యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

మొదటి అధ్యాయము

యేసుక్రీస్తుయొక్క దైవత్వము

ఉపోద్ఘాతము :
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందగలరని చదువరులు ఎరుగు నిమిత్తము యోహాను ఈ సువార్తను వ్రాసెను (20:31).
యోహాను సువార్తలో ఏడు బహిరంగ అద్భుతములు లేక సూచకక్రియలు కలవు. వాటిలో ప్రతి ఒక్కటి యేసే దేవుడని నిరూపించుటకు ఉద్దేశించబడినవి.
అవి :

  • గలిలయలోని కానా అను ఊరిలో నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:9).
  • ప్రధాని కుమారుని స్వస్థపరచుట (4:46-54).
  • బేతెస్థ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్లనుండి పడియున్న వ్యాధిగలవానిని స్వస్థపరచుట(5:2-9).
  • ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-14).
  • సముద్రములో రేగిన తుఫానునుండి తన శిష్యులను కాపాడు నిమిత్తము యేసు గలిలయ సముద్రముపై నడుచుట (6:16 – 21).
  • పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-7).
  • చనిపోయిన లాజరును మరణమునుండి తిరిగిలేపుట (11:1-14).

ప్రభువు బహిరంగముగా ప్రజల యెదుట చేసిన ఈ ఏడు సూచకక్రియలేగాక వీటితోపాటు తాను పునరుత్థానుడైన తరువాత ప్రత్యేకముగా తన శిష్యులకొరకు ఎనిమిదవ అద్భుత కార్యము చేసెను. అదేమనగా – చేపలు పట్టుటయే.

Read and Learn More Telugu Bible Verses

చార్లెస్ ఆర్, ఎర్డ్మన్ అను భక్తుడు యోహాను సువార్తను గూర్చి ఈ రీతిగా చెప్పెను : బైబిలు గ్రంథములో చెప్పబడిన మరి ఏ పుస్తకముకంటెను ఈ సువార్త అనేకులు క్రీస్తును వెంబడించునట్లు ప్రోత్సాహపరచెను. ప్రభువుయొక్క యథార్థమైన పరిచర్య చేయునట్లు అనేకులను ప్రేరేపించెను. సంక్లిష్టమైన ఎన్నో సమస్యలను అనేకమంది బైబిలు పండితులయెదుట ఉంచెను.

రచయితను గూర్చిగాని ఆతని పేరు గాని ఈ సువార్తలో ఎక్కడా చెప్పబడలేదు. అయితే పన్నెండుమంది అపొస్తలులలో ఒకడైన యోహాను దీనిని వ్రాసెనని నమ్ముటకు అనేక మంచి కారణములు కలవు. ఉదాహరణకు దీని రచయిత యూదుడై యుండెను. ఎట్లనగా రచనాశైలి, దానిలో ఉపయోగించిన శబ్దసముదాయము, యూదా మతాచారములు దాని లక్షణములతో అతనికిగల పరిచయము, ఈ సువార్తలో ప్రతిబింబించెడి పాత నిబంధన లేఖనములు – ఇవన్నియు దీని గ్రంథకర్త యూదుడని తెలియజేయుచున్నవి. ఇతడు పాలస్తీనాలో నివసించిన ఒక యూదుడు (1:28; 2:1,11; 4:46; 11:18,54; 21:1,2). మరియు యెరూషలేమును గూర్చియు దేవాలయమునుగూర్చియు అతనికి మంచి పరిచయము కలదు (5:2; 9:7; 18:1; 19:13, 17, 20, 41; మరియు 2:14-16; 8:20; 10:22).

ఈ సువార్తలో తాను వివరించినవాటన్నింటికి అతడు ప్రత్యక్షసాక్షియైయున్నాడు. అనేక ప్రదేశముల, వ్యక్తుల, సమయముల, అలవాటులను గూర్చిన వివరణలు ఈ సువార్తలో అనేకములు కలవు (4:46; 5:14; 6:59, 12:21; 13:1; 14,5,8; 18:6; 19:31). మరియు ఇతడు అపొస్తలుడైయుండెను. యేసుక్రీస్తును గూర్చియు, ఆయనయొక్క ఆంతరంగిక శిష్యులను గూర్చియు అతడు బాగుగా ఎరిగి యున్నాడు. (6:19,60,61; 12:16, 13:22, 28, 16:19).

అయితే ఇతర అపొస్తలులయొక్క పేర్లను పేర్కొని తన పేరు వెల్లడిచేయకుండునట్లు జాగ్రత్త వహించెను. మరియు 13:23; 19:26; 20:2; 21:7,20 లో పేరు చెప్పబడని ఒక వ్యక్తి గలడు. అతడు నిస్సందేహముగా ఈ అపొస్తలుడైన యోహాను కావచ్చునని నమ్మబడుచున్నది. అంతేగాక ఈ రచయిత ప్రత్యక్షసాక్షి యనుటకు ప్రాముఖ్యమైన మరి మూడు లేఖన
భాగములను గమనించండి -1:14; 19:35 మరియు 21:24.

మన ప్రభువుయొక్క భూలోక పరిచర్యను గూర్చిన వరుసక్రమము ఈ సువార్త నుండియే గైకొనబడినది. తక్కిన మూడు సువార్తలలో ప్రభువుయొక్క పరిచర్యకాలము ఒక్క సంవత్సరమునకే పరిమితమైయున్నట్లు కనిపించుచున్నది. కాని యోహాను సువార్తలో పేర్కొనబడిన సాంవత్సరిక పండుగలు, ప్రభువుయొక్క బహిరంగ పరిచర్య కాలము ఇంచుమించు మూడు సంవత్సరముల కాలవ్యవధిని తెలియజేయుచున్నవి. ఈ వాక్యభాగములు గమనించండి : మొదటిది పస్కాపండుగ (2:12,13); “పండుగ” (5:1) ఇది పూరీము అను పస్కా పండుగ కావచ్చును. రెండవది (లేక మూడవది) పస్కా పండుగ (6:4); “పర్ణశాలల పండుగ” (7:2); “ఆలయప్రతిష్ఠ పండుగ” (10:22); ఆఖరిది “పస్కా పండుగ” (12:1).

యోహాను తన సువార్తలో కాలమును గూర్చి కూడ తేటగా తెలియజేసెను. కాని తక్కిన ముగ్గురు సువార్తికులు సమయాన్ని గూర్చి చెప్పినప్పుడు “ఇంచు మించు” అను పదము వాడిరి. యోహానయితే “ఒంటి గంటకు” (4:52), “మూడవ దినము” (2:1), “రెండు దినములు” (10:22), “ఆరు దినములు” (12:1) అని కచ్చితముగా వ్రాసెను.
ఈ సువార్తలో వాడబడిన శైలి, మాటలు బహు విశేషమైనవి. ఇట్టి శైలి, మాటలు ప్రత్యేకమైనవైయుండి యోహాను వ్రాసిన పత్రికలలోనే కనిపించును. దీనిలోని వచనములు సంక్షిప్తముగాను, బహు సులభశైలిలోను ఉన్నవి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

ఇది గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికిని దీనిలో హెబ్రీ భాషయొక్క ఆలోచన ధోరణి కలదు. సహజముగా వచనము, దానిలోని సత్యము అంత గంభీరముగా నుండును. తక్కిన సువార్తల కంటె ఈ సువార్తలో పదసముదాయము చాలా తక్కువ. కాని వాటిలో బహు లోతైన భావము కలదు. ఈ సువార్తలో చెప్పబడిన ప్రాముఖ్యమైన కొన్ని మాటలు, అవి ఎన్ని మారులు వాడబడినది మనము గమనించవలెను : తండ్రీ (118), విశ్వసించు (100), లోకము (78), ప్రేమ (45), జీవము (37), సాక్ష్యము (47), వెలుగు (24).

