గొట్టెల మంచి కాపరి – Bible Verses Chapter 10 in Telugu

పదియవ అధ్యాయము

గొట్టెల మంచి కాపరి
(యోహాను 10:11)
“నేనే ద్వారమును” (10:1-10) :

10:1 ఇశ్రాయేలీయులకు తామే సరియైన కాపరులమని పరిసయ్యులు చెప్పు కొందురు. అట్టివారితో ప్రభువైన యేసు గంభీరముగా ఇట్లు మాట్లాడుచున్నాడు. నిశ్చయముగా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

రాత్రియందు గొట్టెలు విశ్రాంతి తీసికొను స్థలము గొట్టెల దొడ్డి. ఈ విశ్రాంతి స్థలముచుట్టు కంచెవేయబడి ఒక స్థలమునందు ద్వారముంచబడును. ఈ గొట్టెల దొడ్డియే “యూదా జనాంగము”.
యూదా జనాంగములో అనేకులు ఆత్మీయమైన పాలకులుగాను, ఉపదేశించు వారుగా కనుపరచుకొందురు, అట్టివారు ఆ జనాంగమునకు తమ్మును తామే మెస్సీయలుగా ప్రతిష్ఠించుకొందురు.

కాని వారు ద్వారములోనుండి ప్రవేశించువారు కారు. పాత నిబంధనలో మెస్సీయ రాకను ప్రవచించునట్లుగా వారి మార్గము ఉండదు. వారు మరియొక మార్గముగుండ ఎక్కివచ్చిరి. తాము ఏర్పరచుకొనిన స్వంత మార్గముల ద్వారావచ్చి ఇశ్రాయేలీయులకు కనుపరచుకొందురు. వీరు నిజమైన కాపరులుకారు గాని, దొంగలును దోచుకొనువారునైయున్నారు.

తమది కాని దానిని స్వతంత్రించు కొనువాడు దొంగ, తమది కాని దానిని దౌర్జన్యముతోను, హింసతోను స్వతంత్రించు కొనువాడు దోచుకొనువాడునైయున్నాడు. పరిసయ్యులు దొంగలును, దోచుకొనువారునై యున్నారు.

Read and Learn More Telugu Bible Verses

వారు యూదులను పరిపాలింపవలెనని ఆశించుదురు. మరియు ఇశ్రాయేలీ యులు నిజమైన మెస్సీయను అంగీకరించుటకు వారు అనేకములైన ఆటంకములను కలిగించుదురు. యేసును వెంబడించినవారిని హింసించుదురు మరియు ఆయనను మరణమునకు పాత్రునిగా చేయుదురు.

10:2 రెండవ వచనము ప్రభువునుగూర్చి చెప్పబడినది. ఇశ్రాయేలీయులలో నశించిన వారియొద్దకే ఆయన వచ్చెను. ఆయన నిజమైన గొట్టెలకాపరి, ఆయన ద్వారములో నుండి ప్రవేశించెను. పాత నిబంధనలో మెస్సీయను గూర్చిన ప్రవచనములు నెరవేరు నట్లుగా ఆయన వచ్చెను. ఆయన తన్నుతాను ఏర్పరచుకొనిన రక్షకుడు కాడు. తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయుడై వచ్చెను. తన్నుగూర్చిన నిబంధనలన్నిటికి విధేయుడై వాటిని నెరవేర్చెను.

10:3 క్రొత్త నిబంధన ప్రకారము ‘పోర్టరు’ అనగా ద్వారపాలకుడు. ద్వారపాలకుని యొక్క గుర్తింపులో యీ వచనమందు భేదాభిప్రాయము కనబడుచున్నది. క్రీస్తుయొక్క రాకడనుగురించి పాత నిబంధనలో ప్రవచించిన ప్రవక్తలను ఈ వచనము సూచించు చున్నదని కొందరు చెప్పుదురు.

మరికొందరు నిజమైన కాపరికి ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి అని చెప్పుదురు. మరికొందరైతే మానవుల జీవితము లోనికి, హృదయములోనికి తలుపు తెరచి ప్రభువును ప్రవేశింపజేయు పరిశుద్ధాత్ముడేనని చెప్పుదురు.

గొట్టెలు, గొజ్జెల కాపరి స్వరము వినును. నిజమైన గొట్టెలకాపరి స్వరమును అవి గుర్తించును. గొట్టెలు కాపరి స్వరము వినునట్లుగా యూదులలో కొంతమంది మెస్సీయను గుర్తించగలిగిరి. ఈ సువార్త అంతటిలో గొజ్జెల కాపరి తన గొట్టెలను పేరు పెట్టి పిలుచుటను గమనించుదుము.

మొదటి అధ్యాయములో ఆయన కొంత మంది శిష్యులను పిలువగా వారు ప్రతిస్పందించిరి. 9వ అధ్యాయములో ఆయన గ్రుడ్డివానిని పిలిచెను. ఆయన తనను రక్షకునిగా అంగీకరించువారిని ఇంకను పిలుచు చున్నాడు. ఒక్కొక్కరినే వ్యక్తిగతముగా పిల్చుచున్నాడు.

