప్పుడు మనము విశ్వాస నేత్రముతో చూడగలిగినను, రాబోవు లోకములో మనుష్య కుమారునిగా ఆయన మహిమ వెల్లడికాబోవుచున్నది.

అవి, ఒకటి – జలప్రళయమునకు ముందున్న లోకము. దీనినే పేతురు “అప్పుడున్న లోకము” అని వ్రాసెను. రెండవది – ప్రస్తుత లోకము “ఇప్పుడున్న ఆకాశమును, భూమియు” (2 పేతురు 3:7); మూడవదిగా – ప్రస్తుత వాక్యభాగములో చెప్పబడిన “రాబోవు లోకము”.

2 పేతురు 3-7

“రాబోవు లోకము” అనగా భూమిమీద వెయ్యేండ్ల పాలన కాలము. ఇది ఇంతకుముందెన్నడును లేని ఆశీర్వాద క్రమమును ఆవిష్కరించు చున్నది. ఈ ఆశీర్వాదకరమగు నూతన ప్రపంచము మనుష్యకుమారునికి లోబడి ఉండును గనుక ఆయన మహిమ వెల్లడింపుకు కారణమగును.

ఒక విధముగా చూచినయెడల ప్రస్తుత లోకమును దేవుడు దేవదూతల అధికారము క్రింద ఉంచియున్నాడు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారిని భద్రపరచుచు, దేవుని ప్రభుత్వమును జరిగించు పని దేవదూతలకు అప్పగించబడినది. రాబోవు లోకములో దేవదూతలు మనుష్య కుమారునికి అధికారమును అప్పగించుదురు.

(వచనములు 6-9). క్రీస్తుయొక్క ఈ మహా మహిమను వెల్లడించు టకు రచయిత ఇక్కడ 8వ కీర్తనను ఉదహరించియున్నాడు. “నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” అని దావీదు ప్రశ్న లేవనెత్తియున్నాడు. ఈ ప్రశ్న మానవుని అల్పత్వమును సూచించు చున్నది.

బైబిల్‌లో క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు వివరణ

మనుష్య కుమారుడగు క్రీస్తు గొప్పతనమే దానికి జవాబు. సూర్యచంద్రనక్షత్రముల గొప్పతనమును దావీదు ఆలోచించినప్పుడు తానెంత అల్పమైనవాడో గ్రహించి “మనుష్యుడు ఏపాటివాడు?” అని ఆశ్చర్యము వ్యక్తము చేసెను. పాపముతో పతనమైన మానవుడు నిజముగా కొద్దివాడే.

కాని మనుష్య కుమారుడగు క్రీస్తులోనుంచబడిన దేవుని సంకల్ప ముతో చూచినప్పుడు ఎంతో గొప్పవాడు. దేవుని ఆత్మచేత నడిపించ బడిన హెబ్రీ పత్రిక రచయిత కీర్తన 8 లోని మనుష్యకుమారునిలో క్రీస్తును చూచి “మేము యేసును చూచుచున్నాము” అని చెప్పగలుగుచున్నాడు.

“ఆయన పాదములక్రింద నీవు సమస్తము ఉంచియున్నావు” అని దావీదు అనుచున్నాడు. రాబోవు లోకములో యేసు పరిపాలించును అను దానిని ఇది సూచించుచున్న దేవుని ఆత్మ తెలియజేయుచున్నాడు.

“సమస్తము” అనగా భూమిమీద ఉన్న వస్తు సముదాయము మాత్రమే కాదు, సృష్టించబడిన జగత్తు అంతయు, సృష్టించబడిన ప్రతి ప్రాణియు. ఎందుకనగా “ఆయనకు లోబరచకుండ దేనిని విడిచిపెట్టలేదు”.

దావీదు “నీవు దేవదూతలకంటే ఆయనను కొంచెము తక్కువవానిగా చేసితివి” అనుచున్నాడు. యేసు “మరణము అనుభవించునట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడెనని” దేవుని ఆత్మ చెప్పు చున్నాడు.

దేవుని అగౌరవపరచిన లోకములో మనుష్యకుమారుడు దేవుని మహిమపరచెను. మరణము అనుభవించుటద్వారా తన పరిశుద్ధతను వెల్లడించెను.

పాపఫలితముగా మనుష్యుడు మరణమును రుచి చూచు చున్నాడు. మనుష్యకుమారుడైతే దేవుని కృపనుబట్టి మరణమును రుచి చూచుచున్నాడు. కృప అందరికీ విస్తరించునట్లు ఆయన అందరికొరకు మరణమును అనుభవించెను.

“మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి” అను చున్నాడు దావీదు. “ఆయనే యేసు” అని దేవుని ఆత్మ విశ్వాసమూలముగా మనము పలుకునట్లు నడిపించును. మహిమా ఘనతలతో కిరీటధారియై యున్నట్లు ఆయనను చూతుము.

ఆ విధముగా క్రీస్తు అను వ్యక్తిద్వారా మనుష్యకుమారుడు సృష్టికి ప్రభువుగా నుండుట దేవుని సంకల్పము. సమస్తమును సృష్టించి, నిర్వహించువాడు నరునిగా అవతరించుటవలన ఆయన విశాల విశ్వమునకు కేంద్రము, అధిపతి యగును.

ఈ మహిమ యెదుట దేవదూతల మహిమ వెలవెలబోవును. ఏ దేవదూతయు, ఎప్పు డునూ సార్వత్రిక అధికార స్థాయి పొందియుండలేదు, పొందబోడు.

ఈ విధముగా మనుష్యకుమారుని భూత, భవిష్యత్, వర్తమాన కాలములలోని మహిమ మనయెదుట స్పష్టముగా చూపెట్టబడినది. గతములో ఆయన అందరికొరకు మరణము అనుభవించెను.

వర్తమాన కాలమందు మహిమా ప్రభావములను కిరీటముగా ధరించియున్నాడు. భవిష్యత్తులో సర్వలోకము ఆయన అధికారము క్రిందకు కొనిరాబడును.

(వచనము 10). 5-9 వచనములలో రాబోవు లోకములకు సంబం ధించి క్రీస్తు మహిమలు వెల్లడిచేయబడియున్నవి. 10వ వచనమునుండి చివరివరకు ఆయన అనేకమంది కుమారులను మహిమకు కొనితెచ్చు సందర్భమున ఆయన మహిమ మరింత వెల్లడియగుచున్నది.

మొదటి అధ్యాయములో ఉదహరించిన 45వ కీర్తనలోని లేఖన భాగముద్వారా రాబోవు మహిమను క్రీస్తుతో పంచుకొనుటకు సహచరులు కావలెనను దేవుని ఉద్దేశ్యమును ఇంతకుముందే తెలిసికొన్నాము.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్ స్టడీ గైడ్

ఈ అధ్యాయము మిగిలిన భాగములో ఈ సహచరులు దేవుని “కుమారులు” అనియు, క్రీస్తు “సహోదరులనియు” పిలువబడియున్నారు. తన సహోదరు లను మరణమునుండి, అపవాదినుండి, పాపమునుండి విడిపించి, ప్రస్తుత కాలమందు వారిని మహిమకు నడిపించుచు, వారికి సహాయపడుచు, ఆదుకొనుటకు ఆయన అనుభవించినదంతయు గ్రహించుచున్నాము.

అయితే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునప్పుడు, వారు దేవుని పరిశుద్ధతకు తగినట్టుగా ఉండవలెను. “ఎవని నిమిత్తము సమస్త మును ఉన్నవో, ఎవరివలన సమస్తమును కలుగుచున్నవో” ఆ క్రీస్తు మరణమును అనుభవించుట మాత్రమేకాదు, తన ప్రజలకు అధిపతి యగునట్లు వారి పరిస్థితిలో, శ్రమలలో పాలుపొంది, శ్రమలద్వారా పరిపూర్ణునిగా చేయబడెను.

పరిపూర్ణుడైన వ్యక్తిగా అరణ్యయాత్రలో తన ప్రజలను నడిపించుటకు, శ్రమలు అనుభవించుటకు ఆయన సంపూర్ణ ముగా తగినవాడు. ఆ విధముగా ఆయన వారి “రక్షణకర్త” యగు చున్నాడు. మహిమకు వారు వెళ్లుచుండగా ప్రతి అపాయమునుండి వారిని తప్పించుటకు ఆయన సమర్థుడు.

(వచనము 11). 11వ వచనమునుండి విశ్వాసులకు క్రీస్తు మూల ముగా సంక్రమించు ధన్యకరమైన ఫలితములను గ్రహించుచున్నాము. వారు ఆ వారసత్వమున ప్రవేశించి ఆ హోదావలన కలుగు ప్రతిఫలము లను అనుభవించుచు అందు దేవుని మహిమను కొనసాగించుచున్నారు.

మొదటిగా, పరిశుద్ధపరచువాడు (క్రీస్తు), పరిశుద్ధపరచబడువారు (విశ్వాసులు) ఇరువురిని ఏకముగా చూడగలము. ఈ అద్భుత పరిభాష వలన స్పష్టమగునదేమనగా, క్రీస్తు మన స్థానములోనికి వచ్చి దాని పరి ణామములను భరించి, మనలను దేవునియెదుట తన స్థానములోనికి తెచ్చియున్నాడు. మనిషిగా తాను, తనవారు – పరిశుద్ధపరచువాడు పరిశుద్ధపరచబడువారు దేవునియెదుట ఒకే సమూహముగా కనబడు చున్నారు.

“పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధపరచబడువారు, ఏకమైయున్నా రని” దేవుని వాక్యము చెప్పుచున్నది కాని – యేసుక్రీస్తు, మానవులు ఏకమైయున్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. ఇది గమనార్హము.

ఆ కారణము చేతనే వారిని పరిశుద్ధపరచుటద్వారా తన స్థానములోనికి తీసుకొని వచ్చినందుకు వారిని “సహోదరులు” అనుటకు ఆయన సిగ్గుపడలేదు.

విశ్వాసులు పరిశుద్ధపరచబడినవారు: పరిశుద్ధపరచబడినందున దేవునియెదుట క్రీస్తు స్థానములోనికి వారు కొనిరాబడియున్నారు. వారంతా ఏకమైయున్నందున వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు.

క్రీస్తు పునరుత్థానుడగునంతవరకు శిష్యులను ఆయన “సహోదరులు” అని పిలువలేదని సువార్తలలో చూడగలము. ప్రభువు ఎప్పుడూ దేవునితో తండ్రి కుమార సంబంధము కలిగియుండెను.

ఆయన తన యాత్రలో ఎప్పుడూ “నా దేవా” అని సంబోధించక, ఎల్లప్పుడూ “నా తండ్రీ” అని సంబోధించెను. క్రీస్తు శరీరధారియగుటద్వారా మనకు ఈ సంబంధము కలుగలేదుగాని, విమోచన కార్యమునుబట్టియే కలిగినది.

యోహాను 20-17

(వచనములు 12, 13). పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధపరచబడు వారైన తన సహోదరులతో ఏలాగు సమైక్యపరచుకొన్నది ఋజువు చేయుటకు పాత నిబంధననుండి మూడు లేఖనములు ఉదహరించ బడినవి.

మొదటిది – కీర్తన 22:22. ప్రభువు తన పునరుత్థానమందు ఈలాగు ప్రకటించుచున్నాడు, “నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరతును. సమాజముమధ్య నీ నామమును గానము చేతును”.

ఇక్కడ ప్రభువు తన ప్రజలతో సమైక్యపరచుకొనుచున్నాడు. దేవుని పక్షముగా తండ్రి నామమును ప్రచురముచేయుట, మన పక్షముగా ప్రజల స్తుతులను తండ్రికి అర్పించుట కీర్తన 22 లో ప్రవచించబడినది, యోహాను 20 లో వెల్లడించబడినది, హెబ్రీ 2 లో వివరించబడినది.

యెషయా 8-17,18

(వచనములు 14, 15). 12, 13 వచనములు క్రీస్తు దేవునియెదుట మనలను ఏలాగు సమైక్యపరచుకొనెనో తెలియజేసినవి. దేవునియెదుట మన బలహీనతలయందును, మరణమందును క్రీస్తు తనతో మనలను సమైక్యపరచుకొనినట్లుకూడా గమనించగలము.

పిల్లలు రక్తమాంసము లలో పాలివారైతే, ఆయనకూడా వాటియందు పాలివాడాయెను. వారు మరణముయొక్కయు, అపవాదియొక్కయు అధికారము క్రింద ఉండిన యెడల, ఆయనకూడా రక్తమాంసములు ధరించినవానిగా మరణాధిపతి యగు అపవాదిని నశింపజేయుటకు మరణమందు ప్రవేశించెను.

ఆ విధముగా జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోనైనవారిని విడిపించగలిగెను. పాపమునకు జీతము మరణమని అపవాదికి తెలియును. అందువలననే పాపిని జీవితకాలమంతయు మరణముతో, దాని పరిణామములతో భయపెట్టుటకు అపవాది వెను కాడడు.

ప్రభువుపై ఆ మరణమునకు ఎట్టి అధికారము లేదు గనుక, ఆయన మరణములోనికి ప్రవేశించి, మనపైనున్న మరణశిక్షను తానే భరించి విశ్వాసిని మరణముచేత భయభ్రాంతునిగా చేయుచున్న అపవాది శక్తిని కొల్లగొట్టెను.

అందువలననే మనము పాపముయొక్క శిక్షగా కాక, శ్రమలనుండి విడుదలగా, సంపూర్ణ ఆశీర్వాదములు పొందునట్లుగా మరణములోనుండి దాటుచున్నాము.

(వచనములు 16–18). ప్రభువు వచ్చినది దేవదూతలకు సహాయము చేయుటకు కాదుగాని, అబ్రాహాము సంతానముకొరకు కార్యము చేయు టకు వచ్చెను. ఈ పని చేయుటకు ఆయన సహోదరులవంటివాడు కావలసివచ్చెను.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్ స్టడీ గైడ్

ఆ విధముగా ఆయన పూర్తిగా వారి స్థానములోనికి వచ్చెనుగాని, వారి స్థితిలోనికి కాదు. ఈ పత్రికలో ఇక్కడ మొట్టమొదటి సారిగా ఆయన మన ప్రధాన యాజకునిగా నమ్మకముగా, దయాపూర్వ కముగా పనిచేయుట చూడగలము.

ఈ పరిచర్య జరిగించుటకు ఆయన తనను తాను తగ్గించుకొని, శ్రమలు శోధనలు ఎదుర్కొనవలసి వచ్చెను. పరిపూర్ణ జీవితము జీవించిన పిమ్మట, పాపములు క్షమింపబడునట్లు ఆయన మరణమందు ప్రవేశించి, పాపములకు ప్రాయశ్చిత్తము జరిగిం చెను.

ఆ గొప్ప కార్యమును ముగించి, మహిమలో తన యాజక స్థానము ద్వారా కృపాకనికరములు చూపుచు, తానే శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికి సహాయపడగలవాడైయున్నాడు.

ఆయనకు శ్రమ కలిగినది శోధనకు లొంగిపోయినందుకు కాదు. మనము శోధనకు లొంగినయెడల శరీరము శ్రమపడదు సరిగదా, శరీరమే ఆ శోధనలో పాలుపుచ్చుకొనును.

ఏ శోధనకు లొంగిపోయెనో దానిలో ఆనందించును. తాత్కాలికముగా పాపపుశోధనవలన ఆనందించినను, చివరకు ఆ పాపమునుబట్టి శ్రమననుభవించవలసినదే. ప్రభువు శోధింప బడినను ఒక్క క్షణముకూడా దానికి లోబడలేదు.

శోధనద్వారా ఆయన పరిపూర్ణత మరింత వెల్లడాయెను. దీనిద్వారా శ్రమ కలిగినది. ఆయన అపవాది శోధనకు లొంగక ఆకలిని సహించెను. ఆ విధముగా శోధనలో శ్రమననుభవించినందున శోధింపబడువారు స్థిరముగా నిలువగలుగు నట్లు వారికి సహాయముచేయగలవాడైయున్నాడు.