ఈ సువార్తలో గుర్తింపదగిన మరొక ముఖ్య లక్షణమేమనగా – “ఏడు” అను సంఖ్య. దాని గుణిజములు సారిసారి మనకు కనిపించును. ఈ సంఖ్యకు లేఖన మంతటిలో పరిపూర్ణత మరియు ముగింపు లేక నెరవేర్పు అను భావము ఇయ్యబడినది (ఆదికాండము 2:1-3 చూడండి). ఈ సువార్తలో దేవుని ఆత్మ యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షతను పరిపూర్ణము చేయుచున్నాడు. అందునుబట్టి “ఏడు” అను సంఖ్య పదే పదే మనకు కనిపించుచుండును.

“నేనే” అను మాట ఏడు విధములుగా ఈ సువార్తలో మనకు కనిపించుచున్నది. గమనించండి: “జీవాహారము నేనే” (6:35, 41,48,51), “నేను లోకమునకు వెలుగును”(8:12; 9:5), “ద్వారమును నేనే” (10:7,9), “నేను గొజ్జెలకు మంచి కాపరిని” (10:11,14), “పునరుత్థానమును జీవమును నేనే” (11:25), “నేనే మార్గమును, సత్యమును, జీవమును (14:6), “నేను ద్రాక్షావల్లిని” (15:1,5), ఇవిగాక మరి ఏడు “నేను” లు కలవు (4:26; 6:20; 8:24, 28, 58; 13:19, 18:5, 8).

ఆరవ అధ్యాయములో జీవాహారమునుగూర్చి చెప్పబడిన “ఆహారము” (Bread) అను పదము ఇరువదిఒక్కమారులు గ్రీకు భాషలో చెప్పబడినది. ఇది ఏడుయొక్క గుణిజము (7×3=21). కొన్ని మారులు “రొట్టెలు” (Loaves) అనియు, కొన్ని మారులు “ఆహారము” (Bread) అను భావములతో చెప్పబడెను. “జీవాహారము” అను మాటలో “పరలోక ఆహారము” అని ఏడు పర్యాయములును “పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము” అని ఏడు పర్యాయములును చెప్పబడెను.

యోహాను తన సువార్తను “వాక్యము” అను మాటతో ప్రారంభించుచున్నాడు. కాని, వాక్యమనగా ఎవరు? ఆ వాక్యము ఏమైయున్నది? అను విషయమును గూర్చి ప్రారంభములో అతడు వివరించలేదు. సహజముగా మన భావములను ఇతరులకు వ్యక్తపరచు సంభాషణల సముదాయమే వాక్యము. కాని ఇక్కడ యోహాను సంభాషణ లనుగూర్చి గాక, ఒక వ్యక్తిని గూర్చి మాటలాడుచున్నాడు. ఆ వ్యక్తి దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు.

ఆయనను యోహాను “వాక్యము” అని సంబోధించెను. ఎందుకనగా, ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మానవాళికి తన్నుతాను సంపూర్ణ ముగా బయలుపరచుకొనెను. క్రీస్తు ఈ లోకమునకు వచ్చుటద్వారా దేవుడు ఎట్టివాడై యున్నాడు లేక ఏమైయున్నాడను సత్యమును ఆయన మనకు బయలుపరచెను. అంతే గాక కలువరి సిలువలో మనకొరకు మరణించుటద్వారా దేవుడు మనలను ఎంతగా ప్రేమించెనను దానిని క్రీస్తు మనకు బోధించెను. ఈ రీతిగా క్రీస్తు మానవునికి దేవుని జీవవాక్యమైయున్నాడు. అనగా దేవుని ఆలోచనలను బయలుపరచువాడైయున్నాడు.

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

1:1 ప్రభువు నిత్యత్వములోనే తన ఉనికి కలిగియున్నాడు. మానవుని ఆలోచన గతములో ఎంత వెనుకకు వెళ్ళగలదో, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎన్నడు సృజింపబడినవాడుకాడు. ఆయన ఆది (ప్రారంభము) లేనివాడు.

అందుకు ఈ వచన భాగమును గమనించండి : “వాక్యము దేవునియొద్ద ఉండెను” అనగా, ఆయన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తి. ఆయన దేవునితో జీవించియున్న ఒక వాస్తవికమైన వ్యక్తి. ఆయన దేవునియొద్దనుండుటమాత్రమే గాక, తనంతట తానే దేవుడైయున్నాడు. దేవుడొక్కడే. మరియు ఆ దైవత్వములో ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి-కుమార-పరిశుద్ధాత్మ ఉన్నారనియు బైబిలు మనకు బోధించుచున్నది.

1.2 ఈ ముగ్గురు వ్యక్తులు కలసి దేవుడై యున్నారు. కాని ఈ వచనములో దైవత్వములోని యిద్దరు వ్యక్తులు మాత్రమే పేర్కొనబడిరి. వారే తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు. “యేసుక్రీస్తు దేవుడైయున్నాడ”ని ఈ సువార్తలో చెప్పబడిన అనేక వచనములలో ఇది మొదటి వచనము. ఆయన దేవుని వంటివాడనియు, ఆయనకూడా ఒక దేవుడ నియు చెప్పుట సరికాదు. కాని “ఆయన దేవుడు” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. మొదట చెప్పిన విషయమునే ఈ రెండవ వచనముకూడా చెప్పినట్లు కనిపించ వచ్చును.

కాని అది సత్యముకాదు. క్రీస్తుయొక్క వ్యక్తిత్వమునకును, ఆయన దైవత్వ మునకును ఆది లేదని ఈ వచనము చెప్పుచున్నది. ఆయన బేత్లహేములో శిశువుగ జన్మించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి కాలేదు. లేక నేడు అనేకులు చెప్పుచున్నట్లు పునరుత్థానము తరువాత ఆయన ఒక దేవుడు కాలేదు. నిత్యత్వమంతటిలో నుండి ఆయన దేవుడైయున్నాడు.

1:3 యేసుక్రీస్తు ఒకరిచేత సృష్టింపబడినవాడు కాదు. కాని ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. మానవులను, జంతుజాలమును, గ్రహములను దేవదూతలను అనగా – దృశ్యమైన, అదృశ్యమైన వాటన్నింటిని ఆయనే సృష్టించెను. సృష్టింపబడిన దేదైనను ఉన్నయెడల అది ఆయనద్వారానే సృష్టింపబడెను. సృష్టికర్తగా సమస్త సృష్టికి ఆయన పైవాడైయున్నాడు. వాస్తవముగా సృష్టి కార్యములో దేవత్వములోని ముగ్గురు వ్యక్తులు కలసియున్నారు. ఈ వచనమును గమనించండి: ఆదియందు ఆయన భూమ్యాకాశములను సృజించెను (ఆది 1:1). “దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చుండెను” (ఆది 1:2).

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

“సర్వమును ఆయన (యేసుక్రీస్తు) ద్వారాను, ఆయననుబట్టియు సృజింపబడెను” (కొలొస్స. 1:16).

1:4 ఆయన జీవమునకు మూలమైయుండెను. ఇక్కడ “జీవము” అను మాటలో “భౌతిక జీవము” మరియు “ఆత్మీయ జీవము” అను భావము కూడా కలదు. ఈ లోకములో మనము పుట్టినప్పుడు భౌతిక జీవమును పొందియున్నాము. అయితే మనము తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవమును పొందుదుము. అయితే ఈ రెండు జీవములు ఆయననుండియే కలుగుచున్నవి మనకు జీవమును అనుగ్రహిం చిన ఆయనే మానవులకు వెలుగైయున్నాడు. మానవునికి ఈ లోకములో అవసరమైన నడుపుదలను, మార్గమును ఆయనే చూపును. జీవించుట అనునది ఒక సత్యము. కాని, ఎలా జీవించవలెను?

“ఈ జీవముయొక్క నిజమైన ఉద్దేశ్యమేమి?” అను సత్యమును ఎరుగుట, అనగా పరలోకపు మార్గము ఎరుగుట ప్రాముఖ్యమైన సత్యము. మనకు జీవముననుగ్రహించిన ఆయనే. మనము పయనించుచున్న మార్గమునకు అవసరమైన వెలుగునుగూడ అనుగ్రహించుచున్నాడు.