“బయటికి పిలుచుచున్నాడనగా” ఇశ్రాయేలీయులు దొడ్డిలోనుండి తన స్వరమునకు విధేయులగువారిని పిలుచుచున్నాడు. వారా దొడ్డిలో బంధింపబడి, మూయబడియున్నారు. ధర్మశాస్త్రముక్రింద స్వేచ్ఛా స్వాతం త్ర్యము లేదు.

అట్టివారిని తన కృపలోనున్న స్వేచ్ఛాస్వాతంత్య్రములను అనుభవించుటకు పిలిచెను. చివరి అధ్యాయములో ఆయనను సునగోగునుండి బయటికి పంపివేసిరి. వారట్లు చేయుటవలన తెలియకయే ప్రభువు చేయు పనికి సహకరించుచున్నారు.

10:4 మరియు ఆయన తన గొట్టెలను వెలుపలికి నడిపించునప్పుడెల్ల వాటినే ముందుగా నడిపించక, తానే వాటిముందర నడుచును. తాను ఒక స్థలమునకు ముందుగా పోనియెడల తన గొట్టెలను అక్కడికి నడిపించడు.

రక్షకునిగా, దారి చూపువానిగా వారికి మాదిరిగా వాటిముందర తానే నడుచును. నిజమైన గొట్టెలు ఆయనను వెంబడించును. ఆయనను అనుసరించుట వలన అవి ఆయన గొట్టెలు కాలేవు గాని రక్షింపబడిన తరువాత తిరిగి జన్మించుట వలననే అగును.

10:5 అవి ఆయన నడిపించుచోటికి పోనాశించవలసియుండును. గొట్టెలకుగల యీ స్వభావము నిజమైన కాపరి స్వభావము గుర్తించుటకును, అన్యుని స్వరము విని పారిపోవుటకును సహకరించును.

అన్యులెవరనగా తమ స్వలాభముకొరకు గొట్టె పట్ల ఆసక్తినిజూపు పరిసయ్యులు మరియు యూదుల అధికారులు, చూపు పొందిన గ్రుడ్డివాడు మంచిగొట్టెకు ఉదాహరణగానున్నాడు. అతడు ప్రభువైన యేసు స్వరమును గుర్తెరుగ గల్గెను. పరిసయ్యులను అన్యులుగా గుర్తించెను. కనుకనే వారికి విధేయుడగుటకు అంగీకరింపకపోయెను. వారతనిని వెలివేసినప్పటికిని వారికి విధేయుడు కాలేదు.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

10:6 ఈ మాటలు ప్రభువు పరిసయ్యులతో చెప్పినప్పటికిని వారు నిజమైన గొట్టెలు కానందుచే ఆయన మాటలను అర్థము చేసికొనలేదు. వారు మంచి గొట్టెలయినచో ఆయన మాటలు విని, ఆయనను వెంబడించెడివారే.

10:7 ప్రభువు ఇచ్చట క్రొత్త వివరణ ఇచ్చుచున్నాడు. 2వ వచనములో చెప్పినట్లుగా గొట్టెల దొడ్డి, ద్వారమును గురించి చెప్పుటలేదుగాని, తానే ద్వారమునై యున్నానని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయులనబడిన గొట్టెల దొడ్డిలో ప్రవేశించుట కాదుగాని ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు యూదా మతమును వదలి ద్వారమనబడిన క్రీస్తు నొద్దకు వచ్చిరి.

10:8 కొందరు అధికారమును, ఉన్నతమైన స్థితిని కోరుచు క్రీస్తుకుముందు వచ్చిరి. కాని ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు వారు దేనికి తగినవారు కారో, దానిని ఆశించు చున్నారని గ్రహించి, వారి మాట విననైరి.

10:9 ఈ వచనము సండేస్కూలు విద్యార్థికి సహితము అర్థమగు రీతిలోనున్నది. అయినను బాగుగా జ్ఞానము తెలిసిన వారికి అందనిదికాదు. క్రీస్తు ద్వారమైయున్నాడు క్రైస్తవ్యము, ఒక మతముగాని, సమాజముగాని కాదుగాని, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనద్వారానే ఒకడు లోపల ప్రవేశించగలడు, రక్షణ క్రీస్తు ద్వారా గల్గును.

బాప్తిస్మముగాని, ప్రభురాత్రి భోజనముగాని రక్షణ కలుగజేయదు. క్రీస్తుద్వారా ఆయనిచ్చు శక్తిద్వారా మనము లోపల ప్రవేశింపవలసియున్నాము. ఈ ఆహ్వానము అందరికీ, క్రీస్తు యూదులకు ఎలాగో, అన్యులకు ఆయన రక్షకుడే, కాని రక్షింపబడవలెనంటే ఒకడు లోపల ప్రవేశింపవలసియున్నది.

వాడు విశ్వాసముద్వారా క్రీస్తు నంగీకరించవలసియున్నది అది వ్యక్తిగతచర్య. ఈ కార్యము జరుగనిదే రక్షణలేదు. లోపలికి ప్రవేశించువాడు శిక్షనుండియు, పాపమునుండియు, దానియొక్క శక్తినుండియు తప్పింపబడును.