ఆయన పరిపూర్ణమగు సున్నిత హృదయముతో మన శోధనలలో ప్రవేశించి కరుణ, విశ్వసనీయ తలలో మనకు సహాయపడగలుగుచున్నాడు. అనేక పర్యాయములు మనము కరుణను విడచి విశ్వసనీయతను, విశ్వసనీయతను విస్మరించి కరుణను చూపుట కద్దు. అయితే ఆయన తన పరిపూర్ణతనుబట్టి విశ్వస నీయతతో ఎంతమాత్రమును రాజీపడక కరుణ చూపును.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక మనము ఒప్పుకొనినదానికి ప్రధాన యాజకుడు ( అధ్యాయములు 3, 4)

మనము ఒప్పుకొనినదానికి ప్రధాన యాజకుడు (3, 4 అధ్యాయములు)

మొదటి రెండు అధ్యాయములు క్రీస్తు వ్యక్తిత్వముయొక్క మహిమను వెల్లడించుచున్నవి. ఆ విధముగా మహా ప్రధాన యాజకునిగా ప్రభువు చేసిన దివ్య పరిచర్యలోనికి మనకు ప్రవేశము లభించుచున్నది.

ఈ భాగములో మనము నేర్చుకొనునది క్రీస్తు యాజక పరిచర్యయొక్క పరిధి. మొదటగా, దేవుని ఇల్లు (3:1-6); రెండవదిగా, ప్రభువు యాజక పరి చర్యకు అవకాశము కల్పించిన అరణ్య పరిస్థితులు.

హెబ్రీయులకు పత్రిక అధ్యాయం 3, 4

(3:7-19); మూడ వదిగా, అరణ్య యాత్ర ఎటువంటి విశ్రాంతికి నడిపించునో అనునది. (4:1-11); చివరిగా, అరణ్యయాత్రలో దేవుడు కనికరించి మనకు కలిగించిన ఏర్పాట్లు (4:12-16).

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

క్రీస్తు యాజక పరిచర్య పరిధి (3:1-6).

రెండవ అధ్యాయము చివరి భాగములో ప్రభువు తన ప్రజల శ్రమల యందు సహానుభవము పొందునట్లు ఆయన ఎన్నుకున్న యాజక పరిచర్య విధానము వివరించబడినది. ఈ మూడవ అధ్యాయము ప్రారంభ వచనములలో ఆయన యాజక పరిచర్య పరిధిని తెలుపుచు దేవుని ఇల్లు పరిచయము చేయబడినది.

(వచనము 1). ప్రారంభ వచనములో “పరలోక పిలుపులో పాలు పొందిన” అనియు, “పరిశుద్ధ సహోదరులు” అనియు యూదా విశ్వాసులు సంబోధించబడిరి.

యూదులుగా “సహోదరులు” అని పిలిపించుకొనుట వారికి తెలుసు. వారు భూసంబంధమైన పిలుపులో పాలుపొందియున్నారు.

క్రైస్తవులుగా వారు “పరిశుద్ధ సహోదరులు”. క్రైస్తవులందరికిని ఇది వర్తించును. క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును వారు పొందియున్నారు.

మొదటి రెండు అధ్యాయములలో క్రీస్తు మహిమలను మన యెదుట పెట్టి, ఇప్పుడు “మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును, ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచ”వలసినదిగా దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు.

అపొస్తలుడు అను బిరుదు మొదటి అధ్యాయము లోని దేవుని కుమారుడు అను సత్యమునకు సంబంధించినది. ప్రధాన యాజకుడు అను బిరుదు రెండవ అధ్యాయమునకు సంబంధించినది.

ఈ అధ్యాయములో మనుష్యుల పక్షముగా దేవుని యెదుట సేవ చేయుటకు మనుష్యకుమారుడు భువినుండి పరమునకు వెళ్ళుచున్నట్లు చూపబడినది.

నిజమైన పరిచర్యయొక్క గురి, ప్రకటించిన సత్యమును కొందరు వినునట్లు చేయుటమాత్రమే గాక, యేసునందు “లక్ష్యముంచునట్లు” చేయుటయే. ఇదియే పరిచర్య అంతటి అంతిమ లక్ష్యము.

ఈ అధ్యాయము మొదటి వచనములో క్రీస్తుయేసు అని గాక ‘యేసు’ అని మాత్రమే ప్రస్తావించుట గమనార్హము. ప్రతి యూదుడు మెస్సీయాను అంగీకరించును. క్రైస్తవులు మాత్రమే ‘యేసు’ అను వ్యక్తిగా ‘క్రీస్తు’ వచ్చినట్లు గుర్తించుదుర.

(వచనములు 2–6). దేవుని ఆత్మ అరణ్యమందలి మోషేను, ప్రత్యక్ష గుడారమును సూచించుచున్నాడు.

ఎందుకనగా మోషేకంటే క్రీస్తు శ్రేష్ఠు డనియు, ప్రత్యక్షగుడారము తరువాతి కాలమందు ప్రత్యక్షపరచబోవు వాటికి సాక్ష్యార్థముగా నున్నదని తెలియజేయబడినది.

మోషే యాజకుడు కాడు, అతని పరిచర్య ప్రవక్త లక్షణములు గలది. అతడు దేవుని పక్షముగా మనుష్యుల యెదుటికి వెళ్లువాడు.

యాజకుడగు అహరోను ప్రజల పక్షముగా దేవుని యెదుటికి వెళ్ళువాడు. మోషే దేవుని సూచనల మేరకు అరణ్య ములో ప్రత్యక్ష గుడారమును నిర్మించెను.

నిజమైన అపొస్తలుడగు యేసు సర్వజగత్తుకు నిర్మాత. దీనికి ప్రత్యక్ష గుడారము సాక్ష్యముగా నున్నది. దేవుడు ఆకాశ మహాకాశములందు నివసించినయెడల, ఈ రోజున తన ఇల్లగు తన ప్రజలమధ్య నివసించుట మరింత నిజము.

నేడు ఆత్మీయ రూపమున ఉన్న దేవుని ఇంటికి అప్పటి పదార్థ నిర్మితమైన ప్రత్యక్ష గుడారము అలంకారికముగా నున్నది. సేవకుడుగా మోషే అరణ్యమందు దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు.

క్రీస్తు అయితే కుమారునిగా దేవుని ప్రజలతో కూడిన ఆయన ఇంటిపైనున్నాడు. ఈ విధముగా దేవుని ప్రజలు దేవుని ఇల్లుగా రూపొందు చున్నారని పరిచయము చేయుటనుబట్టి క్రీస్తు యాజకత్వ పరిచర్య జరిగించు పరిధి తెలియుచున్నది.

హెబ్రీ 10-21

హెబ్రీయులకు పత్రిక 3, 4 అధ్యాయాల వచనాలు

క్రీస్తు యాజక పరిచర్యకు పిలుపునిచ్చు అరణ్యము (3:7-19)

(వచనము 6). మోషేను, ప్రత్యక్ష గుడారమును గూర్చిన సూచన సహజముగా దేవుని ప్రజల అరణ్య ప్రయాణముయొద్దకు మనలను నడిపించును.

ప్రత్యక్ష గుడారము దేవుని ప్రజలకు ముంగుర్తుగా నుండిన యెడల, ఇశ్రాయేలు ప్రజల అరణ్యయాత్ర దేవుని ప్రజలు ఈ దుష్ట లోకములో దాని ప్రమాదములను ఎదుర్కొనుచు ప్రయాణము చేయుటకు ముంగుర్తుగా నున్నది.

ఈ అరణ్యయాత్ర కారణముగానే యాజక పరిచర్య అవశ్యకమైనది. అరణ్యములో మనకు ఎదురగు ప్రమాదములవలన మన ఒప్పుకోలు నిజమైనదో కాదో పరీక్షింపబడినది.

ఈ యూదులు క్రైస్తవ్యమును బహిరంగముగా ఒప్పుకొనియున్నారు. ఒప్పుకోలులో యథార్థత కొరవడు ప్రమాదము తప్పక ఉండును. అందుకే “చేపట్టిన యెడల” అను పదము వచ్చెను.

“ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిర ముగా చేపట్టినయెడల … మనమే దేవుని ఇల్లు అని రచయిత చెప్పుచున్నాడు. ఈ హెచ్చరిక క్రీస్తునందు మనకుగల నిబ్బరము, విశ్వాసికి ఆయన సంపాదించు భద్రత విషయమైనది కాదు.

అందుకే ఒకరు ఈలాగు చెప్పియున్నారు – “క్రీస్తు కార్యములోగాని, కృపమూలముగా వచ్చు శుభ వర్తమానములలో గాని ‘అయితే’ అనునది లేనే లేదు. ఉన్నవన్నియు విశ్వాసమునకు భేషరతుగా లభ్యమగును.

హెచ్చరింపబడినవారు ఈ నిశ్చయత కలిగియున్నారని భావించినందున, తాము ఒప్పుకొనినదానిని విడిచిపెట్టవద్దని హెచ్చరింపబడియున్నారు. విశ్వాసికి అపజయములు ఎన్నో ఎదురైనను క్రీస్తు తన యాజక పరిచర్యవలన విశ్వాసిని గట్టిగా పట్టుకొనును.

లేదా విశ్వాసి ఆయనను గట్టిగా చేపట్టును. విశ్వాసి నిజ విశ్వాసము అంతమువరకు సహించుటవలన ఋజువగును. నిజ విశ్వాసిని పరీక్షించు అరణ్యము నామకార్థ క్రైస్తవుల కపట జీవితమును బహిర్గతము చేయును”.

(వచనములు 7-11). యేసుక్రీస్తు తన మహిమతోను, శక్తితోను వచ్చి యూదా జాతికి ఇవ్వనైయున్న విశ్రాంతిని ఇశ్రాయేలీయులకు చూపుచు దేవుని ఆత్మ పై లేఖన భాగమును ఉదహరించెను.

కీర్తన 95-7,11

రాబోవు లోకములో క్రీస్తు మహిమను పంచుకొను కృపా రక్షణ దినము నేడే. అట్టి ధన్యకరమైన దినమందు తమ పితరులవలె ప్రవర్తించవద్దని వారు హెచ్చరింపబడుచున్నారు.

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి అడు గడుగునా అపాయములతో నిండిన అరణ్యమందు యెహోవాను వెంబ డింతుమని ఒప్పుకొనియున్నారు. దేవునియందు నమ్మకము మాత్రమే వారిని అంతమువరకు నడిపించును. నలువది సంవత్సరములు వారు దేవుని బలమైన కార్యములను చూచిరి.

అన్ని ఆపదలనుండి కాపాడుచు, ఆయన వారిని పోషించెను. అయినను వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా లేదా?” అనుచు దేవుని శోధించిరి. దేవుని మంచితనము వారి కఠిన హృదయములను కదిలించలేదు అని వారు ఋజువు చేసిరి.

వారి స్వకీయ దురాశలను తీర్చుకొనుచు, దేవుని మార్గములను ఎరుగక, కేవలము నామకార్థముగా ఒప్పుకొనినను, దేవునియందు వారికి నమ్మిక లేదని ఋజువుచేసిరి. అట్టివారినిగూర్చి దేవుడు “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని” చెప్పెను.

(వచనములు 12, 13). ఈ వచనములలో కీర్తన 95 లోని హెచ్చరిక నామకార్థ క్రైస్తవులకు అన్వయించబడినది. జీవముగల దేవుని విడిచిపెట్టి, మృతమగు ఆచారముల తట్టు మరల తిరుగు విశ్వాసరహితమైన దుష్ట హృదయము కలదేమో అని పరిశీలించుకొనవలెను.

వారు ఒప్పుకొనినది ఏమైనను, క్రీస్తు కృపద్వారా విశ్వాసికి సంపాదించి ముగించిన రక్షణ, పాప క్షమాపణలో వారికి నమ్మకము లేదు అని స్పష్టమగుచున్నది.

మొత్తముమీద ఇక్కడ చెప్పదలచిన విషయమేమనగా క్రైస్తవ జీవిత శైలికి, యూదా ఆచారములను జోడించుట మంచిది కాదు. అసలు జరిగిన దేమనగా వారు క్రీస్తునే పూర్తిగా విడిచి యూదా మతమునకు మళ్ళిరి.

ఇదే భ్రష్టత్వము. మనము జాగ్రత్తపడుట మాత్రమే కాదు. నేడు అను సమయముండగనే స్వంత ఆలోచన అను మోసములో చిక్కుకొని కఠిన పరచబడకుండునట్లు “ఒకనినొకడు” బుద్ధి చెప్పుకొనవలెనని హెచ్చరింప బడియున్నాము.

ఇక్కడ పాపములు చేయుటవలన కలుగు మోసమును గూర్చి చెప్పుటలేదు. ఒక పాపము మరియొక పాపమునకు దారితీయును. ఇక్కడ రచయిత మాట్లాడుచున్నది పాపముయొక్క విధానము, అనగా అక్రమమన్న మాట.

మన ఇష్టముచొప్పున జరిగించిన హృదయము ఏలాగు కఠినపరచబడును అని మనము అంతగా దాని విషయము ఆలోచించము. అందుచే మనము జాగ్రత్తపడి ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనవలెను. తమ సొంత ఆలోచనను అనుసరించుచు దిగజారి పోవుచున్నవారిని ప్రేమతో దారికి తేవలెనుగాని, దూరము చేయరాదు.

(వచనములు 14-19). విశ్వాసులు దేవుని ఇల్లు మాత్రమేకాదు. వారు క్రీస్తు సహచరులును అయి ఉన్నారు.  ఇక్కడ చెప్పబడినది క్రీస్తు శరీరము కాదు, పరిశుద్ధాత్మచే శిరస్సుకు అతుకబడిన ఆయన శరీర అవయవములు కాదు.

ఎందుకనగా శరీరమునుండి తగనిదేదియు వచ్చు టకు వీలులేదు. ఇక్కడ ఇంకను ఒప్పుకోలు ప్రస్తావనలో ఉన్నది. అది యథార్థమైనదిగా ఉండవలెను.

అయితే యథార్థత లేకుండటకుకూడా అవకాశమున్నది. అందువలననే “మొదటినుండి మనకున్న దృఢ విశ్వాస మును అంతముమట్టుకు గట్టిగా చేపట్టవలెనని” మరల చెప్పబడియున్నది.

ఈ నిశ్చయతకు ఆధారము మనలోనున్నదేదియు కాదు. మనలోనున్నది స్వనీతి మాత్రమే. ఇక్కడ నొక్కి చెప్పిన నిశ్చయత క్రీస్తుయేసునందు పునాది కలిగియున్నది.

ఆయన ప్రాయశ్చిత్త బలిని అంగీకరించుటవలన అది అందుబాటులోనికి వచ్చినది. అట్టి నిశ్చయత కలిగియున్నందున రచయిత మనలను నిందించుట లేదు సరిగదా దానిని గట్టిగా చేపట్టవలెనని హెచ్చ రించుచున్నాడు.

అరణ్యములోని ఇశ్రాయేలు విషయము రచయిత మరల ప్రస్తావిం చుచు, ఇశ్రాయేలీయుల కఠినత్వమును, పాపమును, అవిశ్వాసమును వెలికితీయుటకు మూడు సూటియైన ప్రశ్నలు వేసియున్నాడు.

మొదటిది – దేవుని వాక్యము రాబోవు విశ్రాంతిని గూర్చి మాటలాడినప్పుడు విని, కోపము పుట్టించినవారెవరు? ప్రజలలో కొద్దిమందా? కానేకాదు, ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చిన అసంఖ్యాక ప్రజలు.

రెండవది ఎవరిమీద దేవుడు నలుబది ఏండ్లు కోపగించెను? స్వేచ్ఛగా పాపమును ఎన్నుకొని హృదయములు కఠినపరచుకొనినవారిమీదనే గదా! మూడు – తన విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ఎవరినిగూర్చి ప్రమాణము చేసెను? విశ్వసింపనివారిని గూర్చియే.

దీనినిబట్టి అంతటికిని మూల మగు పాపము అవిశ్వాసము అని అర్థమగుచున్నది. అవిశ్వాసము వారి పాపములను బహిర్గతము చేయగా, పాపము వారి హృదయములను కఠినపరచెను.

