జాన్ బన్యన్: జీవిత చరిత్ర, ఆత్మీయ పాఠాలు మరియు ప్రభావం

జాన్ బన్యన్ జీవిత వృత్తాంతము

పంచంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన జాన్ బన్యన్ ఇంగ్లాండులోని ‘బెడ్ఫోర్డ్ పట్టణానికి ఒక మైలు దూరంలోనున్న ఎలో గ్రామంలో క్రీ.శ. 1628వ సంవత్సరంలో జన్మించాడు. అతని స్వంతమాటల్లో చెప్పాలంటే అతడు “సమాజంలో ఏమాత్రం ఎన్నికలేని ఒక దిగువస్థాయి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఆ ప్రదేశంలో తృణీకరించబడినది అయిన పాత్రలకు కళాయివేసే వృత్తిని చేపట్టి ఒక కళాయి వేసేవానిగా పిలువబడుతూ వచ్చాడు. ఆ రోజుల్లో ఈ వృత్తి సమాజంలో ఏమాత్రం గౌరవంలేని వృత్తిగా పరిగణించబడేది.

బహుశాః ఈ వృత్తిని చేపట్టేవారు ఒక ప్రదేశంనుండి ఇంకో ప్రదేశానికి తిరిగే సంచారులు కావడంవల్లనూ, ఏమాత్రం సిద్ధాంతాల్లేని వారి అనైతిక అలవాట్లు మరియు జీవన విధానంవల్లనూ వారికి సమాజంలో ఎలాంటి గౌరవమూ ఉండేదికాదు. అయితే, బన్యన్ తండ్రికి ఎల్లో గ్రామంలో ఒక స్థిరమైన నివాసగృహం మాత్రమేగాక, తన ఇరుగుపొరుగు వారిమధ్య అతనికి మంచి గౌరవమర్యాదలు ఉండేవి. అంతేగాక, సమాజంలో హీనదశలోనున్న సామాన్య ప్రజానీకం తమ పిల్లలను ఒక పాఠశాలకు పంపించి చదివించడం అత్యంత అరుదుగానుండిన ఆ రోజుల్లో బన్యన్ తండ్రి అతనికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఒక పాఠశాలకు పంపిం చాడు.

తాను నేర్చుకొన్న “అతికొద్ది చదువును అనతికాలంలోనే మరచిపోయి నట్లు”గా జాన్ బన్యన్ చెప్పినప్పటికీ, అతడు చదవడాన్నీ వ్రాయడాన్నీ మాత్రం బాగా నేర్చుకొన్నాడు.

అతని జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదనీ, అతని మానసికశక్తి అత్యంత ఆరోగ్యకరమైనదనీ అతని రచనలద్వారా మనకు స్పష్టమవుతోంది. తన బాల్య చేష్టల కారణంగా విద్యను అభ్యసించాలన్న జిజ్ఞాస అతనిలోనుండి తొలగిపోయినందువల్ల, తన జ్ఞాపకశక్తిని గురించి బహుశాః బన్యన్ తప్పుగా అంచనా వేసికొని ఉండవచ్చు.

తన జీవితంలో అమూల్యమైన అనేక సంవత్స రాలు తాను తిరిగిన పనికిరాని తన చెడు తిరుగుళ్ళనుబట్టి తాను నేర్చుకొన్న కొద్దిపాటి విద్యకు తానేమీ అదనంగా చేర్చలేకపోయానని అతడు అభిప్రాయ పడ్డాడు. అతని బాల్యచేష్టలను గురించిన వివరణ మరియు వాటి ఫలితంగా అతడు అనుభవించిన నైరాశ్యపు జీవితాన్ని గురించి “ప్రధానపాపికి చూపబడిన అపరిమితమైన కృప” అన్న పేరుతో అతడు వ్రాసిన తన ఆత్మీయ స్వీయకథలో
మనము చదువగలము.

దేవుని కృప కార్యరూపంలో …

తన ప్రారంభజీవితంలో అతడు అనేక ప్రమాదకరమైన పరిస్థితులనుండి తప్పింపబడ్డాడు. రెండుసార్లు నదిలో మునిగిపోతుండగా వెంట్రుకవాసి వ్యత్యా సంలో అతడు తప్పించబడ్డాడు.

పార్లమెంటరీ సైన్యంలో సైనికునిగా ఉన్నప్పుడు అతని స్థానంలో వేరొక సైనికుడు యుద్ధానికి వెళ్ళి హతుడయ్యాడు. ఆ వ్యక్తి “ఒక తుపాకీ తూటా తలలోకి చొచ్చుకొనిపోగా అతడు అక్కడికక్కడే మరణిం చాడు.” ఆ తర్వాత, తన పాపములకుగాను తన్ను శిక్షించక, శిక్షతో మిళితమైన అపార కృపతో తనను కాపాడుతూ ఆశీర్వదిస్తోన్న దేవుని కృపాహస్తాన్ని బన్యన్ చూడటం ప్రారంభించాడు. అంతేగాక, తాను ఇంకను యౌవనస్తునిగా ఉన్న సమయంలో భక్తిగల భార్యను తనకనుగ్రహించి తనను ఆశీర్వదించిన దేవుని కృపాహస్తాన్ని బన్యన్ స్పష్టంగా చూడగలిగాడు.

ఆమె మాదిరి జీవితం మరియు ఆమెలోని మార్పు యౌవనస్తుడైన ఆ కళాయివేసే వ్యక్తిని క్రమంగా దేవాలయానికి వెళ్ళేందుకు పురికొల్పడం మాత్రమేగాక, త్రాగుబోతులైన తన సహచరుల సహవా సాన్ని అతడు అసహ్యించుకొనేలా చేసింది. ఆమె సహచర్యానికీ, ఆమె ప్రక్కన వెచ్చగా చలికాచుకోవడానికీ అతణ్ణి ప్రోత్సహించిన అతనిలోని తీవ్రమైన వాంఛ అల్లరిగా తిరిగే తన సహచరుల దుష్ట సాంగత్యానికి అతణ్ణి దూరంచేసింది.

తమకు ఒక చిన్న గరిటెగాని ఒక చిన్న గిన్నెగాని లేనంతటి అత్యంత నిరుపేద స్థితిలో ఆ యౌవనదంపతులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.

తన తండ్రి తనకు అందించిన ఆస్తి అయిన రెండు పుస్తకాలను అతని భార్య వారి వైవాహిక బంధంలోనికి తీసుకొచ్చింది.

“పరలోకానికి సామాన్య మానవుని రాజ బాట” మరియు “భక్తి సాధన” అన్న రెండు అమూల్యమైన పుస్తకాలను ఆమె తనతోపాటు తీసుకొచ్చింది. ఈ పుస్తకాలు బన్యను ఆత్మీయంగా ప్రభావితంచేసి, అతని ఆత్మీయాభివృద్ధికి అమితంగా దోహదపడ్డాయి.

యౌవనస్తుడును ఆరోగ్యవంతుడును అయిన బన్యన్ తన వృత్తిద్వారా తన కుటుంబ అవసరాలకు తగినంతగా సంపాదించుకొని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలడు. అతని భార్య మంచి పొదుపరి, శ్రమజీవి, ఆరోగ్యకర మైన మానసికస్థాయి కలిగిన వ్యక్తి. వారి చిన్నికుటీరంలో వెలుగును వెదజల్లి దానిని శాంతి, సంతృప్తి, సమాధానములతో నింపేందుకు నిజమైన దైవభక్తి తప్ప వారిరువురికి మరింకేం కావాలి?

అయితే, నిజమైన దైవభక్తి అంటే ఏంటో జాన్ బన్యనక్కు ఇప్పటివరకు ఏమాత్రం తెలి యదు. అయినప్పటికీ అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు. చర్చి, చర్చి వేదిక, పీఠాధి పతి, అతని సహాయకులు, వారు ధరించే దుస్తులు … ఇవన్నీ అతణ్ణి అమితంగా ఆకర్షిం చాయి.

నిజమైన దైవభక్తి అంటే ఎంటో అప్పటికింకా జాన్ బన్యన్ కు తెలియకపోయినా, అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు.

వీటన్నిటిలో అతడు సంపూర్ణంగా ఆనందించడం ప్రారంభించాడు. అయి నప్పటికీ అతడు వాస్తవమైన భక్తిజీవితానికి ఇంకను అపరిచితుడే.
అతని దైవధ్యానాలు ఇంకను అత్యంత సాధారణమైనవే. అప్పుడప్పుడూ అవి అతని మనఃస్సాక్షిని మేల్కొలిపి అతని ప్రశాంతతను భంగపరుస్తున్నప్పటికీ, వాటిపట్ల క్రమక్రమంగా అతనికి మక్కువ ఎక్కువకాసాగింది.

దైవభక్తిపట్ల అతనిలో చెలరేగే ఆలోచనలు ఒకదానికి మరొకటి భిన్నమైనవై అతణ్ణి తీవ్రమైన గలిబిలికి గురిచేయడం ప్రారంభించాయి. అవన్నీ అతణ్ణి మార్మికవాదమువైపు మళ్ళిస్తూ, అతణ్ణి భవిష్యత్తును గురించిన లోతైన ఆలోచనల్లో పడవేయడం ప్రారంభిం చాయి.
కొన్నిసార్లు పరలోకంనుండి ఒక స్వరం తనతో మాట్లాడుతున్నట్టుగా అతడు అనుభూతి చెందేవాడు. మరికొన్నిసార్లు తన జ్ఞానేంద్రియాలకు వింతైన మార్మిక దృశ్యాలు ప్రత్యక్షపరచబడుతున్నట్టుగా అతనికి అనిపించేది.

ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న ఆశతోను ఆసక్తితోను అతడు బైబిలు పఠనంలోను ప్రార్థనలోను గడపడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన గ్రాహ్యశక్తికి సుదూరంలో నున్న దైవికమర్మాలను గురించి తీవ్రమైన కలతకు గురై అతడు తన బైబిలు పఠనమును ఆపివేశాడు.

నిరాశా నిస్పృహలలో…

కొన్నిసార్లు తన హృదయం తీవ్రమైన అలజడికి గురైన సమయంలోను, తన చుట్టూ చిమ్మచీకట్లు కమ్ముకొన్న సమయంలోను ఏదో ఒక చిరుదీపంలాంటి ఆశ తన్ను ఆవరించి ఉన్నట్టుగా అతనికి అనిపించేది. అయితే, మరికొన్ని సమయాల్లో లోతైన నైరాశ్యపు చీకట్లు తన్ను ఆవరించి ఉన్న సమయంలో అతడు తీవ్రమైన భయభ్రాంతులకు గురైనవాడై, “ఆయ్యో నా స్థితి ఎంత దౌర్భాగ్యకర మైనది! నా పాపములను నేను వదలినప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! పాపములను నేను విడిచిపెట్టనప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! ఎటు చూచినా నా స్థితి దౌర్భాగ్యమైనదే! నేను కేవలం శిక్షకే పాత్రుడను.

నేను చేసే కొన్ని పాపముల కొరకైనా మరిన్ని పాపముల కొరకైనా నేను శిక్షార్హుడనే” అని భోరున విలపించేవాడు. ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను గురించి అతడు ఇలా ఆవేదనతో వ్రాశాడు:

“నా ఆట మధ్యలో నా చుట్టూ ఉన్నవారందరి యెదుట నేను అలాగే నిశ్చేష్టుడనై నిలువబడ్డాను. కాని ఏం జరిగిందో నేను వారికి చెప్పలేదు.

అలా కాసేపు మౌనంగా నిలుచున్న తరువాత చివరిగా ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి నేను తిరిగి నా ఆటలో కొనసాగాను. ఇలాంటి నిరాశా నిస్పృహలు నాలో పదేపదే చోటుచేసుకొంటున్నాయని నాకు తెలుసు. వాటినుండి నేను ఉపశమనం పొందే మార్గం కేవలం నేను నా పాపంలో కొనసాగడమే. ఎందుకనగా పరలోకం అనేది నాకు అందనిది. కావున, నేను దాన్ని గురించి ఆలోచించడంలో ఏమాత్రం అర్థం లేదు. అందు వలన నన్ను నేను విపరీతమైన పాపంతో నింపుకోవాలని నేను అమి తంగా ఆశించాను. నేను మరణించి ఈ లోకాన్ని వదలక మునుపు ఈ లోకంలో ఉన్న పాపపు లోతులన్నిటినీ నేను అనుభవించాలి. అందులోని మాధుర్యాన్ని నేను రుచిచూడాలి.”

ఒక మారిన మనిషిగా …

ఈ భయంకరమైన పరిస్థితినుండి అతడు ఒక అసాధారణమైన విధంగా విడిపించబడ్డాడు. ఒకనాడు పాపిష్టురాలైన ఒక స్త్రీ అతణ్ణి తీవ్రంగా అసహ్యించు కొంటూ, అతని బూతుమాటలను తాను వినలేకున్నాననీ, అతనిలాంటి భక్తిహీన మైన వ్యక్తిని తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదనీ, ఆ గ్రామంలోని యౌవ నస్తులందరినీ అతడు చెడుమార్గంలో నడిపిస్తూ వారిని సర్వనాశనం చేస్తున్నాడనీ నడివీధిలో అనేకమంది యెదుట అతణ్ణి శాపనార్ధాలు పెట్టసాగింది. ఆమె మాటలు అతని గుండెల్లోకి శూలాల్లా దూసుకుపోయాయి. అతడు అవమాన భారంతో చాలసేపు అలానే నిశ్చేష్టుడై మౌనంగా నిలబడ్డాడు.

ఈ సంఘటన అతని జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది. అతడు వెంటనే తన చిన్ననాటి నుండి వాడుకగా తనలోనుండి వస్తోన్న బూతుమాటల్ని వెంటనే మానివేశాడు. అంతేగాక, అతడు బైబిలు గ్రంథాన్ని చదివేందుకు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు. అతని ప్రవర్తనలో ఎంతగా మార్పు వచ్చిందంటే, అతని ఇరుగు పొరుగువారు అతనిలోని మార్పును చూసి ఆశ్చర్యచకితులై, ఒక మార్పునొందిన వ్యక్తిగా అతనిని గౌరవించడం ప్రారంభించారు.

“నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని జాన్ బన్యన్ ఆలోచించసాగాడు.

ప్రారంభంలో అతడు చర్చి గంటల్ని కొట్టడంలో అమితంగా ఆనందించేవాడు. అయితే, కాలక్రమేణా అతనిలోని మనఃస్సాక్షి మృదువుగా మారేకొలదీ “అలాంటి ఆచారం కేవలం వ్యర్థమైనదని” అతడు అభిప్రాయపడటం ప్రారంభించాడు. మెల్లమెల్లగా వినోదాలనూ నాట్యాలనూకూడ అతడు అల్లరితో కూడిన ఆట పాటలుగా భావించి విడిచిపెట్టాడు. క్రమ క్రమంగా నైతికభావన అతనిలో చోటు చేసు కొంది. అనతికాలంలోనే “నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లాండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని అతడు ఆలోచించసాగాడు. అయితే, వాస్తవమైన హృదయ పరివర్తనను అతడింకను అనుభవించలేదు. హృదయంలో లోతైన మార్పుయొక్క అవసరత అతనికి ఏ మాత్రం తెలిసియుండలేదు.

హృద యముయొక్క స్వభావము పూర్తిగా మారాలన్న అవగాహనకూడ అతనికింకను కలుగలేదు. అయితే, దేవుని దృష్టిలో తన వాస్తవస్థితి ఆమోదయోగ్యమైనది కాదని తన హృదయపు లోతుల్లో ఎక్కడో ఒక మెల్లని స్వరం తనను మేల్కొలుపు తున్నట్టుగా అతనికి అనిపించేది.

ఒకనాడు మారుమనస్సును గురించీ, తిరిగి జన్మించుటను గురించీ భక్తిపరులైన కొందరు స్త్రీలు ఒకచోట మాట్లాడుకోవడాన్ని విన్న బన్యన్, తన భక్తిమార్గం కేవలం లోపభూయిష్టమైనదనీ “నిజమైన భక్తి పరునికి ఉండవలసిన గుర్తులు” తనలో లేవనీ గ్రహించాడు.
అతనిలో ఈ నూతనమైన వెలుగు ప్రవేశించడానికి కారకులైన ఆ స్త్రీలు, జాన్ గిఫోర్డ్ పాస్టరుగానున్న బెడ్ఫోర్డ్లోని బాప్టిస్ట్ సంఘానికి చెందినవారు.

ఆ సత్పురుషుని గురించి ఇవిమీ (Mr. Ivimey) అనే వ్యక్తి తాను రచించిన “ఇంగ్లీషు బాప్టిస్టుల చరిత్ర” (History of the English Baptists) అన్న పుస్తకంలో ఇలా వ్రాశాడు:

“అతని శ్రమ ఒక ఇరుకైన పరిధికే పరిమితమై ఉన్నప్పటికీ, కొంత కాలం తర్వాత ఆ శ్రమయొక్క ఫలితాలు చాల విశాలంగా విస్తరించాయి.

అతడు ఎల్లోని ఒక దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చి తన సంఘానికి అతనిని పరిచయం చేసిన దృశ్యాన్ని మనము వీక్షించినప్పుడు, దుర్మార్గపు ద్వారంగుండా బన్యను సువార్త జ్ఞానము లోనికి నడిపించిన సువార్తికునిగా మనము అతనిని తప్పక గౌరవిస్తాం.

గాఢాంధకారపు లోయలోనుండి ఆ వ్యక్తిని వెలుగుమయమైన పర్వత శిఖరాగ్రానికి చేర్చిన బోధకునిగా మనము అతనిని తప్పక ప్రశంసిస్తాం. అయితే, దేవునిచే ఎన్నుకొనబడిన పాత్రయైన నిరుపేదయు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోన్నవాడును అయిన బన్యను మొట్టమొదటి సారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు. అతడు ఒక గొప్ప పాత్రగా దేవునిచేతిలో వాడబడతాడని ఆ సంఘకాపరి ఆ సమయంలో ఏమాత్రం ఊహించి ఉండడు.”

బన్యన్ మార్పుకు కేవలం గిఫోర్డ్ మాత్రమే కారణమని మనము చెప్పలేము గాని, అతని సంభాషణ మరియు బోధలు ఎల్టాలోని ఒకప్పటి దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనము విశ్వసించక తప్పదు.

జాన్ బన్యన్ కు మొట్టమొదటిసారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు.

తన మార్పు తర్వాత తన అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణను బన్యన్ అనుభవిం చాడు. తనలోని అపరాధభావన ఒకవైపూ, క్రీస్తు దయచేసిన క్షమాపణ ధర్మశాస్త్రపు అవస రతను కొట్టివేసిందన్న బోధ మరోవైపూ అతణ్ణి తీవ్రమైన సంఘర్షణకు గురిచేసాయి. అయితే, బన్యన్ ఈపాటికే లేఖనాలను అత్యంత శ్రద్ధా సక్తులతోను ప్రార్థనాపూర్వకంగాను పఠించియున్నాడు. గనుక దేవుని ఆత్మయొక్క ఆశీర్వాదాన్నిబట్టి, దేవునియందు నమ్మికయుంచినవారు “ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు” (యెషయా 45:17) అన్న లేఖనానుసారమైన నిశ్చయతద్వారా తీవ్రమైన అలజడికి గురియైయున్న తన ఆత్మలో అతడు శాంతినీ విశ్రాంతినీ పొందాడు.

బోధించేందుకు నియమించబడుట

క్రీ.శ. 1655వ సంవత్సరంలో తన ఇరవై ఏడేండ్ల వయస్సులో గిఫోర్డ్ సంఘ సభ్యునిగా బన్యన్ చేర్చబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆ సంఘము తన కాపరి మరణంతో కృంగిపోవడంతో, తన అర్హతల విషయమై కొన్ని పరీక్షల తర్వాత, నూతన సహోదరుడుగా ఆ సహవాసంలోనికి చేర్చబడిన బన్యన్, అప్పు డప్పుడూ ఆ సంఘంలో బోధించే బాధ్యతను చేపట్టేందుకు ఆ సంఘసభ్యులచే ప్రోత్సహించబడ్డాడు. తన ఈ నియామకాన్ని గురించి బన్యన్ ఇలా వ్రాశాడు:

“తమ దృష్టిలో పరిశుద్ధునిగా కనిపించిన నాలో దేవుని చిత్రాన్ని గ్రహించే యోగ్యత తమకు అగుపడినందునను, దేవుని పరిశుద్ధ వాక్య మును ప్రకటించుటకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపావరమును తాము స్పష్టంగా కనుగొనినందునను, తమకు దేవుని వాక్యమును బోధింప వలెనని మాతోనున్న పరిశుద్ధులు కొందరు నన్ను బలవంతం చేసారు. అలా తమ కూడికలలో తమకు దేవుని వాక్యమును బోధించమని వారు నన్ను పదే పదే అర్థించినందున మొదట నేను అంగీకరించనప్పటికీ, ఆ తర్వాత వారి కోరికను నేను మన్నించవలసి వచ్చింది.”

మొట్టమొదట బన్యన్ బోధించడాన్ని ప్రారంభించినప్పుడు, ప్రజలు అతని బోధను వినేందుకు నలుదిశలనుండి తండోపతండాలుగా రావడం ప్రారంభిం చారు. అతని పరిచర్యలో స్పష్టంగా కనిపించే జయకరమైన ఫలితాల్ని చూసిన సంఘస్తులు కొంతకాలం “పట్టుదలతో ఉపవాస ప్రార్థన” చేసిన తరువాత, బెడ్ఫోర్డ్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ పూర్తి పరిచర్య జరిగించేందుకు అతణ్ణి నియమించారు.

బోధించడం ప్రారంభించిన మొదట్లో బన్యన్ ధర్మశాస్త్రముయొక్క భయంకర మైన స్థితిని గురించి బోధించసాగాడు. ఈ అంశంపై తాను బోధించడాన్ని గురించి అతడు ఈ విధంగా వ్రాశాడు:

“నాకు అప్పగింపబడిన ఈ పరిచర్యను అత్యంత శ్రద్ధాభక్తులతోను, గొప్ప నమ్మకత్వంతోను నేను నెరవేర్చాను. వ్యక్తిగతంగా నేను చూచి అనుభవించినవాటినే నేను బోధించాను.

నా దౌర్భాగ్యపు ఆత్మ మూల్గులనే నేను ప్రకటించాను. సంకెళ్ళచే బంధింపబడినవారు విడుదల పొందు నట్లుగా సంకెళ్ళచే బంధించబడిన నేను, నా అనుభవాలతో వారికి బోధించేందుకు బయలువెళ్ళాను.

నా స్వంత మనఃస్సాక్షిలో అగ్నిజ్వాలల్ని చవిచూసిన నేను, వాటి విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ బోధించగలిగాను.” అతని ఆత్మీయస్థితి మెరుగుపడేకొద్దీ అతని బోధలు మెరుగులు దిద్దుకో సాగాయి. తాను “అనుభవించి అనుభూతి పొందినవాటినే” అతడు బోధించాడు.

“పాపాన్ని శత్రువుగా భావించిన పాపుల మిత్రుడైన క్రీస్తునే అతడు బోధించాడు. క్రీస్తు కృపాకార్యంపై మాత్రమే ఆధారపడవలెనని అతడు తన సభికులకు బోధిం చాడు. “ఈ లోకము ఆధారపడే పడిపోవునవీ నాశనమయ్యేవీ అయిన తప్పుడు స్తంభాలను పెకలించివేయడమే అతని సందేశములయొక్క ముఖ్యోద్దేశము.”

అంకితభావము కలిగిన రచయిత

ఇప్పుడు బన్యన్ నిరంతర పరిచర్యలో విరామం లేకుండా ఉన్నాడు. తనకు ఇవ్వబడిన మానసిక శారీరక మరియు ఆత్మీయ శక్తిచే అతడు దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమేగాక, ఆత్మీయ రచనలనుకూడ ప్రచురించడం ప్రారంభిం చాడు. “లేఖనముల ప్రకారము వెల్లడించబడిన కొన్ని సువార్త సత్యములు” అనునది అతని మొదటి ప్రచురణ. బెడ్ఫోర్డ్లోని సంఘ పరిచర్యలో గిఫోర్డ్ వారసుడైన జాన్ బర్టన్ (John Burton) తన వ్యాఖ్యానాన్ని ఈ విధంగా వ్రాశాడు:

సత్యములను గురించి ఈ నా సహోదరుడు రచించిన రచనలకు నేనును సాక్ష్యము పలుకుట నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.”

“ఈ వ్యక్తియొక్క స్థిరమైన విశ్వాసాన్నీ, అతని దైవిక సంభాషణలనూ, మానవ నైపుణ్యముతోగాక క్రీస్తు ఆత్మతో సువార్తను ప్రకటించుటలో అతనికిగల సామర్థ్యాన్నీ, పాపులగు అనేకులను క్రీస్తువైపుకు త్రిప్పుటలో అతడు సాధించిన విజయాన్నీ, ఇతర పరిశుద్ధులతోబాటు నేనును ప్రత్యక్షంగా వీక్షించిన తరువాత, ప్రభువైన యేసుక్రీస్తు మహిమకరమైన బన్యన్ చేసిన ఈ రచన కాకర్ల (Quakers) చే తీవ్రంగా వ్యతిరేకించబడింది.

మంత్రశక్తులను ఉపయోగించి చేసిన రచనగా వారు దానిని అభివర్ణించారు. అందులో అతడు “తాను సిలువపై వ్రేలాడిన శరీరంతోనే మరియ కుమారుడైన యేసు పరలోకంలో ఉన్నాడని” వ్రాసినందున, అతడు “ఒక విగ్రహాన్ని గురించి బోధించాడని” వారు విమర్శించారు.

క్రీస్తు మరణం పునరుత్థానం ఆరోహణం మరియు మధ్యవర్తిత్వం మున్నగువాటిని గురించిన లేఖనానుసారమైన తన అభిప్రాయాలను బన్యన్ సమర్థించుకొంటూ వారి నేరారోపణలకు విరోధంగా శక్తివంతంగాను సరియైన విధంగాను న్యాయసమ్మతంగాను వాదించాడు.

అతని భాషాశైలి ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, మొట్టమొదటి సారిగా రచనా వ్యాసంగంలోనికి ప్రవేశించిన విద్యావంతుడుకాని ఒక వ్యక్తి చేసిన ఆ రచన ఒక అసాధారణమైనదే. బన్యన్ రచనకు జవాబుగా “సమాధాన సువార్త యొక్క నిజమైన విశ్వాసము కొరకు వినయముతో కూడిన పోరాటము”

బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు.

అన్న పేరుతో ఎడ్వర్డ్  బరోస్ అనే వ్యక్తి ఒక కరపత్రాన్ని విడుదల చేసాడు. అయితే, బన్యన్ ఆ కరపత్రానికి సరైన  ఇచ్చాడు. బరోస్ ఆ తర్వాత తిరిగి మరో కరపత్రాన్ని విడుదల చేసినప్పటికీ బన్యన్ తన రచనను బలంగా నిరూపించ డంతో చివరికి వివాదం సద్దుమణిగింది.

చెరసాలకు పంపబడుట

క్రీ.శ. 1657లో ఈటన్ (Eaton) అనే స్థలంలో బన్యన్ బోధిస్తున్న సమ యంలో లండన్ చర్చి ఆరాధనకు విరోధంగా బోధిస్తున్నాడని అతనిపై నేరా రోపణ చేయబడింది. అయితే ఆ రోజుల్లో బ్రిటీష్ కామన్వెల్త్లో తీవ్రమైన శిక్షలు

అమలులో ఉండినప్పటికీ, అతనిపై మోపబడిన నేరారోపణ ఋజువుకానందు వల్ల బన్యన్కు ఎలాంటి శిక్షా పడలేదు. అయితే, కొన్ని నెలల తరువాత బన్యన్పై అరెస్టు వారంటు జారీచేయబడింది. ఫలితంగా బెడ్ఫోర్డ్షైర్లోని సామ్ సెల్లో అతడు నిర్బంధించబడి వినేట్ (Wingate) అనే న్యాయాధిపతి యెదుట హాజరుపరచబడ్డాడు. బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు. న్యాయస్థానంలో అతనిపై మోపబడిన అభియోగం ఈ విధంగా ఉంది :

“బెడ్ఫోర్డ్ పట్టణంలో సామాన్య కార్మికుడైన జాన్ బన్యన్ దైవిక ఆరాధనలో పాల్గొనడానికి చర్చికి రావడాన్ని మానివేయడమేగాక చట్ట విరుద్ధమైన రహస్య మతకూడికలను నిర్వహిస్తూ రాజరికపు సార్వ భౌమాధికారానికి హాని కలిగిస్తున్నాడు.”

ఈ అభియోగంపై అతడు తిరిగి మూడు నెలలు చెరసాల నిర్బంధంలోనికి పంపబడ్డాడు. అంతేగాక, ఆ మూడు నెలల నిర్బంధం తర్వాత చర్చికి వెళ్ళేందుకూ బోధించడాన్ని మానివేసేందుకూ అతడు అంగీకరించనట్లయితే, దేశబహిష్క రణకు గురికావలసి ఉంటుందని అతడు హెచ్చరించబడ్డాడు.