ఈ ప్రారంభ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క అద్భుతమైన ఏడు బిరుదులు కలవు. అవి : వాక్యము (1,14); వెలుగు (5,7), దేవుని గొట్టెపిల్ల (29,36); దేవుని కుమారుడు (34,49); క్రీస్తు (మెస్సీయ 41); ఇశ్రాయేలు రాజు (49); మనుష్యకుమారుడు (51). ఈ ఏడింటిలో మొదటి నాలుగు బిరుదులు ఒక్కొక్కటి రెండుమారులు. తక్కిన మూడు బిరుదులు ఒక్కొక్కసారి మాత్రమే పేర్కొనబడినవి. మొదటి నాలుగు బిరుదులు సార్వత్రికముగను, తక్కిన మూడు బిరుదులు దేవుని పురాతన ప్రజలైన ఇశ్రాయేలీయులకును అన్వయింపబడియున్నవి.

1:5 పాపము లోకములో ప్రవేశించుటను గూర్చి ఈ వచనములో మనము చూడ గలము. పాపప్రవేశము మానవ జాతియొక్క మనస్సునకు చీకటి క్రమ్మజేసెను. మానవుడు దేవుని ఎరుగకుండునట్లును, దేవుని ఎరుగవలెననెడి కోరిక లేకుండ ఈ చీకటి అతనిని అంధకారములో ముంచివేసినది. అయితే ఈ చీకటి లోనికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చెను. అనగా, చీకటిలో ప్రవేశించు వెలుగుగా వచ్చెను.

మరొక తర్జుమాలో (ASV) దీని భావము : “చీకటి దానిని జయింపకుండెను” అని కలదు. దీని భావమేమి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆ చీకటి ఆయనను గ్రహించలేదని దీని భావము. నిజముగా ఆయన ఎవరో, ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చెనోయను విషయమును మానవులు గ్రహింపకుండిరి. అయిననేమి? మానవుని తిరస్కారము, శతృత్వము ఆ నిజమైన వెలుగు ఈ లోకములో ప్రకాశింపకుండ నిరోధించలేకపోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

1:6 ఈ వచన భాగము బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్నది. ఇతడు ప్రభువైన యేసుకు ముందుగా దేవునిచేత పంపబడెను. యేసు క్రీస్తుయొక్క రాకడను గూర్చి ప్రకటించుటయు, ఆయనను అంగీకరించుటకై సిద్ధపడవలెనని ప్రజలకు తెలియజేయుటయు ఇతని పనియైయున్నది.

1:7 మరియు లోకమునకు నిజమైన వెలుగు యేసుప్రభువేయని సాక్ష్యమిచ్చు టకును, తద్వారా మనుష్యులందరు క్రీస్తునందు విశ్వాసముంచునట్లును ఇతడు సాక్షిగా వచ్చెను.

1:8 తనకు అప్పగించిన పనిలో అపనమ్మకస్థుడు కాకుండునట్లు ప్రజలను తన తట్టు ఆకర్షించుకొనలేదు. అంతేగాక తన్నుగాక ప్రభువైన క్రీస్తునే ప్రజలకు కనుపరచెను. లోకములోనికి ప్రభువైన క్రీస్తు రాక (1:9-18) :

1:9 యుగములనుండి మేమే రక్షకులము, మార్గదర్శకులమని చెప్పుకొనిన అనేక మంది కలరుగాని యోహాను ఎవరినిగూర్చి సాక్ష్యమిచ్చెనో ఆయనమాత్రమే శ్రేష్ఠమైన, నిజమైన వెలుగైయున్నాడు. “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” (9వ).

అనగా ప్రతి మనుష్యుడు క్రీస్తును గూర్చిన జ్ఞానము తన అంతరంగములో పొందియున్నాడని భావము కాదు. లేక అందరు ఏదోయొక సమయములో యేసుక్రీస్తునుగూర్చి వినియున్నారను భావముకూడా కాదు. కాని కుల, మత, జాతి, రంగు విచక్షణ లేకుండ ఆ వెలుగు అందరిపై ప్రకాశించుననియే దీని భావము. మరియు ఆ వెలుగు మనుష్యులందరిపై ప్రకాశించుటద్వారా ప్రభువైన యేసుక్రీస్తుయొక్క నిజ స్వభావమును బయలుపరచుచున్నది. అంతేగాక పరిపూర్ణమైన

మానవుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చుటద్వారా, ఇతర మానవులందరు తనకంటే ఎంతో అసంపూర్ణులని తెలుపుచున్నాడు. సహజముగా ఒక గది చీకటిగా ఉన్నప్పుడు, ఆ గదిలోని వస్తువులపైనున్న దుమ్ము ధూళిని నీవు చూడలేదు. కాని ఎప్పుడైతే ఆ గదిలో వెలుగు ప్రకాశించునో అప్పుడుమాత్రమే ఆ గదిలో ఉన్నది ఉన్నట్లు కనిపించును. అదే విధముగా నిజమైన వెలుగుయొక్క ప్రకాశత ఒక వ్యక్తి వాస్తవముగా ఏమైయున్నాడను విషయమును అతనికి బయలుపరచును.

1:10 ప్రభువు బేత్లహేములో జన్మించినప్పటినుండి, తిరిగి పరలోకమునకు వెళ్ళు దినము వరకు ఇప్పుడు మనము జీవించుచున్న ఈ లోకములోనే ఆయన జీవించి యుండెను. వాస్తవముగా మనుష్యులందరికంటే ఈ భూమిమీద నివసించుటకు ఆయనకుమాత్రమే ఎక్కువ అధికారము, హక్కు కలదు. ఈ సమస్త లోకమును ఉనికి లోనికి తెచ్చినవాడును, దీనికి నిజమైన హక్కుదారుడును ఆయనే, కాని మనుష్యులు సృష్టికర్తగా, ఆయనను గుర్తించక, తమవలె ఆయనకూడ ఒక సామాన్య మానవుడని వారు తలంచిరి. గనుకనే ఆయనను తమకు అన్యునిగాను, బయటికి త్రోసివేయబడిన వానిగాను ఎంచిరి.

1:11 “ఆయన తన స్వకీయులయొద్దకు (తన స్వంతవారియొద్దకు) వచ్చెను” అని ఈ వచనములో మనము చదువుచున్నాము. ఆయన ఎవరి స్వాస్థ్యమును ఆక్రమించ లేదు. కాని తాను సృజించిన ఈ భూమిమీదనే ఆయన జీవించెను. అయినను “ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు” సామాన్యదృష్టితో పరికించిన యెడల ఆయన స్వకీయులు” అను మాట సమస్త మానవాళిని సూచించుచున్నది. గనుక సమస్త మానవాళి ఆయనను తిరస్కరించెననుట వాస్తవము.

కాని ప్రత్యేకముగా చెప్పవలెనంటె యూదా జాతిని ఆయన తన వారినిగా ఎంచుకొనెను. వీరు ఆయన యొక్క భూలోక ప్రజలైయున్నారు. గనుక ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు వారి “మెస్సీయ” గా తన్నుతాను యూదులకు కనుపరచుకొనెను. కానీ వారు ఆయనను
అంగీకరించలేదు.

1:12 అందువలన సమస్త మానవాళికి ఆయన తన్నుతాను సమర్పించుకొనెను. మరియు తన్ను ఎందరు అంగీకరించెదరో వారికి దేవుని కుమారులగు అధికారమును అనుగ్రహించెను. అయితే మనము దేవుని పిల్లలము కాగల విధానమును ఈ వచనము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. సత్రియలవలనగాని, లేక సంఘములో సభ్యత్వమువలనగాని గాక, ఆయనను అంగీకరించి, ఆయన నామమునందు విశ్వాస ముంచుట ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలము కాగలము.

1:13 సామాన్యముగా ఆలోచించినయెడల, శరీరరీత్యా ఒకడు ఒక వ్యక్తికి బిడ్డగా తీర్చబడవలెనంటే వాడు తప్పక శరీరరీతిని జన్మించవలెను. అదేరీతిగా, ఒకడు దేవుని బిడ్డగా తీర్చబడవలెనంటే అతడు తప్పక రెండవ జన్మను కలిగియుండవలెను. దీనినే క్రొత్తజన్మ లేక “మారుమనస్సు” లేక “రక్షింపబడుట” అంటారు. అయితే క్రొత్త జన్మను ఏ రీతిగా పొందలేమో తెలియజేయు మూడు విధానములను ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. అదే సమయములో క్రొత్త జన్మ పొందుటకుగల ఏకైక మార్గమును కూడ ఈ వచనము తెలియజేయుచున్నది. అవును, ఇది “రక్తమువలన” కలుగునది కాదు.