రక్షింపబడిన తరువాత వాడు బయటికి వెళ్ళుచు, లోపలికి వచ్చుచుండవలెను. అనగా విశ్వాసముతో ఆరాధించు టకు ప్రభువు సన్నిధికి వచ్చుచు, ప్రభువునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు లోకములోనికి వెళ్ళుచుండవలెను, ప్రభువు పరిచర్యలో సంపూర్ణ స్వేచ్ఛను ఈ పటము చూపించును.

లోపలికి ప్రవేశించువారు పచ్చికను కనుగొందురు. క్రీస్తు రక్షకుడేకాక స్వేచ్ఛను అనుగ్రహించువాడును, మరియు మనలను నిలువబెట్టువాడునైయున్నాడు. ఆయన గొజ్జెలు దేవుని వాక్యమందు ఆహారమును కనుగొనును.

10:10 దొంగ దొంగిలించుటకును, ప్రాణము తీయుటకును, నశింపజేయుటకును వచ్చును. దొంగ తన స్వలాభాపేక్షతో వచ్చి గొట్టెలను సహితము చంపును. ప్రభువైన యేసు స్వలాభాపేక్షతో ఏ మానవ హృదయములోనికి వచ్చియుండలేదు.

ఆయన జీవము ఇచ్చుటకు వచ్చెను. మానవులకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగజేయుటకును వచ్చెను. యేసుప్రభువును అంగీకరించిన తక్షణమే మనము జీవమును పొందుదుము.

మనము రక్షింపబడినపిదప మనమనుభవించు ఆనంద ములో వివిధ అంతస్థులుండును. మనమెంత ఎక్కువగా పరిశుద్ధాత్మునివైపు మళ్ళు దుమో, అంత ఎక్కువగా మనకివ్వబడిన జీవమును అనుభవించెదము, జీవమును కలిగియుండుటయేగాక అది సమృద్ధిగా కలిగియుందుము.

10:11 త్రిత్వమైయున్న దేవుని మూర్తిమత్వములో తానొకరని ప్రభువైన యేసు పలుమార్లు ప్రస్తావించెను. దేవునితో తాను సమానుడనని ప్రతిసారి చెప్పుకొను చుండెను. ఇక్కడ తాను గొజ్జెల మంచి కాపరిననియు తన గొజ్జెలకొరకై ప్రాణము పెట్టుటకు వచ్చియున్నాననియు చెప్పెను. సాధారణముగా కాపరికొరకు గొట్టే వధింప బడును.  యేసు ప్రభువైతే తన గొట్టెలకొరకు చనిపోయెను.

హతుడు గాయపరచబడినవాడై రక్తము కారుచుండగా

నడిపింపబడెను  కాపరి దయగల హృదయముతో

మనకు, మన విరోధికి మధ్య నిలుచుటకై

హృదయ పూర్వకముగా తానే మనకొరకు మరణించుటకై.

10:12 జీతగాడు తాను చేసిన పనికి జీతము పుచ్చుకొనును. పరిసయ్యులు జీతగాండ్రుగా చెప్పబడిరి. వారు పొందు జీతమునుబట్టి వారికి ప్రజలపట్ల అభిమానము పెంపొందును. గొజ్జెలు జీతగాని స్వంతముకాదు. ప్రమాదము సంభవించునప్పుడు వాడు పారిపోవును. తోడేలు గొట్టెలను పట్టి తినివేయును,

10:13 మనమేమైయున్నామో అదే అయియుండి, మనము చేయునదే చేయుదము జీతగాడు జీతగాడే గనుక గొట్టెలను ప్రేమింపడు. తన క్షేమమునే కోరుకొనునుగాని, గొట్టెల క్షేమమును ఆలోచించడు. ఇట్లే దేవుని సమాజములోని సభ్యులపట్ల నిజమైన ప్రేమ లేకుండినను పరిచర్యనొక అనుకూలమైన వృత్తిగా చేపట్టిన జీతగాళ్ళు గలరు.

10:14 మరల ప్రభువు తాను గొట్టెలకు మంచి కాపరినని చెప్పుకొనుచున్నాడు. ‘మంచి’ అనగా న్యాయమైన, యుక్తమైన, శ్రేష్ఠమైన, ఉత్తమమైన, యోగ్యమైన అను అర్థముల నిచ్చును. ఆయన ఇట్టి లక్షణములన్నియు కలవాడు. ఆయన తనకును తన గొట్టెలకున్న సంబంధమును గూర్చి మాట్లాడుచున్నాడు. తండ్రి తన కుమారుని ఎరుగును. తనవారు ఆయనను ఎరుగుదురు. ఇది అద్భుతమైన సత్యము.

10:15 నా గొట్టెలను నేను ఎరుగుదును. (అవి నన్ను ఎరుగును). “తండ్రి నన్ను ఎరిగియుండినట్లుగా నేను వాటిని ఎరుగుదును. నేను నా తండ్రిని ఎరుగుదును”. ఇది నిజముగా హృదయమును స్పందించు సత్యము. తనకు గొట్టెలకు ఉన్న సంబంధ మును యేసుప్రభువు తనకు తండ్రికి మధ్యగల సంబంధమునకు పోల్చెను.