ఒక నమ్మకస్తురాలైన భార్య

ఈ సమయానికి బన్యన్కు అతని మొదటి భార్యద్వారా పుట్టిన నలుగురు చిన్నబిడ్డలు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె అయిన మేరీ పుట్టుకతోనే అంధురాలు. తన మొదటి భార్య మరణించిన సంవత్సరం తరువాత అతడు తిరిగి వివాహం చేసుకొన్నాడు. అతని రెండవ భార్య ప్రసవదినములు సమీపిస్తున్న సమయంలో బన్యన్ చెరసాలలో బంధించబడటం మరియు అతని దేశబహిష్కరణలను గురిం చిన వార్తలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేయడంవల్ల తన ప్రసవదినములకు ముందే ఆమె ఒక మరణించిన బిడ్డను ప్రసవించింది. అయినప్పటికీ, ఈ శ్రమలన్నిటి మధ్యలో ఆమె తన భర్త విడుదలకోసం తీవ్రంగా పోరాడింది.

ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లండన్కు ప్రయాణంచేసి తన భర్త విడుదల కోసం హౌస్ ఆఫ్ లార్డ్స్క ఒక వినతిపత్రం సమర్పించింది. అయితే, ఈ విషయమై స్థానిక న్యాయస్థానంలోని న్యాయవాదులను సంప్రదించమని అక్కడ ఆమె నిర్దేశించబడింది. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి ఎంతో వినయముతోను ‘వణకుతున్న హృదయంతోను’, అనేకమంది న్యాయవాదుల సమక్షంలోను ఆ పట్టణములోని పెద్దల సమక్షంలోను తన విన్నపాన్ని న్యాయమూర్తులకు సమర్పిం చింది. అక్కడున్న న్యాయమూర్తులలో ఒకరైన సర్ మాథ్యూ హేల్ (Sir Mat- thew Hale) ఆమె భర్త విడుదల విషయంలో తన నిస్సహాయతను వ్యక్తంచేస్తూ తన తలను అడ్డంగా ఊపాడు.

“నీ భర్త బోధించడాన్ని విడిచిపెడతాడా?” – ట్విస్డెన్ (Twisden) అనే న్యాయాధిపతి ఆమెను ప్రశ్నించాడు. “ఆ విధంగా అతడు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే, అతణ్ణి పిలిపించండి.”

“అయ్యా, తాను మాట్లాడగలిగినంత కాలం అతడు బోధించడాన్ని నిలిపి వేయలేడు” – ధైర్యస్తురాలైన ఆ స్త్రీ అతనికి జవాబిచ్చింది. సర్ మాథ్యూ ఆమె మాటల్ని తీవ్రమైన బాధతో ఆలకించాడు. అయితే, ట్విస్డెన్ ఆమెతో కఠినంగా మాట్లాడి దారిద్ర్యమే ఆమె పైవస్త్రమని ఆమెతో అన్నాడు.

“అవును,” – ఆమె సింహంలా గర్జించింది – “అతడు ఒక కళాయివేసేవాడు గనుకనూ, అతడు ఒక నిరుపేద గనుకనూ అతడు తృణీకరించబడ్డాడు. కాబట్టి అతనికి ఏమాత్రం న్యాయం జరగదు” – మండే గుండెతో ఆమె అతనికి బదు లిచ్చింది. ఆ సందర్భాన్ని గురించి ఎలిజబెత్ బన్యన్ తన అభిప్రాయాన్ని ఈ క్రింది మాటల్లో తెలిపింది :

“నేను న్యాయస్థానంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టే సమయంలో భయపడినప్పటికీ, నేను అక్కడనుండి బయటకు వచ్చే సమయంలో కన్నీటి పర్యంతమయ్యాను. అలా నేను ఏడ్చింది నాపట్లనూ నా భర్తపట్లనూ వారు కఠినంగా ప్రవర్తించినందుకు కాదుగాని, ‘ఈ దౌర్భాగ్యులు ప్రభువు రాకడ సమయంలో ఏమని లెక్క అప్పగించ గలరా?’ అని నేను విలపించాను.”

ఫలాల్ని పండించిన కారగారవాసము

బన్యన్ పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు కారాగారవాసం చేసాడు. అయితే, అతడు చెరసాల అధికారి కనికరమునుబట్టి అప్పుడప్పుడూ రాత్రివేళల్లో తన ఇంటికి వెళ్ళివచ్చేవాడు. ఒక సందర్భంలో అతడు రహస్యంగా లండన్లోని క్రైస్తవ విశ్వాసులను దర్శించాడు. తన జీవితంలోని అత్యంత మధురమైన కాలాన్ని అతడు చెరసాల నాలుగు గోడలమధ్య వ్యర్థపుచ్చుతున్న ఈ సమయంలో, బైబిలుగ్రంథం మరియు ఫాక్సుగారి హతసాక్షుల పుస్తకం తప్ప మరే పుస్తకమూ తనతోలేని ఈ కాలంలో అతడు దేవుని ప్రజలకు ఆదరణ కలిగించే అనేక చిన్న చిన్న కరపత్రాలతోపాటు తన సజీవ రచన అయిన “యాత్రికుని ప్రయాణము”ను రచించేందుకు పూనుకొన్నాడు.

చెరసాలనుండి విడుదల

బన్యన్ కారాగార శిక్ష అనుభవించిన చివరి సంవత్సరమగు 1671 లో అతడు బెడ్ఫోర్డ్ లోని బాప్టిస్ట్ చర్చికి పాస్టరుగా ఎన్నుకొనబడ్డాడు. తాను కారాగార శిక్ష అనుభవించిన చివరి నాలుగు సంవత్సరాలు అతడు ఆ సంఘ కూడికలకు వెళ్ళేందుకు చెరసాల అధికారిచే రహస్యంగా అనుమతించబడ్డాడు. తాను సాయం కాలం చెరసాలకు తప్పక తిరిగొస్తానన్న అతని మాటపై చెరసాల అధికారికి ఏమాత్రం అనుమానం ఉండేదికాదు.

చిట్టచివరిగా అతని విడుదల అధికారికంగా ప్రకటించబడింది. లింకన్ బిషప్ అయిన బార్లో, బన్యన్ విడుదల విషయంలో జోక్యంచేసుకొన్నాడు. అతని విడుదల తర్వాత బెడ్ఫోర్డ్ ఒక క్రొత్త ప్రార్థనా మందిరం నిర్మించబడింది.

తన శేషజీవితమంతా బన్యన్ ఆ ప్రార్థనామందిరం లోనే విస్తారమైన జనసమూహానికి బోధిస్తూ గడిపాడు.

సంవత్సరానికి ఒకసారి అతడు లండన్కు వెళ్ళి సౌత్వారాలోని సమావేశ భవనంలో బోధించేవాడు. ఆ సమయంలో ఆక్కడి ప్రజలు అతనిని అత్యంత ఆదరాభిమానాలతో ఆహ్వానించేవారు. అంతేగాక, అతడు బెడ్ఫోర్డ్ మరియు లండన్ పరిసర ప్రాంతాల్లో కూడ విరివిగా సంచరిస్తూ బోధించేవాడు. అతడు నగరాల్లో బోధించే సమయాల్లో ఆనాటి ప్రసిద్ధిగాంచిన వేదాంత పండితుడైన ఓవెన్ (Owen) తప్పక అతని కూడికలకు హాజరై అతని బోధలను వినేవాడు. విద్యాధికుడూ వేదాంతపండితుడూ అయిన ఆ వ్యక్తి విద్యాధముడైన ఒక కళాయి వేసేవాని బోధలను వినడాన్ని గురించి ఒకసారి రెండవ చార్లెస్ రాజు అతణ్ణి ప్రశ్నించినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు: “ఘనతవహించిన రాజా, అతని లాంటి బోధనాసామర్థ్యాన్ని సంపాదించేందుకు నా విద్యార్హతలన్నిటినీ సంతోషంగా వదలుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.”

బన్యన్ జీవిత చరిత్రను మొట్టమొదటిగా రచించిన ఒక రచయిత అతని భావోద్రేకాలను గురించి ఇలా వ్రాసాడు :

“అతడు చూడటానికి చాల కఠినంగా కనిపించేవాడు. అయితే, అతని మాటల్లో ఎంతో మృదుత్వం మేళవించేది. ఎప్పుడైనా అరుదుగా అవసరమొస్తే తప్ప అతడు వాక్చాతుర్యంతో వాక్యాన్ని బోధించేవాడు కాడు. తన్ను గురించి తాను గొప్పలు చెప్పుకోవడమంటే ఏంటో అతనికి తెలియదు. తన్నుతాను తగ్గించుకొంటూ ఇతరుల తీర్పుకే తనను వదలి వేయటం అతని అభిమతం. అబద్ధాలు చెప్పడం, ఒట్టుపెట్టుకోవటం, డంబాలు పలకటం, చెడు మాటలు పలకటం, ప్రతీకారం తీర్చుకోవటం, గాయపరచటం అతని దృష్టిలో హేయమైనవి. మాటల్లోను క్రియల్లోను నీతిని ప్రేమను ప్రదర్శించటం, బేదాభిప్రాయాలను సరిచేసుకొంటూ అందరితో స్నేహంగా ఉండటం అతనికి అత్యంత ఇష్టమైనవి. అతని కళ్ళు చాల త్వరగా ఇటూ అటూ తిరుగుతూ మనుష్యుల్ని కనిపెడు తుంటాయి. అంతేగాక అవి తమ మొదటి చూపులోనే ఒక వ్యక్తియొక్క గుణలక్షణాలను ఇట్టే పసిగట్టగలవు. అవి ఒకే క్షణంలో ఆ వ్యక్తిని గురించి తీర్పు తీర్చగలవు. ఇక అతని విగ్రహం విషయానికి వస్తే, అతనిది బలమైన కండలు తిరిగిన ఒక ఎత్తైన విగ్రహం. ఎఱ్ఱని ముఖంలో మెరిసే కళ్ళు. చిరునవ్వులొలికే పెదవులపై తొణికిసలాడే దట్టమైన మీసాలు, చక్కని ముక్కు అతని అందానికి అదనపు ఆస్తులు. అతని

వెంట్రుకలు ఎఱ్ఱగా ఉండేవి. అయితే, ఆ తర్వాతి కాలంలో అవి తెలుపు రంగుకు మారాయి. అతని నోరు ఒక మోస్తరు పెద్దదిగాను, అతని తల నిటారుగాను, అతని అలవాట్లు సాదాసీదాగాను ఉండేవి.”

తరతరాలకూ సజీవమైన పరిచర్య

బన్యన్ శేషజీవితాన్ని గురించి చరిత్రకారులచే అతి తక్కువగా వ్రాయబడింది. దేవుని ప్రజలు చార్లెస్ రాజు పరిపాలనలో భయంకరమైన హింసను అనుభవించిన సమయంలో బన్యన్ మునుపటిలాగా తన మనఃస్సాక్షిలో తీవ్రమైన సంక్షోభాన్ని అనుభవించాడా లేదా అన్న విషయాన్ని గురించి మనకు సరైన సమాచారం లేదు.

తన జీవిత చరమాంకంలో ఒక రోజు భయంకరమైన కుండపోత వర్షంలో బాగా తడిసి తీవ్రమైన చలిజ్వరం బారినపడ్డ కారణంగా అప్పటికే బాగా నీరసించి బలహీనంగా ఉన్న బన్యన్ 1688వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన తన ఇహలోక యాత్రను ముగించి నిత్యత్వంలోనికి చేరుకొన్నాడు.

అతని దేహం లండన్లోని క్రైస్తవ స్మశానవాటిక అయిన బర్హిల్ ఫీల్డ్స్లో భూస్థాపన గావించబడింది. విధవరాలైన అతని భార్య అతడు మరణించిన నాలుగు సంవత్సరాలకు మరణిం చింది.

అతని వారసులలో అతి కొద్దిమంది పేర్లు మాత్రమే బెడ్ఫోర్డ్ ని బాప్టిస్టు చర్చి పుస్తకాలలో కనిపిస్తున్నాయి.

అతని చివరి వారసురాలిగా కనుగొనబడిన బన్యన్ మునిమనుమరాలు అయిన హన్నా బన్యన్ క్రీ.శ. 1770 లో తన 76వ ఏట మరణించింది.

ఎలిజబెత్ బన్యన్ మరణించిన సంవత్సరమైన 1692 లో బన్యన్ రచనలన్నీ రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి.

బెడ్ఫోర్డ్లో బన్యన్ పరిచర్యను కొనసాగించిన ఎబెనెజర్ క్యాండ్లర్ మరియు క్యాండ్లర్ తరువాత బెడ్ఫోర్డ్ సంఘ పరిచారకుడైన జాన్ విల్సన్ ఈ ప్రచురణ కార్యాన్ని చేపట్టి ముగించారు.

ఈ గ్రంథాలలో జాన్ బన్యన్చే రచించబడిన దాదాపు అరవై వేర్వేరు రచనలు సమీకరించబడ్డాయి. ఇవన్నీ లోతైన ఆత్మీయ ధ్యానాలతో నిండివున్నాయి.

Understanding Heaven: A Christian Reader’s Guide – Bible Verses

క్రైస్తవ పాఠకునికి

సంగ్రహ రచన నీ ఆత్మీయ మేలు నిమిత్తము రూపొందించబడినది. | పరలోక మహిమను నీ మనోనేత్రములకు ప్రదర్శించుటద్వారా నీ ఆశలూ ప్రేమానురాగాలూ పరలోకంవైపుకు ఆకర్షించబడి, ఆ పరలోకాన్నే నీ ముఖ్యమైన ధననిధిగా నీవు ఎంచుకొంటావు. అప్పుడు “నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును” .

బహుశాః నీ ప్రేమానురాగాలు ఇంతవరకు దృశ్యములైన ఐహిక అంశములవైపు మళ్ళివుండ వచ్చు. అయితే పరలోకాన్ని గురించిన ఈ సంగ్రహ రచనను నీవు చదువుటద్వారా నీ ప్రేమానురాగాలు పరలోక మహిమవైపు మళ్ళించబడి, అందులోని ఆనందాన్ని నీవు ఈ లోకంలోనే అనుభవించుట మాత్రమేగాక, దాని ఫలితంగా నీవు నిత్యమైన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి, ఆ నిత్యమైన ఆనందంలో శాశ్వతంగా పాలు పొందగలవు.

పరలోకాన్ని గురించిన పరిపూర్ణ వివరణను ఇది నీకు ఇవ్వదుగాని, భవిష్యత్తును గురించిన దైవిక ప్రత్యక్షతను ఇది కొంతవరకు వివరిస్తుంది. ఎందు కనగా, “మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు” .

మన నిజమైన సంతోషము ఎక్కడ ఉందో ఈ పుస్తకం నీకు చక్కగా వివరిస్తుంది. మన నిత్యత్వమును గురించి మనలో నిరంతరం చెలరేగే అనేకములగు ఆసక్తికరమైన ప్రశ్నలకు, సంశయాలకు సత్యవాక్యము ప్రకారము ఈ రచన చక్కని జవాబులను ఇస్తుంది.

పరలోకము మరియు నరకములనుగూర్చిన దర్శనములు ప్రేమ మరియు కోరిక అనునవి ఆత్మను పరలోకంవైపుకు ఎగిరేట్లుగాచేసే రెక్కలుగా నేను కనుగొనినందున, దైవిక ప్రేరణ కలిగిన ఆత్మ తప్పక పరలోక ఆకర్షణలవైపుకు మెల్లమెల్లగా చేరుకొని, చివరిగా “శాశ్వత శోభాతిశయ”మైన ఆ పరలోకపు అందాల్ని కళ్ళారా వీక్షించి ఆనందిస్తుంది.

ఆ పరలోకపు అందాలు మాత్రమే మనము కోరదగినవి. ఆ పరలోక ప్రభువు మాత్రమే మనము కోరదగినవాడు. తన దీనదశలో సహితము ఎంతో ఆకర్షణీయుడుగా ఉండిన ఆ ప్రేమాప్రభువు, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు తెలిపినట్లుగా తన పరలోక మహిమలో “మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన” వాడుగా ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటాడో కదా?

“శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను” మనకు బయలుపరచబడిన దేవుని పట్టణమును గురించి “మిక్కిలి గొప్ప సంగతులు” చెప్పబడి నప్పటికీ, అనేక విధములుగా దానిని గురించి మనకు అభివర్ణించబడినప్పటికీ, తాను వాస్తవంగా వీక్షించిన సంగతులలో సగమైనను తనకు తెలుపబడలేదని సొలొమోను వైభవమును గురించి షేబ రాణి పలికినట్లుగా మనముకూడ పలికేందుకు ప్రోత్సహించబడుదుము గాక! ఈ లోకంలో ఉండగనే మనము మన హృదయాలను ఆనందమయమైన ఆ పరలోక మహిమవైపు మళ్ళించి, ఆ పరలోక మహిమయొక్క ప్రేమాను రాగాలతో వాటిని నింపుకొని “సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు!” అని రాజైన దావీదులాగా ఆనందపార వశ్యములతో పలుకగలము .

ఆ పరలోక మహిమపై మనకున్న ప్రేమ మరియు అందులో ప్రవేశించాలన్న మనలోని లోతైన కోరిక మనము అపేక్షించే పరలోక మహిమవైపుకు మనల్ని ఎంత శక్తివంతంగా నడిపిస్తాయో, మనల్ని ఆ పరలోక మహిమకు వెళ్ళనీయ కుండాచేసే పాపములన్నిటినుండి మనం దూరంగా పారిపోయేందుకు మన ఆత్మయొక్క భావోద్రేకమైన భయము మనల్ని ప్రోత్సహిస్తుంది.

ఆ ప్రేమ మరియు మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షించేందుకు కోరిక మనలో ఎంత బలంగా పనిచేస్తాయో అంతే బలంగా భయము అనే భావోద్రేకము మనలో పనిచేస్తుంది. మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షిం చేందుకు మనకు పరలోక దర్శనము ఎంత అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనము కూడ మనకు అంతే అవసరము. అప్పుడు మనము మన చెవులను తోపెతు నోటివద్ద పెట్టి , వ్యర్థమైన తమ పాపభోగములనుబట్టి నిత్యనాశనము నకు వారసులైన దౌర్భాగ్యుల విలాపగీతము లను వినగలము.

ఈ లోకంలో తమ సుఖ భోగములకొరకు ఆ పరలోక మహిమను నిర్లక్ష్యంచేసిన ఆ దౌర్భాగ్యుల ఆర్తనాదాలను నీవుకూడ తప్పక వినగలవు. అయితే ఇప్పుడు వారు పశ్చాత్తాపపడేందుకూ, సహాయంకోసం అర్థించేందుకూ బాగా ఆలశ్యమైపోయింది. ఆ విధంగా పరలోకము మరియు నరకమును గూర్చిన దర్శనములు జ్ఞానులగు ప్రతి ఒక్కరినీ మనకు పరలోక దర్శనము ఎంత

అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనముకూడ మనకు అంతే అవసరము.
అత్యంత జాగ్రత్తగా ఉండునట్లు ప్రేరేపించడమేగాక, నాశనకరమైన నిత్యనరకము నుండి తప్పించుకొమ్మని అవి ఇతరులను హెచ్చరిస్తూ, నిత్యమైన పరలోక రాజ్యంవైపుకు చూసేందుకు వారిని పురికొల్పుతాయి.

నోవహు భయముచేత కదిలించబడినవాడై, తననూ తన ఇంటివారినీ రక్షించుకొనుటకు ఒక ఓడను తయారుచేసుకొన్నాడని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలుపుతున్నాడు . నరకపువేదన సరైనవిధంగా వివరించబడి నట్లయితే, “రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు”  క్రీస్తు అను ఓడలోనికి ప్రవేశించునట్లు అనేక హృదయాలను అది కదిలిస్తుంది. అది నిజంగా చెప్పనశక్యమైన కృప. ఈ సందేశము ఒక దర్శనరూపంలో వ్యక్తీక రించబడినందుకు ఎవరూ ఎలాంటి గలిబిలికీ గురికానవసరము లేదు. ఎందు కనగా ఇక్కడ బయలుపరచబడిన సత్యములన్నియు విశ్వాస సూత్రమును

ఆధారముచేసికొనే వ్రాయబడ్డాయి. తన ఔషధము ఒక రోగిలోనికి పోయేందుకు ఒక వైద్యుడు ఒక సరియైన పరికరమునే ఉపయోగిస్తాడు. నేనుకూడ అదే చేశాను. పరలోక మార్గము ఒక స్వప్నమునకు పోల్చబడినప్పుడు, ప్రయాణము అదే దర్శనముద్వారా ఎందుకు అంగీకరించబడకూడదు? పరలోకమునకు మనలను చేర్చే సాధనము అయిన దర్శన మును దీనికోసం మనము ఎందుకు ఎన్ను విశ్వాసం మరియు ప్రేమ కొనకూడదు? యాత్రికుడు మార్గమధ్యంలో అనే బంగారు రెక్కలను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే, చివరిగా అతడు సంతోషకరమైన పరలోకాన్ని చేరుకొన్నాక అతని కష్టాలన్నీ ఒక్కసారిగా అంతమయ్యాయి, గాలితుఫానులన్నీ ఒక్కసారిగా ఆగిపోయి నిశ్శబ్దం మరియు ప్రశాంతత అతనిని ఆవరించాయి.

అలాగైతే మనము ఇంకెంత మాత్రం ఆలశ్యంచేయక విశ్వాసం మరియు ప్రేమ అనే బంగారు రెక్కలను ధరించి పైపైకి ఎగురుదామా? ఎందుకనగా,

“చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు; దేశమంతట పువ్వులు పూసియున్నవి; పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.”

నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము, రమ్ము” అని మన ఆత్మలకు ప్రియమైన మన పెళ్ళికుమారుడు మనల్ని పిలుస్తున్నాడు (పరమగీతము 2:13). ప్రియ చదువరీ, నీ ప్రియుని చేరేందుకు నీవు త్వరపడవా? నీ ఆత్మ శ్రేయోభిలాషి,

కృపాసత్య సంపూర్ణుడు – Bible Verses Chapter 21 in Telugu

ఇరువది ఒకటవ అధ్యాయము

కృపాసత్య సంపూర్ణుడు

గలిలయలో క్రీస్తు శిష్యులకు ప్రత్యక్షపరచుకొనుట (21:1-14) :

21:1 సన్నివేశం ఇప్పుడు తిబెరియ (గలిలయ) సముద్రమునకు మారినది. శిష్యులు ఉత్తరముగా ప్రయాణించి గలిలయలోని తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. వారిని ప్రభువు అక్కడ కలుసుకున్నాడు.

21:2 శిష్యులలో ఏడుగురు ఆ సమయములో అక్కడ కూడుకొనియున్నారు. వారు – పేతురు, తోమా నతానియేలు, యాకోబు, యోహాను (జెబెదయ యొక్క ఇద్దరు కుమారులు), మరియు మనకు పేర్లు తెలియని మరి ఇద్దరు.

21:3 సముద్రములో చేపలు పట్టుటకు వెళ్ళడానికి పేతురు నిర్ణయించుకున్నాడు. మిగిలినవారు కూడా అతనితో వెళ్ళడానికి అంగీకరించారు. వారు అలా వెళ్ళడం దేవుని చిత్తంలో లేదని మరియు వారు ముందుగా ప్రార్థించకుండా వెళ్ళారని అనేకులు అభిప్రాయపడినప్పటికీ, ఇది చాలా సర్వసాధారణమైన నిర్ణయంగా కన్పిస్తుంది.

కృపాసత్య సంపూర్ణుడు అర్థం

ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు చేపలు పట్టడంలో రాత్రంతా గడిపినా, ఫలితం లేకుండా ఉండటానికి, వారు క్రొత్తగా వృత్తిని చేపట్టిన జాలరులేమీ కాదు. “దైవికమైన సహాయము లేని మానవ ప్రయత్నాలు వ్యర్థమగును” (ముఖ్యంగా ఆత్మల సంపాదనలో) అనుదానికి ఇది చక్కని దృష్టాంతముగా ఉన్నది.

21:4 తెల్లవారు జామున వారు తమ నావను తీరమునకు నడిపిస్తూ ఉండగా యేసు వారికోసం వేచిచేస్తూ ఉన్నాడు. అయితే వారాయనను గుర్తుపట్టలేదు. బహుశ అప్పటికి ఇంకా చీకటిగా ఉండియుండవచ్చు లేక దేవుని శక్తివల్ల వారు ఆయనను ఎరుగకుండా ఆటంకపరచబడియుండవచ్చు.

Read and Learn More Telugu Bible Verses

21:5 యేసు – పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైన ఉన్నదా అని వారిని అడుగగా ఎంతో నిరుత్సాహముతో వారు ‘లేదు’ అని సమాధానమిచ్చారు.

21:6 వారికి తెలిసినంతవరకు అతడు తీరంవెంబడి నడచి వెళ్ళుచున్న ఒక అపరి చితుడు మాత్రమే. అయినప్పటికీ ఆయన ఆజ్ఞచొప్పున నావకు కుడివైపున వారు వల వేయగా చేపలు విస్తారముగా పడ్డాయి! వారు వలను లాగలేకపోయారు.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

చేపలు సముద్రంలో ఎక్కడున్నాయో యేసుకు బాగా తెలుసు. అదేవిధంగా ఆయన మన సేవనుకూడా నడిపించినప్పుడు ఇంక ఖాళీ వలలు ఉండవు. రక్షించబడుటకు సిద్ధముగా ఉన్న ఆత్మలు ఎక్కడున్నాయో ఆయనకు తెలుసు. మరియు మనము ఆయనను అనుమతిస్తే, ఆ ఆత్మల యొద్దకు మనలను నడిపించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు.

21:7 యోహాను ముందుగా ప్రభువును గుర్తించి, పేతురుతో చెప్పాడు పేతురు అది విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసికొని సముద్రంలో దుమికాడు, ఒక వ్యక్తి తనపై బట్ట (out side coat) ధరించి యుండకపోతే, అతనిగూర్చి ‘వస్త్రహీనుడు’ (naked) అనుమాట బైబిలునందు సాధారణంగా వాడబడింది. యూదుల ఆలోచనా విధానాన్నిబట్టి ఇక్కడ పేతురుకూడా వస్త్రహీనుడుగా ఉన్నాడని చెప్పవచ్చు.

కృపాసత్య సంపూర్ణుడు అర్థం

21:8 మిగిలిన శిష్యులు చేపలుపట్టే పెద్దనావ నుండి ఒక చిన్న దోనెలోనికి వచ్చి, వలను లాగుతూ, ఇంకా 300 అడుగుల దూరంలో ఉన్న తీరానికి చేరారు. 21:9 రక్షకుడు అప్పటికే నిప్పులపై కాల్చబడిన చేపలను, రొట్టెలను వారికి అల్పా హారముకొరకై సిద్ధంచేశాడు.

కృపాసత్య సంపూర్ణుడు – Bible Verses Chapter 21 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

ప్రభువు ఆ చేపలను పట్టాడో లేక అద్భుతముగా వాటిని పొందాడో మనకు తెలియదు. కాని మన బలహీన ప్రయత్నాలపై ఆయన ఆధారపడి లేడు అనే విషయం దీనినుండి మనకర్ధమవుతుంది.

మనము పరలోకమునకు వెళ్ళి నప్పుడు, సువార్త బోధ మరియు వ్యక్తిగత సాక్ష్యములద్వారా రక్షించబడిన అనేకులతో పాటు, ఎలాంటి మానవ సహాయం లేకుండా ప్రభువు తానే రక్షించుకొనిన అనేకులు కూడా అక్కడ ఉంటారని మనము తెలుసుకుంటాము.

దీనిలో సందేహము లేదు. చేపలతో నిండిన వలను తీసికొని రమ్మని ప్రభువు ఇప్పుడు వారితో చెప్పాడు. వాటిని వండుటకు కాదుగాని, లెక్కపెట్టుటకు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు “ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేయడం మరియు ఆయన వాక్యమునకు సంపూర్ణ విధేయత కలిగి నడచుకోవడం ఇదే విజయ రహస్యం” అనే విషయం వారికి జ్ఞాపకానికి వచ్చి వుంటుంది.

కృపాసత్య సంపూర్ణుడు బైబిల్ వచనాలు

వలలో కచ్చితంగా 153 చేపలున్నాయి. ఆ కాలములో ప్రపంచములో ఉన్న భాషల సంఖ్యను; ప్రపంచములోని ఏ జాతుల, తెగలవైపు సువార్త వల విసరబడనైయుందో వాటి సంఖ్యను; మరియు గలిలయ సముద్రములోని వివిధరకాలైన చేపల సంఖ్యను సూచించడానికి ఈ సంఖ్య తీసికోబడింది.

సువార్త ప్రకటనద్వారా ప్రతి జాతి మరియు ప్రతి దేశములో రక్షింపబడనైయున్న వేర్వేరు రకముల మనుష్యులనుగూర్చి ఇది చెబుతున్నది అనడంలో సందేహంలేదు. ఇన్ని చేపలు పడినా వల చిరగకపోవడం విశేషం అని జాలరులకు తెలుసు.

కృపాసత్య సంపూర్ణుడు Bible Verses Chapter 21

“దేవుని పద్ధతుల్లో జరిగే దేవుని పనికి దేవుని వనరులు ఎప్పుడూ తక్కువకావు” అను సత్యమునకుకూడా ఇది ఒక ఋజువుగా ఉంది. వల పిగిలిపోకుండా ఆయనే చూచుకుంటాడు.

21:12 అల్పాహారానికి ఆహ్వానించబడిన శిష్యులు, ప్రభువు సిద్ధము చేసిన మంచి వాటిలో పాలుపొందడానికి ఆ నిప్పులచుట్టూ చేరారు.