అనగా విశ్వాసులైన తల్లితండ్రులకు జన్మించుటవలన ఒకవ్యక్తి నిజమైన క్రైస్తవుడుగా తీర్చబడడు. రక్షణ రక్త సంబంధము (తల్లి తండ్రుల) ద్వారా బిడ్డలకు సంక్రమించునదికాదు. రెండవదిగా, ఇది “శరీరేచ్ఛలవలన” కలుగునదికాదు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తిని ఏ వ్యక్తి తన శరీరమందు కలిగియుండడు. రక్షణపొంద వలెననెడి కోరిక అతనికి కలిగినను, అతని స్వయిష్టము ఎంత మాత్రము చాలదు. చివరిగా, రక్షణ “మనుషేచ్ఛవలన” కలుగదు.

ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ విధముగను రక్షించలేడు. లేక ఒక బోధకుడు ఫలానివ్యక్తి తిరిగి జన్మించవలెనని ఎంతో ఆత్రుత కనుపరచినను అద్భుతమైన ఆ క్రొత్తజన్మను కలిగించుశక్తి అతనికి లేదు. అయితే ఈ క్రొత్త జన్మ ఏ విధముగా కలుగును? “దేవునివలననే” అని దీనికి జవాబు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తి దేనియందుగాని, ఎవరియందుగాని లేదు కాని, దేవునియందే కలదు.

1:14 ప్రభువైన యేసుక్రీస్తు బేత్లహేములో శిశువుగా పుట్టినప్పుడే “వాక్యము శరీర ధారియాయెను”. ఆయన దేవుని కుమారుడుగా పరలోకములో తండ్రితోకూడ నిరంత రము ఉన్నవాడు. కాని ఈ లోకములోనికి వచ్చుటకు ఆయన మానవ దేహమును ఎన్నుకొనెను. ఈ సందర్భములో మనము గ్రహించవలసినదేమనగా ఆయన శరీరా కారముగా చేయబడుననుట సరికాదు. కాని “ఆ వాక్యము శరీరధారియయ్యెను” యనుట స్పష్టము. ఎందుకనగా, ఆయన ఎన్నడు రూపింపబడినవాడుగాని లేక సృష్టింప బడినవాడుగాని కాడు. ఆయన తానే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. అయినను ఆయన శరీరధారియాయెను. అనగా ఒక మానవుడుగా ఈ లోకమునకు వచ్చెను.

అంతేగాక, ఆయన “మన మధ్య నివసించెను.” అనగా, ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోయెనని తలంచుట పొరబాటు. కాని వాస్తవముగా దేవుడు తానే ఈ లోకమునకు దిగివచ్చి మానవులమధ్య ఒక మానవుడుగా జీవించెను. “నివసించెను” అను పదము “తన గుడారమును వేసెను” అను భావమును సూచించుచున్నది. అనగా ఆయన శరీరమే ఆ గుడారము. తన శరీరమనే ఆ గుడారములో ఆయన మానవుల మధ్య ముప్ఫై మూడు సంవత్సరములు నివసించెను.

మరియు యోహాను – “మనము ఆయన మహిమను కనుగొంటిమి” అని చెప్పు. చున్నాడు. బైబిలు గ్రంథములో “మహిమ” అను పదము అనేక మారులు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కనిపించెడి తేజస్సును, ప్రకాశించుచున్న వెలుగును సూచించుచున్నది. అంతేగాక ఆ పదము దేవునియొక్క “పరిపూర్ణత” మరియు “మహాత్మ్యము” అను భావములనుకూడ సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్నప్పుడు తన మాంసయుక్తమైన దేహమందు తన మహిమను మరుగుపరచెను.

కాని ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుటకు రెండు మార్గములు కలవు. మొదటిది, ప్రకాశమానమైన, నీతియుక్తమైన మహిమ, అనగా, పరిపూర్ణమైన ఆయన శీలము మరియు పరిపూర్ణమైన జీవితమే. ఆయనయందు ఎట్టి లోపముగాని, దోషముగాని లేదు, ఆయన తన సమస్త మార్గములయందు సంపూర్ణుడై యున్నాడు. ప్రతి సద్గుణము ఆయన జీవితములో సమపాళ్ళలో ప్రత్యక్షపరచబడినది.

రెండవది – కనిపించని ఆయన మహిమ ఈ మహిమ రూపాంతరపు కొండమీద ప్రత్యక్షమైనది (మత్తయి 17:1,2). శిష్యులు చూచిన ఆ మహిమ ఆయన నిజముగా దేవుని కుమారుడై యున్నాడని తెలియజేయుచున్నది. క్రీస్తు తండ్రియొక్క అద్వితీయ కుమారుడు. అనగా దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు దేవునికి మరొకడు లేడు. ఒక విధముగా, నిజవిశ్వాసులందరు దేవునికి కుమారులైయున్నారు. కాని యేసుక్రీస్తు తనకు తానుగా దేవుని కుమారుడై యున్నాడు.

దేవుని కుమారునిగా ఆయన దేవునితో సమానుడైయున్నాడని అర్ధము. మరియు ఆయన “కృపాసత్య సంపూర్ణుడై యున్నాడు. అపాత్రులయెడల ఆయన మితిలేని దయగలవాడు. పరిపూర్ణమైన నీతి, పరిశుద్ధత గలవాడు. కాని ఆయన ఎన్నడు పాపమును కప్పిపుచ్చలేడు. దుష్టత్వమును సహించలేదు. నిండు కృప, మెండైన నీతిగలవాడు దేవుడు మాత్రమే.
1:15 ఈ వచనములో – యేసుక్రీస్తు దేవుని కుమారుడని యోహాను సాక్ష్యమిచ్చెను.

ప్రభువు తన బహిరంగ పరిచర్య ప్రారంభించకముందే యోహాను ఆయనను గూర్చి మానవాళికి తెలియజేయుచుండెను. యేసు యోహాను నొద్దకు వచ్చినప్పుడు యోహాను – “నేను చెప్పినవాడు ఈయనే” అని ఎలుగెత్తి చాటెను. పుట్టుకలోను పరిచర్యలోను ప్రభువు యోహానుకంటే వెనుకటివాడు.

ఆయన యోహాను పుట్టిన ఆరు నెలల తరువాత పుట్టెను. యోహాను ప్రకటించుచు బాప్తిస్మమిచ్చుచున్న కొంత కాలమునకు ఇశ్రాయేలు జనాంగమునకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. కాని ఆయన యోహానుకంటే ముందున్న వాడు. అంతేకాదు – ఆయన యోహానుకంటె గొప్పవాడు. గనుక యోహానుకంటే ఆయన అధిక ఘనతకు యోగ్యుడైయున్నాడు. కారణమేమనగా, ఆయన యోహాను కంటె ముందున్నవాడు. ఆయన విత్తుతున ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారందరు ఆయన పరిపూర్ణతలో నుండి ఆత్మీయ బలమును పొందుదురు.

ఆపరిపూర్ణత సకల యుగములలో సమస్తదేశ విశ్వాసులకు బలమును అనుగ్రహింపగలిగినంత గొప్పదైయున్నది. ఈ వచనములో బడిన “కృప వెంబడి కృప” అను మాటకు “సమృద్ధియైన కృప” అని భావము కలదు. “కృప” అనగా, దేవుడు తన ప్రియమైన పిల్లలపట్ల కుమ్మరించు దయ వాత్సల్యతయని అర్థము.