తండ్రికి, కుమారునికి గల సహవాసము మరియు సన్నిహిత సంబంధము-గొట్టెల కాపరికిని, గొట్టెలకునుకూడా గలదు. “నేను గొట్టెలకొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను.” ప్రభువు చెప్పిన మాటలలో అనేకసార్లు పాపులకు ప్రతిగా తన ప్రాణము పెట్టుటకు ఈ లోకములోనికి తాను ఇష్టపడి వచ్చినట్లుగా చెప్పెను.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

10:16 ఈ అధ్యాయమునకు ఈ వచనము తాళపుచెవి వంటిది. ప్రభువు చెప్పిన వేరొక గొట్టెలు ఎవరనగా అన్యులు. ఆయన రాక ఇశ్రాయేలీయులకొరకే. అయినను అన్యుల రక్షణను గురించి ఆలోచన ఆయనకు గలదు.

అన్యులు యూదులు కలసి సాంగత్యము చేయరు. (అన్యులు యూదులకు చెందినవారు కారు) అయితే ఆయన హృదయములో గొప్ప ఆశ ఏమనగా తన దైవజ్ఞానముతో బలవంతము చేయబడి అన్యులను రక్షించుటకు పూనుకొనెను.

యూదులకంటే ఎక్కువ ఆసక్తితో వారు తనను అంగీకరింతురని ఆయనకు తెలియును. కనుకనే ఒకే దొడ్డి, ఒకే కాపరి ఉండునని ప్రభువు చెప్పుచున్నాడు. దీనిని ఒకే మంద, ఒకే కాపరి ఉండునని కూడ వ్రాయబడినది.

“దొడ్డి” యూదా మతమునకును, “మంద” క్రైస్తవ్యమునకును చెందినది. క్రీస్తునందు యూదుడు, అన్యుడు ఏకమైయున్నాడని ఈ వచనముయొక్క భావమైయున్నది. వీరిద్దరికి ఉన్న విపరీతమైన భేదము తొలిగించబడెను.

10:17,18 ఈ వచనములలో ప్రభువు యూదులను, అన్యులను తనయొద్దకు ఆకర్షించుకొనుటకు ఏమి చేసెను? ఆయన చనిపోయి తిరిగి లేచెను. ఆయన తన ప్రాణమును పెట్టుటకును, తిరిగి తీసికొనుటకును, ఆయనకు అధికారము కలదు. ఆయన దేవుడు గనుక ఆలాగు చేయగలడు.

నశించిన గొట్టెల రక్షణార్థమై ఆయన చనిపోవుటకు, మరల తిరిగి లేచుటకు యిష్టము చూపినందున తండ్రి ఆయనను ప్రేమించెను ప్రభువు ప్రాణమును ఆయన యొద్దనుండి తీసికొనువారు ఎవరునులేరు.

ఆయన దేవుడు గనుక తన్ను చంపుటకు పన్ను కౄర పన్నాగములన్నింటికి ఆయన అతీతుడు. కనుక ఆయన తన ప్రాణము పెట్టుటకును, తిరిగి తీసికొనుటకును ఆయనకు అధికారము కలదు.

అయితే మానవులాయనను చంపలేదా? అవును, మానవులాయనను చంపిరి. ఈ విషయము అ.కా. 2:23 మరియు 1 థెస్స 2:15. లోను చెప్పబడినది. వారట్లు చేయుటకు ఆయన ఒప్పుకొనెను. ఇది తన ప్రాణము పెట్టుటకు తనకు అధికారము కలదని నిరూపించుటకు సూచన.

యోహాను 19:30 ప్రకారము ఆయన “ఆత్మను అప్పగించెను” అని చెప్పబడినది. ఇది ఆయన యొక్క చిత్తమును శక్తిని చూపించుచున్నది. ఈ ఆజ్ఞ నా తండ్రివలన పొందితినని చెప్పు చున్నాడు. ఆయన తన ప్రాణము పెట్టుటకును మరియు మృతులలోనుండి తిరిగి లేచుటకును తండ్రి ఆయనకు ఆజ్ఞాపించెను. ఆయన మరణ పునరుత్థానములు తండ్రియొక్క చిత్తమై యున్నవి.

యూదులలో భేదము (10:19 – 21)

10:19 యూదులలో మరియొక భేదమును ప్రభువైన యేసుక్రీస్తు చూపించు చున్నాడు. క్రీస్తు ప్రవేశము ఈ లోకములోనికి, గృహములోనికి, హృదయములోనికి సమాధానముకన్న ఖడ్గమును తీసికొని వచ్చును. ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించిన వారి హృదయములు దేవుని సమాధానముతో నింపబడును.

10:20,21 ఈ లోకములో నివసించిన పరిపూర్ణ మానవుడు ప్రభువైన యేసు ఒక్కడే. ఆయన ఒక దుర్భాషగాని, ఒక దుష్టకార్యమునుగాని చేసియుండలేదు. ఆయన ప్రేమనుగూర్చియు, జ్ఞానమునుగూర్చియు మాటలాడుటకు వచ్చియుండగా దుర్మార్గు లైన మనుష్యులు ఇతడు దయ్యము పట్టినవాడును, పిచ్చివాడును అని చెప్పి నిర్లక్ష్యము చేసిరి. అయితే కొందరు ఆయనయొక్క మాటలను, కార్యములను గుర్తించి ఆయన దయ్యము పట్టినవాడుకాక, మంచివాడని ఒప్పుకొనిరి.