ఆ నిప్పులను, మంటలను చూచినప్పుడు పేతురు తాను ప్రభువును ఎరుగనని బొంకినప్పుడు, చలి కాచుకోవ డానికి ఏ మంటవద్ద ఉన్నాడో అది అతనికి గుర్తుకు వచ్చిందా? ప్రభువు సన్నిధిలో ఒక విధమైన భయము, గంభీరతతో కూడిన వింతైన భావాన్ని శిష్యులు అనుభవించారు.

ప్రభువును ఎన్నో ప్రశ్నలు అడగాలని వారు అనుకొనియుంటారు. కాని వారు ధైర్యం చేయలేకపోయారు. ఆయన ప్రభువని వారు గ్రహించారు.

కృపాసత్య సంపూర్ణుడు బైబిల్ వచనాలు

21:13 ప్రభువు వారికి ఆ అల్పాహారాన్ని పంచిపెట్టాడు. కొద్ది రొట్టెలు, చేపలతో ఐదువేలమందికి ఆయన ఆహారం పెట్టిన సందర్భము బహుశ ఈ సమయంలో వారికి జ్ఞాపకం వచ్చివుంటుంది.

21:14 “యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి” అని యోహాను చెప్పుచున్నాడు. అనగా దీనిగూర్చి యోహాను తన సువార్తలో ప్రస్తావించడం యిది మూడవసారి.

అయితే ప్రభువు ప్రత్యక్షమైన సందర్భాలు ఇంకా ఉన్నట్లుగా మిగిలిన సువార్తల వలన మనకు స్పష్టమవుతుంది. యోహాను సువార్తలో – ఆయన పునరుత్థానుడైనరోజు సాయంత్రం మొదటి సారిగా శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు; ఒక వారము తరువాత మరల కన్పించాడు; ఇప్పుడు గలిలయ సముద్ర తీరాన ప్రత్యక్షమయ్యాడు.

పేతురుతో సంభాషణ (21:15-17) :

21:15 ప్రభువు మొదటిగా వారి భౌతిక అవసరాలను తీర్చాడు. వారు తిని తృప్తి పొందిన తరువాత ఆయన పేతురువైపు తిరిగి ఆత్మీయ విషయాలనుగూర్చి మాట్లాడాడు.

పేతురు మూడుసార్లు బహిరంగంగా ప్రభువును ఉపేక్షించియున్నాడు ఆ తర్వాత అతడు పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువుతో సహవాసంలోకి చేర్చబడ్డాడు. ఈ వచనాల్లో పేతురుయొక్క సమాధానపడిన స్థితిని ప్రభువు బహిరంగంగా సమ్మతించాడు.

ప్రేమకు పర్యాయపదాలుగా రెండు వేరవేరు మాటలు ఇక్కడ వాడబడినవి. 15వ వచనాన్ని వేరే మాటలలో ఈ విధంగా చెప్పవచ్చు – “యోహాను కుమారుడవైన సీమోను, ఈ మిగిలిన శిష్యులు నన్ను ప్రేమించినదానికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అందుకతడు – ‘అవును ప్రభువా, నేను నీ స్నేహితుడనని నీకు తెలుసు’ అని ఆయనతో చెప్పాడు.

కృపాసత్య సంపూర్ణుడు తెలుగులో

మిగిలిన శిష్యులందరూ విడిచిపెట్టినా తాను ఎన్నటికీ ప్రభువును విడువనని ఇకపై అతడు డంబాలు చెప్పలేదు. అతడు తన పాఠాన్ని నేర్చుకున్నాడు. ‘నా గొఱ్ఱపిల్లలను మేపుము’ అని యేసు చెప్పాడు.

క్రీస్తుకొరకైన ప్రేమను చూపించుటకు ఒక మంచి ఆచరణాత్మకమైన విధానమేమనగా – ఆయన మందలోని పిల్లలను మేపుట. ఈ సంభాషణ ‘చేపలు పట్టడం’ దగ్గరనుండి ‘మందను కాయడం’ వరకు మారడాన్ని గమనించండి మొదటిది – సువార్త ప్రకటనను, రెండవది – బోధించుట మరియు కాపరిగా సంరక్షించుటను సూచిస్తున్నాయి.

21:16 రెండవ సారి ప్రభువు – ‘నన్ను ప్రేమించుచున్నావా?’ అని పేతురును అడిగాడు. పేతురు, తననుతాను పూర్తిగా తగ్గించుకొన్నవాడై రెండోవసారికూడా, ‘నేను నీ స్నేహితుడనని నీకు తెలుసు’ అని జవాబిచ్చాడు.

ఈ సారి ప్రభువు, ‘నా గొట్టెలను కాయుము’ అని చెప్పాడు. ప్రభువుయొక్క మందలో గొట్టెపిల్లలు మరియు గొట్టెలు ఉంటాయి. కాపరిని ప్రేమించేవానియొక్క ప్రేమతో కూడిన సంరక్షణ వాటికెంతో అవసరము.

21:17 పేతురు ప్రభువును మూడుసార్లు ఉపేక్షించినందున, ఆయనను ఒప్పుకొను టకు అతనికి మూడు అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఈ సారి పేతురు ‘యేసు, దేవుడైయున్నాడు, కాబట్టి ఆయన సమస్తమును ఎరిగినవాడు’ అనే వాస్తవాన్ని విన్నవిస్తున్నాడు.

మూడవసారికూడా అతడు, ‘నేను నీ స్నేహితుడనని నీ వెరుగుదువు’ అని చెప్పాడు. చివరిగా, క్రీస్తుయొక్క గొట్టెలను మేపడంద్వారా తన ప్రేమను చూపించు మని ప్రభువు అతనితో చెప్పాడు. ఈ లేఖన భాగములో దాగియున్న సత్యమేమనగా- క్రీస్తును సేవించడము వెనుక ఉండవలసిన ఒకే ఒక ఉద్దేశ్యము – ఆయనకోసమైన ప్రేమ మాత్రమే.

పేతురు మరణమునుగూర్చి ముందుగా చెప్పబడుట (21:18-23): 21:18

యౌవనుడుగా ఉన్నపుడు పేతురు ఎంతో స్వాతంత్ర్యాన్ని అనుభవించాడు. తనకిష్టమైన చోటికి అతడు వెళ్ళాడు. కాని అతని జీవితపు చివరి రోజుల్లో అతడు బంధించబడి, చంపబడటానికి తీసికొనిపోబడతాడని ఇప్పుడు ప్రభువు అతనితో చెప్పాడు.

21:19 పేతురు హతసాక్షిగా మరణించి దేవుని మహిమపరచనైయున్నాడు. ప్రభువును ఎరుగునని బొంకినవానికి ఆయనకోసం ప్రాణాన్ని అర్పించగల ధైర్యం అనుగ్రహించబడింది.

కృపాసత్య సంపూర్ణుడు వివరణ

మన జీవితముద్వారా మాత్రమే కాక మరణంద్వారాకూడా దేవుని మహిమపరచగలము. అప్పుడు ప్రభువు – ‘నన్ను వెంబడించు’ అని చెప్పాడు. ఆయన ఈ మాట పలికినపుడు, వెళ్ళడానికి అతడు సిద్ధమై యుండియుంటాడు.

21:20 పేతురు ప్రభువును వెంబడించడం ఆరంభించినట్లుగా ఇక్కడ కన్పిస్తుంది. అప్పుడతడు వెనక్కు తిరిగి యోహానుకూడా వెంబడిస్తూ ఉండటం చూచాడు. ఈ వృత్తాంతాన్ని వ్రాస్తూ యోహాను తననుగూర్చి, ‘యేసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని – ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు’ అని చెప్పుచున్నాడు.

21:21 పేతురు, యోహానును చూచినపుడు “యోహాను సంగతేమిటి? అతడు కూడా హతసాక్షిగా మరణించబోతున్నాడా? లేక ప్రభువు తిరిగి వచ్చువరకు ఇంకా బ్రతికేవుంటాడా?” అను ఆలోచన అతని మదిలో మెదిలింది. యోహాను భవిష్యత్తును గూర్చి అతడు ప్రభువునడిగాడు.

21:22 యోహానుయొక్క అంతమునుగూర్చి నీవు పట్టించుకోనవసరంలేదు, అని ప్రభువు పేతురుతో చెప్పాడు. క్రీస్తుయొక్క రెండవ రాకడవరకు అతడు జీవించియున్నా, దీనివల్ల పేతురుకు ఒరిగేదేమీ లేదు.

క్రీస్తు శిష్యులైనవారు నేడు ప్రభువునుగూర్చిగాక, ఒకరి విషయాలనుగూర్చి ఒకరు ఎక్కువగా ఆసక్తికలిగి యుండటంవల్లనే ‘క్రైస్తవ పరిచర్య’లో అనేక అపజయాలు తలెత్తుతున్నాయి.

21:23 ప్రభువు పలికిన ఈ మాటలు అటుతరువాత అనేకులచేత తప్పుగా ఉ దాహరించబడ్డాయి. తాను తిరిగివచ్చువరకు యోహాను ఇంకా సజీవంగా ఉంటాడని ఆయన చెప్పలేదు.

‘నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి’ అని మాత్రమే ఆయన పేతురుతో అన్నాడు. యేసు ఇక్కడ యోహానును తన రెండవ రాకడ సందర్భముతోకూడా కలిపి ప్రస్తావించాడు. అనుకోని విధంగా ఈ యోహానే, అంత్యదినములనుగూర్చి ఎంతో విపులముగా వివరించబడిన చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథమును వ్రాశాడు.

కృపాసత్య సంపూర్ణుడు వివరణ

క్రీస్తునుగూర్చి యోహానుయొక్క ముగింపు సాక్ష్యము (21:24,25):

21:24 యోహాను, తాను వ్రాసిన సంగతులకు కచ్చితత్వముకోసం తన స్వంత సాక్ష్యాన్ని ఇప్పుడు చేర్చుచున్నాడు.
“యేసు చేసిన కార్యములు ఇంకను

21:25 యోహాను ఇలా వ్రాశాడు అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమేన్.” దీనిని మనము అక్షరార్ధముగానే తీసికోవచ్చును.

కృపాసత్య సంపూర్ణుడు జీవిత శిక్షణలు

యేసు, దేవుడు కావున ఆయన అనంతుడుగా ఉన్నాడు. ఆయన మాటల అర్థమునకు లేక ఆయన పనుల సంఖ్యకు అంతములేదు. ఆయన భూమిపై ఉన్నప్పుడుకూడా సూర్యచంద్ర నక్షత్రాలు మొదలగువాటన్నిటికి ఆయనే ఆధారభూతుడుగా ఉన్నాడు.

ఈ అనంత విశ్వాన్ని చలనంలో ఉంచడానికి దోహదపడిన వాటన్నిటినిగూర్చి ఎవరు వివరించగలరు? ఆయన భూమిపై చేసిన సూచక క్రియలనుగూర్చికూడ చాలా స్వల్పమైన వివరణనే మనము కలిగియున్నాము.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

 

ఒక చిన్న స్వస్థత కార్యమును గమనిస్తే – ఆయన సరిచేసిన నరములు, కండరాలు, రక్తకణాలు మరియు ఇతర అవయవాలనుగూర్చి ఆలోచించండి. క్రిమి కీటకాలు, చేపలు, జంతువుల జీవితాలను ఆయన నడిపించుచున్న విధానాన్ని గూర్చి ఆలోచించండి.

కృపాసత్య సంపూర్ణుడు జీవిత శిక్షణలు

విశ్వములోని ప్రతి పదార్థముయొక్క అణు నిర్మాణముపై ఆయనకున్న అధికారమునుగూర్చి ఆలోచించండి. ఇటువంటి అనంతమైన వివరాలను వర్ణించే పుస్తకాలను ఈ భూలోకము కలిగియుండగలదా? దీనికి జవాబు కచ్చితముగా ‘లేదు’ అని నొక్కి చెప్పగలము.

ప్రియ చదువరీ! యోహాను సువార్తలోని ధ్యానాల ముగింపుకు మనము వచ్చాము. బైబిలులోని అతి ప్రియమైన భాగాలలో ఒకటిగా ఇది ఎందుకు ఎంచబడిందో బహుశ కొద్దిగానయినా నీకు అర్థమై యుంటుంది. ఈ యోహాను సువార్తను ఆలోచనా పూర్వకముగా మరియు ప్రార్థనాపూర్వకముగా చదివినవారెవరైనా అది చూపించుచున్న పావనుడగు ప్రభువుతో నూతనముగా ప్రేమలో పడకపోవడం దుర్లభము!

 

పునరుత్థానుడైన ప్రభువు – Bible Verses Chapter 20 in Telugu

ఇరువదియవ అధ్యాయము

పునరుత్థానుడైన ప్రభువు

20:1 వారములో మొదటి దినము ఆదివారము. మగ్దలేనే మరియ తెల్లవారక ముందే సమాధి దగ్గరకు వచ్చింది. ఈ సమాధి బహుశ ఒక కొండలో తొలచబడిన చిన్న గదిలాంటిదై యుండవచ్చు. సమాధిమీద ఉంచబడిన రాయి నిస్సందేహంగా ఒక నాణెము ఆకారములో గుండ్రముగా మరియు చదునుగా ఉండి ఉంటుంది.

అది సమాధి ఎదుటనున్న ఒక గాడిలో అమర్చబడి, దానిని దొర్లించి, సమాధిని మూయుటకు వీలుగా ఏర్పాటుచేయబడినది. మరియ వచ్చేటప్పటికే రాయి దొర్లించబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయములో మనము నేర్చుకొనిన విధముగా క్రీస్తు పునరుత్థానుడైన తరువాత అకస్మాత్తుగా ఇది సంభవించింది.

20:2 మరియు వెంటనే పరుగెత్తుకొని పేతురు, యోహానులయొద్దకు వెళ్ళి ప్రభువు దేహమును సమాధిలోనుండి ఎవరో తొలగించారని చెప్పింది. ఆ పని ఎవరు చేశారో ఆమె చెప్పలేదు కాని తనకు అంతా తెలుసన్నట్లుగా ‘వారు’ అని మాత్రం చెప్పింది.

పునరుత్థానుడైన ప్రభువు బైబిల్‌లో

మన ప్రభువు సిలువ వేయబడినప్పుడు మరియు పునరుత్థానుడైనప్పుడు స్త్రీలయొక్క నమ్మకత్వము మరియు భక్తి గమనించదగినది. శిష్యులయితే ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. కాని ఈ స్త్రీలు తమ స్వంత క్షేమాన్నికూడా లక్ష్యపెట్టక ఆయన ప్రక్క నిలిచారు.

20:3 పేతురు, యోహానులు త్వరపడి పట్టణమునుండి కల్వరికొండకు సమీపమున ఉన్న ఆ తోటవైపుకు పరుగెత్తుతూ ఉన్నప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో ఊహించడం కష్టము.

Read and Learn More Telugu Bible Verses

20:4 పేతురు కంటే యోహాను బహుశ చిన్నవాడై యుండటంవల్ల అతడు త్వరగా పరుగెత్తి ఖాళీ సమాధిని ముందుగా చేరాడు.

20:11 ఈ వచనంలోని ‘అయితే మరియ’ అనే మొదటి రెండు మాటలు గమనించ దగినవి.

20:5 సమాధిలోకి ఎవరైనా ప్రవేశించాలన్నా, లోపలికి చూడాలన్నా క్రిందగా ఉన్న ద్వారమువల్ల వారు వంగవలసిన అవసరం ఉంది. నారబట్టలు పడియుండటం యోహాను చూశాడు. నారబట్టలు దేహానికి ఏ విధంగా చుట్టబడ్డాయో, బహుశ అదే ఆకారములో అవి అక్కడ ఉండియుండవచ్చు. యోహాను సమాధిలో ప్రవేశించలేదు.

20:6 ఈ లోగా పేతురు వచ్చి తన సహజమైన దూకుడు వైఖరితో ఏ మాత్రం సందేహించకుండా సమాధిలో ప్రవేశించాడు. అతడుకూడా నారబట్టలు పడియుండటం చూచాడు. కాని రక్షకుని దేహము అక్కడలేదు.

20:7 “ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి యుండుటయు చూచెను”. ప్రభువు ఆ స్థలమును విడిచిపెట్టడమనేది ఏదో తొందరపాటుగా జరిగినది గాక ఒక పద్ధతి ప్రకారం జరిగింది అని చూపడానికి ఈ వివరణ చేర్చబడింది. ప్రభువు దేహమును ఎవరైనా దొంగిలించివుంటే, వారు తల రుమాలును జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు.

పునరుత్థానుడైన ప్రభువు – Bible Verses Chapter 20 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

20:8 యోహాను పేతురును వెంబడించి సమాధిలోనికి వెళ్ళి నారబట్టలు మరియు తల రుమాలు ఒక క్రమపద్ధతిలో ఉండటం చూశాడు. “అతడు.. చూచి నమ్మెను” అనగా అప్పుడు అతడు గ్రహించాడు. అతని యెదుట క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయి.

20:9 మెస్సీయా మృతులలోనుండి తిరిగిలేస్తాడు అని చెప్పుచున్న లేఖనాలను ఇంకను ఆ శిష్యులు నిజముగా అర్థం చేసుకోలేదు. ప్రభువు, తానే ఆ విషయమును గూర్చి వారికి ఎన్నోసార్లు చెప్పాడు గాని వారు దానిని గ్రహించలేదు.

20:10 దీనిని గ్రహించింది. మొదటిగా యోహానే. పేతురు, యోహానులు బహుశ యెరూషలేములో తాము బసచేసిన స్థలాలకు తిరిగివెళ్ళిపోయారు. సమాధి యొద్ద వేచియుండటంలో ఏమీ అర్థంలేదు. వారేమి కనుగొన్నారో దాన్ని మిగిలిన శిష్యులకు చెప్పడమే ఉత్తమమైనది.

యేసు మరియకు కన్పించుట (20:11-18)

20:11 ఈ వచనంలోని ‘అయితే మరియ’ అనే మొదటి రెండు మాటలు గమనించ దగినవి. మిగిలిన ఇద్దరు శిష్యులు ఇంటికి వెళ్ళి పోయారు, అయితే మరియ …. ఇక్కడకూడ ఒక స్త్రీ యొక్క ప్రేమ మరియు భక్తిభావం మనకు కన్పిస్తుంది.

ఆమె విస్తారంగా క్షమించబడింది; కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది. బహుశ ప్రభువు యొక్క శత్రువులు ఆయన దేహమును దొంగిలించారేమో అని ఆమె తలంచి సమాధి బయటే ఏడుస్తూ నిల్చొని ఉంది.

20:12 అప్పుడామె లోపలికి వంగిచూడగా ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో ఆమెకు కన్పించారు. ఈ అద్భుతమైన వాస్తవాలు గొప్ప భావోద్రేకంతో కాక ఎంతో నిశ్చలంగా ఎలా చెప్పబడ్డాయో అది గమనించదగినది.

20:13 మరియ భయపడినట్లుగాని, ఆశ్చర్యపడినట్లుగాని మనకు కన్పించదు ఇది ఎంతో సాధారణమైన అనుభవం అన్నట్లుగా ఆమె వారి ప్రశ్నకు జవాబిచ్చింది. యేసు తిరిగిలేచాడని మరియు సజీవుడుగా ఉన్నాడని ఆమె ఇంకా గ్రహించలేదు.

పునరుత్థాన ప్రసంగం తెలుగులో

20:14 ఆ క్షణాన ఏదో ఆమెను వెనక్కు తిరిగి చూచేలా చేసింది. అక్కడున్నది ప్రభువే, కాని ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. అది ఇంకా వేకువజాము కావడంవల్ల బహుశ బాగా వెలుతురుగా లేదేమో. ఆమె ఇంకా ఏడుస్తూ బాగా కలవరముతో ఉంది. సరియైన సమయము వచ్చేవరకు యేసును గుర్తుపట్టకుండా దేవుడే ఆమెను ఆటంకపరచియుండవచ్చు.

20:15 తాను వేస్తున్న ప్రశ్నకు జవాబు బాగా తెలిసినప్పటికి ఎందుకేడుస్తున్నావని ప్రభువు ఆమెను ప్రశ్నించాడు. ఆమె దుఃఖానికి కారణాన్ని ఆమె పెదవుల నుండే వినడానికి ఆయన ఇష్టపడ్డాడు.

ఆమె ఆయనను తోటమాలి అనుకొంది, రక్షకుడు మానవులకు ఎంత సమీపంగా ఉన్నా గుర్తింపబడకపోవచ్చు. ఈ లోకములోని గొప్ప వారిలో ఒకనిగా కాక ఆయన తరచుగా ఎంతో తగ్గించుకొన్న వాడైవస్తాడు.

20:11 ఈ వచనంలోని ‘అయితే మరియ’ అనే మొదటి రెండు మాటలు గమనించ దగినవి.

 

మరియు ప్రభువు పేరును సంబోధించలేదు. మూడుసార్లు యేసును గూర్చి ఆమె ‘ఆయన’ అని ప్రస్తావించింది. ఒకే ఒక వ్యక్తి గురించి మాత్రమే ఆమె ఆలోచన కలిగివుంది. అంతకు మించిన వివరాలు అనవసరం అని ఆమె భావించింది.

2016 తనను పేరు పెట్టి పిలుస్తున్న ఒక సుపరిచిత స్వరాన్ని యరియ ఇప్పుడు విన్నది. ఏ మాత్రం సందేహంలేదు. – ఆ స్వరం యేసుదే. ఆమె ఆయనను ‘రబ్బూనీ’ అని పిలిచింది. అంటే ‘నా గొప్ప బోధకుడు’ అని అర్ధము. తానెరిగిన గొప్ప బోధకుని గానే ఆమె ఆయననుగూర్చి ఇంకా ఆలోచిస్తూ ఉంది.

ఆయన ఇప్పుడు ఆమెయొక్క బోధకుని కంటే అధికుడని ఆమె గ్రహించలేదు. ఆయన ఆమె యొక్క ప్రభువు మరియు రక్షకుడు. ఇకపై ఆమె ఆయనను గూర్చి ఒక నూతనరీతిలో సంపూర్ణంగా ఏ విధంగా ఎరుగనైయుందో దానిని ప్రభువు ఆమెకు వివరించాల్సి వుంది.

20:17 ‘నన్ను ముట్టుకొనవద్దు’ అని ఆయన అన్నాడు. అంటే మరియ కనీసం తన చేతి వ్రేళ్ళతోకూడా ఆయన దేహాన్ని తాకకూడదని దీని అర్థం కాదు. ‘నన్ను అంటిపెట్టుకొని యుండవద్దు’ అని దీని భావము.

శరీరముతో నుండిన మనుష్యునిగా యేసు మరియకు తెలుసు. ఆయన జీవించియున్నపుడు జరిగిన అద్భుతకార్యాలను ఆమె చూచింది. కాబట్టి, భౌతికంగా ఆమె ఆయనను కలిగియుండకపోతే ఆశీర్వాదము పొందడానికి ఆమెకు ఎలాంటి నిరీక్షణ ఉండదనే నిర్ణయానికి ఆమె వచ్చింది.

ప్రభువు ఆమె ఆలోచనను సరిచేయవలసివచ్చెను. ‘శరీరముతో ఉన్న ఒక మనుష్యునిగామాత్రమే తనను అంటిపెట్టుకొని యుండవద్దు’ అని ఆయన చెప్పాడు. “నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు.

యేసు క్రైస్తు పునరుత్థానం అర్థం

నేను పరలోకమునకు తిరిగివెళ్ళిన తరువాత పరిశు ద్ధాత్మ ఈ భూమిమీదకు పంపబడును. ఆయన వచ్చినపుడు నీవు ఇంతకు ముందెన్నడూ నన్ను ఎరుగని రీతిలో ఆయన నీ హృదయానికి నన్ను బయలుపరుస్తాడు.

ఈ భూమిపై నేను జీవించిన కాలంలో సాధ్యంకాలేనిది, అప్పుడు నేను నీకు ఎంతో సమీపంగాను, ప్రియముగాను ఉంటాను.” ఆయన, ‘తన శిష్యుల దగ్గరకు వెళ్ళి, ప్రవేశపెట్టబడిన ఈ నూతన క్రమాన్నిగూర్చి వారికి తెలియజేయుమని’ ఆమెతో చెప్పాడు.

మొదటిసారిగా ప్రభువు ఇక్కడ తన శిష్యులను ‘నా సహోదరులు’ అని సంబోధించాడు. ఆయన తండ్రే తమ తండ్రి అని, ఆయన దేవుడే తమ దేవుడని వారు తెలుసుకోవాల్సివుంది. ఆయన పునరుత్థానానికి ముందు ‘కుమారులు’ మరియు ‘దేవుని వారసులు’గా విశ్వాసులు ఎప్పుడూ చేయబడలేదు.

దేవుని గూర్చి ‘మన తండ్రి’ అని ప్రభువు చెప్పలేదు దేవుడు మనకంటే భిన్నమైన రీతిలో యేసుకు తండ్రియై యున్నాడు. ప్రభువైన యేసుకు నిత్యత్వమునుండి దేవుడు తండ్రిగా ఉన్నాడు. నిత్యత్వమునుండి క్రీస్తు కుమారునిగా ఉన్నాడు. కుమారుడు తండ్రితో సమానుడైయున్నాడు, మనమైతే దేవునికి దత్తపుత్రులము.

ఈ సంబంధము మనము రక్షింపబడిన నాటి నుండి ప్రారంభమై ఎన్నటికీ అంతమవదు. దేవుని కుమారులముగా మనము దేవునితో సమానులము కాము. అలా ఎన్నటికీ కాలేము.

20:18 తన కప్పగింపబడిన పనికి విధేయురాలైన మరియ ‘అపొస్తలులకే అపొస్తలు రాలు’ అయినది. క్రీస్తుపట్ల ఆమెకున్న భక్తికి ప్రతిఫలంగా ఆమెకు ఇంతటి గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది అనడంలో సందేహంలేదు.

శిష్యులకు యేసు ప్రత్యక్షమగుట (20:19-23)

20:19 అది ఆదివారం సాయంకాలం. మూడు రాత్రుల క్రితం వారు కూడుకొనిన మేడగదిలోనే బహుశ శిష్యులందరూ సమావేశమై యుంటారు. యూదులవలని భయం చేత గది తలుపులు మూసికొనియున్నారు. అకస్మాత్తుగా యేసు వారి మధ్యలో నిలబడి ‘మీకు సమాధానము కలుగును గాక’ అని చెప్పడం వారు విన్నారు.

తలుపులు తెరవకుండానే ప్రభువు గదిలోపలికి ప్రవేశించాడు. ఆయన పునరుత్థాన శరీరము మాంసము, ఎముకలతో కూడిన నిజమైన శరీరమే. అయినప్పటికి, అడ్డంకుల గుండా వెళ్ళడానికి మరియు ప్రకృతి ధర్మాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆయన శక్తి కలిగియున్నాడు.

పునరుత్థానుడైన ప్రభువు Bible Verses Chapter 20

“మీకు సమాధానము కలుగునుగాక” అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు క్రొత్త అర్థాన్ని కలిగి యున్నాయి. ఎందుకంటే తన సిలువలో కార్చిన రక్తముద్వారా క్రీస్తు సమాధానాన్ని కలుగజేసాడు. ఎవరైతే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారు దేవునితో సమాధానాన్ని కలిగియుంటారు.

20:20 ఏ గుర్తుల ద్వారా వారికి సమాధానము లభించిందో వాటిని (తన ప్రేమ గుర్తులను) ఆయన వారికి చూపించాడు. మేకుల గుర్తులను, బల్లెపు గాయాన్ని వారు చూచారు. సంతోషంతో వారి హృదయం నిండిపోయింది. ఆయన నిజంగా ప్రభువే!

20:21 తాను చెప్పినట్టుగానే ఆయన జరిగించాడు; ఆయన మృతులలోనుండి తిరిగిలేచియున్నాడు. కాని ఆయన సమాధానాన్ని వారు స్వార్థంగా తాము మాత్రమే అనుభవించడానికి ఉద్దేశింపబడలేదు. దానిని వారు ఇతరులతో పంచుకోవాల్సి వుంది.

కాబట్టి తండ్రి ఆయనను పంపినట్లుగా ఆయన వారిని లోకములోనికి పంపించాడు, క్రీస్తు ఒక పేదవానిగా ఈ లోకమునకు వచ్చాడు; ఆయన దాసునిగా వచ్చాడు; తన్నుతాను రిక్తునిగా చేసుకొన్నాడు; తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఎంతో సంతోషిం చాడు; తన్నుతాను మానవునితో సమానునిగా ఎంచుకున్నాడు; ఆయన సమస్తాన్ని పరిశుద్ధాత్మ శక్తిద్వారా జరిగించాడు. ఆయన గురి – సిలువ. ఇప్పుడు ప్రభువు తన శిష్యులతో ఇలా చెబుతున్నాడు – “కాబట్టి నేను మిమ్మును పంపుచున్నాను.”

20:22 “ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారితో చెప్పెను.” – ఈ సువార్తలలోని అతి క్లిష్టమైన వచనాల్లో ఇది ఒకటి, సమస్య ఏమిటంటే, పెంతెకొస్తు దినమువరకు పరిశుద్ధాత్మ పంపబడలేదు.

బైబిల్‌లో పునరుత్థాన వచనాలు

ఈ సందర్భము వెంటనే జరగనప్పుడు ప్రభువు ఎలా ఈ మాటలు మాట్లాడగలిగారు? దీనికి అనేక వివరణలు ఇవ్వబడ్డాయి. పెంతెకొస్తు దినమున వారు పొందబోయే దానినిగూర్చి ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు అని కొందరి అభిప్రాయం. ఇది యుక్తమైన వివరణ కాదు.