1:17 పాత నిబంధన కాలమునకు క్రొత్త నిబంధన కాలమునకు గల వ్యత్యాసమును యోహాను ఈ వచనములో చూపించుచున్నాడు. మోషేద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రము కృపను కనుపరచునదికాదు, విధేయతను చూపవలెనని అది మానవులకు ఆజ్ఞాపించు చున్నది. కాని విధేయత చూపుటలో మానవులు విఫలులైనయెడల వారికి మరణశిక్ష విధించుచున్నది. మరియు అది మంచిని మానవులకు బోధించెనుగాని, ఆ మంచిని చేయగల శక్తి ననుగ్రహించలేకపోయెను. ఆ ధర్మశాస్త్రము మానవులు కేవలము పాపులని చూపుటకే ఇయ్యబడెను. కాని ఆ మానవులను వారి పాపములనుండి రక్షించలేక పోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

అయితే “కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను” అని చెప్పబడిన మాటలు గ్రహింపతగినవి. ఆయన లోకమునకు తీర్పుతీర్చుటకు రాలేదుగాని, అయోగ్యులై తమ్మునుతాము రక్షించుకొనలేని తన శత్రువులైన వారిని రక్షించుటకు వచ్చెను. ఇదియే కృప. భూలోకపు నీచులకొరకు అనుగ్రహింపబడిన పరలోకపు శ్రేష్ఠుడే కృప.
కృప మాత్రమే కాదుగాని సత్యముకూడ ఆయనద్వారా కలిగెను.

ఆయన తన్ను గూర్చి “నేనే … సత్యమును” అని చెప్పెను. ఆయన తన సమస్త మాటలయందును కార్యముల యందును పరిపూర్ణమైన నీతిమంతుడును, నమ్మతగినవాడునైయుండెను. తన కృపను కనుపరచు నిమిత్తము ఆయన సత్యమును విడిచిపెట్టలేదు. మరియు పాపులను ప్రేమించినప్పటికిని, వారి పాపములను ఆయన ప్రేమించలేదు.

1:18 “ఎవరును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయన అదృశ్యుడైయుండెను. సామాన్యమైన మానవ దేహము ఆయనకు లేదు. పాత నిబంధన కాలములో ఆయన దేవదూతగా లేక ఒక మానవునిగా మానవులకు కనిపించెను. కాని దేవుడు ఏమైయున్నాడు? ఏ పోలికలో ఉన్నాడను దానిని పాత నిబంధనలోని ఈ ప్రత్యక్షతలు బయలుపరచలేదు. అవి కేవలము తన ప్రజలతో మాటలాడుటకు దేవుడు ఏర్పరచుకొనిన ప్రత్యక్షతలు మాత్రమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు మరొకడు లేడు. తండ్రియైన దేవునితో ఆయన ఎల్లప్పుడు ఒక విశిష్టమైన సన్నిహితము గలవాడు. యేసుక్రీస్తు

ఈ భూమిమీద ఉన్నప్పుడుకూడ ఆయన తండ్రి రొమ్మున ఉండెను. ఆయన దేవునితో ఉన్నవాడు. దేవుడు ఏమైయుండును లేక ఆయన ఎట్టివాడై యుండెనను సత్యమును ఆయన మానవులకు సంపూర్ణముగా ప్రత్యక్షపరచెను. యేసును చూచుట, దేవుని చూచుటయే. మానవులు యేసును చూచినప్పుడు దేవుని చూచిరి దేవుని మాటలు వినిరి. దేవుని ప్రేమను, ఆయన దయను వారు అనుభవించిరి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:19 మెస్సీయ వచ్చుచున్నాడు గనుక మారుమనస్సు పొందుడని యోహాను అను పేరుగల వ్యక్తి యూదా జాతికి బోధించుచున్నాడను వార్త యెరూషలేమునకు చేరిన వెంటనే, అతడెవరో తెలిసికొనుటకు యూదులు యాజకులను లేవీయులను అతని యొద్దకు పంపిరి. (యాజకులు దేవుని మందిరములో ప్రాముఖ్యమైన పరిచర్యలను జరిగించువారైయుండగా, లేవీయులు సామాన్యమైన విధులను జరిగించు పరిచారకులై యున్నారు.) వారు యోహాను నొద్దకు వచ్చి “నీవు ఎవరవు? బహు కాలమునుండి మేము ఎదురు చూచుచున్న మెస్సీయవా?” అని అడిగిరి.

1:20 అందుకు ఇతరులెవరైనను ఈ అవకాశమును సద్వినియోగము చేసికొని తానే క్రీస్తునని చెప్పుకొని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొనుటకు ఉపయోగించుకొనెడి వారే. కాని యోహాను నమ్మకమైన సాక్షి. గనుక “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకొనెను. 1:21 క్రీస్తు రాకముందు ఏలీయా ఈ భూమిమీదికి తిరిగి వస్తాడని యూదులు తలంచిరి (మలాకీ 4:5). గనుక ఈ యోహాను క్రీస్తుకానియెడల ఏలీయా కావచ్చునను ఉద్దేశ్యముతో “నీవు ఏలీయావా?” అని ప్రశ్నించిరి.

అందుకు యోహాను “కాను” అని గట్టిగా చెప్పెను. ఈ సందర్భములో ద్వితీయోపదేశకాండము 18:16 లో మోషే చెప్పిన మాటలు గమనించండి * “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను.” అను ప్రవచన వాక్కులు యూదులు జ్ఞాపకము చేసికొని, మోషే చెప్పిన ఆ ప్రవక్త ఈ యోహాను కావచ్చునని తలంచిరి. కాని ఈ పర్యాయముకూడా యోహాను – “కాను” అని ప్రత్యుత్తరమిచ్చెను.

1:22 గనుక యెరూషలేమునుండి పంపబడిన యాజకులు లేవీయులు సరియైన ప్రత్యుత్తరము లేకుండ తిరిగి వెళ్ళుటకు కలవరపడి “నిన్నుగూర్చి నీవు ఏమని చెప్పుకొనుచున్నావు” అని ప్రశ్నించిరి.

1:23 అందుకతడు – “ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు నేను …. అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము” అని చెప్పెను (యెషయా 40:3). మరొక మాటలో చెప్పవలెనంటే ముందుగా చెప్పబడినట్లు ఆయనకు ముందుగా వెళ్ళువాడనని యోహాన చెప్పెను. యోహానే ఆ స్వరము ఇశ్రాయేలీయులే ఆ అరణ్యము. ఎట్లనగా, ఇశ్రాయేలు జనాంగము ఎండిపోయి, నిష్పలమైన ఎడారివంటి వారైరి. అట్టి జనాంగమునకు యోహాను ఒక “స్వరముగా” తన్ను గూర్చి చెప్పుకొనెను. సహజముగా మనము స్వరమును వినగలమే గాని దానిని చూడలేము. ఇక్కడ యోహాను స్వరముకాగా, యేసుక్రీస్తు వాక్యమై యున్నాడు. వాక్యము వెల్లడి కావలెనంటే దానికి స్వరము కావలెను. కాని వాక్యములేకుండ స్వరమునకు విలువలేదు.

స్వరముకంటే వాక్యము బహు గొప్పది. గనుక మనము ఆయన స్వరమైయుండుట మన గొప్ప భాగ్యము. “ప్రభువు మార్గము సరాళము చేయుడి” – అనునది యోహాను వర్తమానము. “మెస్సీయ వచ్చుచున్నాడు. మరియు ఆయనను అంగీకరించుటకు ఆటంకముగా నున్న సమస్తమును మీలో నుండి తీసివేసికొనుడి. అట్లు చేసి ఆయన వచ్చి ఇశ్రాయేలు రాజుగా మిమ్మును ఏలునట్లు మీ పాపముల విషయమై పశ్చాత్తాప పడుడి” అని భావము.

1:24 యోహాను నొద్దకు మనుష్యులను పంపిన పరిసయ్యులు యూదా జాతిలో బహు నిష్టగల తెగకు చెందినవారు. ధర్మశాస్త్రమునందు తమకుగల విశేష జ్ఞానమును బట్టి పాతనిబంధన ఆజ్ఞలను, లేఖనములను తూ.చ. తప్పక పాటించెదమనెడి అతిశయము గలవారు. కాని వాస్తవమునకు వారిలో అనేకులు వేషదారులు. భక్తిగల వారివలె కనుపరచుకొనుటకు వారు ప్రయత్నించెదరు గాని ఘోరమైన పాపములో వారు జీవించెడివారు.