యూదులలో భేదము (10:19 - 21)

యేసు తాను చేసిన పనులనుబట్టి
క్రీస్తు అని గుర్తింపబడుట (10:22-39) :

10:22 – 24 ఇక్కడ ప్రభువు పరిసయ్యులతో మాటలాడుట చాలించి యూదులతో మాటలాడుట కారంభించెను. 21వ వచనములో జరిగిన సంఘటనకు 22వ వచనములో జరిగిన సంఘటనకు ఎంత సమయము గడిచిపోయెనో మనకు తెలియదు, ఆలయప్రతిష్ఠ పండుగనుగూర్చి ఇక్కడ మాత్రమే ఇవ్వబడెను.

క్రీ.పూ. 165వ సంవత్స రమున (యూదా మక్కాబీయుల కాలమందు) దేవుని మందిరము ‘అంతియొకస్ ఎపిఫనెస్ వలన అపవిత్రపడియుండుట వలన మక్కాబీయులైన యూదా జనాంగము ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగను ఆచరించుటకు ఏర్పాటు చేసిరని సామాన్యముగా చెప్పుదురు.

ఇది యూదులు సంవత్సరమున కొకసారి ఏర్పాటుచేసిన పండుగయేగాని యెహోవా దేవుడు వారికి నిర్ణయించినదికాదు. అది చలికాలము, ఆధ్యాత్మికముగాను అది చలికాలమే. యేసుప్రభువు పరిచర్య ముగియనున్నది. సిలువ మ్రానుపై ఆయన తన ప్రాణమును అప్పగించుటద్వారా తన్ను తాను తండ్రియైన దేవునికి ప్రతిష్ఠించుకొను చున్నాడు.

 

గొట్టెల మంచి కాపరి Bible Verses Chapter 10

సొలొమోను మంటపము హేరోదు నిర్మించిన మందిరమునకు ఆనుకొని యున్నది. యేసు అక్కడ ఉండగా యూదులనేకులు ఆయనచుట్టు కూడిరి. అంతట వారు నీవు మమ్ములను ఎంత కాలము సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైన మాతో చెప్పుమనిరి.

10:25 యేసు మరల వారికి తాను చేసిన బోధయు, తాను నెరవేర్చిన కార్యములను వారి జ్ఞాపకమునకు తెచ్చెను. అనేకసార్లు వారికి తాను మెస్సీయనని చెప్పుకొనెను. ఆయన చేసిన అద్భుత కార్యములు ఆయనను ‘మెస్సీయ’గా నిరూపించినవి.

మరియు తాను చేసిన అద్భుత కార్యములు తండ్రియొక్క అధికారముతోను, ఆయన మహిమ కొరకు చేసినట్లుగా వారికి వివరించెను. ఆ విధముగా ఆయన చేయుటవలన తాను తండ్రియొద్దనుండి పంపబడితినని వారికి నిరూపించుకొనెను.

10:26 అయితే వారాయనను అంగీకరించలేదు గనుక వారాయన గొట్టెలుకారని తేలుచున్నది. వారాయనవారని తమ్మును తాము ప్రత్యేకించుకొనినచో, వారాయనను నమ్ముచున్నట్లుగా తమ అంగీకారమును చూపవలసినవారునై యున్నారు.

10:27 ప్రభువైన యేసుయొక్క నిజమైన గొట్టెలు ఎన్నటికి నశించవని తరువాయి వచనములు కొన్ని మనకు బోధించుచున్నవి. విశ్వాసియొక్క నిత్యత్వమంతటిలోని భద్రత ఒక మహిమాన్విత కార్యము.

క్రీస్తుయొక్క నిజమైన గొజ్జెలు ఆయన స్వరము వినును. సువార్త ప్రకటింపబడగా వినుట మరియు, వినినదానికి అనుగుణముగా ప్రతిస్పందించుట నిజమైన గొట్టెలు (విశ్వాసుల యొక్క లక్షణము. (ఆయనను అంగీకరించుట). దినము తరువాత దినము ఆయన స్వరమును వినుచు ఆయన వాక్యమునకు వారు విధేయులై యుందురు.

ప్రభువైన యేసు తన గొట్టెలను ఎరుగును. పేరుపేరున ఆయన తన వారిని ఎరుగును. ఎవరైనను ఆయనను దాటి పోజాలరు. (ఆయన గురిని తప్పిపోరు). ఆయనయొక్క అలక్ష్యము వలన గాని, నిర్లక్ష్యము వల్లగాని ఎవరు తప్పిపోరు. క్రీస్తు గొట్టెలు ఆయనను వెంబడించును. నిజమైన కాపరిని గుర్తించి, ఆయన అడుగుజాడలను అనుసరించును.

10:28 క్రీస్తు తన గొట్టెలకు నిత్యజీవమనుగ్రహించి యున్నాడు. దీనినిబట్టి ఎల్లప్పుడు ఉండునది నిత్యజీవమేనని తేలుచున్నది. వారి ప్రవర్తననుబట్టి ఈ జీవము అనుగ్రహింపబడియుండలేదు. ఇది నిత్యజీవము.