“వాస్తవానికి రక్షకుడు ‘పరిశుద్ధాత్మను పొందుడి’ (re- ceive the Holy Spirit) అని అనలేదు కాని ‘పరిశుద్ధాత్మ పొందుడి’ (receive Holy Spirit) అని మాత్రమే అన్నాడు” అని మరికొందరి అభిప్రాయం.

ఈ వివరణ నుండి వారు – “శిష్యులు ఈ సయమంలో పరిశుద్ధాత్మను ఆయన సంపూర్ణతతోకూడా పొందలేదు. కాని సత్యమునుగూర్చిన అధిక జ్ఞానము లేక వారి సేవకోసం అధికారము మరియు నడిపింపు మొదలగు ఆత్మయొక్క కొన్ని పరిచర్యలను మాత్రం పొంది యున్నారు, వారు పరిశుద్ధాత్మను ముందుగా రుచి చూచిన అనుభవాన్ని మాత్రమే పొందిరి” అని చెబుతారు.

మరికొందరు – ‘ఈ సందర్భములో శిష్యులపై పూర్తిగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందని’ అభిప్రాయపడుచున్నారు. కాని లాకా 24:49 మరియు అపొ. 1:4,5,8 వచనాలలో ‘పరిశుద్ధాత్మ రావడం’ అనేది భవిష్యత్తులో జరగ బోయే విషయంగా చెప్పబడింది.

యేసు మహిమపరచబడనంతవరకు అనగా ఆయన పరలోకమునకు తిరిగివెళ్లకమునుపు పరిశుద్ధాత్మ దేవుడు తన సంపూర్ణతతో ఈ భూమి పైకి రాలేడు అనే విషయం యోహాను 7:39 ద్వారా మనకు స్పష్టమవుతున్నది.

20:23 ఈ 23వ వచనముకూడా కష్టమైనది మరియు అనేక భేదాభిప్రాయాలకు మూలముగా ఉంటున్నది. పాపములు క్షమించుటకును లేక వాటిని నిలిచి యుండ నిచ్చుటకును యేసు తన శిష్యులకు (మరియు వారి వారసులైనవారికి) అధికారమును వాస్తవంగానే ఇచ్చాడని ఒక అభిప్రాయము.

 

20:23 ఈ 23వ వచనముకూడా కష్టమైనది మరియు అనేక భేదాభిప్రాయాలకు మూలముగా ఉంటున్నది.

 

కాని దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు (లూకా 5:21) అను బైబిలు బోధకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. రెండవ అభిప్రాయమేమనగా – “వాగ్దానము చేయబడిన శక్తి మరియు ఇవ్వబడిన ఈ అధికారము – సువార్త ప్రకటించడానికి; ఏయే షరతులమీద పాపములు క్షమించ బడగలవు అని తెలియజేయడానికి సంబంధించినది. షరతులు అంగీకరించబడకపోతే పాపములు నిలిచివుంటాయి.”

మూడవది మరియు మనముకూడా అంగీకరించే అభిప్రాయము ఏమనగా “పాపములు క్షమించబడినవి” అని ప్రకటించడానికి శిష్యులకు అధికారము ఇవ్వ శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వెళతారనుకోండి, కొంత మంది ప్రజలు పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకొని యేసుప్రభువును అంగీక రిస్తారు.

అలాంటివారితో వారి పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడానికి శిష్యులు అధికారం పొందారు. కొందరయితే పశ్చాత్తాపపడడానికి నిరాకరించి క్రీస్తులో విశ్వాస ముంచరు. అప్పుడు శిష్యులు – వారు ఇంకా వారి పాపములలోనే ఉన్నారని అలాగే మరణిస్తే, వారు నిత్యనాశనమునకు గురిఅవుతారని వారితో చెబుతారు. కొన్నిరకాల పాపములతో వ్యవహరించే విషయంలో శిష్యులు ప్రత్యేక అధికారాన్ని ప్రభువునుండి పొందియుండటము గమనించండి : పేతురు, అపొ. కార్య.

5:1-11 వచనాల్లో అననీయ సప్పీరాల విషయంలో ఈ అధికారాన్ని ఉపయోగించాడు. పౌలు, 1 కొరింథీ 5:3-5, 12,13 వచనాల్లో ఒక దుర్మార్గుని పాపమును నిలిచియుండనివ్వడం మరియు 2 కొరింథీ

2:4-8 వచనాల్లో అదే పాపన్ని క్షమించడం మనము చూస్తాము. ఇది ఇక్కడ జీవితములోని ఈ పాపముయొక్క శిక్షనుండి క్షమాపణ పొందడమైయున్నది. సందేహము విశ్వాసముగా మార్చబడుట (20:24-29) :

20:24 “యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను.” ‘తోమా అక్కడ లేకపోవడం అతని తప్పు’ అనే నిర్ణయానికి మనము రాకూడదు అతడు ఎందుకు అక్కడ లేడో దానినిగూర్చి ఏమీ చెప్పబడలేదు.

20:25 కానీ తోమా యొక్క అవిశ్వాస ధోరణిని మాత్రం తప్పు పట్టాల్సివుంది. అతడు ప్రభువు పునరుత్థానమునకు దృగ్గోచరమైన, స్పర్శనీయమైన ఋజువులను కోరాడు. లేనట్లయితే అతడు విశ్వసించడు! ఈ రోజుల్లో కూడా అనేకుల వైఖరి ఈ విధంగానేఉంది.

కాని అది సమంజసం కాదు. మన దైనందిన జీవితంలో తాకలేని, చూడలేని అనేకవిషయాల్లో మనము నమ్మకం కలిగి యుంటున్నాము.

పునరుత్థానుడైన ప్రభువు గురించి ప్రవచనాలు

20:26 ఒక వారము తర్వాత ప్రభువు మరల శిష్యులకు కన్పించాడు. ఈ సమయ ములో తోమాకూడా ఉన్నాడు. మరల యేసు అద్భుతరీతిగా గదిలో ప్రవేశించి అంతకు
ముందువలెనే ‘మీకు సమాధానము కలుగును గాక’ అంటూ వారిని పలుకరించాడు.

20:27 సందేహించిన తోమాతో ప్రభువు ఎంతో మృదువుగాను, సహనంతోను వ్యవహరించాడు. తన ప్రక్కలోని బల్లెపు గాయములో అతని చేతిని ఉంచడంద్వారా తన పునరుత్థానముయొక్క వాస్తవికతను ఋజువుపరచడానికి ప్రభువు అతనిని ఆహ్వా నించాడు.

20:28 తోమా ఒప్పించబడ్డాడు. ప్రభువు ప్రక్కలో అతడు తన చేతిని ఉంచి చూశాడా లేదా అనేది మనకు తెలియదు. కాని యేసు తిరిగిలేచాడని, ఆయనే ప్రభువు మరియు దేవుడు అని చివరకు అతడు తెలుసుకున్నాడు.

20:29 దేవునిగా ఆరాధించబడటాన్ని యేసు అంగీకరించడము ఇక్కడ గమనిం చండి. ఆయన కేవలం మానవుడే అయితే, ఆయన ఆరాధించబడటాన్ని నిరాకరించాల్సి ఉంటుంది. ఇక్కడ తోమా చూపిన విశ్వాసము ప్రభువుకు అంతగా ప్రీతికరమైనదిగా లేదు. అది చూడటంమీద ఆధారపడిన విశ్వాసము. ఎన్నడూ చూడనప్పటికీ

విశ్వసించువారు మరి ధన్యులు.
యోహాను సువార్తయొక్క ఉద్దేశ్యము (20:30,31)

20:30 యేసు చేసిన సూచక క్రియలన్నీ యోహాను సువార్తలో గ్రంథస్థము చేయబడలేదు.

20:30 యేసు చేసిన సూచక క్రియలన్నీ యోహాను సువార్తలో గ్రంథస్థము చేయబడలేదు. ఏవైతే తన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలవో వాటినే పరిశు త దేవుడు ఎన్నుకొని వ్రాయించాడు.

20:31 యోహాను ఈ పుస్తకం వ్రాయడంలోని తన ఉద్దేశ్యాన్ని ఇప్పుడు చెబు తున్నాడు. దీనిని చదువువారు, యేసు నిజమైన మెస్సీయా అనియు మరియు దేవుని కుమారుడనియు విశ్వసించునట్లుగా ఇది వ్రాయబడింది. విశ్వసించువారు ఆయన ద్వారా నిత్యజీవమును పొందెదరు. ప్రియ చదువరీ నీవు విశ్వసించావా?

 

రక్షకుని మరణము – Bible Verses Chapter 19 in Telugu

పందొమ్మిదవ అధ్యాయము

రక్షకుని మరణము

నిర్దోషి దోషిగా తీర్పు తీర్చబడుట (19:1-16) :

19:1 నిరపరాధియైన ఒక వ్యక్తిని పిలాతు కొరడాలతో కొట్టించడం అనేది చాలా అన్యాయం. ఇలా శిక్షిస్తే యూదులు సంతృప్తిపడి, యేసు మరణాన్ని కోరుకొనరని బహుశ పిలాతు తలంచియుంటాడు. కొరడాలతో కొట్టించడం రోమా వారు శిక్షించే విధానము.

ఖైదీలను కొరడాతోగాని లేక బెత్తముతోగాని కొడతారు. ఈ కొరడాల చివర లోహపు ముక్కలుగాని, ఎముక ముక్కలుగాని ఉంటాయి. ఇవి శరీరముపై లోతైన గాయాలు చేస్తాయి.

19:2 తాను రాజునని చెప్పిన యేసును సైనికులు అపహసించారు. రాజు అయితే కిరీటం ఉండాలి కదా! అందుచే ముండ్లతో ఒక కిరీటమల్లి వారు దానిని ఆయన తలపై పెట్టారు. ఆ ముండ్లు నుదుటిలోనికి గ్రుచ్చబడుచున్నప్పుడు భయంకరమైన నొప్పి ఉంటుంది.

పాపము మానవజాతికి తెచ్చిన శాపమునకు ఈ ముండ్లు గుర్తుగా ఉన్నవి. మనకు విమోచనము కలుగునట్లుగా మన పాపములయొక్క శాపమును ఆయన భరించుట’ అనే చిత్రపటమును ఇచ్చట మనము చూస్తున్నాము. మనము మహిమాకిరీటమును ధరించవలెనని కోరి ఆయన ముండ్ల కిరీటమును ధరించాడు.

రక్షకుని మరణము నిర్దోషి దోషిగా తీర్పు తీర్చబడుట (19:1-16) :

ఊదారంగు వస్త్రమునుకూడా అపహసించడంకోసమే ఆయనకు తొడిగించారు. ఊదారంగు రాజత్వమునకు గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క నీతి వస్త్రమును మనము ధరించులాగున మన పాపములన్నియు యేసుపై మోపబడినవి.

19:3 దేవుడు తన చేతులతో సృష్టించుకొనిన మానవులు అరచేతులు, దేవునియొక్క నిత్యత్వపు కుమారుడైన యేసును కొట్టడానికి మరియు వారి నోరులు ఆయనను అపహసించడానికి ఉపయోగించబడటం అనేది ఎంత శోచనీయం!

19:4 పిలాతు మరల వెలుపలకు (యూదుల యొద్దకు వచ్చి ఈయనయందు నాకు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీ తీసికొని వచ్చుచున్నానని వారితో చెప్పాడు. ఈ విధంగా పిలాతు తన మాటలచేతనే తననుతాను దోషిగా తీర్చుకొనుచున్నాడు. అతడు క్రీస్తునందు ఏ దోషమును కనుగొనలేదు. కానీ అతడు ఆయనను విడుదల చేయలేదు.

Read and Learn More Telugu Bible Verses

19:5 ఆ ముండ్ల కిరీటమును, ఊదారంగు వస్త్రమును ధరించినవాడై యేసు వెలుపలికి రాగా పిలాతు – ‘ఇదిగో ఈ మనుష్యుడు’ అని వారితో చెప్పాడు. అతడీ మాటను ఎగతాళిగా అన్నాడో, సానుభూతితో అన్నాడో లేక ఒక ప్రత్యేకమైన భావోద్రేకంతో కాక మామూలుగా అన్నాడో తెలుసుకోవడం కష్టం.

19:6 పిలాతు ఈవిధంగా భిన్న తలంపులమధ్య తడబడడం గమనించిన ప్రధాన యాజకులు – యేసును సిలువవేయుమని పెద్దగా కేకలు వేశారు. రక్షకుని మరణం విషయంలో నాయకత్వం వహించినది ఈ మతాధికారులే.

రక్షకుని మరణము – Bible Verses Chapter 19 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

తరచుగా చర్చి అధికారులే నిజవిశ్వాసులను హింసలకు గురిచేస్తూ ఉండటమనేది శతాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది. పిలాతు వారితోను, యేసుపట్ల వారికిగల నిష్కారణమైన ద్వేషముతోను విసుగుచెందినవాడై ‘ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు.

కనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని’ వారితో చెప్పాడు. అయితే తన అనుమతి లేనిదే వారు యేసుకు మరణశిక్ష అమలు చేయలేరని అతనికి తెలుసు.

19:7 కైసరు ప్రభుత్వమునకు యేసు ఒక ఆటంకముగా ఉన్నాడు’ – అని ఋజువు పరచడంలో విఫలులైన యూదులు ఇప్పుడు ఆయనపై తాము మోపిన మతసంబంధ మైన నేరమును ముందుకు తీసికొని వస్తున్నారు.

క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకోవడంద్వారా తననుతాను దేవునితో సమానునిగా ఎంచుకున్నాడు. యూదులకు ఇది దేవదూషణ నేరమవుతుంది. మరియు అట్టి నేరానికి మరణశిక్ష విధించాల్సి ఉంది.

19:8 యేసు నిజముగా దేవుని కుమారుడా? కాదా? అనే విషయం పిలాతును కలవర పెట్టింది ఇప్పటికే జరుగుతున్న వ్యవహారముతో గందరగోళ స్థితిలో నున్న పిలాతును ఈ విషయం మరింత భయానికి గురిచేసింది.

19:9 అతడు యేసును అధికార మందిరములోనికి తీసికొని వెళ్ళి “నీవెవరవు? ఎక్కడినుండి వచ్చావు?” అని ఆయనను ప్రశ్నించాడు. పిలాతు ఒక విషాదకరమైన వ్యక్తి. యేసు ఏ పాపమును చేయలేదని అతడు ఒప్పుకున్నాడు.

కానీ అతడు యూదులకు భయపడటంవల్ల యేసును విడుదలచేసే నైతిక ధైర్యం అతనికి లేకుండా పోయింది. యేసు అతనికి ఏ జవాబును ఇవ్వలేదు. పిలాతు తనకు ‘ఒప్పు’ అని తెలిసినదానిని చేయడానికి అయిష్టంగా ఉన్నాడు అనే విషయం ఆయనకు తెలుసు.

తన అవకాశదినాన్ని దుర్వినియోగపరచుకొని పిలాతు పాపం చేశాడు. అవకాశం ఇవ్వబడినపుడు సరియైన విధంగా స్పందించని అతనికి ఇక అవకాశం ఇవ్వబడదు.

19:10 యేసును భయపెట్టి, బలవంతముగా ఆయనచేత జవాబు చెప్పించడానికి పిలాతు ప్రయత్నించాడు. ఒక రోమా గవర్నరుగా ఆయనను విడుదల చేయుటకును, సిలువ వేయుటకును తనకు అధికారము కలదని అతడు యేసుకు జ్ఞాపకం చేశాడు.

19:11. యేసుప్రభువుయొక్క ఇంద్రియ నిగ్రహము ఎంతో అసాధారణమైనది. ఆయన పిలాతుకంటె ఎంతో ప్రశాంతముగా ఉన్నాడు. ‘పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు’ అని ఆయన పిలాతుకు సమాధానమిచ్చాడు.

ప్రభుత్వములన్నియు దేవునిచేతనే నియమించబడినవి. అధికార ములన్నియు – అవి ఇహలోక సంబంధమైనవిగాని, ఆత్మ సంబంధమైనవి గాని అన్నియు దేవునినుండి కలిగినవే. ‘నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు’ అని యేసు చెప్పాడు.

ఈ మాట, ప్రధానయాజకుడైన కయపను గూర్చి గాని ద్రోహియైన యూదానుగూర్చిగాని లేక యూదులందరినిగూర్చిగాని ఆయన చెప్పి యుండవచ్చును. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే యూదులకు సమస్తము తెలుసు. మెస్సీయా రాకనుగూర్చి ముందుగానే ప్రవచించబడిన లేఖనములు వారికున్నాయి.

19:10 యేసును భయపెట్టి, బలవంతముగా ఆయనచేత జవాబు చెప్పించడానికి పిలాతు ప్రయత్నించాడు.

ఆయన వచ్చినప్పుడు వారాయనను గుర్తించాల్సివుంది. కానీ వారు ఆయనను తృణీకరించారు. అంతేకాక ఇప్పుడు ఆయన ప్రాణం కోసం వారు కేకలు వేస్తున్నారు. ‘అపరాధము’లో స్థాయిలున్నాయని ఈ వచనము మనకు బోధించుచున్నది, పిలాతు అపరాధి కానీ కయప, యూదా మరియు దుష్టులైన యూదులు – వీరందరూ మరి ఎక్కువగా అపరాధులు.

19:12 యేసును విడుదల చేయుటకు అప్పుడే పిలాతు తన మనస్సును స్థిర పరచుకొనుచుండగా, యూదులు తమ బలమైన చివరి అస్త్రాన్ని సంధించారు. రోమా సామ్రాజ్యాధిపతియెడల తమకేదో శ్రద్ధ ఉన్నట్లుగా – “నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు” అని వారు పిలాతుతో అన్నారు.

వాస్తవానికి కైసరు అంటే వారికి అసహ్యం. వారికి సాధ్యమయితే వారు అతనిని కూలద్రోసి అతని స్వాధీనమునుండి స్వతంత్రులవ్వగలిగేవారే. కానీ ఇప్పుడు తననుతాను రాజునని చెప్పుకొనుచున్న ‘యేసు’ యొక్క బెదిరింపునుండి కైసరు సామ్రాజ్యాన్ని రక్షించుచున్నట్లు వారు నటించుచున్నారు.

తమయొక్క ఈ వేషధారణకు తగిన శిక్షను క్రీ.శ. 70వ సంవత్సరములో యూదులు అనుభవించారు. ఆ సంవత్సరములో రోమీయులు యెరూషలేములో ప్రవేశించి పట్టణాన్ని సర్వనాశనం చేసి అందులో నివసించుచున్న యూదులనందరినీ హతము చేశారు.

19:13 ‘కైసరుయెడల రాజభక్తి లేదు’ అని యూదులు వేస్తున్న నిందకు తల ఒగ్గడం ఇష్టం లేక పిలాతు ఆ అల్లరి గుంపుకు లొంగిపోయి యేసును బయటకు తీసికొని వచ్చి రాళ్ళుపరచిన స్థలమందు నిలబెట్టినాడు. ఆ స్థలమునకు హెబ్రీ భాషలో ‘గబ్బతా’ అని పేరు.

19:14 అంతకు ముందటిరోజు సాయంత్రం పస్కా విందు జరిగినది. ఈ వచన ములో ప్రస్తావించబడిన ‘పస్కాను సిద్ధపరచు దినము’ అనునది అటుతరువాత జరుగ బోవు విందుకు సిద్ధపడుటను సూచిస్తూ ఉంది.

‘అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను’. మార్కు తన సువార్తలో – అది పగలు తొమ్మిది గంటల సమయము అని వ్రాశాడు. (మార్కు 15:25). సమయం చెప్పే విషయంలో బహుశ మార్కు యూదుల పద్ధతిని, యోహాను రోమనుల పద్ధతిని అనుసరించియుండవచ్చు.

యూదుల కోపమును రేపుటకు పిలాతు యేసును తీసికొనివచ్చి ఇదిగో మీ రాజు అని వారితో చెప్పాడు. తాను యేసును శిక్షించవలసి వచ్చేలా తనను ఇరికించి నందుకు అతడు నిస్సందేహంగా వారినే తప్పుబట్టాడు.

19:15 యేసును సిలువవేయవలెనని యూదులు పట్టుబట్టారు. ‘మీ రాజును మీరే సిలువవేయుమని కోరుతున్నారా? అని పిలాతు వారిని సూటిగా ప్రశ్నించాడు. అందుకు యూదులు ఎంతో నీచస్థితికి దిగజారినవారై కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు’ అన్నారు.

వీరిచ్చిన ఈ జవాబు ఆదికాండము 49:10 వచనమునకు చక్కని నెరవేర్పుగా ఉన్నది. ఆ వచనములో ఇలా ఉన్నది – “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు.” వారు ఒప్పుకొనిన దానినిబట్టి దండము లేక ప్రభుత్వము దేశమునుండి తొలగిపోయినది.

కాని వారి మాటలు షిలోహు అనగా విశ్రాంతి నిచ్చువాడు (Rest-giver) వచ్చియున్నాడనికూడా ఋజువుపరచు చున్నవి. అయితే ఆయన వచ్చియున్నాడనే విషయాన్ని వారు నమ్మడానికి నిరాక రిస్తున్నారు. ‘కైసరు తప్ప మాకు వేరొక రాజులేడు’ అని వారు కేకలు వేశారు. ఎంతటి విశ్వాస ఘాతకమైన జనము!

19:16 యూదులను శాంతింపజేయవలెనని కోరిన పిలాతు, సిలువవేయబడుటకై యేసును సైనికులకు అప్పగించాడు. దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును అతడు ఎక్కువగా ప్రేమించాడు.

“షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు.”

ప్రభువైన యేసు సిలువవేయబడుట (19:17-24) :

19:17 సిలువ – ఒకే కొయ్యతో చేయబడియుండవచ్చు లేదా రెండు వేరు వేరు కొయ్యలతో చేయబడియుండవచ్చు. ఒక మనుష్యుడు మోయగలిగిన పరిమాణము దానికుంటుంది. యేసు కొంత దూరము వరకు తన స్వంత సిలువను మోసికొని వెళ్ళాడు.

తరువాత కురేనీయుడగు సీమోను అను వ్యక్తిచే వారు ఆ సిలువను కొంత దూరము మోయించినట్లుగా మిగిలిన సువార్తల వలన తెలియుచున్నది. యేసు సిలువ వేయబడిన స్థలము ‘కపాల స్థలము’ అని పిలువబడుటకు క్రింది కారణములలో ఏదో ఒకటి అయివుండుటకు అవకాశముంది, అందులో మొదటిది నేరస్థులకు మరణశిక్ష అమలు జరుపుతారు.

కాబట్టి బహుశ ఈ ప్రదేశములో కపాలములు, ఎముకలు ఎక్కువగా ఉండియుండవచ్చు. రెండవది ఈ స్థలము ‘కపాలము’ ఆకారమును పోలియుండవచ్చు. ముఖ్యంగా అది గుహలు కలిగినకొండ అయితే ఆ విధముగా ఉండుటకు అవకాశముంది.

రక్షకుని మరణము Bible Verses Chapter 19

19:18 ప్రభువైన యేసు తన చేతులలోను, కాళ్ళలోను మేకులతో సిలువకు కొట్ట బడ్డాడు. అప్పుడు ఆ సిలువను పైకిలేపి దానిని ఒక గుంటలోనికి దించి నిలబెట్టారు. ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఇద్దరు దొంగలు ఆయనతో కూడ సిలువవేయబడ్డారు.

“అతడు అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను” అను యెషయా 53:12 లోని ప్రవచనమునకు ఇది నెరవేర్పుగా ఉన్నది. ప్రియ స్నేహితుడా! నీవు ఇంకను ఆయనను రక్షకునిగాను, ప్రభువుగాను విశ్వసించనట్లయితే, ఆయన ఏవిధంగా నీకోసం మరణించాడో వివరిస్తున్న ఈ భాగమును నీవు చదువు చుండగా ఇప్పుడే నీవు ఆయనను అంగీకరిస్తావా?

19:19 సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేమిటో బాహాటముగా అందరికి తెలియునట్లు ఒక పత్రముపై వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టించు ఒక ఆచారము కలదు. కాబట్టి పిలాతు – ‘యూదులు రాజైన నజరేయుడగు యేసు’అను పై విలాసము వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా (లాటిన్) భాషలలో వ్రాయబడినది.

19:20 హెబ్రీ, గ్రీకు, లాటిన్-ఈ మూడు భాషలూ మూడు జాతులను మరియు వారి భావాలైన – ప్రత్యక్షత, కళ, సాహిత్యము, అభివృద్ధి, యుద్ధము మరియు ధర్మశాస్త్రము అనువాటిని తెలియజేస్తున్నాయి.

ఎక్కడయితే మానవజాతియొక్క ఈ మూడు రకముల కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుదో, చదవడానికి కన్ను ఉంటుందో – అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగియుంటుంది.

‘యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై యుండెను’ అని వ్రాయబడినది. పట్టణ సరిహద్దులకు బయట ప్రభువైన యేసు సిలువవేయబడినాడు, స్థలం కచ్చితంగా ఎక్కడుందో ఇప్పటివరకు నిర్ధిష్టంగా తెలియబడలేదు.

19:21 పిలాతు పై విలాసమును ఆవిధంగా వ్రాయించడం ప్రధానయాజకులకు నచ్చలేదు. ‘యూదులరాజు’ అని కాక యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయ వలెనని వారు కోరిరి.

19:22 వ్రాయబడినదానిని మార్చుటకు పిలాతు నిరాకరించాడు. వారి విషయంలో సహనం కోల్పోయిన పిలాతు ఇకపై వారి మాటలకు ఏమాత్రం లొంగిపోదలచుకోలేదు. కానీ ఇట్టి ‘నిశ్చయత’ను అతడు అంతకుముందే కనుపరచవలసింది!

19:23 ఈ విధమైన మరణదండన అమలు చేసేటప్పుడు చనిపోయినవారికి చెందిన వస్తువులను సైనికులు తమలోతాము వాటిని పంచుకొనవచ్చును. ఇక్కడ క్రీస్తుయొక్క వస్త్రములను వీరు పంచుకోవడం మనం చూస్తాము.

అవి ఐదు భాగాలు, వారు నాలుగు భాగాలను పంచుకొన్నారు. మిగిలిన అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది. గనుక దానిని చించుటకు సాధ్యపడలేదు.

19:24 కావున వారు దానికోసము చీట్లువేసి చీటివచ్చినవానికి దానిని అప్ప గించారు. దానిని పొందినవాని పేరేమిటో ఇచ్చట వ్రాయబడలేదు. వారీలాగు చేయుచున్నప్పుడు 1000 సంవత్సరములకు పూర్వము వ్రాయబడిన ప్రవచనమును (కీర్తన 22:18) వారు నెరవేర్చుచున్నారనే విషయము వారికి తెలియలేదు.

ఈ విధముగా నెరవేరిన ప్రవచనములు – ఈ గ్రంథము దేవునిచే ప్రేరేపింపబడి వ్రాయ బడినదనియు మరియు యేసుక్రీస్తే వాగ్దానము చేయబడిన నిజమైన మెస్సీయా అనియు తిరిగి మనకు ఒక నూతనమైన రీతిలో జ్ఞాపకము చేస్తున్నాయి.

19:25 యేసు తన తల్లిని యోహానుకు అప్పగించుట (19:25 – 27) : ఈ వచనములో నలుగురు స్త్రీలున్నారు. వారు – యేసు తల్లియైన మరియు, మరియ సహోదరియు – యోహాను తల్లియునగు సలోమే, క్లోపా భార్యయైన మరియ మరియు మగ్దలేనే మరియ.

19:26 తాను ఎంతో వేదనను అనుభవించుచున్నప్పటికీ ప్రభువు ఇతరులపట్ల కనికరయుతమైన శ్రద్ధను కలిగియున్నాడు. ఆయన తన తల్లిని, శిష్యుడైన యోహానును చూచి ఇకపై తన తల్లిపట్ల కుమారుని బాధ్యతను నిర్వర్తించుమని యోహానుకు చెప్పాడు.

తన తల్లిని ‘అమ్మా’ నీ కుమారునిగా ఇతనిని స్వీకరించుమని ఆమెతో చెప్పాడు. (మూలభాషలో ‘woman’ – స్త్రీ అని ఉంది అలా సంబోధించడంలో ప్రభువు ఏవిధంగానూ అగౌరవమును చూపలేదు. ఆమెను ‘అమ్మా’ (తల్లి) అని ఆయన పిలువలేదు. మరియను హెచ్చించి ఆరాధించుటకు శోధింపబడే వారికి ఇది కచ్చితంగా ఒక పాఠమే).

19:27 మరియను తన స్వంత తల్లిగా భావించి ఆదరించుమని యేసు యోహానుతో చెప్పాడు. యోహాను ఆ మాటకు విధేయుడై మరియను తన యింటికి తీసికొని వెళ్ళాడు.
రక్షకుని మరణం (19:28-30)

అవి ఐదు భాగాలు, వారు నాలుగు భాగాలను పంచుకొన్నారు. మిగిలిన అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది.

19:28 మధ్యాహ్నం 12 గంటలనుండి సాయంత్రం 3 గంటలవరకు మూడు గంటలు దేశమంతట చీకటి కమ్మియుండటం బహుశ 27 మరియు 28 వచనముల మధ్యలో సంభవించియుండవచ్చు. ఈ సమయంలోనే ఆయన దేవునిచేత విడువబడి మన పాపములకొరకైన శిక్షను భరించాడు.