1:25 మరియు తాము పేర్కొనిన ప్రముఖ వ్యక్తులలో ఎవరూ కానప్పుడు బాప్తిస్మ మిచ్చుటలో యోహానుకు గల అధికారమేమిటోయని వారు తెలిసికొనగోరిరి.

1:26 ఇతరులు తన్ను ప్రాముఖ్యమైనవానిగా ఎంచవలెనని యోహాను ఆశించలేదు. గాని, క్రీస్తుకొరకు మానవులను సిద్ధపరచుటయే అతని పని. “నేను నీళ్ళలో బాప్తిస్మ మిచ్చుచున్నాను” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. ఎందుకనగా అతని బోధ వినినవారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు, వారి అంతరంగములో కలిగిన మార్పుకు బాహ్యసంకేతముగా అతడు వారికి నీటిలో బాప్తిస్మమిచ్చుచుండెను.

యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

యోహాను తన ప్రసంగమును కొనసాగొంచుచు – నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయనను నెరుగరు అని ప్రభువైన యేసు క్రీస్తును సూచించుచు చెప్పెను. కాని పరిసయ్యులు బహుకాలము నుండి తాము ఎదురు చూచిన మెస్సీయగా ఆయనను గుర్తించలేదు. యోహాను మాటలలోని భావ మేమనగా ఒక ప్రముఖునిగా నన్ను తలంచవద్దు … మీరు లక్ష్యముంచవలసిన వ్యక్తి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాని ఆయన నిజముగా ఎవరైయున్నాడో మీరు ఎరుగలేదు అని అతడు నొక్కి చెప్పెను.

1:27 అవును, ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన యోహానుకంటే తరువాత వచ్చినప్పటికిని ఆయన అన్నింటిలోను ప్రాముఖ్యత మరియు స్తుతి పొందనర్హుడు. తన యజమానియొక్క చెప్పులను విప్పవలసిన బాధ్యత దాసునిదే. కాని యోహాను క్రీస్తు కొరకు ఇట్టి దీనాతిదీనమైన పరిచర్యచేయుటకు తన్ను యోగ్యునిగా ఎంచుకొనలేదు.

1:28 యోహాను పరిచర్యచేసిన బేతనియ ఉన్న కచ్చితమైన ప్రదేశము మనకు తెలియదు. కాని యొర్దానునదికి తూర్పువైపున ఉన్నదని ఎరుగుదుము.

1:29 మరునాడు యెరూషలేమునుండి పరిసయ్యులు యొర్దాను. తీరమునకు వచ్చిరి, యేసుకూడ తనయొద్దకు వచ్చుట యోహాను చూచి, ఆ క్షణములో అమితానందము నొందినవాడై – “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని కేకవేసి చెప్పెను. గొజ్జెపిల్ల యూదులయొక్క బలిపశువు. గొట్టెపిల్లను వధించి దాని రక్తమును ప్రోక్షించవలెనని దేవుడు వారికి బోధించెను.

మానవుని పాపములు క్షమించబడునట్లు తనకు ప్రతిగా గొట్టెపిల్ల వధించబడి రక్తము చిందింపబడవలెను. అయినప్పటికిని, పాత నిబంధనలో వధింపబడిన గొఱ్ఱపిల్ల రక్తము పాపమును నిజముగా తీసివేయలేకపోయెను. ఆ గొట్టెపిల్లలు కేవలము ఛాయలైయుండి, దేవుడే ఒకనాటికి పాపభారమంతటిని మోసికొనిపోవు ఒక గొట్టెపిల్లను అనుగ్రహించునను సత్యమును సూచించుచున్నది. ఇప్పుడు ఆ సమయము రాగా, దేవుని నిజమైన గొట్టెపిల్ల వచ్చెనని యోహాను విజయోత్సవముతో ప్రకటించెను.

అయితే మనము ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా, యేసు లోక పాపమును మోసెనని చెప్పుటలో, ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడెనని యోహాను యొక్క భావముకాదు. సమస్త లోకపాప విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పూర్తిగా సరిపోయినది. కాని, ఎందరు ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరింతురో ఆ పాపులు మాత్రమే క్షమింపబడుదురు.

1:30 వచ్చుచున్నవాడు తనకంటే గొప్పవాడు. ఆయన కొరకు తాను మార్గమును సిద్ధపరచువాడను మాత్రమేయని జ్ఞాపకము చేయుటలో యోహాను ఎన్నడు అలయ లేదు. దేవుడు మానవునికంటే ఎంతటి గొప్పవాడో, యేసుక్రీస్తు యోహానుకంటె అంత గొప్పవాడు. యోహాను క్రీస్తుకంటె కొన్ని నెలలముందు పుట్టెనుగాని, యేసు నిత్యత్వమంతటిలో ఉన్నవాడు.

1:31 “నేను ఆయనను ఎరుగను అని యోహాను చెప్పినప్పుడు – యోహాను క్రీస్తును అంతకమునుపు ఎన్నడు చూడలేదని కాదు. యోహాను మరియు యేసు బంధువులు గనుక బహుశా వారు ఒకరి నొకరు బాగుగా ఎరిగియుండ వచ్చును. కాని యోహాను తన బంధువైన యేసుక్రీస్తును మెస్సీయగా తాను బాప్తిస్మమిచ్చువరకు గుర్తించలేదు. ఇక్కడ యోహాను చేయవలసిన పని ఒక్కటే. అదేమనగా – ప్రభువు మార్గము సిద్ధపరచి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఆయనను కనుపరచుట. గనుక క్రీస్తురాకడ కొరకు ప్రజలను సిద్ధపరచుటకై వారికి నీటిలో బాప్తిస్మమిచ్చు చుండెను. అయితే శిష్యులను తన కొరకు సంపాదించుకొనవలెనను ఉద్దేశ్యముతో అతడు ఆ విధముగా చేయలేదు.

1:32 32 వ వచనములోని మాటలు యోర్దాను నదిలో యోహాను క్రీస్తుకు బాప్తిస్మ మిచ్చు సమయమును సూచించుచున్నవి. బాప్తిస్మము పొంది యేసు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే దేవుని ఆత్మ పావురము రూపములో ఆయనమీదికి దిగి వచ్చెను (మత్తయి 3:16).

1:33 మెస్సీయ రాబోవుచున్నాడనియు, ఆయన వచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలుచుననియు దేవుడు యోహానుకు ముందుగా బయలుపరచెను, గనుక యేసు ప్రభువుకు ఈ సంభవము ఎప్పుడు సంభవించెనో, అప్పుడు “పరిశు ద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు ఈయనే” అని యోహాను గ్రహించెను.

పరిశుద్ధాత్ముడు దైవత్వములోని ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తియైయున్నాడు. ఆయన తండ్రియైన దేవునితోను, కుమారుడైన దేవునితోను సమానుడైయుండెను. యోహాను నీటితో బాప్తిస్మమిచ్చెనుగాని, యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చెను. ఈ ఆత్మ బాప్తిస్మము పెంతెకొస్తు దినమున సంభవించెను. (అ.కా. 1:15; 2:4,38). ఆ ఆత్మ ప్రతి విశ్వాసియందు నివసించుటకును, ఆ విశ్వాసిని క్రీస్తుశరీరమైయున్న సంఘములో అవయవములుగా చేర్చుటకును ఆ దినమున ఆయన దిగివచ్చెను (1 కొరింథీ 12:13). 1:34 ముందుగా చెప్పబడినట్లు లోకమునకు రానైయున్న దేవుని కుమారుడు నజరేయుడైన ఈ యేసేయని యోహాను సరిగా సాక్ష్యమిచ్చెను. యూదా జాతి యంతటిలో ఆయనను మెస్సీయగా గుర్తెరిగిన మొదటివారిలో వీరుకూడ ఉన్నారు. అంద్రెయ,

యోహాను, పేతురులు శిష్యులగుట (1:35-42):

1:35 “మరునాడు” అని చెప్పబడిన దినము మూడవ దినమును సూచించుచ్నుది. అప్పటికి యోహాను తన యిద్దరు శిష్యులతో ఉండెను. ఈ మనుష్యులు యోహాను ప్రకటించుచుండగా విని అతడు చెప్పినదానిని నమ్మిరి. అయితే వారు అప్పటికి యేసుక్రీస్తును కలసికొనలేదు.