జీవితముయొక్క ప్రత్యేకతను చూపించుచున్నది. ఇది ప్రభువైన యేసు జీవితమే. ఆయన దేవునిగూర్చిన సంగతులను ఈ భూమిపై ఆనందించి, పరలోకమునకు అర్హమైన జీవితమును జీవించెను. ఈ మాటలను గమనించండి. “అవి ఎన్నటికిని నశింపవు.”

క్రీస్తు గొట్టెలు నశించి పోయినచో ప్రభువైన యేసు తనయొక్క వాగ్దానమునుండి తప్పిపోయినవాడుగా నుండును. గాని అది అసాధ్యము. అయితే ఆయన గొజ్జయైనది ఏదియు నరకములో నిత్యత్వమున గడపజాలదు.

అయితే దీనినిబట్టి ఒకడు మారుమనస్సు పొంది తన ఇష్టానుసారముగా జీవించవచ్చునా? వాడు రక్షింపబడి పాపయుక్తమైన లోకభోగము లందు జీవించవచ్చునా? వలదు. నిజముగా అట్టివాడు ఈ కార్యములను చేయువాడై యుండకూడదు.

వాడు తన కాపరిని అనుసరించ నాశగలవాడై యుండవలెను. మనము క్రైస్తవులుగా నుండుటకు క్రైస్తవ జీవితము జీవించలేము. లేదా రక్షణను నిలుపుకొనుటకు క్రైస్తవులుగా జీవించము గాని మనము క్రైస్తవులము గనుక క్రైస్తవ జీవితమును జీవించుదుము.

మన రక్షణ పోగొట్టుకొందుమేమోనను భయముతో పరిశుద్ధ జీవితము జీవించుట కాదుగాని మనకొరకు ప్రాణము పెట్టిన వానికొరకు కృతజ్ఞతతో పరిశుద్ధ జీవితమును జీవించుట కాశించుదుము. నిత్యత్వముయొక్క భద్రతనుగూర్చిన సిద్ధాంతము జీవితముపట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగియుండుట కాదు గాని, పరిశుద్ధ జీవితము జీవించుటకు స్థిరమైన అభిప్రాయమును కలిగియుండుటయే. ఎవడును క్రీస్తు చేతిలోనుండి ఒక విశ్వాసిని అపహరింపలేడు.

ఆయన హస్తము అనంతమైన శక్తిగలది. ఆయన హస్తము ప్రపంచములను నిర్మించెను. 10:29 ఆ ప్రపంచములకు ఆయన ఆధారమైయున్నాడు. ఆయనయొద్దనుండి తీసివేయుటకు ఏ శక్తియు చాలదు. ప్రభువైన క్రీస్తు చేతిలోనేగాక. తండ్రిచేతిలో కూడ మనము ఉన్నాము. ఇది రెండింతలు క్షేమకరమైన వాస్తవము. తండ్రియైన దేవుడు అందరికంటే గొప్పవాడు గనుక ఆయన చేతిలోనుండి మనలను ఎవడును అపహరించ లేడు.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :10:30 ఇక్కడ ప్రభువు తన్ను దేవునితో సమానముగా చూపుచున్నాడు. నేనును నా తండ్రియు ఏకమై యున్నాము. అధికారములోను, శక్తిలోను తండ్రి, క్రీస్తు ఒక్కటే. గొట్టెలను కాపాడు శక్తిని గూర్చి ప్రభువు మాట్లాడుచుండెను. తన గొట్టెలను కాపాడుటలో తండ్రి కెంత శక్తిగలదో తనకు అంత శక్తిగలదని యేసు చెప్పుచున్నాడు. దైవత్వములోను ఆయన సమానుడేనని నిరూపించుచున్నాడు.

10:31 ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా దేవుడైయుండి, ప్రతి విషయములోను తండ్రితో సమానుడు. రక్షకుడు చెప్పినదానికి యూదులకు ప్రశ్నవేయనగత్యము లేదు. వారిముందు తన దైవత్వమును ఆయన నిరూపించుకొనుచున్నాడు. ఆయనను చంపు టకు వారు రాళ్ళుఎత్తిరి.

10:32,33 వారు తనపై రాళ్ళు విసురుటకు ముందుగా తన తండ్రి ఆజ్ఞానుసారముగ వారి మధ్య చేసిన అద్భుత కార్యములను వారికి గుర్తుచేసెను. తాను చేసిన ఈ కార్యములలో దేనిని బట్టి తనను రాళ్ళతో కొట్టుచున్నారని అడిగెను.

అందుకు వారు నీవు చేసిన ఏ అద్భుత కార్యములకును మేము నిన్ను రాళ్ళతో కొట్టుటలేదు గాని, నీవు దేవునితో సమానముగా ఎంచుకొని, దేవదూషణ చేయుచున్నందుకు మేము నిన్ను రాళ్ళతో కొట్టెదమని చెప్పిరి.

ఆయన తాను దేవునిగా అనేకసార్లు నిరూపించు కొనుచున్నప్పటికి నీవు మానవునికంటె ఏ మాత్రము ఎక్కువైన వాడివి కాదని వారు వాదించుచుండిరి. వారు ఆయన దేవుడని చెప్పుటకు నిరాకరించుచుండిరి. వారు ఆయన దేవుడనని చెప్పుకొనుటకును సహించలేకపోయిరి.