‘నేను దప్పిగొనుచున్నాను’ అను ఆయన కేక, సిలువవేయబడి యుండటంద్వారా అధికమైన, నిజమైన, శరీర సంబంధమైన దప్పికను సూచిస్తూ ఉంది. ఈ శరీర సంబంధమైన దప్పికకంటేకూడా, మానవుల ఆత్మల రక్షణకొరకైన ఆయన దప్పిక ఇంకా గొప్పదనికూడా ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.

19:29 ఆయన త్రాగుటకు సైనికులు చిరకను ఇచ్చారు. వారు ఒక స్పంజీని చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి దానిని ఆయన నోటికి అందించారు. (హిస్సోపు అనునది ఒక మొక్క) దీనిని పస్కాదినమున ఉపయోగించారు. (నిర్గమ 12:22).

దీనికి ముందు చేదు కలిపిన ద్రాక్షారసమును సైనికులు ఆయనకు త్రాగనిచ్చిన సందర్భమును (మత్తయి 27:34) మరియు ఈ సందర్భమును ఒకటి కాదు. చేదుకలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఆయన నిరాకరించాడు, ఎందుకంటే నొప్పిని తగ్గించు మందుగా దానిని ఇస్తారు. కాని మన పాపములకు తగిన శిక్షను ఆయన సంపూర్ణముగా భరించాల్సివుంది.

19:30 ‘సమాప్తమైనది’ అని చివరకు ప్రభువు కేకవేశాడు. ఆయన తండ్రి ఆయన కప్పగించిన పని సంపూర్ణముగా నెరవేరింది! మన పాపములకు పరిహారముగా ఆయన తనప్రాణమును ధారపోశాడు.

విమోచన కార్యము మరియు మన పాపములకు ప్రాయశ్చిత్తము సంపూర్తి చేయబడింది. ఆయన ఇంకా మరణించలేదనేది వాస్తవమే కాని ఆయన మరణము, సమాధి చేయబడటం, ఆరోహణం అనేవి – అవి అప్పటికే నెరవేర్చబడ్డాయి అన్నంత నిశ్చయమైనవి.

కాబట్టే పాపులు రక్షింపబడునట్లుగా ద్వారము తెరువబడినదని ప్రభువు ప్రకటించాడు. కల్వరి సిలువలో ప్రభువైన యేసు సంపూర్తి చేసిన కార్యమునకై దేవునికి స్తోత్రములు! ‘ఆయన తలవంచి …’ అని మనము చదువుతాము, అనగా ఆయన తన తలను వెనుకకు వాల్చాడని కొందరు చెబుతారు.

వైన్ ఇలా అంటారు “చనిపోయిన తర్వాత నిస్సహాయంగా తలను వాల్చడం కాదుగాని ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే తన తలను అలా విశ్రాంతి స్థితిలో ఉంచాడు.” ‘ఆయన తన ఆత్మను అప్పగించెను. అనగా ఆయన మరణం స్వేచ్ఛా పూర్వకమైనది. అంటే తన ఇష్టపూర్వకంగానే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తాను మరణిం చాల్సిన సమయాన్ని ఆయనే నిర్ణయించాడు.

రక్షకుడు ఈటెతో ప్రక్కలో పొడువబడుట (19:31-37) :

19:31 తమ మెస్సీయాను చంపుతూ ఉన్నప్పుడుకూడా ఈ మతాసక్తి గలిగిన యూదులు ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నారో మరల మనము ఇక్కడ చూస్తున్నాము. విశ్రాంతి దినమున (శనివారం) ఆ దేహములను సిలువపైనే ఉంచ కూడదు.

మరుసటి దినము పట్టణంలో మతసంబంధమైన విందు జరగబోతూ ఉంది గనుక నేరస్థులు త్వరగా మరణించులాగున వారి కాళ్ళు విరుగగొట్టించుమని వారు పిలాతుకు మనవి చేశారు.

19:32 కాళ్ళు ఎలా విరుగగొట్టేవారో అది మనకు చెప్పబడలేదు. ఒకచోట విరుగ గొట్టినంతమాత్రాన మరణం సంభవించదు – కాబట్టి అనేకచోట్ల వారి ఎముకలు విరుగగొట్టాల్సి ఉంది. ఇటువంటి విషయాల్లో సైనికులకు ఎంతో అనుభవం ఉండి ఉంటుంది.

19:33 యేసు అప్పటికే మరణించాడని వారు కనుగొన్నారు. ‘ఆయన సొమ్మసిల్లి యుండటంవల్ల వారు ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు’ అని చెప్పుటకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఆయన మరణించియుండటం వారు చూచారు.

19:34 “సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్ళును కారెను” – బహుశ ఇది దుష్టత్వము అంతిమముగా బహిర్గత మవడమై డవచ్చును.
రక్తము మరియు నీరు అనువాటియొక్క భావమును గూర్చిన సరైన ఏకీభావము లేదు.

బ్రద్దలయిన హృదయంతో యేసు మరణించాడు అనుదానికి ఒక సూచనగా కొందరు దీనిని భావిస్తారు. కాని ‘ఆయన మరణము అనునది తనకు తానే ఇష్ట పూర్వకంగా అప్పగించుకొనినది’ అని మనము ఇంతకుముందే చదివాము.

రక్షకుడు ఈటెతో ప్రక్కలో పొడువబడుట (19:31-37) :

మరి కొందరు ఇది బాప్తిస్మమునుగూర్చి మరియు ప్రభురాత్రి భోజనమునుగూర్చి చెప్పు చున్నదని భావిస్తారు. కాని ఇది లేనిపోని అర్థం కల్పించినట్లుగా ఉంది. పాపము వలన కలిగే అపరాధ భావననుండి కడుగబడటం అనే సందర్భంలో ‘రక్తము’ మరియు పాపముయొక్క అపవిత్రతనుండి వాక్యముద్వారా శుద్ధిచేయబడడం అనే సందర్భంలో ‘నీరు’ సూచనగా ఉన్నాయి.

19:35 ఈ వచనము – యేసుయొక్క కాళ్ళు విరుగగొట్టబడలేదను వాస్తవమును గూర్చిగాని, యేసు తన ప్రక్కలో పొడవబడుటను గూర్చిగాని లేదా సిలువమరణ సంభవ మంతటినిగూర్చిగాని సూచిస్తూ ఉండవచ్చు.

“ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చు చున్నాడు” అను ఈ మాటలు ఈ వృత్తాంతమును వ్రాసిన యోహానును సూచించు చున్నవనుటలో సందేహము లేదు.

19:36 నిర్గమ 2:46 లోని “దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు” అను ప్రవచనమునకు నెరవేర్పు అని ఈ వచనము జ్ఞాపకంచేస్తూ ఉంది. (33వ వచనము గమనించండి).

ఆ ప్రవచనము పస్కా గొర్రెపిల్లను సూచిస్తుంది. ఎముకలను విరువకూడదు అనునది దేవుని ఆజ్ఞ. ఈ మాదిరి అంతయు క్రీస్తులో సంపూర్తిగా నెరవేర్చబడింది కాబట్టి ఆయనే నిజమైన పస్కా గొర్రెపిల్ల.

19:37 34వ వచనములో జరిగిన దానిని ఈ వచనం జ్ఞాపకముచేస్తూ ఉంది. ఆ సైనికునికి ఏమీ అర్థం కానప్పటికీ, అతడు చేసినది జెకర్యా 12:10 లోని ప్రవచ నమునకు నెరవేర్పుగా ఉన్నది. ఈ ప్రవచనము – భవిష్యత్తులో ఒకానొక దినమున ప్రభువు తిరిగి వచ్చునప్పుడు యూదులు చూస్తారు అన్న విషయాన్నికూడా సూచిస్తూ ఉంది.

“వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లును, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు” (జెకర్యా 12:10).

యేసు పాతిపెట్టబడుట (19:38-42) :

19:38 ఇప్పుడు యేసు పాతిపెట్టబడిన వృత్తాంతము మొదలవుతూ ఉంది. ఇప్పటివరకు అరిమతయియ యోసేపు ఒక రహస్య విశ్వాసిగానే ఉన్నాడు. అతడు క్రీస్తును బహిరంగముగా ఒప్పుకొనకుండా యూదులవలని భయము అతన్ని పట్టి ఉంచింది.

అయితే ఇప్పుడు ప్రభువు దేహమును పాతిపెట్టుటకై సెలవడుగుటకు అతడు ధైర్యముగా అడుగు ముందుకు వేశాడు. ఈ విధముగా చేయడంద్వారా వెలి వేయబడటానికి, హింసించబడటానికి మరియు దౌర్జన్యము చేయబడటానికి అతడు తననుతాను అప్పగించుకున్నాడు.

అయితే యేసు జీవించియున్న కాలములో తృణీక రించబడిన బోధకునిగా నెంచబడిన ఆయన కోసం అతడు నిలబడలేకపోవడమే. బాధాకరమైన విషయం.

యేసు పాతిపెట్టబడుట (19:38-42) :

19:39 నీకొదేము కూడావచ్చి అరిమతయియ యోసేపుతో కలవడం మనము ఇక్కడ చూస్తున్నాము. 3వ అధ్యాయములో అతడు రాత్రివేళ యేసునొద్దకు వచ్చినట్లు గాను మరియు 7వ అధ్యాయములో సన్హెడ్రిన్ సభయెదుట యేసు చెప్పుచున్న దానిని వినిన తరువాతనే ఆయనకు తీర్పు తీర్చవలెనని పట్టుబట్టినట్లుగాను మనము ఈ నీకొదేమును గూర్చి చదివాము.

అతడు బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్లయెత్తు తీసికొని వచ్చాడు.

19:40 బహుశ ఈ సుగంధ ద్రవ్యములు దేహమునకు పూయుటకు వీలుగా మెత్తని పొడి రూపంలో ఉండియుండవచ్చును. దానిని పూసిన తరువాత యేసు దేహమునకు నారబట్టలు చుట్టారు.

19:41 దాదాపుగా ప్రతివిషయము ప్రవచనముల నెరవేర్పుగా నున్నది. “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను” (యెషయా 53:9) అని యెషయా ముందుగానే ప్రవచించాడు.

ఒక తోటలోని సమాధి అంటే అది కచ్చితముగా ఒక ధనవంతునికి చెందినదై యుండాలి. ఈ సమాధి అరిమతయియ యెసేపుకు చెందినదని మత్తయి సువార్తద్వారా మనకు తెలుస్తుంది.

19:42 యేసు దేహము ఆ సమాధిలో ఉంచబడినది. ఆ సాయంత్రం ప్రారంభం కాబోవుచున్న తమ విందుకు ఆటంకం కలుగకుండవలెనని యేసు దేహమును సిలువపైనుండి దించుటకు యూదులు ఆతృతపడ్డారు. కాని యేసు దేహము మూడు పగళ్ళు, మూడు రాత్రులు ఈ భూమియొక్క కేంద్రభాగములో ఉంచబడటం ఇదంతయు దేవుని ప్రణాళికలో ఒక భాగమైయున్నది.

యూదుల లెక్కల ప్రకారము ఒకదినములోని ఏ భాగమయినా అది ఒక పూర్తి దినముగా లెక్కించబడుతుంది. కాబట్టి ప్రభువు మూడు దినములు సమాధిలో ఉంచబడినాడనే వాస్తవం మత్తయి

12:40 లో ఆయన ముందుగా ప్రవచించినదానికి నెరవేర్పుగా ఉన్నది.

కల్వరివైపుకు పయనము – Bible Verses Chapter 18 in Telugu

పదునెనిమిదవ అధ్యాయము

కల్వరివైపుకు పయనము

యూదా యేసును అప్పగించుట (18:1-11) :

18:1 యోహాను సువార్త 13 నుండి 17 అధ్యాయములలోని మాటలు – యేసుక్రీస్తు యెరూషలేములో ఉండగా మాట్లాడినవి. ఇప్పుడు ప్రభువు యెరూషలేము పట్టణమును విడిచి తూర్పుగానున్న ఒలీవల కొండవైపుకు వెళ్ళుచున్నాడు, ఆయన కెద్రోను వాగును దాటి ఒలీవల కొండకు పడమటి వాలున ఉన్న గెత్సెమనే తోటలోనికి వచ్చాడు.

18:2 ప్రభువు ఆ తోటలో అనేకసార్లు ప్రార్థనలో గడపడం యూదాకు తెలుసు, ప్రభువును కనుగొనుటకు అవకాశం హెచ్చుగానున్న స్థలము – ఆయన ప్రార్ధనా స్థలమే అనికూడ అతనికి తెలుసు. కావున సైనికులను, ప్రధాన యాజకులు – పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని అతడు గెత్సెమనే తోటకు వచ్చాడు.

18:3 ఈ సైనికులు బహుశా రోమా సైనికులై యుండవచ్చును. బంట్రౌతులు అనగా ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపగా వచ్చిన ఉద్యోగులు, వారు దివిటీలతోను, దీపములతోను, ఆయుధములతోను వచ్చారు. లోకమునకు వెలుగైయున్న వానిని వెదకడం కోసం వారు దివిటీలు తీసికొని వచ్చారు!

18:4 వారు తనను కనుగొనేంతవరకు వేచియుండక, ప్రభువే వారిని కలుసు కునేందుకు వచ్చాడు. ఇది సిలువకు తనను తాను అప్పగించుకోవడంలోని తన అంగీకారమును వెల్లడిచేస్తూ ఉంది. సైనికులు తమతో ఆయుధాలేమీ తీసికొని రాక పోయినా రక్షకుడు వారిని ఏ మాత్రం ప్రతిఘటించేవాడు కాదు.

Read and Learn More Telugu Bible Verses

‘మీరెవరిని వెదకు చున్నారు?’ అని ఆయన ప్రశ్నించాడు. వారు ఏ పని నిమిత్తమై వచ్చారో దానిని వారి పెదవులతోనే చెప్పించడమే ఈ ప్రశ్న వేయడంలోని ఉద్దేశ్యం.

18:5 ‘ఆయన వారి సృష్టికర్త, వారిని పోషించి కాపాడువాడు మరియు వారు అంతకు ముందెన్నడూ కలిగియుండని మంచి స్నేహితుడు’ అనే గ్రహింపులేనివారై నజరేయుడైన యేసును పట్టుకొనుటకు వారు వెదకిరి. “నేనే” (I AM) అని యేసు పలికెను. ఆయన నజరేతుకు చెందిన యేసే.

కల్వరివైపుకు పయనము – Bible Verses Chapter 18 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

అయితే ఆయన యెహోవా కూడా ‘నేను ఉన్నవాడు’ (I AM) అనునది పాత నిబంధనలో యెహోవాకున్న పేర్లలో ఒకటి, ఆ సమూహంలోని ఇతరులతోకూడా యూదా నిలువబడియున్నప్పుడు, ఇది అతడు క్రొత్తగా ఆశ్చర్యపడేలా చేసిందా?

18:6 ఒక్కక్షణం యేసు తనను తాను సర్వశక్తిమంతుడైన దేవుడగు ‘నేనే’ (I AM) గా వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ప్రత్యక్షత ఎంత శక్తిగలదిగా ఉన్నదంటే, వారు వెనుకకు తగ్గి నేలమీద పడిపోయారు.

కల్వరివైపుకు పయనము యూదా యేసును అప్పగించుట (18:1-11) :

18:7 మరల ప్రభువు – మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని ప్రశ్నించాడు. అంతకుముందే యేసుయొక్క (I AM) రెండు మాటలూ వారిమీద ఎంతో ప్రభావం చూపినప్పటికీ మరలా వారు అదే సమాధానం ఇచ్చారు.

18:8 వారు వెదుకుచున్న వ్యక్తి తానే అనియు మరియు తానే యెహోవా అనియు యేసు మరియొకసారి వారితో చెప్పెను. “నేనే ఆయననని మీతో చెప్పితిని. మీరు వెదకుచున్నది నా కోసమే గనుక శిష్యులను పోనియ్యుడని” యేసు వారితో చెప్పాడు.

తన స్వంత జీవితము ఎంతో అపాయములోనున్న సమయములోకూడా ఇతరులయెడల నిస్వార్థమైన ఆసక్తిని కలిగియుండటమనేది ఎంతో అద్భుతమైన విషయము!

18:9 యోహాను 17:12 లో యేసు పలికిన మాటలు ఇచ్చట నెరవేరినవి.

18:10 తన యజమానిని ఆ సమూహమునుండి బలత్కారముగా రక్షించుకొను సమయము ఆసన్నమైనదని పేతురు తలంచాడు. అతడు తన కత్తిదూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికాడు. పేతురు ఆ దాసుని చంపుటకు ఉద్దేశించెననుటలో సందేహము లేదు. కాని ఆ కత్తిని ఆ దాసుని కుడి చెవిని మాత్రమే సరుకునట్లుగా అది ప్రక్కకు తప్పినది.

18:11 పేతురు దురభిమానాన్ని యేసు గద్దించాడు. ‘శ్రమ అనుభవించడం మరియు మరణం’ అనే పాత్ర (Cup) ఆయనకు తండ్రిద్వారా ఇవ్వబడినది. మరియు దానిని త్రాగుటకే ఆయన నిర్ణయించుకొని యున్నాడు. ఈ సందర్భములో ప్రభువు ఏవిధంగా ‘మల్కు’ అను ఈ దాసునియొక్క చెవిని తాకి స్వస్థపరచాడో ఆ వృత్తాంతాన్ని లూకా తన సువార్తలో వ్రాశాడు.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:12 ఇప్పుడు మొదటిసారిగా దుష్టులైన మనుష్యులు ప్రభువైన యేసును పట్టుకొని బంధించగలిగినారు. ఆయన ‘అన్న’ యొద్దకు తీసుకొనిపోబడినాడు ‘అన్న’ అంతకు ముందు ప్రధాన యాజకునిగా పనిచేసినవాడు.

ఇప్పుడు ప్రధానయాజకునిగానున్న కయపయొద్దకు గాక అతని మామయగు అన్నయొద్దకు ముందుగా యేసు ఎందుకు తీసికొనిపోబడినాడో స్పష్టముగా తెలియదు. ప్రాముఖ్యమైన విషయమేమిటంటే ఆయ మోపబడిన నేరములైన ‘దేవదూషణ, భిన్న మతబోధ’ అను వాటిని ఋజువు చేసే ప్రయత్నములో భాగంగా యేసు ముందుగా యూదుల యెదుట న్యాయవిమర్శకు నిలబడినాడు.

దీనిని మనము ‘మత సంబంధమైన విచారణ’ అని పిలువవచ్చు. తరువాత – ఆయన ‘కైసరుకు శత్రువు’ అని ఆయనపై మోపబడిన నేరాన్ని ఋజువుచేసే ప్రయత్నములో భాగంగా రోమా అధికారులయెదుట విమర్శింప బడుటకై వారియొద్దకు తీసికొని పోబడినాడు.

అది – ‘పౌరసంబంధమైన విచారణ’ యూదులు రోమా అధికారము క్రింద ఉన్నారు. కాబట్టి వారు రోమా న్యాయస్థానముల ద్వారామాత్రమే పనిచేయవలసియుంది. మరణశిక్ష అమలుపరచే అధికారము వారికి లేదు. వారు దానిని పిలాతుద్వారా జరిగించాల్సి ఉంది.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:14 ప్రజలందరికొరకు ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరమని ప్రవచించిన కయపయు (యోహాను 11:50) ప్రధాన యాజకుడును ఒక్కడే అని యోహాను ఇచ్చట వివరించుచున్నాడు. ఆ ప్రవచన నెరవేర్పులో అతడు ఇప్పుడు పాలుపంపులు పొందబోవుచున్నాడు.

“కయప అను ఈ మనుష్యుడు ప్రజలందరి ఆత్మలకు కాపరిగా ఉండుటకు అధికారము పొందినవాడు, ఇతడు దేవునియొద్ద నుండి వర్తమానమును తెచ్చుటకును, సర్వాధికారియగు దేవునియొక్క ప్రతినిధిగా ఉండుటకును ప్రత్యేకింపబడినవాడు.

సంవత్సరమున కొకసారి అతిపరిశుద్ధ స్థలము లోనికి ప్రవేశించే మహిమకరమైన భాగ్యమును ఇతడు కలిగియున్నాడు. కాని ఈ మనుష్యుడే దేవుని కుమారుని నిందించినాడు.”

“ప్రపంచములో అత్యున్నతమైన మత అవకాశాలు మరియు ఎంతో ఆశాజనకమైన వాతావరణం ఒక వ్యక్తి రక్షణకు హామి ఇవ్వలేవు లేదా అవి అతని ఆత్మను యోగ్యంగా చేయలేవు’ అను సత్యాన్ని వివరించ డానికి ఇంత కంటే నిర్ఘాంతపరచే ఉదాహరణను చరిత్ర అందించలేదు.

‘యాత్రికుని ప్రయాణం’ అను గ్రంథాన్ని వ్రాసిన జాన్ బన్యన్ తన గ్రంథం ముగింపులో ఇలా వ్రాశాడు – “నేను” చూడగా, ఆకాశముయొక్క గవునులయొద్దనుండియు నరకమునకు వెళ్లుత్రోవ ఉన్నదని నాకు తెలిసెను.

పేతురు ప్రభువును ఎరుగనని బొంకుట (18:15-18) :

18:15 ఈ వచనములో ప్రస్తావించబడిన మరియొక శిష్యుడు యోహాను – కానీ అతడు వినయపూర్వకముగా, మరియు పేతురుయొక్క అవమానకరమైన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని తన పేరును తానే ప్రస్తావించుకోలేదని చాలమంది బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు.

ప్రధాన యాజకునితో అంతటి పరిచయమును యోహాను ఏ విధముగా కలిగియున్నాడో మనకు చెప్పబడలేదు. ప్రధాన యాజకునికి అతడు నెళవైనవాడు గనుక ప్రధాన యాజకుని యింటి ముంగిటిలోనికి వెళ్ళ గలిగినాడు.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:16 యోహాను బయటకువచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి అనుమతి తీసికొనేవరకు పేతురు లోపలికి ప్రవేశించుటకు వీలులేకపోయింది. జరిగినదంతటినీ పరిశీలిస్తే, తన పలుకుబడిని ఈ విధంగా ఉపయోగించడం యోహాను యొక్క దయ కావచ్చునని మనము ఆశ్చర్యపడతాము.

18:17 పేతురు ప్రభువును ఎరుగనని మొట్టమొదటిగా బొంకినది ఒక సైనికుని ముందు కాదుగాని ఒక స్త్రీ ముందు.

18:18 తాను యేసు శిష్యుడను కానని పేతురు బొంకాడు. ఇప్పుడు పేతురు తన ప్రభువుయొక్క శత్రువులతో కలిసిపోయి తన గుర్తింపును మరుగుచేయుటకు ప్రయత్నించాడు. అనేకమంది ఇతర శిష్యులవలెనే పేతురుకూడా ఈ లోకముయొక్క మంటవద్ద చలికాచుకున్నాడు.

మతసంబంధమైన విచారణ (18:19-24) :

18:19 ఈ వచనములోని ప్రధానయాజకుడు ‘అన్న’యో లేక ‘కయప’యో స్పష్టముగా వ్రాయబడలేదు. ఇతడు ‘అన్న’ అయివుండవచ్చని తోచుచున్నది. అదే నిజమైతే – అతడు అంతకుమునుపు ఆ పదవిలో ఉన్న కారణంచేత బహుశ మర్యాద పూర్వకముగా ‘ప్రధానయాజకుడు’ అని అతడు పిలువబడి యుండవచ్చును.

ప్రధాన యాజకుడు యేసును – ఆయన శిష్యులనుగూర్చి మరియు ఆయన బోధలను గూర్చి ప్రశ్నించాడు. ఆయనమీద మోపుటకు వారికి ఏ నేరము దొరకలేదు గనుక ఏదో ఒక నేరము సృష్టించుటకు వారు ప్రయత్నించుచున్నారు.

18:20 తాను చేసినది బహిరంగ పరిచర్యయని ప్రభువు సమాధానమిచ్చాడు. రహస్యముగా నుంచుటకు ఆయనయొద్ద ఏమియు లేదు. సమాజ మందిరములలో యూదుల సమక్షంలోను మరియు దేవాలయములోను ఆయన బోధించాడు, రహస్య ముగా జరిగినదేమియు లేదు.

మతసంబంధమైన విచారణ (18:19-24) :

18:21 తన బోధలు విన్న యూదులను ముందుకు తీసికొని రమ్మని ఆయన న్యాయాధిపతులను సవాలు చేశాడు. వారిని తనకు వ్యతిరేకంగా ఆరోపణలు తీసుకొని రానివ్వండి. తాను ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా, సాక్ష్యము తీసికొనిరా వచ్చునని ప్రభువు సమాధానము.

18:22 యేసు ఇచ్చిన ఈ సమాధానము యూదులను చికాకు పెట్టింది. ఆ సమాధానమునుబట్టి వారు యేసుపై ఏ విధమైన కేసును బనాయించలేకపోయారు. కనుక వారు ఆయనను దూషించడం మొదలుపెట్టారు. యేసు ప్రధానయాజకునితో మాట్లాడిన విధానము సరియైనదిగా లేదన్న నెపంతో అక్కడున్న బంట్రౌతులలో ఒకడు ఆయనను అరచేతులతో కొట్టాడు.

18:23 పరిపూర్ణమైన ఆత్మస్థైర్యంతోనూ, తర్కంతోనూ, రక్షకుడు వారి స్థితి అసమంజసమని చూపాడు. ఆయన చెడ్డగా మాట్లాడాడని వారు ఆరోపించలేక పోయారు. ఆయన నిజము చెప్పినందుకు వారు ఆయనను కొట్టారు.

18:24 ‘అంతట అన్న యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపయొద్దకు పంపెను’ అని ఈ వచనములో వ్రాయబడియున్నది. అనగా మొదటి విచారణ అన్న యెదుట జరిగినదని చెప్పవచ్చును. కయప యెదుట జరిగిన విచారణను గూర్చి యోహాను సువార్తలో వ్రాయబడలేదు. అది ఈ అధ్యాయము లోని 24 మరియు 28 వచనముల మధ్య జరిగినది.

పేతురు రెండవసారి మరియు మూడవసారి బొంకుట (18:25 – 27):

18:25 ఈ వృత్తాంతము మరల పేతురువైపునకు మళ్ళినది. తెల్లవారు జామున చలిలో అతడు చలికాచుకొనుచున్నాడు. అతని వస్త్రధారణ మరియు అతని మాటల తీరు నిస్సందేహంగా అతడొక గలిలయ జాలరుడనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అతనితో కూడ నిలుచున్నవారిలో నొకడు నీవును యేసు శిష్యులలో ఒకడవు కావా? అని అతని ప్రశ్నించాడు, పేతురు రెండవసారి కూడా ఆయన ఎవరో తనకు తెలియదని బొంకాడు.

18:26 పేతురుతో మాట్లాడిన ఈ వ్యక్తి-మల్కు యొక్క బంధువు. తన బంధువు యొక్క చెవిని పేతురు తెగనరకడం అతడు చూచాడు. ‘నీవు తోటలో యేసుతో నుండగా నేను చూడలేదా? అని అతడు మరల ప్రశ్నించాడు.పేతురు రెండవసారి మరియు మూడవసారి బొంకుట (18:25 - 27):

18:27 ఇప్పుడు పేతురు మూడవసారి తాను ప్రభువును ఎరుగనని అబద్ధమాడాడు. వెంటనే కోడి కూయడం అతడు విన్నాడు. మరియు “కోడికూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువు” అని ప్రభువు పలికిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. అప్పుడు పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినట్లుగా మిగిలిన సువార్తలవలన మనకు తెలియుచున్నది.

పిలాతు యెదుట ‘పౌరసంబంధమైన విచారణ’ (18:28-40) :

18:28 మత సంబంధమైన విచారణ ముగిసినది. ఇక పౌరసంబంధమైన విచారణ ప్రారంభమవబోతూ ఉంది. గవర్నరు యొక్క అధికార మందిరము లేక న్యాయవిమర్శ జరిగే సభయొక్క సన్నివేశమిది. అన్యులయొక్క అధికార మందిరంలోనికి వెళ్ళడానికి యూదులకు ఇష్టము లేదు.

ఆ విధంగా చేస్తే తాము మైలపడి పస్కాను భుజించకుండా ఉండవలసి వస్తుందని వారు తలంచారు. కానీ దేవుని కుమారుని చంపడానికి కుట్ర పన్నడం అనే విషయం వారిని ఏ మాత్రం బాధించలేదు. వారికి అన్యుల గృహంలో ప్రవేశించడం అంటే చాలా విషాదకరమైన విషయముగానీ హత్యమాత్రం తృణప్రాయం.

కల్వరివైపుకు పయనము Bible Verses Chapter 18

అగస్టీన్ ఇలా అన్నారు “వారు (యూదులు) ఇతరుల నివాసస్థలమునుబట్టి నిశ్చయముగా అపవిత్రపరచబడతారుగాని తమ స్వంత అపరాధమునుబట్టి అపవిత్ర పరచబడరు. ఒక అన్యుడైన న్యాయాధిపతి యొక్క ప్రేతోర్యమను సభవలన అపవిత్ర పరచబడుదుమని వారు భయపడ్డారు గాని నిరపరాధియైన ఒక సహోదరుని రక్తమును బట్టి అపవిత్రపరచబడుదుమనే భయం వారికి లేదు.