అరణ్యయాత్రగుండా వెళ్ళగా కలుగు విశ్రాంతి (4:1-11).

3:7-19 లో రచయిత ఇశ్రాయేలీయుల అరణ్యయాత్ర గురించి మాటలాడుచున్నది – కనానులో వారు పొందబోవు విశ్రాంతిని దృష్టిలో ఉంచుకొనియే.

ఐగుప్తునుండి వెలుపలికి వచ్చినవారు విశ్రాంతిలో ప్రవేశింపకపోవుటకు కారణము వారి హృదయ కాఠిన్యము, వారి పాపము మరియు వారి అవిశ్వాసమే. (3:15,17,19).

పూర్వకాలమందలి ఇశ్రాయేలీయులవలెనే, నేటి విశ్వాసులుకూడా ఈ లోకమను అరణ్యముగుండా రాబోవు మహిమయను విశ్రాంతిలో ప్రవేశింప వెళ్ళుచున్నారు.

నాలుగవ అధ్యాయము మొదటి 11 వచనముల లోని ప్రధానాంశము ఈ విశ్రాంతి. ఇక్కడ రచయిత మాట్లాడుచున్నది “దేవుని విశ్రాంతి” అని మనము గ్రహించవలెను. ఇదియే “ఆయన విశ్రాంతి” అనియు, పాత నిబంధన లేఖన భాగమందు “నా విశ్రాంతి” అనియు చెప్పబడియున్నది. (3:18; 4:1,3,5).

ఇక్కడ ప్రస్తావించిన విశ్రాంతి విశ్వాసి యేసుక్రీస్తునందు ఆయన ముగించిన కార్యమందు విశ్వాసముంచుటద్వారా కలుగునది కాదు. అలాగే ప్రభువు చెప్పినట్లు “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త మైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అను వాక్యము ప్రకారమును కలుగు ప్రస్తుత మానసిక ప్రశాంతతకూడా కాదు. అది దేవుని విశ్రాంతి.

మత్తయి 11-29, మార్కు 6-31

దేవుడు తన ప్రేమ, పరిశుద్ధతలకు సంతృప్తి కలిగినప్పుడే విశ్రాంతి గైకొనును. ఆయన ప్రేమించువారి మూలముగా దేవుని సంకల్పము, దేవుని ప్రేమ నెరవేరినప్పుడే ఆయన విశ్రాంతి అందుబాటులోనికి వచ్చును.

దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోయినప్పుడు, నీతి స్థాపించబడి నప్పుడు దేవుడు “తన ప్రేమయందు విశ్రాంతి నొందును” (జెఫన్యా 3:17). “పాపమున్నచోట పరిశుద్ధత, దుఃఖమున్న చోట ప్రేమ విశ్ర మింపవు” అని జె. యన్. డార్బీ అను భక్తుడు చెప్పెను.

జెఫన్యా 3-17

క్రైస్తవుడు పరలోక విశ్రాంతిలో పాల్గొనునట్లు అవిశ్రాంత లోకము నుండి పిలువబడియున్నాడు. అతడు లోకమును విడిచిపెట్టలేదు, తాను వెళ్ళనున్న పరలోకమును చేరలేదుగాని తాత్కాలికముగా లోకములో ఉన్నాడు.

క్రీస్తు మనకొరకు సంపాదించి, ఆయన ఉన్నట్టి పరలోక విశ్రాంతిని విశ్వాసముద్వారా చూడగలుగుచున్నాము. ఈ విషయము 9:20 లో “ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అని ఆయననుగూర్చి చెప్పబడినది.

(వచనములు 1, 2). శ్రేష్టమైన ఈ వాగ్దానము మనకున్నను, ఆ విశ్రాంతిలో ప్రవేశించక తప్పిపోవుదుమేమో అని హెచ్చరింపబడి యున్నాము.

నామకార్థులుమాత్రము తమ క్రైస్తవ ఒప్పుకోలును విడిచిపెట్టి యూదా మతమునకు మళ్ళి తప్పిపోయినట్లుండుట గాక, అక్షరాలా తప్పి పోయి, అరణ్యమందు నశించెదరు. నిజమైన విశ్వాసి అయితే వెనుదిరిగి, లోకమందు స్థిరపడి తప్పిపోయినట్లు కనిపించును.

3-18 ని ద్వితీ 1-22, 26

పరలోక నిత్య విశ్రాంతిని గూర్చిన మరింత శ్రేష్ఠమగు సమాచారము క్రైస్తవులకు నేడు ఇవ్వబడినది. దేవుని వాక్యమునకు విశ్వాసమును జోడించకపోయినయెడల పూర్వకాలమువలెనే నేడును వినువారికి ఎట్టి ప్రయోజనము చేకూరదు.

(వచనములు 3, 4). పూర్వకాలమందు కొందరు కనాను విశ్రాంతిని గూర్చిన సమాచారము వినియు విశ్వసించనిరీతిగా, నేడును అసంఖ్యా కులు పరలోక విశ్రాంతియందు విశ్వాసముంచుట లేదు.

అయినను దేవుని రాబోవు విశ్రాంతి స్థిరముగా అట్లే నిలిచియున్నది. విశ్వాసులు అందు ప్రవేశించెదరు. వారు వేయు ప్రతి అడుగు వారిని దేవుని విశ్రాంతికి సమీపముగా తెచ్చుచున్నది.

హెబ్రీయులకు పత్రిక 4:14-16 వచనాలు

విశ్వాసమున్నదని కేవలము నోటితో చెప్పు కొనుచు క్రీస్తునందు నిజముగా విశ్వాసముంచని నామకార్థులు తిరిగి రాకుండా ఎడారిలో నాశనమగుదురు.

కీర్తనలు 95-11

దేవుని విశ్రాంతి అను ఆయన లక్షణమును వెల్లడించుటకును, ఆదినుండియు దేవుడు తనయెదుట “విశ్రాంతి”ని ఉంచుకొనియున్నాడని చూపుటకు రచయిత సృష్టి ప్రస్తావన తెచ్చుచున్నాడు.

ప్రపంచము రూపింప బడిన తరువాత దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనిషిని సృజించెను. అంతటితో దేవుని సృష్టికార్యము ముగిసినది. రెండు స్పష్టమైన అంశములతో సృష్టి విశ్రాంతికి దారితీసినది.

మొదటిది – “దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగ నుండెను” అని వ్రాయబడియున్నది.

రెండవది – దేవుని విశ్రాంతిని సూచించు రెండు గొప్ప సత్యములను ఇక్కడ గమనించు చున్నాము. ఈ ప్రయాస ఫలితము – సంపూర్ణ సంతోషమును, సంతృప్తిని అనుభవించుట.

ఆది 1-31, 2-2

(వచనము 5). సృష్టి విశ్రాంతి నిత్య విశ్రాంతికి ముంగుర్తుగానున్నది. సృష్టియొక్క విశ్రాంతి పాపమువలన భంగపరచబడినది. అయినను దేవుడు తన హృదయమందు నిశ్చయించిన విశ్రాంతిని, అనగా నిత్య విశ్రాంతిని విడిచిపెట్టలేదు. ఎట్టి పాపము దానిని రద్దుచేయజాలదు.

యెహోషువ దినములలోకూడా మరియొకసారి దేవుని విశ్రాంతి మనయెదుట ఉంచ బడినది. ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసమునుబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి. అందువలననే దేవుడు “వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” (కీర్తన 95:11) అని చెప్పియున్నాడు.

(వచనము 6). సృష్టి విశ్రాంతిని పాపము పోగొట్టినను, అవిశ్వాసము కనాను విశ్రాంతిని రద్దుపరచినను “నా విశ్రాంతి” అని చెప్పు దేవుని విశ్రాంతి తన యెదుటనే ఉన్నదని దేవుడు మనకు అభయమిచ్చుచున్నాడు.

శారీరక బలహీనత మరియు ఆధ్యాత్మికత

మొదటిగా – సువార్త వినినవారు తమ అవిశ్వాసమువలన ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయినను, ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింతురను మాట నిశ్చయము. దేవుడు తన హృదయాలోచననుబట్టి సంపాదించు ఆ విశ్రాంతిని మానవుని పాపముగాని, అవిశ్వాసముగాని భంగపరచ జాలవు.

(వచనములు 7, 8). సృష్టి విశ్రాంతి పోయి, కనాను విశ్రాంతి భగ్నమైపోయినయెడల విశ్వసించువారు పొందు దేవుని విశ్రాంతి ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలను కనాను విశ్రాంతిలోనికి తెచ్చుటకు యెహోషువ విఫలుడాయెను. అందువలననే, చాలా సంవత్సరముల తరువాత దావీదు విశ్రాంతినిచ్చు “మరియొక దినమును” గూర్చి చెప్పుచున్నాడు.

ఈ విశ్రాంతిని వెల్లడించుటకు రచయిత కీర్తన 95:7,8 ను ఉదహరించెను. యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతికి విశ్రాంతి నిచ్చుటకు రాబోవుచున్నందున కృతజ్ఞతతో యెహోవావైపు మరలుమని ఇశ్రాయేలీయులను ఈ కీర్తన పిలుచుచున్నది.

ఈ శుభసమాచారము విని, యెహోషువ కాలమునాటి ఇశ్రాయేలీయులవలె హృదయములను కఠినపరచుకొనవలదని హెచ్చ రించుచున్నది. సరిక్రొత్తగా చేసిన ఈ అభ్యర్థనను తిరస్కరించుటయనగా క్రీస్తుయేసు భూలోకపాలనలో విశ్రాంతిని పోగొట్టుకొనుటే.

(వచనములు 9, 10). “కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి యున్నదని” చెప్పి రచయిత తన తర్కమును ముగించెను.

ఈ విశ్రాంతి యొక్క విశేష లక్షణమేమనగా ప్రయాస అంతటినుండి విశ్రమించుట. ఎందుకనగా, “ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడుకూడ తన కార్యము లను ముగించి విశ్రమించును” అని వ్రాయబడియున్నది.

ఆ విధముగా ఇక్కడ రూఢిపరచబడిన గొప్ప సత్యమేదనగా పరలోక సంబంధమైన ప్రజలకు పరలోక సంబంధమైన దేవుని విశ్రాంతిగాని, భూసంబంధమైన ఆయన ప్రజలకు భూసంబంధమైన విశ్రాంతిగాని ఏదైనను భవిష్యత్తులో కలుగునదే.

విశ్వాసము ఎదురుచూచు విశ్రాంతి ఇదే. అంతేకాదు, ఇక్కడ చెప్పిన విశ్రాంతి పాపమునుండి కాదుగాని ప్రయాసనుండి. ప్రయాసపడిన వ్యక్తి అలసిపోయినందున విశ్రాంతి కాదు, అతని పని ముగిసినందుననే.

ఒకరు ఈ విధముగా చెప్పియున్నారు – “ప్రస్తుత విశ్రాంతి దేవుని విశ్రాంతి కాదు. భవిష్యత్తులో క్రైస్తవులకు, ముఖ్యముగా ఈ లోకములోనే విశ్రాంతిని వెదకు యూదులకు లభించు విశ్రాంతి వారిని లోకపు ఉరులనుండి కాపాడును.

దేవుడు పాపములో దుఃఖములో విశ్రమించడు గనుక, మనముకూడా మన కోర్కెలయందు సైతము దానిని అనుమతించరాదు. అది మన జీవిత లక్ష్యము ఎంతమాత్రము కాకూడదు.

ఆయన ప్రేమను ఎరిగి ఉన్నయెడల ప్రేమకలిగి ప్రయాసపడు సమయమిదే. తండ్రి యథార్థముగా ఆరాధించువారిని వెదకుచున్నందున మనముకూడా అదే పని చేయవలయును.

(వచనము 11). ఈ విశ్రాంతి భవిష్యత్తులో కలుగుననియు, శ్రేష్ట మైనది గనుక దానిలో ప్రవేశించుటకు ప్రయాసపడుదమనియు హెచ్చ రింపబడియున్నాము.

ఈ పత్రికలోనే తరువాత “ప్రేమతో ప్రయాసపడ వలెనని”, “జాగ్రత్తపడుమని”, “మందులు కాక విశ్వాసముచేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలి నడుచుకొను మనియు” హెచ్చరింపబడియున్నాము. (6:10-12).

మన యాత్ర ముగింపులో మనయెదుట ఉన్న దేవుని విశ్రాంతిని తృణీకరించు ప్రమాదమున్నది. లేదా ప్రయాణములో ప్రేమతో ప్రయాస పడుటలో అలసిపోవచ్చును. ఇశ్రాయేలీయులు ఈ రెంటినీ చేసిరి.

కనుక, మనలో ఎవరును వారివలె అవిశ్వాసముతో తప్పిపోకుండునట్లు జాగ్రత్త పడుదుముగాక! ఇక్కడ రెండు గొప్ప హెచ్చరికలేమనగా, ఒకవేళ ఆ విశ్రాంతినిగూర్చిన వాగ్దానము పొందకుండ తప్పిపోదుమేమోయని “భయము కలిగియుందము” (4:1); ఆ విశ్రాంతిలో ప్రవేశించునట్లు “ప్రయాసపడుదము” (11వ).

అరణ్య యాత్రలో మన పోషణకు దేవుని ఏర్పాటు (4:12-16)

విశ్వాసులు దేవుని విశ్రాంతి పొందుటకై ప్రయాణమై యాత్రలో నుండగా వారిని సంరక్షించు రెండు గొప్ప ఏర్పాట్లు ఈ అధ్యాయము చివరలో మనయెదుట ఉంచబడినవి. మొదటిది, దేవుని వాక్యము. (12, 13 వచనాలు). రెండవది, క్రీస్తు యాజక పరిచర్య. (14-16 వచనాలు).

(వచనములు 12, 13). దేవుని వాక్యము మృతతుల్యమైన లేఖ కాదు. అది సజీవము. మానవ హృదయమును ఛేదించుచు పనిచేయును. దేవుని వాక్య తాకిడి క్రిందికి వచ్చిన వ్యక్తి మనస్సాక్షి హృదయముపై రెండు విధములుగా ఫలితము చూపును.

మొదటిది, హృదయముయొక్క తలంపులను, ఆలోచనలను వెల్లడించును. రెండవది, మనమెవరికైతే లెక్క అప్పగించవలసియున్నదో ఆయన యెదుటికి మనలను నడిపించును.

దేవుని వాక్యము శరీరముయొక్క నిజస్థితిని చూపెట్టును. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. ఆత్మసంబంధమైన అవిశ్వాసమును, శరీర సంబంధమైన రహస్య కోర్కెలను బహిర్గతము చేయును.

ఇక్కడ ప్రస్తావించబడినది బహిరంగ పాపములు కాదు గాని చెడుగంతటికిని మూలమైనట్టి అంతరంగిక ఆలోచనలు. దేవుని వాక్యము హృదయపు లోతులలోనికి వెళ్లి, మన జీవితములోని రహస్య ఆలోచనలు ఎంత “స్వార్థపూరితమో” వెల్లడిచేయును.

అంతేకాదు, ఇది దేవుని వాక్యము గనుక మనలను దేవునియెదుటికి తెచ్చును. దేవుని వాక్యము నాలో పసిగట్టినదానినంతటిని ఒప్పుకొనునట్లు నా హృదయమును తేటగా తనయెదుట నుంచుకొని దేవుడే నాతో మాటలాడుచున్నాడు.

ఇశ్రాయేలీ యులు అరణ్యములో నేలరాలుటకు కారణమేమి? “ప్రకటించబడిన వాక్యము వారికి ప్రయోజనకరము కాకపోయినందునా?” వారు దేవుని వాక్యమునకు తమ హృదయములలో చోటిచ్చియున్నయెడల, వారు విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆటంకపరచిన అవిశ్వాసమునకు కారణ మగు రహస్య పాపములను ఆ వాక్యము పరిష్కరించియుండును.

దేవుని విశ్రాంతి పొందుటకు మనము సాగిపోవుచుండగా మనలను ఆటంకపరచు సమస్తమును, మనము ఈ లోకమందే స్థిరపడునట్లు శోధించు సమస్తమును దేవుని సన్నిధిలో ఆయన వాక్యము పసిగట్టి తీర్పు తీర్చును.