10:34 కీర్తన 32:6 ను చూపించి అది వారి ధర్మశాస్త్రములో భాగమని చెప్పెను. అనగా దేవుని ప్రేరణతో ప్రవచింపబడిన పాత నిబంధన భాగమునుండి గ్రహింపబడిన దని వారికి చూపించెను. “మీరు దైవములనియు, మీరందరు సర్వోన్నతుని కుమారు లనియు నేనే సెలవిచ్చియున్నాను.”

కీర్తనకారుడు ఇశ్రాయేలీయులలోని న్యాయాధి పతులను ఈ కీర్తనలో సంబోధించెను. వారిని దైవములని పిలుచుటలో వారి దైవత్వమునుబట్టికాదు గాని, ప్రజలకు తీర్పుతీర్చుటలో దేవుని పోలియున్నారని చెప్పెను.

హెబ్రీభాషలో ‘దేవుడు’ ‘న్యాయాధిపతి’ అను రెండు అర్థములనిచ్చు ఒకే ఒక పదము గలదు. ఈ పదమునకు ‘శక్తిగలవాడని’ కూడ అర్ధము చెప్పవచ్చును. మనమా కీర్తన అంతయు చదివినయెడల వారు మానవులే కాని, ‘దేవుళ్ళు’ కారు అని తెలియు చున్నది. ఎందుకనగా వారు అన్యాయముగా తీర్పు తీర్చిరి. వ్యక్తులను వారి వారి గొప్పతనమునుబట్టి గౌరవించిరి అని చెప్పబడుచున్నది.

10:35 వాక్యమైయున్న దేవుడు ఎవరి యొద్దకు వచ్చెనో, వారిని దైవములని దేవుడు అనినట్లుగా ప్రభువు ఈ కీర్తనలోని భాగమును వారి గమనములోనికి తెచ్చియున్నాడు. వీరు దేవునికొరకు ప్రవచించువారునై యున్నారు.

ఇశ్రాయేలు జనాంగముతో వీరిద్వారా యెహోవా దేవుడు మాట్లాడెను. దేవునిచే అభిషేకింపబడిన వారై వారు తీర్పు తీర్చునపుడు అధికారము కల్గిన దేవుని ప్రత్యక్షపరచుదురు. పాత నిబంధనలోని లేఖన భాగములు దేవుని ప్రేరణచే కల్గినవని నమ్మిన ప్రభువు లేఖన ములు నిరర్ధకము కానేరవని చెప్పెను.

లేఖన భాగములు అమోఘమైనవిగానుండి నెరవేరినవిగాను తృణీకరింపబడనివిగాను ఆయన నమ్మెను. లేఖనములు దేవునివలన ప్రేరేపింపబడినవే గాని, అవి ఆలోచనలుగాని, ఉద్దేశములుగాని కానేరవు. ఇక్కడ ఆయన ఉద్దేశము అంతయు ‘దైవములను’ గూర్చియే.

10:36 ప్రభువు అల్పుడైన వాని దగ్గరనుండి గొప్పవానికొరకు తర్కము పెంచి యున్నాడు. అన్యాయస్థులైన పాత నిబంధన కాలపు న్యాయాధిపతులే దైవములని చెప్పబడగా తాను దేవుని కుమారుడనని ఎక్కువగా చెప్పుకొనుటకు అధికారము కలదని చెప్పెను.

దేవుని వాక్యము వారియొద్దకు వచ్చెను. ఆయనే దేవుని వాక్యమై యుండెను. వారు దైవములని పిలువబడిరి. ఆయన దేవుడైయుండెను. తండ్రి వారిని పవిత్రపరచి వారిని లోకములోనికి పంపెనని ఆయన చెప్పుటలేదు.

పడిపోయిన ఆదాము కుమారులవలె వారును ఈ లోకములో జన్మించినవారే. అయితే యేసు తండ్రియైన దేవునివలన పవిత్రపరచబడి నిత్యత్వమంతటిలో తండ్రితో నివసించుచు ఈ లోక రక్షకునిగా పరలోకమునుండి పంపబడెను.

కావుననే యేసు తాను అన్ని విషయములలో దేవునితో సమానునిగా చూపించుకొనుటకు అధికారము కలదు. తను తండ్రితో సమానునిగా చూపించుకొనుట వలన ఆయన దేవదూషణ చేయు చున్నాడని చెప్పజాలము. దేవునియొక్క ప్రవక్తలును, న్యాయాధిపతులపై అపవాదు వేయుచు యూదులు ‘దైవము’లను మాటను వాడుచున్నారు.

ఆయనే నిజమైన దేవుడు గనుక మరి నిశ్చయముగా తానే దేవుడనని యేసు మరింతగా దృఢపరచవచ్చునుగదా!

10:37 తాను చేసిన అద్భుత కార్యములన్నియు తనయొక్క దైవత్వమును దృఢపరచు చున్నదని రక్షకుడు మరల చెప్పెను. అద్భుతములు ఆయన దైవత్వమును నిర్ధారించుట కాదుగాని, “నా యొక్క తండ్రి పనులు” అనునది ముఖ్యమైనది.