1:36 క్రిందటి దినము క్రీస్తుయొక్క వ్యక్తిత్వమును గూర్చి – “దేవుని గొఱ్ఱపిల్ల” యని చెప్పి, ఆయన నెరవేర్చబోవు కార్యమును గూర్చి యోహాను మరియొకసారి బహిరంగముగా సాక్ష్యమిచ్చెను. ఇప్పుడైతే ప్రభువువైపు, ఆయన వ్యక్తిత్వమువైపు తన దృష్టిని సారించి, శిష్యుల మనస్సులను కూడ మళ్ళించెను. అంతేగాక, అతని సందేశము క్లుప్తముగాను, సామాన్యముగాను, స్వార్థరహితమైనదిగాను, పూర్తిగా రక్షకుని గూర్చినదిగాను యున్నది.

1:37 తానిచ్చిన నమ్మకమైన ప్రకటనద్వారా యోహాను తన ఇద్దరు శిష్యులను పోగొట్టుకొనెను. కానివారు యేసును వెంబడించుట చూచి అతడు బహుగా సంతోషించెను.

1:38 తన్ను వెంబడించువారియందు రక్షకుడు ఎల్లప్పుడు ఆసక్తి కలిగియున్నాడు. తన్ను వెంబడించుచున్న ఇద్దరు శిష్యులవైపు తిరిగి వారిని ప్రశ్నించుటలో ఆయన ఎంతో ఆసక్తి కనుపరచెను. తానడిగిన ప్రశ్నకు సమాధానము ప్రభువే ఎరిగియున్నాడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. కాని వారి ఆసక్తిని వారి మాటలలోనే ఆయన వినగోరెను. వారు ప్రభువుతోనే ఉండగోరిరనియు, ఆయనను గూర్చి మరి ఎక్కువగా తెలిసికొనగోరిరనియు వారిచ్చిన ప్రత్యుత్తరమునుబట్టి తెలియుచున్నది. కేవలము ఆయనను కలిసికొనుట వలననే వారు తృప్తిచెందలేదు. కాని, ఆయనతో సహవాసము కలిగియుండవలెనని వారు ఆశించిరి. గనుకనే వారు ఆయనను “రబ్బీ” అని సంబోధించిరి. ఆ మాటలకు “బోధకుడు” లేక “యజమానుడు” అని అర్థము.

1:39 అప్పటికి రక్షకునిగూర్చి మరి ఎక్కువగా నేర్చుకొనవలెననెడి నిజమైన అపేక్ష గలవాడెవడును ఆయననుండి ఎన్నడు వెనుకకు మళ్ళడు. రక్షకుని రాకతో పరిస్థితులు మారిపోయినవి. రక్షకుడు తాను ఆ సమయమున ఎక్కడ కాపురముండెనో, అక్కడికే ఆ ఇద్దరు శిష్యులను ఆహ్వానించెను. నేటి ఆధునిక నివాసములతో పోల్చినప్పుడు, ఆయన నివాసము అతిసామాన్యమైనదిగా నున్నది.

కాని ఈ సమస్త విశ్వమునకు సృష్టికర్తయైన ఆయనతో ఆ శిష్యులు ఆ చిన్న ఇంటిలోనే రాత్రి గడిపిరి. మెస్సీయాను గుర్తెరుగుటలో యూదాజాతి యంతటిలో మొట్టమొదట వ్యక్తులు వీరే. ప్రభువు వారిని ఆహ్వానించి నప్పుడు సమయము సాయంత్రము నాలుగు గంటలైనది. అక్కడ వారు ఎంత ప్రొద్దు గడిపిరో, ఏఏ సంగతులు ముచ్చటించిరో తెలిసికొనుట అసక్తికరమైన విషయమే.

1:40 ఆ శిష్యులలో ఒకని పేరు అంద్రెయ. రెండవ వ్యక్తి పేరు చెప్పబడలేదు. కాని యీ సువార్త వ్రాసిన యోహానే ఆ శిష్యుడని బైబిలు పండితులు ఒప్పుకొను చున్నారు. ఎట్లనగా, తన పేరును ఇక్కడ పేర్కొనక పోవుటలోగల అతని తగ్గింపు జీవితమును కారణముగా చూపుచున్నారు.

1:41 సహజముగా ఒక వ్యక్తి ప్రభువును కనుగొనినప్పుడు, తన బంధువులుకూడ ప్రభువును కలిసికొనవలెనని కోరుదురు. రక్షణ-ఒకడు తన కొరకు పదిల పరచుకొన దగినంత ప్రశస్తమైనది. గనుక ఇట్టి శుభ సందేశముతో అంద్రెయ తన సహోదరుడైన సీమోనునొద్దకు త్వరగా వెళ్ళి – మేము మెస్సీయను కనుగొంటిమి అని చెప్పెను. ఆహా! ఇది ఎంత ఆశ్చర్యకరమైన ప్రకటన! అవును. వాగ్దానము చేయబడిన దేవుని అభిషిక్తుడైన క్రీస్తుకొరకు ప్రజలు అప్పటికి నాలుగు వేల సంవత్సరములనుండి ఎదురు చూచుచుండిరి. కాని ఇప్పుడైతే, ఆ మెస్సీయా తనచెంతనే ఉండెనను ఆశ్చర్యకరమైన వార్తను సీమోను తన స్వంత సహోదరుని పెదవులద్వారా వినెను.

అంద్రెయ వర్తమానము ఎంత సూక్ష్మమైనది! అతని వర్తమానములో కేవలము మూడు మాటలే కలవు. గమనించండి : “మేము మెస్సీయను కనుగొంటిమి” అయిననేమి? సీమోనును సంపాదించుకొనుటకు దేవుడు ఆ మూడు మాటలనే ఉపయోగించెను. మనము గొప్ప బోధకులము తెలివైన ప్రసంగీకులము కాకపోవచ్చును, కాని సామాన్య మాటలలో ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చి ఇతరులకు చెప్పుట ఎంతైనా అవసరమైయున్నది. మిగిలిన కార్యమును దేవుడే చేయును.

1:42 ఇప్పుడు అంద్రెయ తన సహోదరుని తగిన స్థలమునకు తగిన వ్యక్తియొద్దకు తోడుకొనివచ్చెను. ఇది ఎంత ప్రాముఖ్యమైన కార్యమోగదా! అంద్రెయకుగల ఆసక్తిని బట్టి, తరువాత కాలములో సీమోను మనుష్యులను పట్టు గొప్పజాలరిగా మారిపోయెను. మరియు ప్రభువుయొక్క ముఖ్య అపొస్తలులలో ఒకడాయెను. మరియు తన సహోదరుడైన అంద్రెయకంటే సీమోను ప్రజలలో ఎక్కువ ప్రసిద్ధి పొందెను. కాని పేతురు యొక్క బహుమానములో అంద్రెయ తప్పక పాలు పంచుకొనుటలో సందేహము లేదు. ఎందుకనగా, యీ అంద్రెయయే సీమోనును ప్రభువు నొద్దకు తెచ్చెను.