ఆ విధముగా మానవాత్మ దేవుని విశ్రాంతిపై దృష్టి నిలిపి, యాత్రలో నిరాటంకముగా కొనసాగుచు, ప్రేమతో ప్రయాసపడగలదు.

(వచనము 14). దేవుని వాక్యము మన రహస్య తలంపులను శోధిం చుట మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు యాజక పరిచర్యద్వారా మనతో సహానుభవము పొందుటనుబట్టి మనకు ప్రయోజనము కలుగునట్లు సిద్ధపరచును.

మన హృదయములోనున్న రహస్య పాపములతో మనము పోరాడుట మాత్రమేకాదు, మన చుట్టూ దుర్బలత్వము ముసురుకొని యున్నది. అడుగడుగునా శోధనలు ఎదురగుచున్నవి.

మన హృదయ మందలి రహస్యమైన చెడుగును పరిహరించుటకు దేవుని వాక్యము అవసరము. మరియు శోధనలలో, కడగండ్లలో మనకు సహాయము కావలెనంటే సజీవుడైన వ్యక్తి కావలయును.

ఆయన మన విషయము శ్రద్ధ కలిగి, మనకు ప్రతినిధిగా ఉండవలెనంటే, ప్రతిక్షణము మన బలహీనతలను భరించువాడు కావలెనంటే మనవలెనే ఆయన అన్ని విషయములలో శోధింపబడి, కష్టములను ఎదుర్కొని యుండవలెను.

“దేవుని కుమారుడైన యేసు” అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవుని విశ్రాంతికి నడిపించు మార్గమందు ఆయన మన కంటే ముందుగా ఉన్నాడు. ఆయన ప్రతి అడుగు వేసియున్నాడు, ఆకాశమండలముగుండా వెళ్ళియున్నాడు. దేవుని విశ్రాంతిని చేరు కొన్నాడు.

మన అరణ్యయాత్రలో ఆయన విశ్రమించు స్థలములో మన మును విశ్రమించునట్లు అన్ని పరీక్షలలో, శోధనలలో, మన బలహీనత లన్నింటిలో ఆయన మనలను ఆదుకొనగలుగుచున్నాడు. చిట్టచివరకు శ్రమ అంతయు అంతమొందును.

అట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నందున మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టవలెనని హెచ్చరింపబడియున్నాము. యేసే క్రీస్తని, ప్రభువని ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుట మాత్రమే కాదు, మనము శ్రేష్టమైన పరలోక సంబంధమగు పిలుపులో పాలివారమని ఒప్పుకొనుట అవసరము.

మన ఒప్పుకోలు ఏదనగా పిలుపులో పాలివారముగా మనము దేవుని విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. పొంచియున్న ప్రమాద మేమనగా, శోధనలలో మన బలహీనతలనుబట్టి పరలోక సంబంధమైన పిలుపును విడిచిపెట్టి, లోకములో కాకున్నను, సేవా సంబంధమైన కార్య క్రమాలలో చురుకుగా పాల్గొనుచు అందులో స్థిరపడుటకు యత్నించుట.

(వచనము 15). మన ప్రధాన యాజకుని ఆదరణ, సానుభూతి మనకు అవసరము. ఎందుకనగా, మొదటిది మన బాధలనుబట్టి, రెండవది – మనము ఎదుర్కొనవలసిన శోధనలనుబట్టి.

మనము శరీర మందున్నాము కనుక అనారోగ్యమువలనను, ఆపదలవలనను మనకు బాధలు కలుగును. దానికి వివిధ అవసరతలు కలుగుచుండును. అనారోగ్యమునకును, ప్రమాదములకును అది లోనగుచుండును.

బాధలు పాపము కాదు గాని, అవి పాపమునకు దారితీయవచ్చును. ఆకలి అనునది బాధ, ఆకలినిబట్టి సణుగుట పాపము. పౌలు తన బాధలలో క్రీస్తు కృపాసమృద్ధిని అనుభవించియున్నాడు. అతడు పాపములో అతిశయించువాడు కాడు, పాపము చేయుటలో సంతోషించు వాడు కాడు.

2 కొరింథీ 12-9,10

విశ్వాసికి రెండు విధములుగా శోధనలు కలుగును. వెలుపలి పరీక్షల మూలముగా కలుగునవి, లోపలనున్న పాపము మూలముగా కలుగునవి. రెండు విధములైన శోధనలను యాకోబు మన యెదుటికి తెచ్చియున్నాడు. “మీరు నానావిధమైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” అనునది మొదటిది.

మనలను పరలోక పిలుపునుండి దారి తప్పించి, దేవుని విశ్రాంతి పొందుటకు ముందుకు సాగిపోకుండా నిరోధించుటకు మన శత్రువగు సాతాను వెలుపలినుండి అనేక శోధనలు మనమీదికి ఎక్కుపెట్టును. తరువాత అపొస్తలుడు మరియొక విధమైన శోధననుగూర్చి ఈ విధముగా వ్రాయుచున్నాడు. ఇది లోపల ఉన్న పాపము మూలముగా కలిగెడి శోధన.

యాకోబు 1-2,14

ప్రస్తుతము మనము ధ్యానించుచున్న హెబ్రీ పత్రికలోని వాక్యభాగము మొదటి రకపు శోధనను మనయెదుటికి తెచ్చుచున్నది. దేవుని వాక్యము నకు విధేయులగువారు పొందు దేవుని విశ్రాంతినుండి తప్పించు శోధన ఇది.

మన ప్రభువు దేవునికి విధేయుడుగానున్న మార్గమునుండి ఆయనను తప్పించుటకు అపవాది ఆకలి అను శోధనను ప్రయోగించినట్టే, మనలను కూడా శారీరక బలహీనతలను ఆధారము చేసుకొని శోధించి, మనలను దారితప్పించ యత్నించుచున్నాడు.

ఇట్టి శోధనలలో ప్రభువుయొక్క సాను భూతి మనకు లభించును. ఎందుకనగా, ఆయనకూడా “సమస్త విషయము లలో మనవలెనే శోధింపబడెను”. రెండవ రకపు శోధన ఆయన బొత్తిగా ఎరుగడు. ఆయన మనవలెనే సమస్త విషయములలో శోధింపబడినట్లు చెప్పినను, “ఆయన పాపము లేనివాడుగా ఉండెను” అని జోడింపబడినది.

(వచనము 16). బలహీనతలలో, శోధనలలో మనకొక ఆధార మున్నది. ఎట్టి కష్టములు మనము ఎదుర్కొనవలసినను, ఏ విధముగా పరీక్షించబడి, శోధింపబడినను, ఎట్టి అత్యవసర పరిస్థితులు ఉత్పన్న మైనను ఆ శోధనను ఎదుర్కొనుటకు చాలినంత కృప మనకు అందు బాటులో ఉన్నది.

కృపా సింహాసనము మనకు తెరువబడియున్నది. కృపా సింహాసనము అనగా దేవునియొద్దకు సమీపించవలసినదిగా మనము హెచ్చరింపబడుచున్నాము. మనము సమీపించవలసినది ప్రధాన యాజకుని కాదు, దేవునినే.

మన కొండిగా యేసు యాజకత్వము

మనము ధైర్యముగా కృపాసనమును సమీ పించగలము. ఎందుకనగా ప్రధానయాజకుడు మన ప్రతినిధిగా కృపాస నము యెదుట నున్నాడు. మనము సమీపించినప్పుడు సమయోచిత సహాయము లభించును.

విఫలులమైనందున కాదు, శోధనలలో వైఫల్యము చెందకుండునట్లు మనము కనికరము పొందుచున్నాము. అవసర సమ యము _ అపజయ సమయము కాదు. అయితే శోధనలు, పరీక్షలు కలిగినమీదట అపజయమునకు దారితీయవచ్చును.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – యాజకత్వపు నూతన క్రమము (అధ్యాయము 7)

యాజకత్వపు నూతన క్రమము (అధ్యాయము 7)

అయిదవ అధ్యాయము 11 వచనమునుండి ఆరవ అధ్యాయము చివరివరకు ఉన్న వాక్యములలో హెచ్చరిక, ప్రోత్సాహపు మాటలు చెప్పిన తరువాత అపొస్తలుడు – ఇప్పుడు అయిదవ అధ్యాయములోని గొప్ప అంశమును తిరిగి ప్రారంభించుచున్నాడు.

పునరుత్థానుడైన తరువాత క్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని సంబోధించుచు ప్రస్తావించి ఆ అధ్యాయములో యాజకత్వమునకున్న హుందాతనమును చాటెను.

ఏడవ అధ్యాయములో అహరోను యాజకత్వముకంటే క్రీస్తు యాజకత్వము శ్రేష్ఠమని చూపుచు ఆ యాజకత్వపు ఔన్నత్యమును మనయెదుట పెట్టుచున్నాడు.

యాజకత్వ క్రమమునకు, యాజక ధర్మమును నిర్వర్తించుటకు ఉన్న వ్యత్యాసమును గుర్తించుట ముఖ్యము. క్రమము విషయములో ఆలోచిం చినయెడల మెల్కీసెదెకు యేసుక్రీస్తు యాజకత్వమునకు చక్కగా సరి పోయిన ముంగుర్తు.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

యాజకత్వము నిర్వహించు విషయము ఆలోచించిన యెడల అహరోను చక్కగా సరిపోల్చుచున్నాడు. అహరోను క్రీస్తు జరిగించిన పనులకు ముంగుర్తుగానున్నాడు.

అహరోను యాజకత్వము బలులు, విజ్ఞాపన, దేవాలయపు సముదాయమును ప్రవేశపెట్టినది. మెల్కీసెదెకు యాజకత్వములో వీటి ప్రస్తావన లేదు. ఆ విధముగా ఏ ఒక్క వ్యక్తియు యేసుక్రీస్తు మహిమలకు పూర్ణమైన ముంగుర్తు కాదని వెల్లడియగుచున్నది.

(వచనములు 1, 2). ఈ వచనములలో రచయిత అబ్రాహాము జీవితములోని ఒక విశేషమైన సంఘటనను సూచించుచున్నాడు. పితరుడైన అబ్రాహాము తనను మించినవాడగు మెల్కీసెదెకును కొద్ది సమయము ఎదురుగా వచ్చి కలిసెను. అదీ ఆ సంఘటన.

ఈయన మన ప్రధాన యాజకుడగు దేవుని కుమారునికి ముంగుర్తుగా నుండునట్లు కొన్ని విషయములలో ఈ సంఘటన వెయ్యేండ్ల పాలనకు సాదృశ్యముగా నున్నది. దేవుని ప్రజలను బందీలుగా పట్టుకొనియున్న రాజులను సంహా రముచేసి తిరిగి వచ్చుచుండగా అబ్రాహామును మెల్కీసెదెకు ఎదుర్కొనెను.

ఆదికాండము 14-17-24

ఆయన పేరు, ఆయన దేశము చూడగా నీతి రాజనియు, సమాధానపు రాజనియు అర్థమిచ్చుచున్నది. దేవుడు రాజులను సంహరించి, తన ప్రజలను వారి శత్రువులనుండి, వ్యతిరేక శక్తులనుండి విడిపించుననుటకు సాదృశ్యముగా ఆయన పేరు “మహోన్నతుడగు దేవుని యాజకుడ”ని కూడా చెప్పబడినది.

స్థాయినిబట్టి చూడగా మెల్కీసెదెకు రాజు. ఆయన పాలన నీతి, సమాధానములతో కూడుకొనినది. ఆయన యాజకధర్మము జరిగించుటలో అబ్రాహాముకు దేవునికి మధ్యన నిలిచియున్నాడు.

మానవుని యెదుట దేవుని ప్రతినిధిగా దేవుని పక్షముగా అబ్రాహామును ఆశీర్వదించెను. దేవునియెదుట మానవుని ప్రతినిధిగా అబ్రాహాము పక్షముగా మహోన్నతు డగు దేవుని స్తుతించెను.

ఆయన దేవునినుండి మనిషికి ఆశీర్వాదములను తీసుకొని వచ్చి, మనిషినుండి దేవునికి స్తుతులను కొనిపోవును. రాబోవు వెయ్యేండ్ల పాలన కాలములో మనుష్యులు దేవునిని ‘మహోన్నతుడైన దేవునిగా’ తెలిసికొందురు.

భూసంబంధులైన తన ప్రజలను విడిపించి ప్రతి దుష్ట శక్తికి తీర్పు తీర్చును. అప్పుడు నిశ్చ యముగా ప్రభువు రాజుగా, యాజకుడుగా ప్రకాశించును. ఈ ప్రత్యక్ష ప్రవచనము ఆయననుగూర్చియే చెప్పుచున్నది.

జెకర్యా 6-13

ఆయనే నిజమైన నీతి రాజు, సమాధానపు రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు.

(వచనము 3). మెల్కీసెదెకు వంశము, జన్మ, లేదా మరణమును గూర్చిన వివరములేవియు ఇవ్వబడలేదు. ఉద్దేశ్యపూర్వకముగానే ఆయన చుట్టూ మర్మము అలముకొనియున్నట్లు గ్రహించగలము.

ఆయన విషయము వ్రాయబడినదేమనగా “తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడు”.

ఆయన ఎక్కడినుండి వచ్చెనో ఏమీ తెలియకయే రంగమందు కనిపించెను. ఎక్కడికి వెళ్ళెనో తెలియకయే ఆయన వృత్తాం తము ముగిసెను. ఆయననుగూర్చి ఒక విషయము వ్రాయబడినది.

అహరోనుకు పూర్తి భిన్నముగా “ఆయన నిరంతర యాజకుడు”. ఇన్ని విధములుగా ఆయన దేవుని కుమారునివంటివాడుగా చేయ బడెను.

అందువలన నిరంతరము యాజకుడుగానున్న దేవుని కుమారుని యాజకత్వపు హుందాతనమును చక్కగా చూపెట్టుచున్నాడు.

(వచనములు 4-7). ఈ వృత్తాంతములో మెల్కీసెదెకు యాజకత్వము అహరోను యాజకత్వముకంటే శ్రేష్టమైనదని ఇతర సంఘటనలును వివరించుచున్నవి.

వాటిని మనము ఆలోచించవలెను. మొదటిది, ఈ రాజ యాజకుడు ఎంత గొప్పవాడనగా, పితరుడగు అబ్రాహాము కొల్ల సొమ్ములో ఇతనికి పదియవ భాగమిచ్చెను.

యాజక ధర్మము జరిగించు నప్పుడు “ప్రజలనుండి పదియవ వంతు పుచ్చుకొను” లేవీ కుమారులు కూడా అబ్రాహాము వంశమువారే. వారు పదియవ భాగము తీసుకొనినను తమ పితరుడగు అబ్రాహామునందు వారుకూడా మెల్కీసెదెకుకు పదియవ భాగము ఇచ్చిరి.

మెల్కీసెదెకు అబ్రాహామునుండి పదియవ భాగము పుచ్చుకొనుట మాత్రమేకాదు, వాగ్దానమునకు వారసుడగువానిని ఆశీర్వదించెను.

“అతడు ఆశీర్వదించబడెను, అతని సంతానము భూలోకమందలి సకల జాతులకు ఆశీర్వాద కారణముగానుండున”ని ఎవరిని గూర్చి చెప్పబడెనో ఆ అబ్రాహామును ఇతడు ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువవానిచేత ఆశీర్వదించబడునను మాట నిరాక్షేపమైనది.

(వచనములు 8-10). అహరోను, అతని సంతానము విషయమాలో చించగా వారు చావునకు లోనైనవారు, అయినను పదియవ వంతు పుచ్చుకొందురు. మెల్కీసెదెకు విషయములో ఆయన మరణమును గూర్చిన ప్రస్తావనే లేదు.

ఆ క్రమమును పరిశీలించగా ఆయన జీవించుచున్నాడను సాక్ష్యమున్నది. ఆ విధముగా అహరోను క్రమములోని యాజకులు పదియవవంతులు స్వీకరించి, ఆశీర్వదించుటకు బదులు తమ పితరుడగు అబ్రాహామునందు పదియవ వంతులు ఇచ్చి ఆశీర్వాదములు పొందిరి.