దురాత్మకూడా కొన్ని అద్భుత కార్యములు చేయునట్లుగా మనము లేఖన భాగములలో చూచెదము. అయితే ప్రభువైన యేసు చేసిన అద్భుత కార్యము లేవనగా “ఆయనయొక్క తండ్రి పనులే.”

ఆ పనులు ప్రభువైన యేసును మెస్సీయ అని రెండింతల సాక్ష్యాధారములై యున్నవి. ప్రభువు ఈ భూమిపై గావించిన అద్భుతములు మెస్సీయ వచ్చినప్పుడు ఈ అద్భుతములు చేయునని పాత నిబంధనకాలములో ప్రవచింపబడెను.

ఆయన చేసిన అద్భుతములు కృపాకనికరములుగలవై ప్రజలకు మేలు కలిగించెను. ఈ విధమైన అద్భుతములు దుష్టుడు చేయజాలడు.

10:38 ఈ వచనమును గురించి ‘రైల్’ గారు ఉపయోగార్ధమై ఈ విధముగా చెప్పిరి. నేను నా తండ్రి పనులను చేయుచున్నయెడల, నా మాటలను బట్టిగాక, నేను చేయు పనులనుబట్టి ఒప్పుకొనుడి. నా మాటను నమ్మినయెడల నా పనులనుకూడ నమ్ముదురు.

దీనినిబట్టి నేనును, నా తండ్రియు ఏకమై యున్నామని నమ్ముడి, తండ్రి నాయందును నేను నా తండ్రియందును ఉన్నాము. గనుక నేను ఆయన కుమారుడనని చెప్పుకొనుటలో దేవదూషణ చేయుటలేదని చెప్పెను.

10:39 ఆయన గతములో ప్రస్తావించిన విషయములను తీసివేయక వాటినే బలపరచుచున్నాడని గ్రహించిరి. కనుకనే వారాయనను మరల పట్టుకొనజూచిరి. గాని వారి చేతినుండి ఆయన తప్పించుకొని పోయెను. ఆయన వారికి అప్పగించు కొనుటకు సమయము సమీపించినను, ఆ గడియ వచ్చియుండలేదు.

యేసు యోర్దాను అద్దరికి తప్పించుకొని పోవుట (10:40-42) : 10:40,41 _

ఆయన పరిచర్యను ప్రారంభించిన ప్రాంతమునకు అనగా యోర్దాను అద్దరికి వెళ్ళెను. మూడు సంవత్సరములుగా ఆయన మాట్లాడిన ఆశ్చర్యకరమైన మాటలు శక్తిగల కార్యములు ముగియనున్నవి. ఆయన ఎక్కడ తన పరిచర్య ప్రారంభిం చెనో అక్కడనే – అనగా ధర్మశాస్త్రపరమైన యూదా మతమునకు దూరముగా తిరస్క రింపబడిన స్థలము ఒంటరిగా విడువబడిన స్థలములో ముగించెను.

అయినను ఆయన దగ్గరకు అనేకులు వచ్చుచుండిరి. వారు నిజమైన విశ్వాసులు, ఆయన నిందను భరించు టకు తమ సిద్ధపాటును చూపించుచున్నారు. ఆయనలో నిందను భరించుటకును, మతమునకు దూరముగా నుండుటకు ఒప్పుకొన్నవారు.

ఈ అనుచరులు బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రశస్తమైన సాక్ష్యమిచ్చిరి. యోహానుయొక్క పరిచర్య వేడుకయైనది, జ్ఞానయుక్తమైనది కాదుగాని అది యథార్థమైనది, ప్రభువైన యేసును గురించి బాప్తిస్మమిచ్చు యోహాను ప్రవచించినదంతయు, ఆయన రక్షకుని పరిచర్య యందు నెరవేర్చెను.

గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

ఈ విషయము ప్రతి క్రైస్తవుని హృదయమును ప్రోత్సహించును. మనము శక్తివంతమైన అత్భుతకార్యములను చేయలేకపోవచ్చును, మనకు ప్రజాదరణ లేకపోవచ్చును గాని, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్ష్యము కలిగియుందుము గాక ! ఇది దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగినది.

10:42 ఇశ్రాయేలు జనాంగముచే తృణీకరింపబడినప్పటికిని, ఆయనకు సాత్వికు లైన కొందరు స్వాస్థ్యముగా లభించుట చాలా ఆహ్లాదము కలిగించును. అక్కడ అనేకు లాయనను విశ్వసించిరి అని మనము చూచుచున్నాము.

ప్రతియుగమునందు ఇట్లే జరుగుచున్నది. దేవుని కుమారునియొక్క తియ్యని సహవాసమును అనుభవించుటకు ప్రభువైన యేసుతోకూడ నిందను భరించును, లోకముచే తృణీకరింపబడుటకు అసహ్యింపబడుటకు హింసింపబడుటకు అంగీకరించి ఆయనను హత్తుకొనియుండు టకు ఎల్లప్పుడు ఆయనకు ఈ భూమిపై కొంత శేషము ఆయనకుండెను.

Leave a Comment