ఏమిటీ దుష్టమైన అంధత్వం!” బిషప్ హాల్ ఇలా అన్నారు. “యాజకులారా, శాస్త్రులారా, అధికారులారా, వేషధారులారా! అయ్యో మీకు శ్రమ! మీ హృదయములంత అపవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉండగలదా? పిలాతుయొక్క అధికార మందిరపు గోడలు కాదు గాని మీ హృదయములే అపవిత్రములు.

హత్య మీ పనియేనా? మీరు సాధారణమైన అంటువ్యాధి వలన ఆగిపోతారా? సున్నముకొట్టిన గోడల్లారా! దేవుడు మిమ్మును మొత్తుతాడు. మీరు దేవుని రక్తముచే మలినపరచబడటానికి కోరుకొంటున్నారా? పిలాతు అధికార మందిరములో అడుగుపెడితే అపవిత్రులమవుతామని మీరు భయపడుతున్నారా? ఒక ప్రక్క ఘోరమైన దుష్టత్వమనే ఒంటెను మ్రింగుతూ మరో ప్రక్క ఏదైనా నలక గొంతులో ఇరుక్కుందని బాధపడుతున్నారా? ఓ అబద్ధికులైన అవిశ్వాసులారా! మీరు అపవిత్రులు కాకుండా ఉండాలంటే యెరూషలేమునుండి వెళ్ళిపొండి.

భయపడడానికి పిలాతుకు ఇంకా అధికమైన కారణం ఉంది. ఎందుకంటే మీవంటి అత్యంత ఘోరమైన దుష్టత్వాన్ని కలిగియున్న రాక్షసులవలన అతడి గోడలు అపవిత్రమౌతాయి”.
పూలే ఇలా అన్నారు – “ఆచారాల గురించి విపరీతమైన ఆసక్తి కలిగియున్న, వ్యక్తులు నైతిక విలువలు కోల్పోవడంకన్నా సాధారణమైనది మరేదీ లేదు.”

‘వారు పస్కాను భుజింపవలెనని’ అను మాట బహుశ పస్కా తరువాత జరుగు విందుకు సంబంధించినదైయుండవచ్చును. అంతకుముందటి రాత్రే పస్కాపండుగ జరుపబడినది.

18:29 రోమా గవర్నరైన పిలాతు బయటకు యూదులున్న చోటికి వెళ్ళడంద్వారా వారికి లొంగిపోయాడు. ‘ఖైదీగానున్న యేసుపై ఏ నేరము మోపుచున్నారు?” అను ప్రశ్న వేయుటద్వారా అతడు విచారణను ప్రారంభించాడు.

18:30 ఎంతో ధైర్యముగాను, అమర్యాదగాను వారు సమాధానమిచ్చారు. తాము అంతకుమునుపే ఆయనను విచారణ చేసి దోషిగా నిర్ణయించినట్లు వారు చెప్పారు. ఇక పిలాతు శిక్ష విధించడమే వారికి కావలసింది.

18:31 పిలాతు తన కర్తవ్యము నిర్వర్తించకుండా తప్పించుకొని దానిని యూదులపైకి నెట్టడానికి ప్రయత్నించాడు. వారు అంతకు మునుపే ఆయనను విచారణచేసి దోషిగా నిర్ణయించినట్లయితే ఎందువల్ల వారు తమ ధర్మశాస్త్రము చొప్పున ఆయనకు తీర్పు తీర్చి శిక్ష విధించలేదు? అందుకు యూదులు ఇలా సమాధానమిచ్చారు

“మేము స్వాతంత్య్రము కలిగినవారము కాదు మేము రోమా ప్రభుత్వంచేత పాలించబడుతున్న వారము. ప్రభుత్వము మా చేతుల్లోనుండి తీసివేయబడింది. కాబట్టి ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించే అధికారం మాకు ఇక లేకుండా పోయింది”.

అన్యుల అధికారానికి తాము దాసులమైయున్నాము – లోబడియున్నాము అనే విషయాన్ని వారు ఈ విధంగా ఒప్పుకొనుచున్నారు. అంతేగాక ‘క్రీస్తు మరణం’ యొక్క నిందను పిలాతుపైకి మళ్ళించుటకు కూడా వారు తలంచారు.

18:32 ఈ 32వ వచనము రెండు అర్థములను కలిగియుండవచ్చును. (1) తనకు మరణశిక్ష విధించునట్లుగా యూదులు తనను అన్యజనులకు అప్పగించెదరని మత్తయి 2019 లో యేసు ముందుగానే చెప్పియున్నాడు. ఆయన మాటలను యూదులు ఇప్పుడు నెరవేర్చుచున్నారు.

(2) చాలా చోట్ల ప్రభువు తాను ఎత్తబడుదునని చెప్పి యున్నాడు. (యోహాను 3:14; 8:28; 12:32, 34) ఇది సిలువ మరణాన్ని సూచిస్తూ ఉంది. సాధారణంగా యూదులు మరణ శిక్ష విధించే సందర్భములో రాళ్ళతో కొట్టి చంపుతారు.

కానీ సిలువవేసి చంపడం అనేది రోమా సామ్రాజ్యం యొక్క పద్ధతి. ఇప్పుడు ప్రభువు విషయంలో తామే మరణ శిక్షను అమలు జరపడానికి వారు నిరాకరించడంతో, యూదులు తమకు తెలియకుండానే ప్రభువుకు సంబంధించిన ఈ రెండు ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నారు.

(కీర్తనలు 22:16 కూడ చూడండి). 18:33 యేసును ఏకాంతముగా ప్రశ్నించుటకై పిలాతు ఆయనను తన అధికార మందిరములోనికి పిలిపించి – ‘యూదుల రాజువు నీవేనా?’ అని ఆయనను అడిగాడు.పిలాతు యెదుట 'పౌరసంబంధమైన విచారణ' (18:28-40) :

18:34 అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు “నేను రోమా ప్రభుత్వాన్ని కూల ద్రోయడానికి ప్రయత్నించినట్లుగా, ఒక గవర్నరుగా నీవు ఎప్పుడైన విన్నావా? కైసరు సామ్రాజ్యాన్ని కూలద్రోయగల రాజుగా నన్ను నేను ప్రకటించుకొనినట్లు ఇంతవరకు నీకేమైనా సమాచారము వచ్చినదా ? నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇప్పుడు ఈ యూదులు మాట్లాడగా విని అనుచున్నావా?”

18:35 పిలాతు జవాబు ఎంతో తిరస్కారముతో కూడుకొనినదై యున్నది. “నేను యూదుడనా యేమి?” అని అతడు ప్రశ్నించాడు. ఇలా అడగడంలో ‘తాను చాలా ముఖ్యమైన వ్యక్తిననీ, స్థానికంగా యూదులయొక్క ఈ సమస్యతో తాను కలత చెంద నవసరం లేదని’ అతని ఉద్దేశ్యం.

గానీ అతడిచ్చిన ఈ జవాబు – యేసుపై మోపబడిన నేరమేమిటో అతనికి తెలియదని అతడు ఒప్పుకొనుచున్నట్లుగా ఉన్నది. యూదుల అధికారులు ఏదైతే చెప్పారో అది మాత్రమే అతనికి తెలుసు.

18:36 అప్పుడు ప్రభువు తాను రాజునని ఒప్పుకొనినాడు. కాని యూదులు నింద మోపినట్లుగా ఆవిధమైన రాజు కాడు. మరియు రోమా ప్రభుత్వమును బెదిరించేవాడు కాడు. క్రీస్తుయొక్క రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; మానవుల ఆయుధాల ద్వారా అభివృద్ధి చెందునది కాదు.

ఆయన రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే ఆయనను బంధించకుండా ఆయన శిష్యులు పోరాడియుండెడివారు. అది ఈ లోకమునకు చెందినది కాదు. అది తన శక్తిని, అధికారమును లోకమునుండి స్వీకరించదు. దాని ఉద్దేశాలు మరియు లక్ష్యాలు శరీరసంబంధమైనవి కావు.

18:37 తరువాత పిలాతు ఆయనను ‘నీవు నిజముగా రాజువా?’ అని ప్రశ్నించాడు. ‘నీవన్నట్టు నేను రాజునే’ అని యేసు జవాబిచ్చాడు, అనగా నీవు పలికినది నిజమే’ అని అర్థము. కాని ఆయన రాజ్యము సత్యమునకు సంబం ధించినది.

కత్తులకు, డాళ్ళకు సంబంధించినది కాదు. ఆయన ఈ లోకమునకు వచ్చెనను సత్యమునకు ఇది సాక్ష్యమైయున్నది. ఇచ్చట ‘సత్యము’ అనగా ‘దేవుని గూర్చిన ‘సత్యము’ క్రీస్తును గూర్చినది, పరిశుద్ధాత్మ, మానవుడు, పాపము, రక్షణ మరియు క్రైస్తవ్యానికి సంబంధించిన ఇతర గొప్ప సిద్ధాంతాలను గూర్చినది.

ఎవరైతే సత్యమును ప్రేమిస్తారో వారు ఆయన స్వరాన్ని వింటారు. ఈ విధంగా ఆయన రాజ్యము అభివృద్ధి చెందుతుంది.

18:38 ‘సత్యమనగా ఏమిటి?’ అని పిలాతు ప్రశ్నించాడు. ఈ విధంగా అడగడంలో అతని ఉద్దేశ్యమేమిటో చెప్పడం కష్టం. అతడు కలవరపడినాడా? లేక అపహాస్యము చేయుచున్నాడా? లేక సత్యమనగా నేమిటో తెలిసికొనుటకు నిజముగానే ఆసక్తి కలిగియున్నాడా? ఒక్కటి మాత్రం మనకు తెలుసు.

శరీర రూపము దాల్చిన ‘సత్యము’ (యేసు) అతని యెదుట నిలువబడియున్నాడు, కాని ఆయనను అతడు గుర్తుపట్టలేదు. యేసులో ఎలాంటి దోషము లేదని గ్రహించిన పిలాతు తిరిగి యూదులవద్దకు వచ్చాడు.

18:39 పస్కా పండుగ సమయములో పేరుమోసిన ఒక యూదు ఖైదీని విడుదల చేయుమని రోమా ప్రభుత్వాన్ని కోరే ఒక సాంప్రదాయం యూదులకు ఉన్నది. ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించి యూదులను సంతోష పెట్టుటకును, అదే సమయ ములో యేసును విడుదల చేయుటకును పిలాతు ప్రయత్నించాడు.

18:40 కానీ అతని ఆలోచన సఫలం కాలేదు. యూదులు యేసును గాక బరబ్బను కోరుకున్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

ప్రభువు ప్రార్థన – Bible Verses Chapter 17 in Telugu

పదిహేడవ అధ్యాయము

ప్రభువు ప్రార్థన

ప్రభువు తన ప్రజలకోసం చేసిన ప్రత్యేకమైన విన్నపాలు

మన ప్రభువైన యేసు చేసిన “ప్రధాన యాజకుని ప్రార్థన”ను మనము ఈ అధ్యాయములో చూడగలము. ఈ ప్రార్థనలో ఆయన తన స్వంతవారికోసం విజ్ఞాపన చేశాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉండి తన ప్రజలకోసం ప్రార్థిస్తూ, తన ప్రజల పక్షంగా చేస్తున్న ప్రస్తుత పరిచర్యయొక్క చిత్రపటాన్ని ఇది చూపిస్తూ ఉంది.

ప్రభువు ప్రార్థన అర్థం

మార్కస్ రెయిన్స్ఫోర్డ్ (Marcus Rainsford) ఇలా అన్నారు – “దేవుని కుడిపార్శ్వమున ఉండి, పావనుడగు మన ప్రభువు చేయుచున్న విజ్ఞాపనకు ఈ ప్రార్థన ఒక చక్కని దృష్టాంతము. ఈ ప్రార్థనలో – తన ప్రజలకు వ్యతిరేకముగా ఒక్క మాటగాని, వారి యొక్క తప్పిదములు – లోపములను గూర్చిన ప్రస్తావనగాని, వారు చేసిన వాటిని గూర్చిన ప్రస్తావనగాని లేదు.

ప్రభువు ప్రార్థన – Bible Verses Chapter 17 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

‘వారందరు ఆయనను విడిచి పారిపోయిరి’ అని వ్రాయబడినట్లుగా ఇంక కొంతసేపట్లో వారందరూ తనను విడిచి వెళ్ళనైయున్నారని ఎరిగికూడా దానినిగూర్చి ప్రస్తావించలేదు. కేవలం – తండ్రి ఏర్పాటులోనున్న వారిని గాను, తనతో సహవాసము కలిగియున్నవారినిగాను, పరలోకమునుండి వచ్చి వారికి తాను అనుగ్రహింపదలచిన తన పరిపూర్ణతను స్వీకరించిన వారిగాను మాత్రమే ఆయన వారినిగూర్చి తన ప్రార్థనలో మాట్లాడాడు.”

Read and Learn More Telugu Bible Verses

ప్రభువు బోధించిన ప్రార్థన

“ప్రధాన యాజకుని ప్రార్థన”ను మనము ఈ అధ్యాయములో చూడగలము.

“గమనించండి, ప్రభువు తన ప్రజలకోసం చేసిన ప్రత్యేకమైన విన్నపాలన్నీ ఆత్మీయ విషయాలకు సంబంధించినవే. అన్నియు పరలోకసంబంధమైన ఆశీర్వాదాలను సూచిస్తున్నాయి. ధనసంపదలు, పేరు ప్రఖ్యాతులు.

ఈ లోకసంబంధమైన అధికారము, పలుకుబడి, ఉన్నత స్థానములు – వీటన్నిటినీ వారికోసం ప్రభువు తండ్రిని అడుగలేదు. గాని దుష్టునినుండి వారిని కాపాడుమని, లోకములో వారిని ప్రత్యేకపరచుమని, వారికి అప్పగించబడిన పనిని నెరవేర్చుటకై సామర్థ్యమును దయచేసి తిరిగి వారిని క్షేమముగా పరలోకమునకు చేర్చుమని ప్రార్థించాడు. ‘ఆత్మ వర్థిల్లుట’ అనునది అన్నిటికంటే మిన్నయైనది. అది నిజమైన అభివృద్ధికి సూచిక వంటిది.”

యేసు తనకప్పగింపబడిన పనినిగూర్చి ప్రార్థించుట (17:1-5) : 17:1

‘నా గడియ వచ్చియున్నది’ అని యేసుప్రభువు చెప్పుచున్నాడు. ఆయన గడియ అప్పటివరకు రానందువలననే ఆయన శత్రువులు అంతకుముందు అనేక సార్లు ప్రయత్నించినను ఆయనను పట్టుకొనలేకపోయిరి.

కాని ఇప్పుడు ప్రభువు మరణించవలసిన సమయము ఆసన్నమైనది. ‘నీ కుమారుని మహిమపరచుము’ అని యేసు ప్రార్థించాడు. ఆయన తనముందున్న సిలువ మరణమును చూచుచున్నాడు. ఆయన చనిపోయి సమాధిలోనే ఉండినట్లయితే, మనుష్యులందరిలో ఒకనిగానే లోకము ఆయనను లెక్కకడుతుంది.

కాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపటంద్వారా ఆయనను మహిపరచినట్లయితే, ఆయన దేవుని కుమారుడనియు మరియు లోకరక్షకు డనియు చెప్పుటకు అది ఒక ఋజువుగా ఉంటుంది. ఆయన చేసిన ఈ మనవిని దేవుడు అంగీకరించాడు.

“నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు .. ” అని ప్రభువు ప్రార్థిస్తున్నాడు దీని అర్థము తరువాతి రెండు వచనములలో వివరించబడింది. ప్రభువైన యేసు తనయందు విశ్వాసముంచు వారికి నిత్యజీవము అనుగ్రహించుటద్వారా తన తండ్రిని మహిమపరచాడు.

భక్తిహీనులైన స్త్రీ, పురుషులు మారుమనస్సుపొంది ప్రభువైన యేసుయొక్క జీవమును ఈ భూమిపై ప్రత్యక్షపరచుట ద్వారా దేవునికి అత్యధికమైన మహిమ కలుగుతుంది.

17:2 ఆయన చేసిన విమోచన కార్యము ఫలితముగా దేవుడాయనకు సర్వమాన వాళిపై అధికారమనుగ్రహించాడు. తండ్రి తనకనుగ్రహించిన వారికి నిత్యజీవమిచ్చు టకు ఆయన అర్హుడగుటకు ఈ అధికారము తోడ్పడినది. భూమి పునాదులు వేయ బడకముందే కొందరిని క్రీస్తుకు చెందినవారుగా దేవుడు చూచాడు : అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో అట్టి వారందరికి రక్షణను అనుగ్రహించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రక్షకుని యందు విశ్వసించి రక్షింపబడనివారు ఎవరూ ఉండరు.

మత్తయి 6:9–13 వచనాలు – ప్రభువు ప్రార్థన

17:3 దేవుని మరియు ప్రభువైన యేసును ఎరుగుటద్వారా నిత్యజీవము పొంద గలము. నిజమైన దేవుడు, వాస్తవంగా ఎంతమాత్రము దేవుళ్ళు కాని విగ్రహములకంటె భిన్నమైన వాడు. నిత్యజీవమునకు ఉమ్మడి మూలాధారముగా తండ్రియైన దేవునితో పాటు యేసుక్రీస్తుయొక్క నామముకూడా ఇక్కడ ప్రస్తావించబడింది అనగా వారిద్దరూ ఒక్కటే ‘నీవు పంపిన యేసుక్రీస్తు … అని ప్రభువు ఇచ్చట తనను గూర్చి చెప్పుటను గమనించండి. ‘క్రీస్తు’ లేక ‘మెస్సీయా’ – ఈ రెండింటికీ అర్ధము ఒక్కటే. ఇక్కడ యేసు తనను గూర్చి ‘మెస్సీయ’ గా చెప్పుకొనుచున్నాడు.

17:4 ‘చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని’ – అని ప్రభువు పలుకుచున్నప్పుడు – తాను అప్పటికే చనిపోయి, సమాధిచేయబడి, తిరిగిలేచినట్లుగా ఆయన మాట్లాడుచున్నాడు.

ఆయన పాపరహితమైన తన జీవితముద్వారా, సూచకక్రియలు చేయుటద్వారా, తన శ్రమ, మరణము మరియు పునరుత్థానములద్వారా తండ్రిని మహిమపరచియున్నాడు. తండ్రి తన కప్పగించిన రక్షణకార్యమును ఆయన సంపూర్తి చేసియున్నాడు.

యేసు తనకప్పగింపబడిన పనినిగూర్చి ప్రార్థించుట (17:1-5) : 17:1

రైల్ (Ryle) అనునతడు చెప్పినవిధముగా – “సిలువ మరణము తండ్రికి మహిమను తెచ్చినది. అది ఆయన జ్ఞానమును, విశ్వాస్యతను, పరిశుద్ధతను మరియు ప్రేమను మహిమ పరచినది, తాను నీతిమంతునిగా ఉండి, భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చుటకై ఒక ప్రణాళికను సిద్ధపరచిన ఆయనను జ్ఞానవంతునిగా అది చూపినది.

స్త్రీ సంతానము సర్పమును తలమీద కొట్టును’ అను వాగ్దానమును నెరవేర్చిన ఆయనను నమ్మదగిన వాడుగా అది చూపినది. తన ధర్మశాస్త్రపు విధులన్నీ మన గొప్ప ప్రతినిధియైన యేసుక్రీస్తుద్వారా నెరవేర్చబడాలని కోరడంద్వారా అది ఆయనను పరిశుద్ధునిగా చూపినది.

తనతోపాటు నిత్యుడైన తన కుమారుడినే మధ్యవర్తిగా, విమోచకునిగా మరియు స్నేహితునిగా పాపియైన మానవునికి అనుగ్రహించినందువలన అది ఆయనను ప్రేమస్వరూపిగా చూపినది”.
“సిలువ మరణము కుమారునికికూడా మహిమను తెచ్చినది.

అది A యొక్క కనికరమును, సహనమును, ఆయనశక్తిని, అధికారమును మహిమపరచినది. మనకొరకు మరణించి, మనకు బదులుగా శ్రమననుభవించి, మన నిమిత్తము తన్ను తాను పాపముగాను, శాపముగాను అగుటకు అప్పగించుకొని, మనలను విమోచించు టకై తన స్వంత రక్తమును వెలగా చెల్లించిన ఆయనను ‘అత్యంత కనికరము గలవాడు’గా అది చూపినది. యేసుక్రీస్తు ఒక్క మాటచే తన తండ్రియొద్దనున్న దూతలను పిలువ గలడు.

సిలువ మరణంనుండి విడుదల పొందగలడు. ఈ అవకాశము తనకున్నప్పటికీ మనుష్యులందరు అనుభవించే సాధారణ మరణమును గాక, ఏ మానవుడూ తన మనస్సుతో గ్రహించలేని బాధకు, వేదనలకు తన్నుతాను ఇష్టపూర్వకముగా అప్పగించు కొనిన ఆయనను ‘అధికమైన సహనము కలిగినవాడు’గా అది చూపినది.

సర్వ లోకముయొక్క అపరాధముల భారమును భరించి, సాతానుని జయించి, సాతాను చెరపట్టిన వారిని దోచుకొనిన ఆయనను ‘అత్యంత శక్తిమంతుని’గా అది చూపినది”.

ప్రార్థనలోని ప్రాముఖ్యములు – ప్రభువు ప్రార్థన

17:5 క్రీస్తు ఈ లోకమునకు రాకపూర్వము ఆయన పరలోకములో తండ్రితోకూడ నివసించాడు. దేవదూతలందరూ ప్రభువును చూచినపుడు దైవత్వముయొక్క సంపూర్ణ మహిమను వారు ఆయనలో చూశారు. అక్కడున్న ప్రతి నేత్రము ఆయనను దేవునిగానే చూచినది.

కానీ ఆయన మానవుల మధ్యకు వచ్చినప్పుడు దైవత్వముయొక్క మహిమ ముసుగు వేయబడినది. భూమిమీద ఉన్నప్పుడుకూడా ఆయన దేవుడే అయినప్పటికీ ఆ విషయము అనేకులకు స్పష్టముగా బోధపడలేదు.

ప్రభువు ప్రార్థన – Bible Verses Chapter 17

ఆయనను కేవలం ఒక వడ్రంగి యొక్క కుమారునిగానే వారు చూచారు. పరలోకమందు తనకున్న మహిమతో తిరిగి తనను మహిమపరచుమని ఇక్కడ రక్షకుడు ప్రార్థించుచున్నాడు. “నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” అనగా “పరలోకమునందలి నీ సన్నిధితో నన్ను మహిమపరచుము, నేను నరావతారిగా జన్మించక మునుపు నీతో కలసి ఏ విధమైన మహిమను కలిగియుంటినో ఆ మహిమను తిరిగి అనుగ్రహించుము” అని అర్ధము.

క్రీస్తు తన శిష్యులకోసం ప్రార్థించుట (17:6-19) :

17:6 యేసు తన శిష్యులకు తండ్రి నామమును ప్రత్యక్షపరచియుండెను. లేఖనము లలో ‘నామము’ అనునది ఆ వ్యక్తిని, అతని గుణలక్షణములను, స్వభావమును తెలియజేస్తుంది. ‘క్రీస్తు’ పూర్తిగా తండ్రిని ప్రత్యక్షపరచాడు. శిష్యులు లోకములో నుండి కుమారునికి అనుగ్రహింపబడిరి.

అవిశ్వాసులైన మానవ సమూహమునుండి వేరుచేయబడి, క్రీస్తుకు చెందియుండుటకు వారు ప్రత్యేకించబడిరి. ‘వారు నీ వాక్యము గైకొనియున్నారు’ అని ప్రభువు చెప్పుచున్నాడు. వారిలో ఎన్నో తప్పిదములు, లోటుపాట్లు ఉన్నప్పటికీ, వారు తన బోధను నమ్మి విధేయత చూపించినారని చెప్పుచూ వారిని హెచ్చించుచున్నాడు.

వారికి వ్యతిరేకముగా ఒక్క మాటకూడ పలుకలేదు. ‘వారందరు ఆయనను విడిచి పారిపోయిరి’ అని వ్రాయబడినట్లుగా ఇంక కొంతసేపట్లో వారందరూ విడిచి వెళ్ళనైయున్నారని ఎరిగి కూడా దానినిగూర్చి ప్రస్తావించలేదు.

17:7 రక్షకుడు సంపూర్ణముగా తండ్రిని ప్రత్యక్షపరచియుండెను. తాను తన స్వంత అధికారముతో ఏమియు మాటలాడక, ఏమియు చేయక, తండ్రి తనకు బోధించిన విధముగానే సమస్తమును చేసితినని ఆయన తన శిష్యులకు వివరించాడు. కాబట్టి తండ్రియే కుమారుని పంపెనని వారు తెలిసికొనిరి.

ప్రభువు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత

17:8 వాస్తవానికి క్రీస్తు తనకు తానుగా ఈ పనిని ఆరంభించలేదు కాని, తండ్రి. చిత్తమునకు విధేయుడై ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన యెహోవా దేవునియొక్క పరిపూర్ణ సేవకుడు.

17:9 ఒక ప్రధాన యాజకునిగా ఆయన లోకముకొరకు కాదుగాని తన శిష్యుల కొరకు ప్రార్థించాడు. ఆయన లోకముకొరకు కూడా ప్రార్థించకపోలేదు. “తండ్రి! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము” అని ఆయన సిలువపై తనను హింసించినవారికోసం ప్రార్థించాడు.

కాని ఇక్కడయితే విశ్వాసు లందరికీ ప్రతినిధిగా దేవుని సింహాసనముయెదుట ప్రార్థించుచున్నాడు. దేవుని సింహాసనము యెదుట ఆయన చేయు ప్రార్థన తన స్వంతవారికోసం మాత్రమే.

17:10 తండ్రియైన దేవునికి, కుమారునికి మధ్యగల ఏకత్వమును ఈ వచనములో చూడగలము. కేవలం మానవమాత్రుడైన ఒక వ్యక్తి ఈ మాటలను సత్యపూర్వకంగా పలుకలేడు. ఒకవేళ మనము దేవునితో ‘నావన్నియు నీవి’ అని చెప్పగలమేమో గాని ‘నీవన్నియు నావి’ అని మాత్రము ఆయనతో చెప్పలేము. కుమారుడు సమానమైనవాడు కావుననే ఆయన ఈ మాటలు చెప్పగలిగినాడు.

ఈ భాగమంతటిలోనూ ఆయన తనయొక్క పేద, వెనుకబడిన మందను చూపుతూ, ప్రతివ్యక్తినీ అనేక రంగులతో కూడిన వస్త్రాన్ని ధరింపజేస్తూ, ‘నేను వారియందు మహిమపరచబడియున్నాను’ అని ప్రకటిస్తున్నాడు.

17:11 ప్రభువైన యేసు, తాను పరలోకమునకు తిరిగి వెళ్ళుటకు అపేక్షించడాన్ని మళ్ళీ ఇక్కడ మనము చూస్తాము. ఆయన అప్పటికే పరలోకమునకు వెళ్ళి పోయినట్లుగా ప్రార్థించాడు తన ప్రజలందరూ ఏకముగా ఉండి, తండ్రిచేత కాపాడబడాలని ఆయన తండ్రిని వేడుకొన్నాడు.

వారు ఇకపై భయంకరమైన శోధనలు, శ్రమలు అనుభవించ వలసియున్నదని ఆయనకు తెలుసు. వారిలో విభజనలు వచ్చి విడిపోయే ప్రమాదం కూడా ఉంది. కావుననే “మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై యుండాలి” అని యేసు ప్రార్థించాడు.

తనకు తండ్రితో ఉన్న సహవాసములో ఏ విధమైన ఏకత్వము ఉందో, అదే విధమైన ఏకత్వమును వారుకూడా అనుభవించి ఆనందించాలని ఆయన కోరుకొన్నాడు. “పరిశుద్ధుడవైన తండ్రీ!” అని ఆయన తండ్రిని సంభోదించడాన్ని గమనించండి.

‘పరిశుద్ధుడు’ అనే మాట అనంతమైన దూరములో (అందనంత ఎత్తులో) ఉన్న వానినిగూర్చి చెప్పబడుతుంది. అయితే ‘తండ్రి’ అనే మాట ఎంతో సన్నిహితముగా (అతి దగ్గరలో) ఉన్న వానిని గూర్చి చెప్పబడుతుంది.

17:12 రక్షకుడు తన శిష్యులతో ఉన్నప్పుడు వారిని తండ్రి నామమందు కాపాడి నాడు. (అనగా తండ్రియొక్క శక్తి, అధికారములద్వారా). “నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు” అని యేసు చెప్పుచున్నాడు.క్రీస్తు తన శిష్యులకోసం ప్రార్థించుట (17:6-19) :

‘నాశన పుత్రుడు’ అనగా ఇస్కరియోతు యూదా, అనగా – తండ్రి కుమారునికి అనుగ్రహించిన వారిలో యూదాకూడా ఒకడనియు మరియు యూదా ఒకప్పుడు నిజమైన విశ్వాసియనియు దీని అర్థము కాదు. దానికి ఈ విధముగా అర్థము చెప్పవచ్చును – “నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని.

వారిలో ఎవరును నశింప లేదు, కాని లేఖనము నెరవేరునట్లుగా నాశనపుత్రుడు నశించెను.” ‘నాశన పుత్రుడు’ అను మాటకు – ‘నిత్యత్వముండు నరక శిక్షకు యూదా నియమింపబడియున్నాడు’ అని అర్ధము.