చావునకు లోనైన వారుగా వీరు, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవానికి పదియవ వంతులు చెల్లించిరి. దీనినిబట్టి అహరోను యాజకత్వముకంటే మెల్కీ సెదెకు యాజకత్వము ఎంతో శ్రేష్టమైనదని విశదమగుచున్నది.

(వచనము 11). అహరోను యాజకత్వముకంటే మెల్కీసెదెకు యాజ కత్వము శ్రేష్టమైనదనుట అహరోను యాజకత్వము పరిపూర్ణమైనది కాదనుటకు స్పష్టమైన ఋజువుగా నున్నది.

అహరోను యాజకత్వ లక్షణ ములు తాత్కాలికమైనవి. పని విషయములో చూడగా అసంపూర్ణమైనది. ఈ పత్రికలో తరువాత మనము నేర్చుకొనునదేమనగా ఆ యాజకత్వము మనస్సాక్షికి శాశ్వతమైన నివారణ కలుగజేయలేదు.

ఆరాధకుడు దేవుని సమీపించుటకు వీలు కలుగజేయలేదని అర్థమగుచున్నది. ఈ అసంపూర్ణ తయే మెల్కీసెదెకు క్రమము తరువాత మరియొక యాజకుడు రావలసిన అగత్యమును ఋజువుపరచుచున్నది.

అట్టి యాజకుని ఒకే ఒక సంపూర్ణు డైన యేసుక్రీస్తులో మనము కనుగొనుచున్నాము.

(వచనములు 12-14). యాజకత్వ క్రమములో మార్పు రావలెనంటే ధర్మశాస్త్రములోకూడా మార్పు అవసరమైనది. క్రీస్తు యూదా గోత్రమునకు చెందినవాడు. మోషే ధర్మశాస్త్రములో ఆ గోత్రమునుండి ఎవరునూ యాజకత్వమునకు పిలువబడలేదు.

(వచనములు 15-17). మన ప్రభువు యూదా గోత్రములో పుట్టినను యాజకుడుగా ఉండుటకు పిలువబడినట్లు తేటగా నున్నది.

క్రీస్తు మెల్కీసెదెకు యాజకత్వముతో పోల్చబడినను, ఆయన యాజకత్వము లోకసంబంధమైన ఆజ్ఞలవలన కలిగినది కాదు.

ఆ విధముగా శరీర సంబంధముగా వచ్చియున్నయెడల ఆ యాజకులు చావునకు లోనగుదురు. కనుక మరణానంతరము మరియొక యాజకుడు వచ్చు ఏర్పాటు కలదు.

ఇందుకు భిన్నముగా క్రీస్తు యాజకత్వము ప్రత్యేకముగా నున్నది. ఎందుకనగా అది అనంత జీవముయొక్క శక్తి ననుసరించినది.

ప్రభువు యాజకత్వము ఒక జీవిత కాలమునకు పరిమితమైనది కాదు. ఆయన యాజకుడని పిలువబడినందున నిరంతరము యాజకుడైయున్నాడు.

(వచనములు 18, 19). యాజకత్వమును గూర్చి మోషే ఇచ్చిన ఆజ్ఞ బలహీనము, నిరుపయోగమునైనందున ప్రక్కన పెట్టబడినది.

అది ఎందువలన బలహీనమైనదనగా యాజకుడు చావుకు లోనైనవాడు గనుక దానిని కొనసాగించలేడు. బలి అర్పించు వ్యక్తిని దేవునియెదుట తీర్పు భయములేక నిర్మలమైన మనస్సాక్షి కలిగినవానిగా అది ఉంచలేకపోయెను గనుక అది నిరుపయోగమైనది.

ధర్మశాస్త్రములో సంపూర్ణము చేయగలవి ఏవియు లేవుగాని, అది శ్రేష్టమైనవాటిని సూచించునది మాత్రమే. క్రీస్తు యాజకత్వముద్వారా శ్రేష్టమగు నిరీక్షణ తెచ్చినట్లయినది.

పోల్చుము 9-21,22

(వచనములు 20-22). అహరోను యాజకత్వముకంటే క్రీస్తు యాజకత్వము శ్రేష్టమైనదన్న వివరణ కొనసాగుచున్నది. అహరోను యాజకత్వమునకు భిన్నముగా క్రీస్తు యాజకత్వపు పిలుపు ప్రమాణముచేత స్థిరపరచబడినది.

దీనిని ఋజువు చేయుటకు అపొస్తలుడు కీర్తన 90:4 ను ఉదహరించెను. ప్రమాణముద్వారా లేవీ యాజకత్వమువలె క్రీస్తు యాజకత్వము రద్దుపరచుట గాని, ప్రక్కనబెట్టుట గాని జరుగదు.

యేసు క్రీస్తు జరిగించిన పనిమీద ఆధారపడిన క్రొత్త నిబంధన ఆశీర్వాదములను ఈ ప్రమాణము మరింత ధృవపరచుచున్నది.

(వచనములు 23, 24). ధర్మశాస్త్రముక్రింద యాజకులను నియ మించుట తరచుగా జరిగెడిది. అయితే మరణము మూలముగా వారు దానిని శాశ్వతముగా కొనసాగించ వీలులేకపోయెను.

యాజకుడు కొంత మేరకు తాను ఎవరి పక్షముగా యాజకత్వము జరిగించుచున్నాడో వారితో సహానుభూతి పొంది, వారిని ఆదుకొనగలడు. అయితే మరణము దానికి విఘాతము కలిగించును.

మరియొక యాజకుడు అతని స్థానములో వచ్చును. మొదటి యాజకునికి సమీపముగా వెళ్ళిన ఆరాధకులకు ఈ యాజకుడు క్రొత్తవాడగును. అందువలన వారి శ్రమలలో సహానుభూతి పొందలేడు.

క్రీస్తు విషయములోనైతే ఎంత వ్యత్యాసము! ఆయన మరణ మును జయించినందున మార్పులేని యాజకత్వమును కొనసాగించు చున్నాడు. “నీవు నిరంతరము నిలిచియుందువు. నీవు ఏకరీతిగానే యున్నావు” (1:11,12).

(వచనము 25). క్రీస్తు యాజకత్వపు శ్రేష్టత్వమును చూపెట్టిన తరువాత, ఆ యాజకత్వముద్వారా సంక్రమించు ఆశీర్వాదములను అపొస్తలుడు మదింపు చేయుచున్నాడు.

నిరంతరము జీవించువాడును, మార్పులేనివాడును, మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిగల ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక ఈ అరణ్యయాత్రలో ఉండగానే ఆయనద్వారా మనము తండ్రిని సమీపించవచ్చును.

ఆయన మనలను ప్రతి శత్రువు నుండి రక్షించును. మనలను దేవునియొద్దకు నడిపించును. మరియు మన బలహీనతలన్నిటిలో మన పక్షముగా విజ్ఞాపన చేయును.

(వచనములు 26, 27). “ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరి పోయినవాడు” అని అపొస్తలుడు పత్రికలోని ఈ భాగమును ముగించెను.

రెండవ అధ్యాయము 10వ వచనములో ఆ ప్రధాన యాజకుడు ‘దేవుడు’ అని నేర్చుకుంటిమి. ఇక్కడ “మనకు సరిపోయినవాడు” అనగా మనవంటి వాడాయెనని భావము.

దేవుడు పరిశుద్ధుడు గనుక క్రీస్తు తప్ప ప్రధాన యాజకుడుగా ఉండగలవారెవరు? మనము బలహీనులమైయుండగా క్రీస్తుమాత్రమే మనకు అందుబాటులోనికి రాగలిగెను.

ఆయన సహజ పరిశుద్ధతనుబట్టి, అనగా ఆయన తలంపులలోని స్వచ్ఛతచేతను – సాధు గుణముగలవాడై ఒక్క చెడు తలంపైనను లేకుండుటవలనను ఆయన మనకు సరిపోయినవాడాయెను.

ఈ లోకములో ఉండగా ఆయన నిష్కల్మ షుడుగా ఉండెను. లోకముయొక్క భ్రష్టత్వము ఆయన దరిచేరలేదు.

ఆయన సిలువపై తనను తాను అర్పించుకొనినప్పుడు, పాపములకొరకైన పని ముగించినప్పుడు ఆయన అత్యున్నతముగా హెచ్చింపబడెను.

(వచనము 28). ఆ విధముగా ప్రమాణపూర్వక వాక్యముద్వారా ఆయన శాశ్వతకాలము యాజకునిగా ప్రతిష్టింపబడెను. ధర్మశాస్త్రము క్రింద నియమింపబడిన యాజకులు అందుకు భిన్నముగా బలహీనతలతో నిండిన వ్యక్తులుగా ఉండిరి.

ఈ అధ్యాయమంతటి సారాంశమేమనగా, మనయెదుట మెల్కీసెదెకు ముంగుర్తుగా క్రీస్తు యాజకత్వపు గొప్పతనము ఉంచబడినది. (1-3 వచనములు).

లేవీయుల యాజకత్వముకంటే మెల్కీసెదెకు యాజకత్వము శ్రేష్టమైన దని వెల్లడించుటనుబట్టి క్రీస్తు యాజకత్వముయొక్క ఔన్నత్యము విశద మగుచున్నది.(4-10 వచనములు).

లేవీయ యాజకత్వమందలి అసంపూర్ణతలు, యాజకత్వపు మార్పుకు దోహదము చేసినవి. (11వ వచనము).

యాజకత్వపు మార్పువలన భూసంబంధమైన యాజకత్వము విషయ ములో ధర్మశాస్త్రమునుకూడా మార్చవలసివచ్చెను. (12-19 వచనాలు).

క్రీస్తు యాజకత్వము ప్రమాణ వాక్యముతో స్థిరపరచబడెను. (20-22 వచనములు).

క్రీస్తు యాజకత్వము నిరంతరముండునది మరియు మార్పులేనిది. (23, 24 వచనములు). యాజక పరిచర్యకు క్రీస్తు సంపూర్ణముగా తగినవాడు. (25వ వచనము).

యాజక ధర్మము నెరపుటకు క్రీస్తుకుగల వ్యక్తిగత యోగ్యతను గమనించండి. (26-28 వచనములు).

హెబ్రీ విశ్వాసుల ఆత్మీయ స్థితి

హెబ్రీ విశ్వాసుల ఆత్మీయ స్థితి (అధ్యాయము 5:11 – 6:20).

హెబ్రీ పత్రికలో ప్రస్తుత భాగము క్రీస్తు యాజకత్వపు శ్రేష్ట లక్షణము లను వివరించుట అపొస్తలునియొక్క గురిగా ఉన్నది.

ఇక్కడ యేసుక్రీస్తు యాజకత్వపు హుందాతనమును సూచించుటకు మెల్కీసెదెకు యాజకత్వపు సామ్యమును చూపెట్టి, రచయిత తన సందేశమును ఆపివేసి, తిరిగి 7వ అధ్యాయము ప్రారంభములో దానిని మొదలు పెట్టెను.

ఈ మధ్యలోగల వచనములలో అపొస్తలుడు తన పాఠకుల ఆత్మీయ స్థితిని చూపుచున్నాడు. ఆత్మీయముగా వారు మందులగుటవలన తీవ్ర సమస్యలలోను, గొప్ప ప్రమాదములలోను ఉన్నారు.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

వారు పాత నిబంధన సంకేతములకు భాష్యము చెప్పలేకపోవుటయే ఆ సమస్య. ఇది 5:11; 6:1-3 లో సూచింపబడియున్నది. ఆత్మీయముగా వారు చాలా తగ్గు స్థాయిలో నున్నందున కొందరు క్రైస్తవ్యమును వదలి యూదా మతమునకు మరలు ప్రమాదమున్నది.

ఈ ప్రమాదము 6:4-8 లో వివరించబడినది. ఈ మధ్యగల వచనములలోని మిగిలిన భాగములో తన పాఠకుల విషయమై అపొస్తలుని నమ్మిక, నిరీక్షణ వెల్లడించబడినది. (6:9-20).

ఆత్మీయ జ్ఞానమునకు అవరోధము (5:11 – 6:3).

(వచనములు 11-13). అపొస్తలుడు చూపుచున్న ఈ పాఠకులు సత్యము ఎరుగనివారు కాదు, విశ్వాసములో క్రొత్తవారుకూడా కాదు. లేఖనములు అర్థము చేసుకొనని స్థితిలో వారు లేరు.

అసలు సమస్య ఏమనగా వారు “వినుటలో మాంద్యులైరి” కనుక వారిలో ఆత్మీయ ఎదుగుదల స్తంభించిపోయెను. వారు బోధకులుగా ఉండవలసిన కాలము వచ్చినది.

అయితే విచారకరమైన విషయమేమనగా దేవోక్తులలోని మూలపాఠములు సహితము వారికి మరల నేర్పించవలసిన ఆవశ్యకత ఏర్పడినది. వారు బలమైన ఆహారము తినువారుగాక పాలు త్రాగువారుగా ఉన్నారు.

ఇక్కడ అపొస్తలుడు పాలయొక్క ఆహార ప్రాధాన్యతను తగ్గించి మాటలాడుటలేదు. వారు పాలు త్రాగుచున్నారంటే ఆత్మీయముగా శిశువు లనియు, దేవుని నీతియందు వారింకను స్థిరపరచబడవలసియున్న దనియు ఋజువగుచున్నది.

(వచనము 14). మనలను సంపూర్ణమైన క్రైస్తవ సత్యములోనికి నడిపించవలెనని అపొస్తలుని కోరిక. అదే బలమగు ఆహారము.

ఇది దేవునియెదుట ఆయన కుమారుడుగా స్థిరపరచబడిన పరిణతి గలిగిన క్రైస్తవులకు చెందినది. అలాంటివారు మందబుద్ధులు కాక, మంచి చెడ్డలు వివేచించగలరు.

(వచనములు 6:1-3). విశ్వాసుల ఆత్మీయ పురోభివృద్ధికి అవరో ధములేమిటో అపొస్తలుడు వివరించుచున్నాడు. కొరింథులోనున్న పరిశుద్ధులకు మనుష్య జ్ఞానము, తత్వము అడ్డుగా నున్నవి.

1 కొరింథీ 1-3 అధ్యాయములు

హెబ్రీ విశ్వాసులకు వారి పూర్వపు మతము అవరోధముగా నున్నది. అని జె. యన్. డార్బీ భక్తుడు చెప్పియున్నాడు.

ఈ హెబ్రీ విశ్వాసులవలెనే నేడు క్రైస్తవ లోకములో దేవుని వాక్య జ్ఞానము కొరతగా నున్నందున సంప్రదాయములకు, మతాచారములకు ప్రజలు అంటిపెట్టుకొనుచున్నారు.

బాహ్యాచారములు ఉద్రేకములను రెచ్చగొట్టు మతకాండలు ప్రకృతి సంబంధులగు మనుష్యుల మానసిక అక్కరలు తీర్చును గనుక వారు దేవుని వాక్యమందు వెల్లడించబడిన దేవుని కృపాసువార్తను చూడలేక గ్రుడ్డివారుగా ఉన్నారు.

ఈ ఉరినుండి తప్పించుకొనుటకు “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోవుదము” అని అపొస్తలుడు హెచ్చ రించుచున్నాడు.

యూదా మతములో సిలువకు పూర్వమున్న కొన్ని ప్రాథ మిక సత్యములను తరువాత అతడు ఉదహరించెను. అవి ఆత్మీయముగా బాల్యదశకు తగినవి.

ఈ సత్యములకు భిన్నమైన క్రైస్తవ్యమునందు వెల్ల డించబడిన యేసుక్రీస్తు వ్యక్తిత్వమును, ఆయన పనిని అపొస్తలుడు వివరించియున్నాడు. దీనినే ఆయన పరిపూర్ణత యనుచున్నాడు.

క్రీస్తు రాకడకు పూర్వమున్న సత్యములను పట్టుకొని వ్రేలాడుచున్నందున వీరు క్రైస్తవ్యములోని క్రీస్తు ప్రత్యక్షతలో సంపూర్ణసిద్ధి పొందలేకపోయిరి.