ప్రభువు సీమోనుయొక్క పేరు ఎవరు చెప్పకనే ఎరుగును. అంతేకాదు, అతడు చంచల మనస్కుడనియు, పిరికివాడనికూడ ఆయన ఎరుగును. కడకు సీమోను గుణము మారిపోయి రాయివలె స్థిరచిత్తుడగునని కూడ ప్రభువు ఎరుగును. అయితే ఈ సంగతులన్నింటిని ప్రభువైన యేసు ఎట్లు ఎరుగును? ఆయన వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్న దేవుడు గనుక ఆయన ఎరుగును. ఇప్పుడు సీమోను పేరు కేఫాగా (పేతురు) మారెను. ప్రత్యేకించి యేసుక్రీస్తు ఆరోహణమై పరిశుద్ధాత్ముడు భూమిమిదికి దిగివచ్చిన పిదప అతడు ఒక బలమైన వ్యక్తిగా మారిపోయెను.
ఫిలిప్పు నతనయేలు పిలుపు (1:43-51) :

1:43 ఇప్పుడు నాలుగవ దినమును గూర్చి ఈ అధ్యాయములో మనము చదువు చున్నాము. ప్రభువు గలిలయలోని ఉత్తర భూభాగములో సంచరించెను. అక్కడ ఆయన ఫిలిప్పును కనుగొని తన్ను వెంబడించుమని ఆహ్వానించెను. ఈ సందర్భములో “నన్ను వెంబడించుము” అను మాటలు బహు శ్రేష్ఠమైనవి. ఎందుకనగా, ఆ మాటలు పలికినవాడు శ్రేష్ఠుడు. మరియు ఆ మాటలు అనుగ్రహించు ఆధిక్యతలుకూడ శ్రేష్ఠ మైనవే. గనుక ఇట్టి సామాన్యమైన అతి గంభీరమైన ఆహ్వానముతో ప్రతి స్థలములో నున్న ప్రతి మనుష్యుని ప్రభువు ఇంకను పిలుచుచున్నాడు.

1:44 బేత్సయిదా అనునది గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణము, ఈ బేత్సయిదావలె ప్రసిద్ధిచెందిన పట్టణములు ఈ లోకములో బహు అరుదు. తాను జేసిన అద్భుతములలో కొన్నింటిని ప్రభువు ఈ పట్టణమందే జరిగించెను (లూకా 10:13). ఇది ఫిలిప్పు, అంద్రెయ, పేతురుయొక్క స్వంత పట్టణము. అయితే ఈ పట్టణము రక్షకుని తిరస్కరించినది. ఫలితముగా అది పూర్తిగా నాశనము చేయబడెను. ఇప్పుడు ఆ పట్టణము ఎక్కడ ఉన్నదో ఆ చోటును మనము కచ్చితముగా చెప్పలేము.

1:45 ఫిలిప్పు నూతనముగా తాను పొందిన ఆనందమును ఇతరులతో పంచుకొన గోరెను. గనుక అతడు బయలు వెళ్ళి నతనయేలును కనుగొనెను. ఫిలిప్పు యొక్క వర్తమానము సాధారణమైనదిగాను, సూటిగాను ఉన్నది. ఫిలిప్పు నతనయేలును మోషేయు ప్రవక్తలును ఎవరినిగూర్చి ముందుగా చెప్పెనో ఆయనను మేము కనుగొంటిమి. ఆయన నజరేయుడైన యేసు అని చెప్పెను.

వాస్తవముగా అతని వర్తమానము పరిపూర్ణమైనది కాదు. అతడు యేసును యోసేపు కుమారునిగా వర్ణించెను. యేసు కన్యమరియ గర్భమున జన్మించెను. కాని ఆయనకు శరీరరీత్యా తండ్రిలేడు, యోసేపు యేసుకు నిజమైన తండ్రి కాకపోయినను, ఆయనను దత్తత తీసికొని, చట్టరీత్యా ఆయనకు తండ్రియాయెను.
కనుగొని

1:46 నతనయేలుకు అనేక సమస్యలు, అనుమానములు కలవు. గలిలయలో నజరేతు తృణీకరింపబడిన పట్టణము. అట్టి వెనుకబడిన పట్టణములో మెస్సీయా నివసించుట అసాధ్యమని అతనికి తోచెను. గనుక తన మనస్సులోని ప్రశ్నను బయట పెట్టెను. కాని దానిని గూర్చి ఫిలిప్పు నతనయేలుతో వాదించలేదు. మనుష్యులకున్న అభ్యంతరములను తీసివేయుటకు వారిని నేరుగా ప్రభువుకు పరిచయము చేయుట శ్రేష్ఠమైన విధానమని అతడు తలంచెను. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించలెనని ప్రయత్నించెడి వారికందరికి ఇది యొక అమూల్యమైన పాఠము. వాదములకు పోవద్దు. దీర్ఘముగా తర్కించక “వచ్చి చూడుడి” అని మాత్రమే చెప్పుడి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:47 యేసుక్రీస్తు సమస్తమును ఎరిగినవాడని ఈ వచనము మనకు తెలుపుచున్నది. ప్రభువుకు నతనయేలుతో ఎటువంటి పరిచయము లేకపోయినప్పటికిని “ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు; ఇతనియందు ఏ కపటమును లేదు” అని ప్రకటించెను. అయితే యాకోబు నీతి యుక్తముకాని విధానములను అనుసరించిన వాడుగా పేరు పొందెను. కాని నతనయేలు ఇందుకు భిన్నమైనవాడు. అవును, అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అతనియందు రహస్యముగాని, అక్రమముగాని లేదు.

1:48 ఒక క్రొత్తవ్యక్తి తన్ను ఇంతకుముందే ఎరిగియున్నట్లు మాటలాడుట చూచి నతనయేలు నిజముగా ఆశ్చర్యపడెను. ఆ అంజూరపు చెట్టుక్రింద కూర్చుండి యున్నప్పుడు అతడు పూర్తిగా దాగియుండెననుట స్పష్టమే.

1:49 కాని అతడెంత దాగుకొనినను యేసు అతనిని చూచెను. మానవ కంటికి
కనబడకుండ నతనయేలు తన్ను మరుగు చేసికొనెనని మానవ దృష్టితో మనము చెప్పినను, యేసు అతనిని చూచెను. ఇది ఆయన శక్తి. బహుశా, యేసుక్రీస్తు కియ్యబడిన ఈ జ్ఞానము మానవాతీతమైనదని నతనయేలు తలంచెను. మెట్టుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, ఇశ్రాయేలుయొక్క రాజనియు అతడు గుర్తెరిగెను.

1:50 తానే మెస్సీయా అని తెలియజేయుటకు ప్రభువు రెండు ఋజువులను నతన యేలుకు కనుపరచెను. ఒకటి – ప్రభువు నతనయేలుయొక్క గుణమును వివరించెను. రెండు ఏ కన్ను చూడలేని అతనిని ఆయన చూచెను. ఈ రెండు ఋజువులు నతనయేలుకు చాలినవి. గనుక అతడు ప్రభువునందు విశ్వాసముంచెను. అయితే వీటికంటే గొప్ప కార్యములు చూతువని ప్రభువు వాగ్దానము చేసెను.

1:51 సర్వలోకమును యేలుటకు త్వరలో రానైయున్న తన భవిష్యత్కాల పటమును ప్రభువు నతనయేలుకు వివరించెను. ఆ దినమున పరలోకము తెరువబడును. యెరూష లేమును ముఖ్యపట్టణముగా చేసికొని రాజుగా ఆయన పరిపాలన చేయునప్పుడు దేవుని అనుగ్రహము రాజుపై నిలుచును. దేవదూతలు దేవుని పరిచారకులు. వీరు దేవుని చిత్తమును జరిగించు అగ్నిజ్వాలలవంటివారు. యేసుక్రీస్తు రాజుగా యేలునప్పుడు ఈ దూతలు ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆకాశమునకు భూమికిని మధ్య ఎక్కుచును దిగుచును నుందురు. మెస్సీయాగా తనకుగల అధికారమును చూచించు సూచకక్రియ లలో అత్యల్పమైనది మాత్రమే నతనయేలుకు చూపబడెనని ప్రభువు నతనయేలుకు చెప్పెను. కాని రానైయున్న క్రీస్తు పరిపాలన కాలములో అభిషిక్తుడైన దేవుని కుమా రుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడుట నతనయేలు చూచును. అప్పుడు నజరేతునుండి మంచివాడు వచ్చెనని సమస్త మానవాళి తెలిసికొనును.

“నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాట గమనించదగినది. “నిశ్చయముగా” అని ప్రభువు చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవని మనము గుర్తించవలెను. “నిశ్చయముగా” అను మాటకు “నిజముగా,” “ఆలాగుననే జరుగును గాక” అని భావము. (Verily Verily means “truly truly” or “amen, amen”).

Leave a Comment