లేఖనము నెరవేర్చబడాలి కాబట్టి క్రీస్తును ద్రోహముతో అప్పగించుటకు యూదా బలవంతపెట్టబడలేదు. కాని రక్షకుని అప్పగించుటకు అతడే నిర్ణయించుకొని యున్నాడు కావున ఆ విధముగా లేఖనము నెరవేరినది.

17:13 తన శిష్యుల సమక్షంలో తాను ఎందుకు ప్రార్థించుచున్నాడో, దానిని ప్రభువు ఇక్కడ వివరించుచున్నాడు. అది ఆయన ఈ విధంగా వారితో చెబుతున్నట్లుగా ఉంది- “ఇవి- పరలోకంలో దేవునియెదుట నిరంతరం నేను చేయబోవు విజ్ఞాపనా ప్రార్థనలు. అవి ఎన్నటికీ ఆగిపోవు.

ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం

అయితే ‘నా సంతోషములో అత్యధికంగా మీరు పాలిభాగస్థులగునట్లు మీ క్షేమాభివృద్ధిని కోరి నేను పరలోకంలో ఏ విధమైన పరిచర్యను చేయనైయున్నానో మీరు స్పష్టముగా గ్రహించాలని ఇప్పుడు మీ వినికిడిలో ఈ లోకంలో నేను ఈ విజ్ఞాపనలు చేయుచున్నాను.”

17:14 ప్రభువు తన శిష్యులకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దానిని వారు స్వీకరించారు. ఫలితంగా లోకము వారిని వ్యతిరేకించి వారిని ద్వేషించింది. వారు ప్రభువైన యేసు స్వభావ లక్షణాలను కలిగిన వారు కాబట్టి లోకము వారిని ద్వేషించింది. లోకసంబంధమైన విషయాలలో వారు ఇమిడిపోలేదు.

17:15 విశ్వాసులందరినీ వెంటనే పరలోకమునకు తీసికొనిపొమ్మని ప్రభువు తండ్రిని కోరలేదు. వారు కృపలో ఎదుగునట్లు మరియు క్రీస్తుకు సాక్షులుగా ఉండు నట్లు వారు ఇక్కడే విడిచిపెట్టబడాలి. దుష్టత్వమునుండి లేక దుష్టునినుండి వారు కాపాడబడాలనేది ఆయన ప్రార్థన. తప్పించుకొని పారిపోవడం కాదుగాని భద్రపరచ బడాలని ఆయన కోరికయైయున్నది.

17:16 క్రీస్తు ఈ లోకసంబంధి కానట్టుగా క్రైస్తవులును ఈ లోకసంబంధులు కారు. యేసు నామమునకు స్థానములేని ఈ లోకసంబంధమైన వినోదములలో పాలు పొందుటకు మరియు ఈ లోకసంబంధమైన సహవాసములతో కలసిపోవుటకు క్రైస్తవుడు శోధించబడినపుడు అతడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.

17:17 ‘ప్రతిష్ఠ చేయుట’ అనగా – ‘ప్రత్యేకించుట’. విశ్వాసులను శుద్ధిచేయగల ప్రభావము దేవుని వాక్యమునకు ఉంది. వారు దానిని చదివి దానికి విధేయత చూపించుచున్నప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా వారు ప్రత్యేకించబడతారు.

ఇక్కడ ప్రభువు చేయుచున్న ప్రార్ధనకూడా అదే. ఈ లోకము నుండి దేవునికోసం ప్రత్యేకపరచబడి, దేవుడు వాడుకొనుటకు అర్హులైన ప్రజలను ప్రభువు కోరుకొంటున్నాడు. “నీ వాక్యమే సత్యము” అని యేసు చెప్పుచున్నాడు. చాలమంది ఈ రోజుల్లో చెప్పుచున్నట్లుగా “నీ వాక్యము సత్యమును కలిగియున్నది” అని కాక “నీ వాక్యమే సత్యము” అని ఆయన చెప్పుచున్నాడు.

17:18 దేవుని వ్యక్తిత్వమును మానవులకు తెలియపరచే ఉద్దేశ్యంతో ప్రభువైన యేసును తండ్రి ఈ లోకమునకు పంపించాడు. తాను త్వరలో తిరిగి పరలోకమునకు వెళ్ళబోవుచున్నానని యేసుకు తెలుసు. కాని రాబోవు తరాలవారు దేవుని గురించిన సాక్ష్యమును, సంగతులను ఇంకను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ పని పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో విశ్వాసులద్వారా జరగాలి. క్రైస్తవులు దేవునితో సమానులు కారు కాబట్టి ప్రభువైన యేసువలె సంపూర్ణముగా దేవునిని ప్రత్యక్షపరచలేరు. కాని లోకమునకు దేవుని ప్రత్యక్షపరచుటకే విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. ఈ కారణము చేతనే ప్రభువైన యేసు వారిని ఈ లోకములోకి పంపెను.

17:19 ‘ప్రతిష్ఠ చేయుట’ అనగా ‘పరిశుద్ధపరచుట’ అనే అర్థమునే తప్పనిసరిగా కలిగియుండాల్సిన అవసరం లేదు. స్వభావసిద్ధముగా మన ప్రభువు పరిశుద్ధుడై యున్నాడు. కాని ఇక్కడ ఆయన – ‘నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను’ అంటున్నాడు.

అంటే – తన తండ్రి తన కప్పగించిన పనికోసం ప్రభువు తన్నుతాను ప్రత్యేకించుకొను చున్నాడని దీని అర్థము. ఈ లోకమునకు వెలుపలి స్థానమును తీసికొని మహిమలో ప్రవేశించుటద్వారా ప్రభువు తన్ను తాను ప్రత్యేకించుకొనుచున్నాడనికూడా దీని అర్థమైయుండవచ్చును. “ఆయన ప్రతిష్ఠించుకోవడం అనేది మనకు మాదిరిగాను మరియు శక్తిగాను ఉన్నది” – అని వైన్ (Vine) అనునతడు చెప్పాడు. మనము ఈ లోకమునుండి ప్రత్యేకించబడి ఆయనతో పాలుపంపులు పొందవలసియున్నది.

విశ్వాసులందరికోసం క్రీస్తు ప్రార్థించుట (17:20-26) :

17:20 ఇప్పటి వరకు తన శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించిన మన ప్రధాన యాజకుడగు యేసు ఇప్పుడు తన ప్రార్థనను ఇంకను విస్తరింపజేయుచున్నాడు. ఇంకను భూమిపై జన్మించని తరాలలో ఉన్న విశ్వాసులందరి కోసం ఆయన ప్రార్థిం చాడు. వాస్తవానికి విశ్వాసియైన ప్రతివ్యక్తి ఈ వచనమును చదివినపుడు ‘యేసు కోసం ప్రార్ధించాడు’ అని చెప్పగలడు.

17:21 ఈ ప్రార్థన విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు చేయబడింది. కానీ ఇప్పుడు మాత్రం అది పాపుల రక్షణను దృష్టిలో పెట్టుకొని చేయబడింది. తండ్రికి, కుమారునికి మధ్య జీవములోను, ఉద్దేశ్యములోను ఐక్యత ఉన్నది. విశ్వాసులందరూ క్రీస్తు యొక్క జీవమును కలిగి యున్నారు.

కాబట్టి వారు ప్రభువుతోను, తోటివిశ్వాసులతోను ఐక్యతను కలిగియుండాలి. లోకములో ఉన్నవారందరూ విశ్వసించెదరని ఈ వచనము బోధించుట లేదు. కానీ క్రైస్తవులందరూ తమ సంఘటిత సాక్ష్యముద్వారా అందరూ విశ్వసించునట్లుగా గట్టి ప్రేరణను కలిగించవలసియుంది.

క్రీస్తు తన పరిశుద్ధులతో కూడ తిరిగివచ్చినపుడు మరియు ఈ ఐక్యత ప్రత్యక్షముగా కనుపరచబడినపుడు ప్రభువైన యేసును తండ్రియే పంపెనని ఈ లోకము తెలుసుకొంటుంది. అందువలన కొంచెముగా ఉన్న ఈ సమయములోనే ఆ సత్యమును ప్రకటించుటకు మనము అపేక్షించాలి.

ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం

17:22 11వ వచనములో ప్రభువు – ‘సహవాసములో ఐక్యత’ కోసం ప్రార్థించాడు. 21వ వచనంలో ‘క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పే విషయంలో ఐక్యత’కోసం ప్రార్థించాడు. ఇప్పుడు ‘మహిమలో ఐక్యత’ కోసం ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధులందరూ మహిమా శరీరములు ధరించుకొనే సమయంకోసం ఇది (ఈ ప్రార్ధన) ఎదురుచూస్తూ ఉంది.

“నీవు నాకు అనుగ్రహించిన మహిమ” అనగా ఆయన పునరుత్థానుడై ఆరోహణమగు నపుడు కలిగే మహిమ. మనము ఈ విధమైన మహిమను ఇంకను కలిగియుండలేదు. మనపట్ల దేవునికున్న ఉద్దేశాలనుబట్టి చూస్తే ఆ మహిమ మనకు అనుగ్రహించబడింది.

కాని రక్షకుడు మనలను పరలోకమునకు తీసికొని వెళ్ళినపుడు మాత్రమే ఈ మహిమను మనము పొందుతాము. క్రీస్తు ఈ భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు తిరిగి వచ్చునపుడు, ఆ మహిమ ఏమిటో సర్వలోకమునకు తేటగా విశదమవుతుంది.

ఆ సమయంలో తండ్రికి – కుమారునికి, కుమారునికి – ఆయన ప్రజలకు మధ్యఉన్న ప్రాముఖ్యమైన ఐక్యతను ఈ లోకము గుర్తిస్తుంది. అప్పుడు వారు (చాలా ఆలస్యంగా) యేసు దేవునియొద్దనుండి పంపబడినవాడని నమ్ముతారు!

17:23 యేసు – దేవుని యొద్దనుండి పంపబడిన వాడని మాత్రమే కాక, దేవుడు క్రీస్తును ఏవిధంగా ప్రేమించాడో అదేవిధమైన ప్రేమతో విశ్వాసులనుకూడ ప్రేమించా డని ఈ లోకము అప్పుడు తెలుసుకొంటుంది, మనము తండ్రియైన దేవునిచే అంత అధికముగా ప్రేమించబడినామనే విషయం నమ్మశక్యంగా ఉండదు.

కానీ అది వాస్తవం. 17:24 తన ప్రజలు మహిమలో తనతోకూడ ఉండాలని కుమారుడు కోరు చున్నాడు. విశ్వాసులు మరణించిన, ప్రతిసారీ ఈ ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకుంటే, మన దుఃఖ సమయాలలో ఇది మనకు ఎంతో ఆదరణ నిస్తుంది.

ఒక విశ్వాసి ‘మరణించుట’ అంటే ‘అతడు క్రీస్తుతోకూడ ఉండు టకు వెళ్ళుట’ మరియు ‘ఆయన మహిమను చూచుట.’ ఈ మహిమ ‘ఈ లోకం ఉనికిలోకి రాకముందే దేవునితోకూడ ఆయనకున్న దైవత్వముయొక్క మహిమ మాత్రమే కాదు. రక్షకునిగా, విమోచకునిగా ఆయన సంపాదించుకున్న మహిమకూడా.’ జగత్తు పునాది వేయబడకముందే దేవుడు క్రీస్తును ప్రేమించెననుటకు ఈ మహిమ ఒక ఋజువుగా ఉన్నది.

విశ్వాసులందరికోసం క్రీస్తు ప్రార్థించుట (17:20-26) :

17:25 యేసుక్రీస్తుద్వారా ప్రత్యక్షపరచబడిన దేవుని చూచుటలో ఈ లోకము విఫలమైంది. అయినను కొందరు శిష్యులు మాత్రం దేవుడే యేసును పంపినాడని విశ్వసించారు. ఆయన సిలువ వేయబడక ముందు సర్వమానవాళిలో కేవలం కొద్దిమంది మాత్రమే నిజంగా ఆయనను ఎరిగిన వారున్నారు. వారు కూడ ఆయనను (సిలువ మరణానికి ముందు) విడిచిపెట్టనై యున్నారు.

17:26 ప్రభువైన యేసు తన శిష్యులతోకూడ ఉండినప్పుడు ఆయన వారికి తండ్రి నామమును తెలియజేశాడు. మరియొక విధంగా చెప్పాలంటే తండ్రిని వారికి ప్రత్యక్ష పరచాడు. ఆయనయొక్క మాటలు – క్రియలు అన్నీకూడా తండ్రియొక్క మాటలు – క్రియలే. తండ్రియొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను వారు క్రీస్తులో చూచారు.

పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యద్వారా ప్రభువైన యేసు ఇంకను తండ్రి నామమును వెల్లడి పరచు చున్నాడు. పెంతెకొస్తు దినము నాటినుండి, తండ్రియైన దేవుని గూర్చి విశ్వాసులకు పరిశుద్ధాత్మ బోధించుచున్నాడు.

‘దేవుడు ఎలాంటి వాడు’ అనే విషయాన్ని ప్రాముఖ్యంగా దేవుని వాక్యముద్వారా మనం తెలుసుకోగలం. ప్రభువైన యేసుద్వారా ప్రత్యక్షపరచ బడిన తండ్రిని ఎవరైతే అంగీకరిస్తారో వారు తండ్రిచేత ప్రత్యేకంగా ప్రేమించబడతారు.

ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం

ప్రభువైన యేసు విశ్వాసులందరిలో నివసిస్తున్నాడు కాబట్టి, తండ్రియైన దేవుడు తన స్వంత కుమారునివలెనే వారిని చూడగలడు. రెయిస్ (Reuss) ఇలా చెప్పాడు – “భౌతిక ప్రపంచంయొక్క సృష్టికి పూర్వం కుమారుని రూపంలో సరియైన అంశాన్ని కలిగియున్న దేవుని ప్రేమ, నూతన ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టించబడిన నాటినుండి కుమారునితో ఐక్యపరచబడిన వారందరిలోనూ దానిని కనుగొంటుంది.”

దీనికి గోడెట్ (Godet) తన అభిప్రాయాన్ని ఇలా జతపర చారు – “కచ్చితంగా చెప్పాలంటే తన కుమారుని ఈ భూమిపైకి పంపించడంలో తండ్రియైన దేవుడు కోరుకున్నదేమిటంటే – మానవాళి అంతటిలో ఆయన తనవంటి బిడ్డలతోకూడిన కుటుంబమును తనకోసం – తయారు చేసుకోవాలని.”

ప్రభువైన యేసు ప్రతి విశ్వాసిలో ఉంటాడు కాబట్టే క్రీస్తును ప్రేమించినట్లుగానే దేవుడు ప్రతి విశ్వాసినికూడా ప్రేమించగలడు. “ప్రియము, దేవుని కెంతో ప్రియము కాలేను నేను మరింత ప్రియము యేసును ప్రేమించే తండ్రి ప్రేమ అట్టిదే నాకొరకు ఆయన ప్రేమ.”

పరిశుద్ధాత్మ – ఆదరణకర్త – Bible Verses Chapter 16 in Telugu

పదహారవ అధ్యాయము

హింసింపబడుటనుగూర్చి ముందుగా చెప్పుట (16:1-4) :

16:1 మెస్సీయ రాజ్యమును స్థాపించి, రోమా సామ్రాజ్య శక్తిని పడద్రోయునన్న యూదుల నమ్మకమును శిష్యులు వృద్ధిపొందించిరి. ఇది ఇట్లుండగా ప్రభువు తాను మరణించి, తిరిగిలేచి, పరమునకు తిరిగి వెళ్ళనై యున్నట్లుగా వారికి చెప్పెను.

పరిశుద్ధాత్ముడు వచ్చుననియు, క్రీస్తుకొరకు సాక్షులుగా శిష్యులు వెళ్ళవలసి యున్నారని చెప్పెను. వారు తృణీకరింపబడి హింసింపబడుదురు. ఇట్టి సంఘటనలన్నియు జరుగు నని, అభ్యంతరపడకుండవలెనని ప్రభువు వారికి ముందుగానే తెలియజేసెను.

పరిశుద్ధాత్మ బైబిల్‌లో

16:2 సునగోగునుండి వెలివేయబడుట అతి నీచమైన సంభవమని యూదులనేకులు అభిప్రాయపడుదురు. ఇది యూదులైన యేసు శిష్యులకు సంభవించినది. క్రైస్తవ విశ్వాసమును అసహ్యించుకొనుచు, తాము దేవుని సంతోషపరచుచున్నామని తలంచు దురు.పరిశుద్ధాత్మ - ఆదరణకర్త

ఒక వ్యక్తి కచ్చితమైన వాడును, ఎంతో ఆసక్తిపరుడును అయినప్పటికీ, అతడు తప్పు త్రోవలో నుండుటకు అవకాశము కలదని దీనినిబట్టి మనకు తెలియుచున్నది.

16:3,4 క్రీస్తుయొక్క దైవత్వము గుర్తించకపోవుటే దీనికి మూలకారణము. యూదు లాయనను స్వీకరించలేదు గావున వారు తండ్రిని అంగీకరించుటకు నిరాకరించిరి కనుక ప్రభువు ఇవి సంభవించునపుడు వారు తప్పిపోకుండునట్లు ఆయన హెచ్చరిం చెను.

Read and Learn More Telugu Bible Verses

అయితే తమ జీవితముపట్ల ఆయన ఒక ఉద్దేశము గలవాడై ఈ విషయములు తమకు బయలు పరచినట్లుగా గుర్తుంచుకొనిరి. ఆయన వారితో ఉన్నపుడు ముందుగా వారికీ విషయములు తెలుపలేదు.

ఆయన వారితో నున్నపుడు వారు ఈ విషయములను గురించి ఆలోచించి, చింతించకుండునట్లు ఆయన వారికీ విషయములను ముందుగా బోధించలేదు. ఇప్పుడైతే ఆయన వెడలిపోవు కాలము సమీపించెను గనుక వారికొరకై ఏర్పాటు చేయబడిన మార్గమును వారికి బోధించెను.

పరిశుద్ధాత్మ – ఆదరణకర్త – Bible Verses Chapter 16 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

సత్యాత్మయొక్క రాక (16:5-15)

16:5 ప్రభువుకొరకు ఏమి సిద్ధపరచబడియున్నదో తెలిసికొనుటకు ఇష్టము లేనివారై శిష్యులు తమ నిరుత్సాహమును తెలియచేసిరి. వారు సాధారణమైన తలంపుతో మీరెక్కడికి వెళ్ళుచున్నారని ప్రభువు నడిగిరి గాని ఆసక్తితో అడిగినట్లుగా లేరు.

ఆదరణకర్త అర్థం తెలుగులో

సత్యాత్మయొక్క రాక (16:5-15)

యోహాను సువార్త – వ్యాఖ్యానము

16:6 ఆయనకు జరుగబోవు సంగతులకంటే తమకు సంభవింపబోవు సంగతులపై వారు ఎక్కువగా మనస్సునుంచిరి. ఆయనముందు సిలువ, సమాధి ఉంచబడియున్నవి. వారి ముందు ప్రభువుకొరకు పరిచర్యలో ‘హింస’ ఉంచబడియున్నది.

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

ఆయన పొందనై యున్న శ్రమలను గురించికాక వారు పొందనైయున్న శ్రమలకొరకు చింతించుచున్నారు. 16:7 వారు నిరాదరణగా వదలివేయబడలేదు పరిశుద్ధాత్మ దేవుని వారికి సహాయ కారిగా ప్రభువు పంపెను. ఆదరణకర్త రాక శిష్యులకు యుక్తమైనది.

ఆయన (పరిశు ద్ధాత్మ దేవుడు) వారిని శక్తివంతులనుగాచేసి, ధైర్యవంతులనుగాచేసి, బోధించి, క్రీస్తును వారికి గతముకంటె ఇప్పుడు మరెక్కువగా ప్రత్యక్షపరచెను. ప్రభువైన యేసు పరమునకు తిరిగివెళ్ళి మహిమపరచబడువరకు ఆదరణకర్త పంపబడలేదు.

ఈ సంఘటనకు పూర్వము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనుండెను గాని ఇప్పుడాయన రాక ఒక క్రొత్తదనమును కలిగియున్నది. అదెట్లనగా లోకమును ఒప్పింపచేయుటకును, విమోచింపబడిన వారికి పరిచర్య చేయుటకును ఆయన వచ్చియుండెను.

16:8,9 పరిశుద్ధాత్మ దేవుడు లోకములోని పాపమును ఒప్పింపజేయును, నీతిని గూర్చి ఒప్పింపచేయును. మరియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయును. పాపి జీవితములో పాపమునుగూర్చియు, నీతినిగూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్నాడని చెప్పవచ్చును.

ఇది వాస్తవమైన యెడల ఈ భాగములో బోధ ఈ విషయమై కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తానెందునిమిత్తమై ఈ లోకములో నుండెనో దానిని గురించి లోకమును శిక్షించుచుండెను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండుటకంటే ప్రభువైన యేసు ఇక్కడ ఉండి, ప్రపంచమును పరిపాలించవలసియుండెను.

ఈ లోకములోనుండి వారి నేరమునుగూర్చి సాక్ష్య మిచ్చుచుండెను.

అయితే లోకమాయనను అంగీకరించలేదు. కనుక ఆయన తిరిగి పరలోకమునకు వెళ్ళెను. క్రీస్తు నెట్టివేయబడిన స్థలములో పరిశుద్ధాత్మ దేవుడుండెను. గనుక లోకపాపము విపులీకరింపబడెను. క్రీస్తును అంగీకరించలేని పాపమును, లోకమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయు చుండెను.

ఆయన నమ్మదగినవాడు. ఆయనను నమ్మలేకుండునట్లు ఆయనయొద్ద అసాధారణ సంగతులను మనము గమనించలేము. ఆయితే వారాయనను తృణీకరిం చిరి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనుండి వారి నేరమునుగూర్చి సాక్ష్య మిచ్చుచుండెను.

పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత

రక్షకుడు నీతిమంతుడని బయలుపరచుచుండగా వారాయనను “దయ్యము పట్టినవాడనిరి.” దేవుడు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. “నా కుమారుడు నీతిమంతుడు. ఆయనను మృతులలోనుండి లేపి, పరమునకు తిరిగి చేర్చుకొందును” అని దేవుడు చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడుకూడ క్రీస్తు నిజమనియు, లోకము అబద్ధమనియు సాక్ష్యమిచ్చుచుండెను.

16:11 పరిశుద్ధాత్మ దేవునియొక్క ఉనికి ఈ లోకమునకు తీర్పు రానైయున్నదని ఒప్పించుచున్నది. సాతాను సిలువలో నలుగగొట్టబడెననియు మరియు రక్షకుని ద్వేషించువారందరు రానున్న దినములలో భయంకరమైన తీర్పునకు లోనౌదురనియు పరిశుద్ధాత్ముని ఉనికి తెలియజేయుచున్నది.

16:12 అనేక సంగతులను ఆయన వారికి చెప్పవలసియున్నది గాని ఇప్పుడు వారు వాటిని గ్రహింపలేరు, బోధనా పద్ధతులలో ఇదియొక ముఖ్యసూత్రము. నిగూఢమైన సత్యములను తెలిసికొనకముందు వినుటలో అభ్యాసము అవసరము. తన బోధలో వారినెప్పుడు ఆయన ఇబ్బంది కలిగించక, ఒకదాని తరువాత నొకటి, ఒక సూత్రము తరువాత మరియొక సూత్రము చెప్పెడివాడు.

16:13 ప్రభువు ప్రారంభించిన పనిని పరిశుద్ధాత్ముడు కొనసాగింపనైయున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వసత్యములోనికి నడిపించును. శిష్యుల జీవిత కాలములో ఈ సర్వసత్యము వారికి అప్పగింపబడెను.

వారు దానిని వ్రాతపూర్వకముగా క్రొత్త నిబంధనలో పొందుపరచి మనకు అప్పగించిరి. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనకు జతచేయబడి, దేవునియొక్క వ్రాతపూర్వకమైన ప్రత్యక్ష మానవులకు అప్పగింపబడెను.

అన్ని యుగములలోను దేవుని ఆత్మ దేవుని ప్రజలను సర్వ సత్యములోనికి నడిపించును ఇది వాస్తవము. లేఖన భాగములద్వారా ఆయన దీనిని నెరవేర్చెను. తనను గూర్చితాను చెప్పుకొనుటలేదని యేసుప్రభువు చెప్పెను.

తననుగూర్చి తాను చెప్పుకొనుటలేదనగా తనంతట తానేమియు మాటలాడుట లేదని అర్థము. అనగా తన అధికారముతో ఏమియు మాటలాడుటలేదు. తండ్రియు కుమారుడు తనకు ఏమి అనుగ్రహిస్తే దానినే పరిశుద్ధాత్ముడు బోధించును.

 

పరిశుద్ధాత్మ - ఆదరణకర్త Bible Verses Chapter 16

జరుగబోవు సంగతులు ఆయన చూపించును. ఇది క్రొత్త నిబంధనలో చెప్పబడినది. ముఖ్యముగా ప్రకటన గ్రంథములో భవిష్యత్సంఘటనలు వివరింపబడెను. పరిశుద్ధాత్మ దేవునియొక్క ముఖ్యమైన పని క్రీస్తును మహిమపరచు టయే.

ఆయన నేర్పునది, బోధించునది ఏమైనది దీనినిబట్టి మనము పరిశీలించ వచ్చును. ఉపదేశించునదిగాని, బోధించునదిగాని రక్షకుని స్తుతించునదియైన, అది పరిశుద్ధాత్ముని పని యని చెప్పవచ్చును. ‘ఆయన నాలోనివి తీసికొనును’ అనగా, ‘నన్ను గూర్చిన గొప్ప సంగతులు గ్రహించును’ అని భావము. ఈ విషయములను ఆయన విశ్వాసులకు విశదపరచును. ఈ అంశమింతటితో విరమించుటలేదు.

16:15 తండ్రి కలిగియున్న సమస్తము కుమారుడు కలిగియుండెను. ఈ వాస్తవాలను గూర్చి ప్రభువైన యేసు 14వ వచనములో చెప్పియుండెను. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి హృదయానికి ప్రభువునుగూర్చిన మహిమకరమైన వాస్తవాలను, పరిచర్యలను, పలువిధములైన పనులను, కృపలను ప్రభువుయొక్క పరిపూర్ణతను తెలియజేసెను.

దుఃఖము ఆనందముగా మార్చబడుట (16:16-22) : 16:16 ఈ వచనముయొక్క భావము స్పష్టముగా విపులీకరించబడలేదు. ‘ప్రభువు వారికి మూడు దినములు అగుపించకుండా పోయి మరల పునరుత్థానము తరువాత వారికి కనుపించును’ అని దీని భావమైయుండవచ్చును.

బైబిల్‌లో ఆదరణకర్త గురించి వచనాలు

లేక, ‘పరలోక మందున్న తండ్రియొద్దకు ఆయన వెళ్ళి కొంత సమయము (ఈ యుగ సమాప్తి) తరువాత వారియొద్దకు మరల వచ్చును (ఆయన రెండవరాకడ’ – అని దీని భావమై యుండ వచ్చును లేక, ‘వారి శరీరసంబంధమైన నేత్రములతో కొంత కాలము ఆయనను చూడకపోయినను, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన పిమ్మట వారియొక్క విశ్వాసమునుబట్టి మునుపెన్నడు ఆయనను చూడనిరీతిగా వారాయనను చూతురని’ దీని భావమైయుండవచ్చును.

16:17 శిష్యులు కలవరపడిరి. వారట్లు కలవరపడుటకు కారణము ఆయన 10వ వచనమునందు ‘నేను నా తండ్రియొద్దకు వెళ్ళెదను. ఇక మీరు నన్ను చూడరు’ అని చెప్పెను. ఇప్పుడు ‘ఆయన కొంతకాలము నన్ను చూడరుగాని మరి కొంతకాలము నకు నన్ను చూచెదరని’ చెప్పుచున్నాడు. అయితే వారీ తేడాను గమనించలేదు.

16:18 ‘మరికొంతకాలమునకు’ అని ఆయన చెప్పిన మాట అర్థమేమిటని వీరు తమలోతాము చర్చించుకొనుచుండిరి. ఈ సమస్య మనదికూడ. ఆయన చెప్పిన ఈ మాట పునరుత్థానమునకు మూడురోజుల ముందునకు సంబంధించినదా లేక ఆయన రెండవ రాకడకు ముందు దాదాపు 1900 సం॥ల కంటే ఎక్కువైన కాలమునకు సంబంధించినదా అను విషయము మనకుకూడ కచ్చితముగా తెలియదు.

16:19,20 ప్రభువైన యేసు – దేవుడై యుండి, వారి తలంపులను ఎరిగియుండెను. వారి కలవరమునుగూర్చి అనేక ప్రశ్నలు వేసి వారి సమస్య తాను పూర్తిగా ఎరిగి యున్నట్లు వారికి తెలియజేసెను. వారియొక్క సమస్యకు సూటిగా సమాధానమివ్వక ‘మరి కొంతకాలమునకు’ అను మాటకు మరికొద్ది వివరణ ఇచ్చెను.

లోకమునకు ఈ సమయము సంతోషభరితమైనది. ఎందుకనగా క్రీస్తుప్రభువును సిలువవేయుటలో ఈ లోకము గెలుపొందినది. శిష్యులకు ఈ సంగతి ఏడ్పును, దుఃఖమును కలిగించి నది. అయినను వారి దుఃఖము కొద్దికాలముండును.