నిర్జీవ క్రియలు విడిచి మారుమనస్సు పొందుట, దేవునియందు విశ్వాసము, శుద్ధీకరణాచారము, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థా నము, నిత్య తీర్పు అను విషయములను ఇక్కడ అపొస్తలుడు ప్రస్తా వించెను.

ఇవన్నియు యేసుక్రీస్తు శరీరధారి కాక పూర్వము అమలులో నుండెను. ఇక్కడ ఆయన చెప్పిన విశ్వాసము యేసుక్రీస్తునందు వ్యక్తిగత విశ్వాసము కాదు, దేవునియందు విశ్వాసము.

శుద్ధీకరణాచారము అనగా క్రైస్తవ బాప్తిస్మము కాదు, యూదుల శుద్ధీకరణాచారము. హస్త నిక్షేపణ యనగా ఇశ్రాయేలీయులు బలి ఇచ్చునప్పుడు బలి జంతువుపై చేతు లుంచి, దానితో తమను తాము గుర్తింపజేసికొనుట.

మృతుల పునరుత్థాన మనగా క్రైస్తవ్యములో ఉన్నట్టి మృతులలోనుండి తిరిగిలేచుట. యోహాను సువార్త 11వ అధ్యాయములో మార్త మృతుల పునరుత్థానమును నమ్మెను.

కాని, మృతులలోనుండి కొందరు పునరుత్థానులు కానుండగా మరి కొందరు మృతులుగానే ఉందురను క్రైస్తవ సత్యమును ఆమె గ్రహించుట కష్టమైనది.

పాత నిబంధన సత్యములలో దేనినీ తిరస్కరించవలెనని అపొస్తలుడు చెప్పుటలేదుగాని, పాక్షిక వెలుగునుండి క్రైస్తవ పరిపూర్ణతయను సంపూర్ణ వెలుగులోనికి రమ్మని పిలుచుచున్నాడు.

దేవుడు సెలవిచ్చినయెడల మన మాలాగు చేయుదమనుచున్నాడు. వీటివైపు తిరిగిమళ్ళుట మరల పునాది వేయుటే యగును. ఇది క్రైస్తవ పునాది కాదు, యూదా మత పునాది.

భ్రష్టత్వమను ప్రమాదము (6:4-8).

(వచనములు 4-6). యూదా విశ్వాసులు ఆత్మీయ విషయములలో మందులైనందున ఎదురైన సమస్యలను ఎదుర్కొనుట ఎట్లో వివరించిన తరువాత, అపొస్తలుడు వారు ఎట్టి ప్రమాద పరిస్థితిలో ఉన్నారో హెచ్చ రించుచున్నాడు.

వారు యూదా మత ఆచారములను, సంప్రదాయాలను పట్టుకొని వ్రేలాడుతూ ఉండుటనుబట్టి స్పష్టమగునదేమనగా, కొందరు క్రైస్తవ సత్యముచే వెలిగింపబడి, దాని ఆధిక్యతలను రుచిచూచిన తరువాత తప్పిపోయి యూదా మతమునకు మళ్ళియుండవచ్చును.

అట్టివారు మరల మారుమనస్సు పొందుట అసాధ్యము. ఇక్కడ “తప్పిపోయినవారు” నిజమైన విశ్వాసులు కాదు నామకార్థులు అని గ్రహించవలెను. ఈ భాగములో ప్రస్తావించిన “వెలిగింపబడుట” క్రొత్త జన్మ లేదా నిత్యజీవమును సూచించునది కాదు.

క్రైస్తవ్యములోని బాహ్య ఆధిక్యతలు, పరిశుద్ధాత్మ వారితో ఉండుట, దేవుని వాక్య శ్రేష్టత్వము, క్రైస్తవ పరిధిలో బహిరంగముగా వెల్లడియగు శక్తి ఈ భాగములో వివరించబడియున్నవి.

ఇవన్నియు క్రైస్తవుల మధ్యకు వచ్చినవారు, ఆత్మీయ జీవము వారిలో లేకున్నను అనుభవించవచ్చును. అట్టివారు క్రైస్తవుల మధ్య ఉండి, బాహ్య మగు ఆధిక్యతలను అనుభవించి, తిరిగి యూదా మతములో కలిసిపోవు అవకాశమున్నది.

ఆ విధముగా చేయుటవలన వారు మెస్సీయాను సిలువవేయుటతో ముగిసిన వ్యవస్థలోనికి వెళ్ళుచున్నారు. వాస్తవముగా దేవుని కుమారుని సిలువవేసినది వారే. వారు బాహాటముగా ఆయనను అవమానపరచియున్నారు.

వారు క్రీస్తును, క్రైస్తవ్యమును ప్రయత్నించి యూదా మతమే మేలని గుర్తించియున్నారు. వారిలో దైవిక జీవమున్నదనిగాని, వారి ఆత్మలో దైవకార్యము జరిగినట్లుగాని అపొస్తలుడు నమ్ముటలేదు.

వారు కేవలము క్రైస్తవ్యములోని బాహ్య ఆధిక్యతలను క్రైస్తవుల మధ్య అనుభవించిరి. ఈ విధముగా ఈ భాగములో ఎదురగు సందేహములకు నివృత్తి కలుగును.

(వచనములు 7, 8). అపొస్తలుడు ఉపయోగించిన దృష్టాంతము అర్థవంతముగా నున్నది. భూమిపైని పైరులు, ముండ్లతుప్పలు ఆకాశము నుండి కురియు వర్షమును సమానముగా అనుభవించును. అయితే పైరులు పంటనిచ్చును, ముండ్లపొదలు కాల్చబడును.

ఆదరణ – ప్రోత్సాహము (6:9-20).

(వచనములు 9-12). హెబ్రీ విశ్వాసులకు వారున్న దీనస్థితిని గుర్తుచేసి, భ్రష్టత్వమను ప్రమాదము విషయము హెచ్చరించి, ఇప్పుడు అపొస్తలుడు వారిపై తనకున్న నమ్మికను, నిరీక్షణను వెల్లడించుచు విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు.

అపొస్తలుడు వారిని హెచ్చరించినను తప్పిపోయినవారు అను విషయము వీరికి అన్వయించుటలేదు. అందుకు భిన్నముగా వారిలోనున్న మంచి విషయములను, రక్షణ తరువాత జరుగు వాటిని గుర్తుచేయుచున్నాడు.

క్రైస్తవుల మధ్యనున్నప్పుడు రక్షింపబడక పోయినను 4-8 వచనములలో చెప్పబడినరీతిగా కొంతమేరకు బాహ్య మగు ఆధిక్యతలు పొందుట సాధ్యమేనని స్పష్టముగా చెప్పుచున్నాడు.

రక్షించబడిన తరువాత ఒక వ్యక్తిలో కన్పించు లక్షణములు అతనిలో దైవిక జీవమున్నదనుటకు నిదర్శనము. అది “ప్రేమ”, “నిరీక్షణ” మరియు “విశ్వాసము”. వారు ఎల్లప్పుడు దేవుని ప్రజలకు పరిచర్య చేయుటవలన వారిలో ప్రేమ ఉన్నదని ఋజువగును.

యేసుక్రీస్తు ప్రేమచేత ప్రేరితులై చేసిన ప్రేమ పరిచర్యను దేవుడు మరచిపోడు. ఇట్టి ప్రేమకు సంపూర్ణ బహుమానము రాబోవు దినమున లభించును. దీనినిబట్టియే మన యెదుట ఉన్న “నిరీక్షణ”నుబట్టి అపొస్తలుడు మాటలాడెను.

ఈ యూదా విశ్వాసులు ఓపికగా ప్రేమతో సత్కార్యములు జరిగించుచు, సువార్త ప్రయాసకు ప్రతిఫలమగు విశ్రాంతి మరియు బహుమానములయందు నిరీక్షణ కలిగియుండవలెనని ఆశించెను.

సేవ చేయుటకు ప్రేరణ బహుమానము కాకూడదని అపొస్తలుడు చెప్పుచున్నాడు. “ఆయన నామముపట్ల ప్రేమ” దానికి కారణము అని అతడు స్పష్టము చేసెను.

శ్రమలలో ప్రోత్సాహము కలిగించుటకు బహు మానమిచ్చుట కలదు. అంతమువరకు సహించుటకు విశ్వాసము, సహనము అవసరము.

“విశ్వాసముచేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన దేవుని ప్రజలను పోలి నడచుకొనవలెనని అపొస్తలుడు హెచ్చరించుచున్నాడు.

వారు భవిష్యత్తులో కలుగు ఆశీర్వాదములకొరకు విశ్వాసముతో కనిపెట్టుకొనిరి. గనుక అరణ్య సంబంధమగు శోధనలను ఓపికతో సహించిరి.

(వచనములు 13-15). విశ్వాసమునకు ఆలంబనగా ఒక సంపూర్ణ అధికారము అవసరము. ఇప్పుడు అపొస్తలుడు పితరుల చరిత్రవైపు మళ్ళి దేవుని వాక్యమను స్థిరమగు పునాదిపై విశ్వాసము వ్యక్తపరచిన అబ్రాహామును చూపించుచున్నాడు.

అబ్రాహాము విషయములో దేవుడు ఈ వాక్యమును ఒక ప్రమాణముద్వారా స్థిరపరచెను. అబ్రాహామును సంపూర్ణ ఆశీర్వాదములలోనికి నడిపింతునని దేవుడు తన వాక్యముతో ప్రమాణము చేసెను. ఆ మాట నమ్మినందువలన అబ్రాహాము ఓర్పుతో శోధనలన్నిటిని సహించి వాగ్దానఫలము అనుభవించెను.

(వచనములు 16-18). దేవుడు ఇచ్చిన ఆయన వాక్యము, ఆయన ప్రమాణము అను ఈ రెండంతల అభయము నిచ్చినది అబ్రాహాము ఒక్కడికి మాత్రమే కాదు.

ఆ విధముగా దేవుడు ఏ సూత్రములపై ఆధారపడి క్రియ జరిగించినాడో ఆ సూత్రములు, పూర్వకాలమందు పితరులతో వ్యవహరించిన తీరు “మనకు బలమైన నిరీక్షణ కలుగునట్లు” విశ్వాస సంబంధులకుకూడా వర్తించును.

దేవుడు తన దయాపూర్వక కృపలో తన వాక్యము మార్పులేనిది అను వాగ్దానమునకు వారసులైనవారిని తన దయాపూర్వక కృపలో ఒప్పించుటకు తాను చేసిన వాగ్దానమును ప్రమాణముతో దృఢపరచెను.

మనుష్యులు పరస్పరము వ్యవహరించు విషయములలోకూడా ఇట్లే చేయుట కద్దు. తనకంటే గొప్పవానిపేరున ప్రమాణము చేయు అవకాశము లేనందున దేవుడు తన పేరనే ప్రమాణము చేసెను.

ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా దానిని కనుపరచ వలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని తన వాక్యము, ప్రమాణమను రెండు నిశ్చలమైన సంగతులను మన ఎదుట ఉంచెను.

ఈ రెంటి విషయములలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. ఆ విధముగా మార్గమందు ఎదురగు కష్టములనుబట్టి వెనుకకు మళ్ళక, తమయెదుట ఉన్న నిరీక్షణను గట్టిగా చేపట్టి క్రీస్తు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించెను. ఇక్కడ ఆశ్రయపురముల సామ్యము ప్రస్తావించియున్నాడు.

యూదులు తమ మెస్సీయానే హత్యగావించి, తమ నెత్తిమీదికి తీర్పు కొనితెచ్చుకొనిరి. విశ్వసించిన ఆ కొద్ది శేషమువారు వారి పాపమునుండి వేరై సజీవుడైన మహిమగల క్రీస్తును ఆశ్రయించిరి.

(వచనములు 19, 20). క్రీస్తును ఆశ్రయించిన విశ్వాసికి స్థిరమైన, నిశ్చలమైన నిరీక్షణ కలదు. ఎందుకనగా మన ప్రధాన యాజకుడు పరలోకమందలి తెరలోపల ప్రవేశించెను.

క్రీస్తు మన పక్షముగా దేవునియెదుట ప్రధానయాజకునిగా, ఆగమన దూతగా కనిపించు చున్నాడు. ఆగమన దూత తన తరువాత మరికొందరు వచ్చుచున్నారని సూచించుచున్నాడు.

మనకున్నది దేవుని వాక్యముమాత్రమే కాదు. మహిమలో సజీవుడైన క్రీస్తు మనము పొందనున్న మహిమకు సాక్షిగా, మనము అక్కడ ఉందుమనుటకు అభయముగా ఉన్నాడు.

మనము పరలోక విశ్రాంతికి చేరువరకు, మార్గమందు మనలను బలపరచునది మన ప్రధాన యాజకుడగు క్రీస్తే. నాలుగవ అధ్యాయము చివరిలోవలెనే ఇక్కడకూడా అపొస్తలుడు దేవుని వాక్యమును, సజీవుడైన క్రీస్తును మనయెదుట ఉంచుచున్నాడు.

మన విశ్వాసమునకు స్థిరమైన పునాది దేవుని వాక్యమే. సజీవుడైన క్రీస్తు మన ఆత్మలకు లంగరువలె ఉన్నాడు. ఆయన మనలను పరలోకముతో అనుసంధానముచేసి, జీవిత తుపాను లలో ప్రశాంతతనిచ్చువాడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – క్రొత్త నిబంధన

క్రొత్త నిబంధన (అధ్యాయము 8)

ఏడవ అధ్యాయంలో క్రీస్తు దేనికి పిలువబడెనో ఆ నూతన యాజకత్వ క్రమము వివరించబడినది. అది లేవీయ యాజకత్వపు ధర్మశాస్త్రముకంటే, మరియు అహరోను యాజకత్వముకంటే శ్రేష్టమైనదని నేర్చుకొంటిమి.

ఈ అధ్యాయములో మనము నేర్చుకొనునదేమనగా యాజకత్వ నియామకమునకు మోషే ధర్మశాస్త్రమును ప్రక్కనబెట్టుటమాత్రమే కాదు, క్రొత్త ఆరాధకులు, నూతన దేవాలయములో, నూతన బలులు అర్పించు క్రొత్త నిబంధనకుకూడా దారి తెరచినది.

ఈ అధ్యాయములోని రెండు ప్రధానాంశములు – ప్రస్తుతము క్రీస్తు పరలోక సంబంధమగు యాజ కత్వము జరిగించుట. (1-5 వచనములు). రెండవదిగా, అందులో క్రొత్త నిబంధన స్ఫురించుట. (6-13 వచనములు).

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

(వచనములు 1, 2). ఇంతవరకు వివరించిన సత్యముల క్లుప్త సారాంశముతో ఈ అధ్యాయము ప్రారంభమైనది.

ఒక ప్రధాన యాజకు డున్నాడని అపొస్తలుడు చెప్పక, “మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు” అని చెప్పుచున్నాడు.

మెల్కీసెదెకు క్రమముచొప్పున ప్రధాన యాజకునిగా ఉండుటకు పిలువబడిన ఈ మహోన్నత మహిమాన్విత వ్యక్తి మనకు పరిచారకుడాయెను.

మన బలహీనతలలో సహాయము కొరకు, వేదనలో సానుభూతికొరకు ఆశ్రయించవలసినవాడు ఆయనే.

మన ప్రధాన యాజకుడు “పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండుటను బట్టి ఆయన ఎంత ఉన్నతమైనవాడో అపొస్తలుడు తెలియజేయుచున్నాడు.

పరలోకమందలి హెచ్చింపబడిన ఆయన స్థానము, ఆయన దేవునికి సమీపముగా నుండుటను వెల్లడించెను.

పైగా, ఆయన “పరిశుద్ధాలయములో” పరిచారకుడు. ఇది మనిషి స్థాపించిన భూసంబంధమగు గుడారము కాదు. దేవుడే స్థాపించిన గుడారము. పత్రికలో తరువాత ఇది “పరలోకము” అని చెప్పబడినది.

(9:24). పరిశుద్ధాలయమునుగూర్చి ప్రస్తావించుటనుబట్టి క్రీస్తు యాజ కత్వములో మరియొక భాగమున్నట్టు గ్రాహ్యమగుచున్నది.

ఇది మన అరణ్యయాత్రలోని శోధనలలో ఆదుకొనునట్టి, వేదనలలో సహానుభూతి పొందునట్టి, బలహీనతలలో బలపరచునట్టి పరిచర్య కాదు గాని ఆరాధకు లను దేవునియెదుటకు నడిపించు ఉన్నతమగు పరిచర్య.

అరణ్య యాత్ర లోని పరిస్థితులలో ఆయన మనకు చేయు పరిచర్యనుగూర్చి 2-7 అధ్యాయములలో వివరించబడినది.

ఆయన యాజక పరిచర్యద్వారా పరిశుద్ధాలయములో ఆరాధనకు మనలను నడిపించుచున్నట్లు 8-10 అధ్యాయములు తేటగా వివరించుచున్నవి.

(వచనము 3). లేవీ గోత్రపు యాజకులు తమ విధిలో భాగముగా బలులు, అర్పణలు అర్పించువారు. అట్లే మన ప్రధాన యాజకుడగు క్రీస్తుకూడ ఏదైనా అర్పించవలసియున్నది. “ఆయనద్వారా ఎల్లప్పుడు మనము స్తుతియాగము చేయుదము” అని చెప్పబడియున్నది. (13:15).

(వచనములు 4, 5). క్రీస్తు తన యాజక పరిచర్యను పరలోక సంబంధులగు ప్రజలకొరకు పరలోకమందు జరిగించుచున్నాడు. ఆయన భూలోకమందున్నయెడల ఆయన యాజకుడగుటకు వీలులేదు.

దేవుని ప్రజలలోనుండి ఒక ప్రత్యేక తరగతి ప్రజలను ధర్మశాస్త్రానుసారముగా యాజకులుగా నియమించుదురు.

మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించుమని కొండమీద నమూనాను చూపించి (నిర్గమ 25:40) స్పష్టమైన సూచనలిచ్చుటలో ఇది స్పష్టమగుచున్నది.

నిర్గమ 25-40

క్రీస్తు వచ్చుటలో “పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ”యొక్క ఉద్దేశము నెరవేరినది. భూసంబంధమైన యాజకులు భూసంబంధమైన ప్రజల పక్షముగా పరిచర్య జరిగించుటవలన పరలోకసంబంధమగు ప్రజల పక్షముగా, పరలోకసంబంధమగు క్రీస్తు యాజకత్వముయొక్క ఆవశ్యకత ఏర్పడినది.

నేటి క్రైస్తవ లోకము తమ పరలోక పిలుపును మరచి యూదా మతముననుసరించి, మానవులచే అభిషేకించబడు యాజకులను నియ మించుకొని భూసంబంధమైన వ్యవస్థను నెలకొల్పుకొనియున్నారు.

ఆ విధముగా చేయుటవలన ఛాయలకు తిరోగమించి, దాని భావమును గ్రహించకపోవుటయేగాక, క్రీస్తు యాజకత్వమును నిరాకరించుచు, ఆయన పనిలో, పదవిలో జొరబడుచున్నారు.

(వచనములు 6-9). క్రీస్తు పరలోకమందు శ్రేష్టమైన పరిచర్య పొందుటమాత్రమేగాక, శ్రేష్టమగు వాగ్దానములపై ఆధారపడిన శ్రేష్టమగు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.

ఈ నిబంధన విషయము 6-13 వచనములలో అపొస్తలుడు వివరించుచున్నాడు. ఇద్దరు వ్యక్తులమధ్య సంబంధము ఏయే షరతుల ఆధారముగా ఏర్పడునో అవి నిబంధనద్వారా ఏర్పడును.

బైబిలు గ్రంథములో దేవుడు మనుష్యులతో చేసిన రెండు నిబంధనలు కలవు. అవి పాత నిబంధన, క్రొత్త నిబంధన లేక ధర్మశాస్త్ర నిబంధన, కృపా నిబంధన.

దేవుడు తన ప్రజలను దీవించవలయునన్న వారు ఏ షరతులను పాటించవలెనో ఇవి రెండును తెలుపుచున్నవి. పాత, క్రొత్త నిబంధనలకున్న ప్రాముఖ్య మైన తేడా ఏమనగా, మొదటి నిబంధన ఆశీర్వాదములు మనిషి తనవంతు కర్తవ్యమును నెరవేర్చుటపై ఆధారపడియుండును.

రెండవ నిబంధన ఆశీర్వాదములు షరతులులేని దేవుని వాగ్దానములద్వారా సమకూడును. దేవుడు క్రొత్త నిబంధనలో కృపద్వారా విశ్వాసికి ఆశీర్వాదములు అందించుట క్రీస్తు మధ్యవర్తిత్వముద్వారా సాధ్యపడును.

ప్రజలు తన స్వరమునకు లోబడి, తన నిబంధనను పాటించినయెడల వారిని ఆశీర్వ దించుటకు యెహోవా పూనుకొన్నాడు. ప్రజలుకూడా తమ వంతు పనిని నెరవేర్చ పూనుకొనిరి.

నిర్గమ 19-5 - 8, నిర్గమకాండము 24-6,8

పాత నిబంధన కాలములో ధర్మశాస్త్ర ఆధారముగా ఇశ్రాయేలీయు లకు దేవునితో సంబంధము ఏర్పడినట్లు స్పష్టమగుచున్నది. వారు ధర్మశాస్త్రముననుసరించినయెడల భూమిమీద జీవము, ఆశీర్వాదములు వాగ్దానము చేయబడెను.

వారు ధర్మశాస్త్రమును మీరినయెడల శాపము, మరణము కలుగును. మనిషి తన వంతు నెరవేర్చుటలో ఆశీర్వాదము లన్నియు ఆధారపడియున్నవి.

పతనమైన మానవుడు దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రమును నెరవేర్చలేనందున మొదటి నిబంధన బలహీనమైనదని స్పష్టమగుచున్నది. గనుక రెండవ నిబంధనకు అవకాశమేర్పడినది. ఈ నిబంధనకు మధ్యవర్తి క్రీస్తు.

యెహోవా దేవుడు మొదటి నిబంధనను తప్పుపట్టలేదు. దాని షరతులు నెరవేర్చలేనివారినే తప్పుపట్టెను. అందువలన క్రొత్త నిబంధనను గూర్చి ఆయన మాటలాడెను.

యిర్మీయా 31-31,34

ఈ లేఖన భాగమునుబట్టి రాబోవు దినమొకటి క్రొత్త నిబంధన దృష్టిలో నున్నట్లు స్పష్టమగుచున్నది. ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైనది. అనగా భూసంబంధమైన ప్రజలకే వర్తించును.

క్రొత్త నిబంధన అక్షరార్ధముగా ఇశ్రాయేలీయులకు పరిమితమైనను, దాని ఆధ్మాత్మిక భావమును క్రైస్తవులకు అన్వయించవచ్చును.

అందువలననే అపొస్తలుడు మరియొక పత్రికలో తాను క్రొత్త నిబంధనకు సామర్థ్యముగల పరిచారకుడనని చెప్పుకొనుచు “అక్షరమునకు కాదుగాని ఆత్మకే”నని చెప్పెను. (2 కొరింథీ. 3:6).

2 కొరింథీ 3-6

అందువలననే క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు ప్రత్యేక ఆధిక్యతలేవియు కనిపించవు. విమోచింపబడిన దేవుని ప్రజలందరికిని సమానమైన ఆశీర్వా దములు చెప్పబడినవి.

ఈ ఆశీర్వాదముల కొరకు ఇశ్రాయేలీయులు ఒక దినము రాబోవుచున్నదని కనిపెట్టిరిగాని, విశ్వాసులు నేటి కృపాకాల మందు వాటిని అనుభవించుచున్నారు.

ఐగుప్తునుండి విమోచించబడిన దినమున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన పాత నిబంధనకు, ఆ తరువాత వచ్చిన క్రొత్త నిబంధనకు వ్యత్యాసమున్నది. ఆ దినమున దేవుడు ఆ జాతిని ఐగుప్తునుండి ప్రత్యేక పరచి, తనతో సంబంధము కలిగియుండవలెనని కోరెను.

అయితే మన మింతకుముందే గమనించిన విధముగా, ప్రజలు తమ వంతు నిబంధన షరతులు నెరవేర్చినప్పుడే ఆశీర్వాదములు లభించును. అయితే యెహోవా చెప్పినట్లుగా “వారు నా నిబంధనలో నిలువలేదు కనుక వారు విఫలులైరి.

ఫలితముగా వారు ఆశీర్వాదమును పోగొట్టుకొనిరి, గనుక ప్రభువు వారిని అలక్ష్యము చేసెను” అని వ్రాయబడెను. అవిధేయతతో, విగ్రహారాధనతో, తమ విధులను నెరవేర్చని ప్రజలను లక్ష్యపెట్టుట యనగా వారి చెడు తనమును ఆమోదించుట యగును.

అందువలన దేవుడు పాత నిబంధన ఆధారముగా వారితో సంబంధము పెట్టుకొని, వారు తన ప్రజలని చెప్పుటకు యిష్టపడలేదు. దీనినిబట్టి ఇశ్రాయేలు జాతి తిరస్కరించబడినది.

(వచనములు 10-12). అయినను దేవుడు తన సార్వభౌమిక కృప ఆధారముగా రానైయున్న దినములలో చేయనున్న సరికొత్త నిబంధనను గూర్చి మాట్లాడెను. ఈ క్రొత్త నిబంధన పూర్తిగా దేవుని సార్వభౌమిక కృపపై ఆధారపడి ఉండును.

ఈ నిబంధనలోని షరతుల ప్రకారము దేవుడే తన పరిశుద్ధ స్వభావమునుబట్టి, తన సంకల్పమునుబట్టి మాన వునితో సంబంధము కలిగి ఉండును. క్రొత్త నిబంధన ఆశీర్వాదములను వివరించుచు ప్రభువు పదే పదే “నేను చేయుదును” అని చెప్పుచున్నాడు.

“నేను క్రొత్త నిబంధన చేయుదును”, “వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను”, “నేను వారికి దేవుడనై యుందును”, “నేను వారి విషయము దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొనను” ఇట్లు క్రొత్త నిబంధన ఆశీర్వాదములు మనిషి చేయు పనులపైన, మనిషి సంకల్పముపైన ఆధారపడి లేవు.

కేవలము దేవుని దయాపూర్వక సంక ల్పమే దానికి ఆధారమని స్పష్టమగుచున్నది. క్రొత్త నిబంధన సారాంశమే మనగా దాని నెరవేర్పంతయు దేవుడే చూచుకొనును.

క్రొత్త నిబంధన ఆశీర్వాదములలో మొదటిది – ‘దేవుడు తన ప్రజల హృదయములలో కార్యము జరిగించుటద్వారా వారి మనస్సులను నూతనపరచి, రాతి పలకల పైగాక వారి హృదయములపై తన ధర్మశాస్త్ర మును వ్రాయును’ అని యిర్మీయా చెప్పుచున్నాడు.

రెండవది – ఆ విధముగా కార్యము జరిగింపబడినవారు దేవునితో సంబంధము కలిగిన ప్రజలుగా నుందురు. విశ్వాసులు నేడు దీనియొక్క ఆధ్యాత్మిక భావములో ప్రవేశించుచున్నారు.

యోహాను 1-12,13

మూడవది యెహోవాను గూర్చిన జ్ఞానము కలిగియుందురు గనుక – ‘ప్రభువును తెలిసికొనుడని’ పొరుగువారైనను, సహోదరుడైనను వారికి బోధించ వలసిన పని ఉండదు.

ఈ రోజున కూడ దేవుని వ్యక్తిగతముగా ఎరిగిన నిజమైన దేవుని పిల్లల విషయములో ఇది ముమ్మాటికిని నిజము.

ఒకవేళ ప్రభువును గురించి మరింతగా తెలిసికొనుటకు బోధించుట అవసరమే అయినప్పటికిని, ఆయనను మనము వ్యక్తిగతముగా ఎరుగుదుము, ఎవరును బోధింపనవసరము లేదు.

నాలుగవది – దేవుడు దయ కలిగి “నేను వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొననని” చెప్పెను. ఈ గొప్ప ఆశీర్వాదములోనికి నేడు విశ్వాసి తీసికొనిరాబడుచున్నాడు.

(వచనము 13). క్రొత్త నిబంధన షరతులు, ఆశీర్వాదములు ఇటువంటివి – మనము దేవుని సమీపించునట్లు క్రొత్త యాజకత్వమున్న యెడల అవశ్యముగా క్రొత్త నిబంధన ఎంత పరిపూర్ణమైనదైనను ప్రయో జనకరము కాదు.

మొదటి నిబంధనలో మనము దేవుని సమీపించుట యనునది నిబంధన షరతులను మనము పాటించుటపై ఆధారపడి యుండును.

ఇది అసాధ్యము గనుక మన వైఫల్యములు మనలను దేవునినుండి ఎల్లప్పుడు దూరము చేయును. క్రొత్త నిబంధనలో మనము దేవునితో సంబంధము కలిగియున్నామంటే అది సంపూర్ణముగా దేవుడు తన కృపతో చేసినదాని ఆధారముగానే జరిగినది.

నిబంధన క్రొత్తది. ఎందుకనగా ఇది పాత నిబంధనకంటే పూర్తిగా భిన్నమైనది. ఇది పాత నిబంధన నమూనాలో చేసిన క్రొత్త నింబంధన కానేకాదు. క్రొత్తది అని చెప్పుటవలన మొదటిదానికి కాలదోషము పట్టినది.

అది పాతగిలి, ఉడిగిపోవుటచేత అదృశ్యమగుటకు సిద్ధముగా నున్నది. మనిషి అతిక్రమించుటద్వారా సిలువద్వారా యెరూషలేము దేవాలయము నాశనమగుటద్వారా దేవుడు ప్రక్కనబెట్టినవాటివైపు యూదులుగాని క్రైస్తవులుగాని మళ్ళుట ఇక వ్యర్థము.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక క్రొత్త బలి – క్రొత్త దేవాలయము

క్రొత్త బలి – క్రొత్త దేవాలయము (అధ్యాయము 9)

అపొస్తలుడు నూతన యాజకత్వమును (7వ అధ్యాయం) నూతన నిబంధన ఆశీర్వాదములను (8వ అధ్యాయం) మన యెదుట పెట్టి యున్నాడు.

ఇప్పుడు 9వ అధ్యాయములో క్రీస్తుయొక్క నూతన బలిని, దాని అనన్య సామాన్య విలువను, క్రీస్తు బలిద్వారా మనకు ప్రవేశము లభించు దేవాలయమును వివరించుచున్నాడు.

భూసంబంధమగు దేవాలయము – శరీర సంబంధమగు బలులు. (1-7 వచనములు).

(వచనములు 1-5). అపొస్తలుడు మొదట పూర్వకాలపు ప్రత్యక్ష గుడారమునుగూర్చి ప్రస్తావించెను. సాదృశ్యములుగా అందులో ఎన్నో సత్యములున్నవి. అవి సాదృశ్యరూపకముగా ఎంత విలువైనవైనను ఆ సత్యములను అతడు ఇచ్చట వివరించుటలేదు.

దీనితో పోల్చగా పరలోక గుడారము ఎంత శ్రేష్టమైనదో చూపించుటయే రచయిత ఉద్దేశ్యము. ప్రత్యక్ష గుడారమునకు సంబంధించి ఎన్నో సేవా నియమములున్నను అది ఈ లోక సంబంధమగు దేవాలయమే.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

దాని అందము, విస్తారమైన ఆచార వ్యవహారములు, కన్నుల పండుగగానుండు ఉత్సవములు, ప్రకృతి సంబంధియగు మానవునికి ప్రత్యేక ఆకర్షణగా నుండెను.

అందువలన అది భూసంబంధులకు సరిపోయినది. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని రెండు విభాగములను అపొస్తలుడు నొక్కి చెప్పుచున్నాడు.

(వచనములు 6,7). ప్రత్యక్ష గుడారపు ఆకారమును, దానిలోని ఉపకరణములను సూచించిన తరువాత, అపొస్తలుడు యాజకులను, ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన బలులను, ప్రజలనుగూర్చి వివ రించుచున్నాడు.

ప్రత్యక్ష గుడారమునకు సంబంధించి దేవుని పరిచర్య జరిగించునది యాజకులేగాని ప్రజలు కాదు. ప్రత్యక్ష గుడారములోని రెండవ భాగములోనికి ప్రధాన యాజకునికి ఒక్కడికే ప్రవేశించు అర్హత ఉన్నది.

అదికూడ సంవత్సరమునకొకసారి. రక్తము లేకుండా కాదు – తనకొరకును, ప్రజల పాపములకొరకును రక్తము అర్పించవలసియున్నది. ఈ అధ్యాయము మొదటి ఏడు వచనములలో అపొస్తలుడు చివరి అధ్యాయములో ప్రస్తావించిన “శిబిరమును” గూర్చి వర్ణించుచున్నాడు. (13:13).

శిబిరము దగ్గర చూచుటకు అందముగానున్న గుడారము చుట్టు అసంఖ్యాక ప్రజలు, దానిలో ఒక భాగము అనగా అతి పరిశుద్ధ స్థలము తెరతో అడ్డగించబడి ఉండును. సామాన్య ప్రజలకు భిన్నమైన యాజకుల సమూహము ప్రజల పక్షముగా దేవుని పరిచర్య జరిగించు చుందురు.

ప్రత్యక్ష గుడారము – దాని బలుల భావము.

(వచనములు 8–10). ప్రత్యక్ష గుడారము, దాని సేవలనుగూర్చి మనము నేర్చుకొనినదేమి? మన స్వంత భాష్యము చెప్పుటకు వీలులేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దాని భావమును సూచించియున్నాడు.

ధర్మ శాస్త్రముక్రింద దేవుని సన్నిధికి మనకు ప్రవేశము యింకను వెల్లడికాలేదని ప్రత్యక్ష గుడారపు సేవా నియమములు స్పష్టముగా చూపెట్టుచున్నవని మొదట మనము గ్రహించవలెను.

రెండవది – అతి పరిశుద్ధ స్థలములోనికి మార్గము యింకను తెరువ బడలేదనుట ఈ బలులు చాలినవి కాదనుటకు స్పష్టమైన ఋజువు. మనస్సాక్షి విషయములో ఆరాధకుని ఆ బలులు పరిపూర్ణునిగా చేయలేవు.

మూడవది – ఈ వస్తువులన్నియు అమలులో ఉన్నప్పుడు అవి రాబోవువాటి మేలుల ఛాయగా నున్నవి. ఈ అలంకారిక రూపములు దేవునికి సంతృప్తి కలిగించలేవు, మానవుని అక్కరను తీర్చలేవు.

అటు వంటి వ్యవస్థలో దేవుడు మూసివేయబడి ఉన్నాడు. మానవుడు వెలుపల నున్నాడు. యూదా మతవ్యవస్థ మనకు పరలోకమును తెరువలేదు లేదా మనలను పరలోకమునకు యోగ్యులనుగా చేయలేదు.

అయితే క్రైస్తవ లోకముకూడా పరిశుద్ధాత్మ బోధను విస్మరించి, ప్రత్యక్ష గుడారమును అలంకారిక రూపముగా చూడక, తమ మతవ్యవస్థకు నమూనాగా తీసుకొన్నది. ఆ విధముగా చేయుటద్వారా ఆ అలంకారిక రూపము చెప్పుచున్న “మేలులను” పోగొట్టుకొనిరి.

క్రైస్తవ లోకములో అసంఖ్యాకులు గొప్ప గొప్ప కట్టడములను నిర్మించి, వారు నిర్మించిన భవనములలోని ఒక భాగము మరియొక భాగముకంటే పరిశుద్ధమైనదని చెప్పుచున్నారు.

సామాన్య ప్రజలకు భిన్నముగా యాజకులను ఒక ప్రత్యేక వర్గముగా నెలకొల్పి ప్రజల పక్షముగా మత కార్యకలాపము జరుపుటకు నియమించుకొనుచున్నారు. ఆ విధముగా దేవునికి దూరముగా నుంచు యూదా శిబిరము నమునాలో ఒక వ్యవస్థను నెలకొల్పుకొనియున్నారు.

ఆ వ్యవస్థ మనస్సాక్షికి సంపూర్ణసిద్ధి కలుగజేయదు. అపొస్తలుడు 9, 10 అధ్యాయములలో ప్రస్తావించిన పరిపూర్ణ సిద్ధి, లేదా కడుగబడిన మనస్సాక్షి అనునది వేర్వేరుచోట్ల ప్రస్తావింపబడిన “నిర్మలమైన మనస్సాక్షికి” భిన్నమైనది. కడుగబడిన మనస్సాక్షి అనగా ఒకసారి శుద్ధియై పాప జ్ఞప్తి ఇక ఉండని మనస్సాక్షి అని అర్థము. (10:2).

పాపముల విషయమై మనస్సాక్షిని అభ్యసింపజేయుచుండగా క్రీస్తుయొక్క ప్రశస్త రక్తము విశ్వాసిని శుద్ధిచేసెనని, ఇక ఎన్నడును అతడు తీర్పులోనికి రాడని ఎరిగిన మనస్సాక్షి, నిజ జీవితములో ప్రవర్తనలో అపరాధ భావన లేనిది. అది మంచి మనస్సాక్షి.

క్రొత్త బలి. (11-23 వచనములు)

(వచనము 11). క్రీస్తు రాకతో అంతా మారిపోయినది. వెంటనే మనకొక ప్రధాన యాజకుడు, గొప్పది మరింత పరిపూర్ణమైనది అయిన గుడారము మరియు నూతన బలి సంప్రాప్తించినవి.

ఈ లోక సంబంధ మైనవాటికి అహరోను ప్రధాన యాజకుడు. అయితే “క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయములో ప్రధాన యాజకుడు”. “క్రీస్తు బలిద్వారా ప్రస్తుత ఆశీర్వాదములు విశ్వాసికి సంక్రమించినవి”.

అయితే క్రీస్తు ప్రధాన యాజకుడని చెప్పబడిన “మేలులు” – అవి “రాబోవునవి”.  ఆ విధముగా ఆత్మ మన అరణ్యయాత్ర ముగింపును సూచించెను. 2:10 లో క్రీస్తు అనేకులగు కుమారులను మహిమకు తెచ్చుచున్నాడని నేర్చుకొంటిమి.

2:5 లో ‘రాబోవు లోకమునుగూర్చి చదువుదుము. 4:9 లో నిలిచి ఉండు విశ్రాంతి ప్రస్తావించబడినది. 6:5 లో మరల రాబోవు లోకమును గూర్చిన ప్రస్తావన ఉన్నది.

రాబోవు లోకములో మనకు “మేలులు” సమకూర్చుటకు, మన అరణ్యయాత్రలో సహాయపడుటకు క్రీస్తు మన ప్రధాన యాజకుడుగానున్నాడు.

క్రీస్తు యాజకత్వము అహరోను యాజకత్వమును ప్రక్కన బెట్టిన యెడల “ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునగు గుడారము” భూ సంబంధమగు గుడారముకూడా ప్రక్కన పెట్టబడును.

భూసంబంధమైన గుడారము హస్తకృతము, ఈ సృష్టి సంబంధమైనది. “అయితే పరిపూర్ణమైన గుడారము పరలోక సంబంధమైనది”. (23 వచనము).

(వచనము 12). లేవీయులు చేయు బలులన్నియు క్రీస్తు చేసిన ఒకే ఒక గొప్ప బలిద్వారా ప్రక్కన పెట్టబడినవి. ఆయన పరలోకమునకు ముంగుర్తుగానున్న అతి పరిశుద్ధ స్థలములో తన స్వంత రక్తముతో ఒక్కమారే ప్రవేశించెను.

అహరోను వంశమువారైన యాజకులు “ప్రతి సంవత్సరము” ఒకసారి ప్రవేశించెదరు. అందుకు భిన్నముగా క్రీస్తు పరలోకమందు “ఒక్కసారే ప్రవేశించెను”. ఆయన అంతకుముందే విమోచింపబడినవారి పక్షముగా యాజక ధర్మము జరిగించుటకు అందులో ప్రవేశించెను.

(వచనములు 13, 14). నిత్య విమోచనము సంపాదించిన క్రీస్తు రక్తము కోడెలయొక్కయు, మేకలయొక్కయు రక్తమును ప్రక్కకు పెట్టినది. ఈ జంతువుల రక్తము శరీర విషయములో శుద్ధి కలిగించుట నిజమే. క్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధిచేయును.

సంఖ్యా 19-7, 8

యాజకునిద్వారా అర్పించబడు జంతువుమాత్రమే ద్వారా పూర్తిగా ప్రక్కన పెట్టబడినది. పరిశుద్ధాత్మద్వారా క్రీస్తు శరీరధారి యాయెను. పరిశుద్ధాత్మద్వారానే ఆయన తన పరిపూర్ణ జీవితము జీవించగలిగెను.

లూకా 1-35

రెండవ అధ్యాయము 9వ వచనములో దేవుని కృపవలన యేసు ప్రతి మనుష్యునికొరకు మరణమనుభవించెనని చెప్పబడినది. ఆ విధముగా దేవునికి క్రీస్తు తనను అర్పించుకొనినది నీకొరకేనని పాపికి మనము ప్రకటించగలము.

ఈ బలిద్వారా కలుగు గొప్ప ప్రయోజనమేమనగా “నిర్జీవ క్రియల నుండి మనస్సాక్షిని శుద్ధిచేయుట” క్రీస్తు తనను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకొనినందున, దేవుడు ఆ గొప్ప బలిని అంగీకరించి – క్రీస్తునందు, ఆయన చిందించిన రక్తమునందు సంపూర్ణ తృప్తినొందియున్నాడు.

కనుక క్రియలద్వారా ఆశీర్వాదమును సంపాదించుకొన ప్రయత్నించిన మానవుని మనస్సాక్షి దానినుండి విడిపించబడినది. ఆ విధముగా మనస్సాక్షియందు విడుదల పొందిన విశ్వాసి దేవునిని ఆరాధించువాడాయెను.

(వచనము 15). క్రీస్తు అర్పణ దేవుని పరిశుద్ధతను, పాపి అవస రతను తీర్చును గనుక క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియాయెను. పిలువబడినవారందరును నిత్య స్వాస్థ్యమను వాగ్దానములో ప్రవేశించు నట్లు క్రీస్తుద్వారా క్రొత్త నిబంధన ఆశీర్వాదములు సమకూడెను.

(వచనములు 16, 17). “మరణము ద్వారా” ఆ స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును విశ్వాసి పొందుచున్నాడని అపొస్తలుడు తెలియ జేయుచున్నాడు.

రచయిత ప్రస్తావించిన మరణముయొక్క ఆవశ్యకతను వివరించుటకు ఈ రెండు వాక్యములలో మరణ శాసనముద్వారా స్వాస్థ్యములనుగూర్చిన వాగ్దానము సంక్రమించుననియు, అది కూడా మరణ శాసనము వ్రాసినవాని మరణముద్వారా అమలులోనికి వచ్చు ననియు తెలియజేయుచున్నాడు.

(వచనములు 18-22). క్రొత్త నిబంధన, క్రొత్త గుడారముయొక్క ఆశీర్వాదములు “మరణముద్వారా” మాత్రమే కలుగునని, అవి భూ సంబంధమగు గుడారము, మొదటి నిబంధనలద్వారా అలంకారికముగా రచయిత చూపెట్టుచున్నాడు. మొదటి నిబంధన రక్తముచే ప్రతిష్టింపబడెను.

ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములన్నియు రక్తముచే ప్రోక్షింపబడెను. రక్తముద్వారానే మనిషికి ఆశీర్వాదము, దేవుని సమీపించుట జరుగుననుట కిది సాక్ష్యముగానున్నది.

దీనినంతటివలన చివరకు తేలినదేమనగా “రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు”. ఇక్కడ ప్రస్తావించినది రక్తము ప్రోక్షించుట కాదు, “రక్తము చిందించుట”. దేవుడు అందరినీ క్షమించు టకు, విశ్వసించినవారిని క్షమించినట్లు ప్రకటించుటకు ఆధారమిదే.

(వచనము 23). ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములన్నియు “పరలోకమందున్నవాటి పోలికయై” యున్నవి. కోడెలయొక్కయు, మేకల యొక్కయు రక్తము కలిగి శారీరక శుద్ధితో భూసంబంధమైన గుడారమందు ప్రవేశించుట సాధ్యపడెను. అయితే పరలోక వస్తువుల శుద్ధికి మరింత శ్రేష్టమైన బలులు అవసరమాయెను.

నూతన ఆలయము (24-28 వచనములు)

రచయిత 11వ వచనములో “క్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి” అను మాటలతో శ్రేష్టమైన బలులు అను అంశమును ప్రారంభించెను.

అయితే ఇప్పుడు “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదుగాని, ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అను మాట లతో మన మనస్సులను నూతన ఆలయమువైపు మళ్ళించుచున్నాడు.

అక్కడ, అనగా దేవుని సముఖమందు యేసుక్రీస్తు మన ప్రధాన యాజ కునిగా తన ప్రజల తరపున దేవునియెదుట ఉన్నాడు. “క్రీస్తు మనకొరకు” పరలోకమందు దేవుని సముఖములో కనబడుట పరలోకము మనకొరకు సంపాదించబడి, విశ్వాసికి తెరువబడియున్నదనుటకు నిత్యసాక్షియై ఉన్నది.

(వచనములు 25-28). పైగా, విశ్వాసి పరలోకమున ప్రవేశించు టకు అడ్డువచ్చిన ప్రతి అవరోధము ఒకే ఒక్క శాశ్వత బలిద్వారా తొలగించబడెను. లేవీయులు అర్పించు బలులు ఏటేటా జరిగించు చున్నందున అవి పాపమును తీసివేయుటకు సరిపోయినవి కావని స్పష్టమగుచున్నది.

అయితే అందుకు భిన్నముగా క్రీస్తు యుగముల సమాప్తియందు పాప నివారణ చేయుటకై తనను తానే బలిగా అప్పగించు కొనుటద్వారా ప్రత్యక్షమాయెను.

“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెను”.

ఆ విధముగా క్రీస్తు తానే బలియగుటవలన పాపము నివారణ చేయ బడెను. పాపములు భరించబడెను. మరణము, తీర్పు విశ్వాసికి లేకుండా తొలగించబడెను.

క్రీస్తు రెండవమారు ప్రత్యక్షమగునప్పుడు విశ్వాసికి కలుగు ఆశీర్వాద కరమగు ఫలితమేమనగా, ఆయన యిక పాపము విషయమై చేయున దేమియు ఉండదు.

ఆయన మొదటి ప్రత్యక్షతలో పాపమును పరిహరించి నందున, రెండవసారి ఆయన ప్రత్యక్షమగునది తన ప్రజలను పాపలోకము నుండి రక్షించి, శత్రువు అధికారమునుండి తప్పించి, నిత్యము నిలిచి ఉండు విశ్రాంతిలోనికి నడిపించుటకే. ఈ భాగములో క్రీస్తుయొక్క మూడు ప్రత్యక్షతలు ప్రస్తావించబడినవి.

పాపమును తీసివేయుటకు పాపమును భరించుటకు తీర్పును తొలగించు టకు సిలువలో గతకాలమందు ప్రత్యక్షమగుట (వ. 26); ప్రస్తుతము పరలోకమందు తన ప్రజల పక్షముగా ప్రధాన యాజకుడుగా ప్రత్యక్ష మగుట; భవిష్యత్తులో మహిమలో ప్రత్యక్షమగుట.

అప్పుడు తన ప్రజలను అరణ్యమువంటి లోకమునుండి, దానిలోని శోధనలు, బలహీనతలన్నిటి నుండి సంపూర్ణముగా రక్షించును.