మొదటిగా ఆయన పునరుత్థానము వలన, రెండవదిగా పరిశుద్ధాత్ముని రాకవలన వారి దుఃఖము ఆనందమునకు మార్చ బడును. అయితే అన్ని కాలములయందున్న ఆయన శిష్యులందరికి ఆయన రెండవసారి తిరిగివచ్చునపుడు వారి దుఃఖము పరిపూర్ణ ఆనందమునకు మార్చబడును.

ఒక స్త్రీ తనకు శిశువు పుట్టెనన్న సంతోషముతో తన ప్రసవవేదనను వెంటనే మరచిపోవును. ఈ సందర్భములో తప్ప మరి ఏ విషయములోను ఒక వ్యక్తి ఇంత త్వరగా తన బాధను మరచిపోలేడు.

అయితే బిడ్డను కనిన స్త్రీ విషయములో జరిగిన విధముగానే శిష్యుల విషయములోను జరుగును. ప్రభువు వారితో నుండకపోవుట వలన కలిగిన దుఃఖము ఆయనను మరల చూచిన వెంటనే ఎగిరిపోవును.

16:22 “మిమ్మును మరల చూచెదనని” ప్రభువు పలికిన ఈ మాట యొక్క పునరుత్థానమునకు లేక పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పంపుటకు లేక ఆయన రెండవరాకడకు ఈ మూడు విషయములలో దేనికి గుర్తుగా ఉన్నదో కచ్చితముగా మనము చెప్పలేము. అయినప్పటికి ఈ మూడు విషయములలో ఫలితము ఒక్కటే. అది – ఆనందము నిలిచియుండే ఆనందము.

యేసునామమున తండ్రిని ప్రార్థించుట (16:23-28) :

16:23 ఇంతవరకు శిష్యులాయనను ప్రశ్నలడుగుచు, మనవి చేయుచు వచ్చిరి. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన నాటనుండి ప్రభువు భౌతికముగా (శరీరముతో) వారితో ఇక నివసింపడు. గనుక వారిక ప్రశ్నలు వేయనవకాశము లేదు.

అనగా వారు వెళ్ళుటకు వారికి ఎవరును లేరు – అని భావముకాదు. ఇప్పుడు యేసు నామమున తండ్రియైన దేవునికి ప్రార్థించు భాగ్యము వారికి కలిగెను. ప్రభువైన యేసునుబట్టి వారి మనవులు ఆలకింపబడును.

‘నా నామమున మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడును’ అని యేసు చెప్పెను. మనయొక్క యోగ్యతనుబట్టి మన మనవులు ఆలకింపబడవు. గాని ప్రభువైన యేసుయొక్క యోగ్యతనుబట్టి మన మనవులు ఆలకింపబడును.

పరిశుద్ధాత్మ మరియు ఆదరణకర్త సంబంధం

16:24 _ ఇంతకు మునుపు వారెప్పుడును ప్రభువైన యేసు నామమున తండ్రియైన దేవునికి ప్రార్థింపలేదు. అట్టివారికి ఇప్పుడు ఆ నామమున ప్రార్థించు భాగ్యము కలిగినది. జవాబు పొందిన ప్రార్ధనలవల్ల వారి సంతోషము పరిపూర్ణమైనది.

16:25 ప్రభువుయొక్క బోధనా సారాంశము వెంటనే బోధపడదు. ఆయన దృష్టాంతములను, సామెతలను ఉపయోగించెడివాడు. ఈ అధ్యాయమునందు సహితము మనము సరియైన అర్థమును గ్రహించలేము.

పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత తండ్రిని గూర్చిన సమాచారము విపులముగా తెలియవచ్చెను. అపొస్తలుల కార్యముల గ్రంథములోను, పత్రికలలోను ‘సత్యము’ దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

పత్రికలలోను 'సత్యము' దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

16:26 మనము నివసించు ఈ పరిశుద్ధాత్మ యుగమునందు ప్రభువైన యేసు నామమునందు తండ్రికి ప్రార్థించు భాగ్యము మనకు కల్గెను “మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు” అని యేసు చెప్పెను. తండ్రి మన ప్రార్థనలకు జవాబిచ్చుటకు ఆయనను బలవంతపెట్టనవసరము లేదు.

ప్రభువు ఆయనను బ్రతిమాలుకొననవసరము లేదు. కాని అదే సమయమునందు ప్రభువైన యేసు దేవునికి మానవునికి మధ్యవర్తియైయుండి తన ప్రజల పక్షమున దేవుని సింహాసనముయెదుట విజ్ఞాపన చేయును.

16:27 తండ్రి శిష్యులను ప్రేమించుచున్నాడు. ఎందుకనగా వారు క్రీస్తును స్వీక రించి, ప్రేమించి, ఆయన దైవత్వమునందు విశ్వాసముంచిరి. ఈ కారణమునుబట్టియే ప్రభువు తండ్రిని వేడుకొనుట లేదు. పరిశుద్ధాత్ముని రాకతో శిష్యులు తండ్రితో నూతన సంబంధమును కలిగియున్నారు. వారు ఆయన కుమారుని ప్రేమించినందున ధైర్యముతో తండ్రి సన్నిధికి వెళ్ళగలరు.

16:28 తండ్రియైన దేవునితో తన సమానత్వమును ఆయన మరల నిర్ధారించు చున్నాడు. తాను ఒక ప్రవక్తవలే దేవునియొద్దనుండి పంపబడియున్నానని చెప్పుటలేదు. అయితే నేను “తండ్రియొద్దనుండి పంపబడియున్నాను” అని చెప్పుచున్నాడు.

కనుక ఆయన నిత్యుడగు తండ్రికి నిత్యుడగు కుమారుడైయున్నాడు. మరియు తండ్రియైన దేవునితో సమానత్వము కలవాడు. ఆయన భూమిపైకి వచ్చినపుడు మునుపు తానెక్కడో జీవించియున్నట్లుగా వచ్చెను. ఆయన ఆరోహణమైనపుడు ఈ లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్ళెను. ఇది మహిమాన్వితుడైన ప్రభువుయొక్క క్లుప్తమైన జీవితచరిత్ర.

శ్రమలు మరియు సమాధానము (16:29 – 33 ) :

16:29,30 మొదటిసారిగా వారు ఆయనను గ్రహించగలిగినట్లుగా తలంచిరి. ఇప్పుడాయన సామెతలు ఉపయోగించక మాటలాడుచున్నట్లుగా చెప్పిరి. ఆయన వ్యక్తిత్వమునుగూర్చిన మర్మమును వినుచున్నామని గ్రహించిరి.

ఆయన దేవుని యొద్దనుండి వచ్చెననియు, ఆయన అనంతజ్ఞానియనియు వారు నమ్మిరి. అయితే ఆయన తాను తండ్రియొద్దనుండి వచ్చియున్నానని చెప్పెను. వారు దీని అర్థమును గ్రహించిరా? త్రిత్వమైన దేవునిలో యేసు ఒక వ్యక్తియని నమ్మియున్నారా?

పరిశుద్ధాత్మ మరియు ఆదరణకర్త సంబంధం

16:31,32 వారి విశ్వాసము ఇంకను అసంపూర్ణమైనదని ప్రభువు చెప్పెను. వారాయనను ప్రేమించియున్నారనియు, నమ్మియున్నారనియు ఆయనకు బాగుగా తెలియునుగాని వారు నిజముగా ఈయన మానవ రూపము ధరించిన దేవుడని నమ్మియున్నారా? స్వల్ప కాలములోనే ఆయన పట్టబడి, హింసింపబడి, చంపబడెను.

పత్రికలలోను 'సత్యము' దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

ఆయన శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. అయితే ఆయన ఒంటరిగా విడిచి పెట్టబడలేదుగాని తండ్రి ఆయనతో నుండెను. తండ్రియైన దేవునికి, ఆయనకు గల సంబంధమునే వారు గ్రహింపరైరి. శిష్యులు తమ ప్రాణములను కాపాడుకొనుటకు పారిపోయినప్పుడు తండ్రి సహవాసమే ఆయనను బలపరచెను.

16:33 వారి సమాధానముకొరకు ఆయన వారితో ఇట్లు సంభాషించెను. తాము ద్వేషింపబడినను, తరుమబడినను, హింసింపబడినను, అన్యాయముగా శిక్షించబడినను ఆయనయందు వారికి సమాధానము కలదు. కలువరి సిలువలో ఆయన లోకమును జయించెను. తమకు శ్రమలు సంభవించినప్పటికి వారు జయమునొందిరి. పరిశు ద్ధాత్మ దేవుని రాకతో ఓర్పునొందినవారై నూతన ధైర్యముతో శత్రువును (విరోధిని) ఎదుర్కొనగలిగిరి.

మార్గములో సంభాషణ – Bible Verses Chapter 15 in Telugu

పదిహేనవ అధ్యాయము

మార్గములో సంభాషణ

“నేనే నిజమైన ద్రాక్షావల్లిని” (15:1-11) :

15:1 పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము యెహోవా నాటిన ద్రాక్షాతోటగా చెప్పబడెను, అయితే ఆ ప్రజలు అవిధేయులై ఫలింపనందువలన ప్రభువైన యేసు ‘నిజమైన ద్రాక్షావల్లి’ ఆయెను. తండ్రియైన దేవుడు వ్యవసాయకుడు – అనగా ద్రాక్షా తోటను కాయువాడు.

15:2 ఫలింపని తీగెనుగూర్చి వేర్వేరు అభిప్రాయములు కలవు. విశ్వాసముతో క్రీస్తును అంగీకరించక, క్రైస్తవునివలె నటించువాడని ఈ తీగెను గూర్చి కొందరు చెప్పుదురు. ఫలించుటలో విఫలులగుటవలన రక్షణను పోగొట్టుకొనిన నిజక్రైస్తవులని మరికొందరు చెప్పుదురు.

కాని బైబిలునందలి అనేక లేఖన భాగములు ‘ఒక విశ్వాసి యొక్క రక్షణ నిత్యము నిలచియుండును’ అని బోధించుటవలన ‘రక్షణను కోల్పోవుట’ అనునది అసాధ్యమని స్పష్టమగుచున్నది. ‘మరి కొందరు, ఫలింపని తీగె’ అనగా విశ్వాసములో వెనుకతీసిన ఒక నిజక్రైస్తవుడు అని చెప్పుదురు.

మార్గములో సంభాషణ అర్థం

అట్టివాడు ప్రభువును విడిచినవాడై లోకవిషయములందాసక్తి కలిగియుండును. మరియు అట్టివాడు ఆత్మఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములను ప్రత్యక్షపరచుటకు విఫలుడైనవాడు తత్ఫలితముగా ప్రభువు వానిని అనారోగ్యముతోను, దుఃఖముతోను శిక్షించును. కొన్నిసార్లు విషమించిన పరిస్థితులలో అతని చెడ్డ సాక్ష్య జీవితాన్నిబట్టి ప్రభువు అతనిని ఈ లోకమునుండి తీసివేయును.

‘ఫలించెడి తీగె’ అనగా ప్రభువైన యేసువలె ఎదుగు విశ్వాసిని సూచించుచున్నది. ఫలించెడి కొమ్మను సహితము శుద్ధిచేయవలసిన అవసరమున్నది. ద్రాక్షాతీగెను కీటకములనుండియు, తెగులునుండియు, బూజునుండియు శుభ్రపరచుచున్నట్లుగా, క్రైస్తవుని ఈడ్చుకొనిపోవు లోకాశలనుండి వానిని శుభ్రపరచవలసి యున్నది.

Read and Learn More Telugu Bible Verses

15:3 విశ్వాసిని శుభ్రపరచునది ప్రభువు వాక్యమే. ఆయన శిష్యులు వారి సంభాషణలో దేవుని వాక్యముద్వారా శుద్ధిచేయబడిరి. పైగా రక్షకుడు వారితో మాటలాడుచుండగా వారి జీవితములలో శుద్ధిజరగుచుండెడిది. ఇట్లు ఈ వాక్యము న్యాయము తీర్చుటను, పరిశుద్ధపరచుటను సూచించుచున్నది.

15:4 ‘నిలిచి యుండుట, అనగా ఉన్నచోటుననే నిలిచియుండుమని అర్ధము. క్రైస్తవుడు నిలిచియుండు స్థలము క్రీస్తే. అనుదిన జీవితములో క్రైస్తవుడు క్రీస్తుతో సహవాసము కలిగియుండును. కొమ్మ తీగెలో నిలిచియుండి, దానిలోని జీవమును, సారమును గ్రహించును.

మార్గములో సంభాషణ – Bible Verses Chapter 15 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

మనము ప్రార్థన చేయుటద్వారా, వాక్యము చదువుటద్వారా, ఆయన ప్రజలతో సహవాసము కలిగియుండుటద్వారా, ఆయనతో మనము ఏకమై యున్నామనే నిశ్చయతను కలిగియుండుటద్వారా – మనము ఆయనలో నిలచియుం దుము.

ఇట్లు మనమాయనతో సన్నిహిత సంబంధము కల్గియుండినచో ఆయన మనలో నిలిచియున్నాడనియు, మనకు ఆత్మీయ స్థైర్యమును కలిగించి, ఆధారము చూపించుచున్నాడని గ్రహించవలయును. తీగెలో నిలిచియున్న కొమ్మ ఫలించును. క్రీస్తువలె ఫలింపనాశగల క్రైస్తవులు క్రీస్తుతో సహవాసము కలిగియుండవలెను.

బైబిల్‌లో మార్గములో సంభాషణ వివరణ

మార్గములో సంభాషణ “నేనే నిజమైన ద్రాక్షావల్లిని” (15:1-11) :

15:5 క్రీస్తు – ద్రాక్షావల్లి, విశ్వాసులు – తీగెలు ద్రాక్షావల్లికొరకు ఫలించుట అనునది ప్రశ్నకాదు గాని, ద్రాక్షావల్లిలోని జీవమును తమద్వారా ప్రవహింపజేయుట అనునది ముఖ్యము. కొన్నిసార్లు మనము ‘ప్రభువా నేను నీకొరకు జీవించుటకు సహాయము చేయుము’ అని ప్రార్థింతుము.

కాని మనము ‘ప్రభువా! నాద్వారా జీవించుము’ అని ప్రార్థించుట మంచిది. క్రీస్తుకు వేరుగా మనము ఏమియు చేయలేము. ద్రాక్షాతీగెయొక్క ముఖ్య ఉద్దేశము ఫలించుట. ద్రాక్షాతీగెలు వస్తుసామగ్రి చేయుటకు గాని, ఇండ్లు కట్టుటకుగాని ఉపయోగపడవు ఇది వంట చెరకుగా కూడ ఉపయోగపడదు. అయితే ఇది ఫలములు ఫలించుటకు బాగుగా ఉపయోగపడును. అయితే ఆ తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని ఎక్కువగా ఫలించదు.

15:6 ఈ వచనము చాలా భేదాభిప్రాయము కలిగించుచున్నది. విశ్వాసిగా పరిగ ణింపబడినవాడు పాపములో పడినయెడల అతడు పూర్తిగా నశించిపోవునని కొందరు చెప్పుదురు. కాని ‘నిజమైన దేవునిబిడ్డ ఎప్పటికిని నశించడు’ అని చెప్పు దేవుని వాక్యమును ఇది వ్యతిరేకించుచున్నది.

‘నశించువాడు’ అనగా – తాను మారుమనస్సు పొందకయే విశ్వాసినని చెప్పుకొనువాడు అని కొందరు తలంచెదరు. యూదాను ఇందుకు ఉదాహరణగా చెప్పుదురు. అయితే దీనికి సరియైన అర్థము ఈ విధముగా చెప్పవచ్చును – ఈ లేఖన భాగము నిజవిశ్వాసులకు సంబంధించినది కావున ఇతడు విశ్వాసియే అయివుండవచ్చును.

ఇక్కడ రక్షణను గూర్చి కాదుగాని, ప్రాముఖ్యముగా ‘నిలిచియుండుట’ మరియు ‘ఫలించుట’ అను వాటిని గూర్చి వ్రాయబడినది. ఒకడు అలక్ష్యముగా నుండుటవలన, ప్రార్థనా రహితముగా నుండుటవలన దేవునితో సంబంధము పోగొట్టుకొనును. తత్ఫలితముగా అతడు పాపము చేసి తన సాక్ష్యమును పాడుచేసికొనును.

ఇట్లు క్రీస్తులో నిలిచియుండుటయందు విఫలుడైన వ్యక్తి ఫలింపని తీగెవలె క్రీస్తువలన కాదుగాని మనుష్యులవలననే పారవేయబడును. మనుష్యులు అట్టి తీగెలను ప్రోగుచేసి, కాల్చివేయుదురు, అవి కాల్చివేయబడును.

ఇట్టిపని చేయునది దేవుడుగాని, దూతలుగాని కాదు. మనుష్యులే. దీని అర్థమేమి? వెనుకంజవేసిన క్రైస్తవుని మనుష్యులు దూషింతురు. అట్టివాని పేరును మట్టుపెట్ట తలంతురు. అతనియొక్క సాక్ష్యమును నిప్పులో పడవేసి కాల్చివేతురు.

బైబిల్‌లో మార్గములో సంభాషణ వివరణ

దీనిని మనము దావీదు జీవితములో చూచెదము. అతడు నిజమైన విశ్వాసి. అతడు తన హృదయ ములో దేవునిపట్ల చల్లారిన పరిస్థితి గలవాడై వ్యభిచారమును, నరహత్యను గావించెను. ప్రభువు శత్రువులు దైవదూషణ చేయుటకు అతడు అవకాశమిచ్చెను.ఇప్పటికి నాస్తికులు దావీదును, దావీదు దేవునిని దూషింతురు.

15:7,8 ‘నిలిచియుండు జీవితము’ అనునది ఫలభరితమైన ప్రార్థనా జీవితముయొక్క రహస్యము. మనము ప్రభువును సమీపించుకొలది ఆయనను గూర్చిన సంగతులు మరి ఎక్కువగా తలంచుదుము. ఆయన వాక్యముద్వారా మనమాయనను ఎక్కువగా తెలిసికొన్నప్పుడు మరెక్కువగా ఆయన చిత్తమును కనుగొనగలము.

ఆయన చిత్తమే మన ఇష్టమైనయెడల మన ప్రార్థనలకు కచ్చితముగా జవాబు దొరుకునని మరెక్కువగా నమ్మవచ్చును. దేవుని పిల్లలు క్రీస్తును లోకమునకు ప్రత్యక్షపరచినయెడల తండ్రి ఘనతనొందును. కౄరులైన పాపాత్ములను దేవుని పరిశుద్ధులుగా మార్చిన దేవుడే గొప్ప దేవుడని ప్రజలు బలముగా ఒప్పింపబడుదురు.

మార్గములో సంభాషణ Bible Verses Chapter 15

ఈ అధ్యాయములో మనము గమనించినట్లయిన మొదటిగా “ఫలించుట” ఆ తరువాత ‘బహుగా ఫలించుట’ అను మాటలను గమనింతము. క్రీస్తునందు అంటు కట్టబడిన వాడు శిష్యుడు కాగలడని దీని అర్థము కాదు. ఒకడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచునప్పుడు ఆయన శిష్యుడు కాగలడు.

ఆయన శిష్యులుగా ఆయన యందు నిలిచియుండుటవలన ఆయనను ప్రత్యక్షపరచుదుము. మన మాయనను పోలియుండునపుడు మనమాయన నిజమైన శిష్యులముగా ఇతరులు గుర్తించుదురు.

15:9,10 తండ్రికి కుమారునిపట్ల ప్రేమ ఎంతో రక్షకునికి మనపట్లగల ప్రేమ అంతే. ఈ వాక్యములు మనము ధ్యానించినప్పుడు ఆరాధనతో నిండిన హృదయములతో ఆయనకు మ్రొక్కుదము. ఈ ప్రేమ స్థాయిలోను, గుణములోను తీసిపోనిది. ప్రేమయొక్క ఎత్తుగాని, లోతుగాని, కొలతకు అందనిది, మన జ్ఞానమునకు అందనిది, మానవుడు సంపూర్ణముగా గ్రహించలేనిది.

ఇట్టి ప్రేమలో కొనసాగమని యేసు చెప్పుచుండెను. ఆయన ప్రేమలో కొనసాగుచు, దానియందు మన జీవితములలో ఆనందించుదుము. ఈ వచనములోని మొదటి భాగము మనమెట్లు ఆయనయందు నిలిచియుండగలమో వివరించుచున్నది.

మార్గములో సంభాషణ బైబిల్ స్టడీ గైడ్

ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటద్వారా ఆయన ప్రేమయందు నిలిచియుందుమని చెప్పుచున్నది. ఈ వచనములోని రెండవ భాగము మన ముందున్న ‘నిర్ధిష్టమైన నమూనా’ను చూపించుచున్నది.

ప్రభువైన యేసు తన తండ్రి ఆజ్ఞలను నెరవేర్చెను. తాను చేసినదంతయు తండ్రి చిత్తమునకు విధేయుడై నెరవేర్చెను. తండ్రి ప్రేమయందు యేసు నిత్యము ఆనందించుచుండెను. ఆ మధురమైన సహవాసమును ఏదియు తప్పించివేయజాలదు.

15:11 తండ్రితో సహవాసమునందే యేసుయొక్క లోతైన ఆనందమున్నది. ఆయనపై ఆధారపడుట వలన తన శిష్యులు అట్టి ఆనందము పొందవలయునని ప్రభువు ఆశించుచుండెను. తన ఆనందమే తన శిష్యులదైయుండవలెనని ఆయన ఆశయైయున్నది.

అయితే మానవుల ఆశ ఏమనగా ప్రభువైన యేసుకు దూరముగా తాము ఆనందించగలిగినంత ఎక్కువ ఆనందము పొందనాశించుదురు. ఒకడు దేవుని తన హృదయములోనికి ఎంతగా ఆహ్వానించునో అంతగా ఆనందించునని ప్రభువు చెప్పుచున్నాడు.

మన ఆనందము పరిపూర్ణమగుటకు మన హృదయములలోనికి దేవుని ఆహ్వానించవలయునని దీని భావము. యేసుప్రభువుయొక్క ఆజ్ఞలు గైకొనుటలోను, ఆయనయందు నిలిచియుండుటలోను వారియానందము పరిపూర్ణమగును.

యేసుప్రభువుయొక్క ఆజ్ఞలు గైకొనుటలోను, ఆయనయందు నిలిచియుండుటలోను వారియానందము పరిపూర్ణమగును.

విశ్వాసి యొక్క భద్రతలోని అనుమానములనుగూర్చి ఈ అధ్యాయము నాధారముగా తీసికొని అనేకులు ప్రసంగించుదురు. అయితే ప్రభువు ఉద్దేశ్యము మన అనుమానములు తీరవలెననికాదుగాని, మన ఆనందము పరిపూర్ణము కావలెనని ఆయన చెప్పుచుండెను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడని శిష్యులకాజ్ఞాపించుట (15:12-17) :

15:12 ప్రభువు తన శిష్యులను శీఘ్రముగా విడచి వెళ్ళవలసియున్నది. ప్రతి కూలమైన లోకములో వారు విడచిపెట్టబడనైయున్నారు. ఇట్టి ఉద్రిక్త పరిస్థితులలో వారు ఒకరితో నొకరు కలహించుకొను అపాయకరమైన పరిస్థితులలో ఉన్నందున ప్రభువు వారికి నూతనముగా ఒక ఆజ్ఞ ఆజ్ఞాపించుచున్నాడు.

అదేమనగా – నేను మిమ్మును ప్రేమించు చున్నట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. వారిలో ఒకరికొరకొకరు చావసిద్ధమై యుండవలసినది. ఇట్లు చేయగోరువారు ఒకరితోనొకరు కలహించుకొనరు.

తన స్నేహితునికొరకు చనిపోవనుద్దేశించువాడే ఆత్మ త్యాగము చేయు గొప్ప మానవత్వము గలవాడు. విశ్వాసులైనవారు ఇట్టి స్థితికి ఎదుగవలసియున్నారు. కొందరు అక్షరార్థముగా తమ ప్రాణములర్పింపవలసియున్నారు. మరి కొందరు తమ జీవితకాలమంతయు దేవునిబిడ్డలకు పరిచర్యచేయ సమర్పించుకొందురు.

ప్రభువే మనకు మాదిరి. తన స్నేహితులకొరకు ఆయన మరణించెను. మనము జన్మించినప్పటినుండి మన మాయనకు విరోధులమే. అయితే మనము రక్షింపబడిన పిమ్మట మనమాయనకు స్నేహితులమైతిమి. కనుక ఆయన తన స్నేహితుల కొరకును మరియు తన శత్రువుల కొరకును మరణించెనని చెప్పుటలో ఇది యథార్థమైన విషయము.

15:14,15 మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల ఆయనకు స్నేహితులమై యుందుము. ఆయన స్నేహితులైయుండుటకు ఇది మార్గము కాదుగాని, అయితే మనము ప్రపంచమునకు చూపించవలసిన మార్గమిది. సేవకునికి స్నేహితునికిగల తేడాను ప్రభువు ఇక్కడ తేటగా వివరించుచున్నాడు.

క్రీస్తు మార్గములో సంభాషణ విషయంలో పద్యాలు

సేవకుడు తనకు నియమింప బడిన పనిని చేయువాడు. స్నేహితుడైతే నమ్మకమును సంపాదించుకొని పనిచేయును. మన భవిష్యత్తునుగూర్చిన ప్రణాళికను స్నేహితునికి తెలియజేయుదుము.

రహస్యము లనుగూడ స్నేహితునితో పంచుకొందుము. ఆయన శిష్యులెల్లప్పుడు ఆయనకు శిష్యులుగా ఉండగోరిరి. అయితే వారు మరెక్కువగా ఆయనకు స్నేహితులైరి. తన తండ్రివద్ద వినిన సంగతులను సైతము ప్రభువు వారికి తెలియజేసెను.

తాను వెడలి పోవు సంగతికూడ వారికి తెలియజేసెను. మరియు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చునన్న సంగతి ఆయన తిరిగి రానైయున్న సంగతి, ఆయనపట్ల వారి బాధ్యతను గురించి వివరించెను. కొందరు – మనము కొమ్మలవలె గ్రహించుదుము, శిష్యులవలె అనుస రించుదుము (8వ) స్నేహితునివలె సహవాసము కలిగియుందుమని చెప్పుదురు.

15:16 వారు నిరుత్సాహముతో ఎప్పుడైనను తమకు అప్పగింపబడినదానిని వదలివేయుదురను తలంపుతో ఆయన వారిని తాను ఏర్పరచుకొనియున్నానని వారికి తెలియజేసెను. వారిని నిత్యరక్షణకును, శిష్యత్వమునకును, ఫలించుటకును ఏర్పరచు కొనెను.

నేను మిమ్మును ప్రత్యేకించియున్నాను అనగా అభిషేకించియున్నానని చెప్పెను. ఇది ఇప్పుడు మానవులు చేయు అభిషేకమువంటిది కాదు. క్రీస్తువలన ఏర్పరచబడిన వారై, వారి కప్పగింపబడిన పనిని చేయుటలో వారికి గుర్తుచేయుటను సూచించును.

మనము ఫలింపవలసియున్నాము. ‘ఫలించుట’ అనగా క్రైస్తవ జీవితముయొక్క కృపలైన ప్రేమ, సంతోషము, సమాధానము మొ||వి కావచ్చును. లేదా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటయై యుండవచ్చును ఈ రెండు విషయములకు దగ్గర సంబంధము కలదు.

మనము మన జీవితములో మొదటి రకమైన ఫలమును (ప్రేమ, సంతోషము… మొదలగునవి) కలిగియున్నప్పుడు మాత్రమే రెండవ ఫలమును ఫలించగలము. “మీ ఫలము నిలిచి యుండనియ్యుడి” అని చెప్పుటలో ‘ఫలము’ అనగా రక్షింపబడిన ఆత్మలు.

ఎల్లప్పుడు నిలిచియుండే ఫలమును ఫలించుటకు ప్రభువు శిష్యులను ఏర్పరచుకొనెను. కేవలము నోటిమాటచేత తనను విశ్వసించి ఒప్పుకొనుట యందు ఆయన ఆసక్తిని కలిగిలేడు కాని నిజమైన రక్షణ అనుభవము కలిగియుండాలని ఆయన కోరుచున్నాడు. యల్. యస్. ఛాఫర్ (L.S. Chafer) – “ఈ అధ్యాయమునందు ప్రభావము గల్గిన ప్రార్థన (7వ॥).

పరిపూర్ణమైన సంతోషము (11వ॥), శాశ్వతమైన ఫలము (16వ॥) – అను వాటిని మనము చూడగలమని” చెప్పెను. “కాబట్టి మీరు అడుగు ప్రతిదానిని …” ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే. క్రీస్తుపేర ఏమి అడిగినను తండ్రి దానిని అనుగ్రహించునను వాగ్దానముతో శిష్యులను ఈ లోకములోనికి ప్రభువు పంపెను.

ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే.

15:17 ఈ లోకమునకు, వారికి మధ్యగల వైరమునుగూర్చి ప్రభువు వారిని హెచ్చరించెను. మొదటిగా ఒకరి నొకరు ప్రేమించుకొనవలెననియు, ఒకరి నొకరు హత్తుకొని యుండవలెననియు, శత్రువును ఐక్యమత్యముతో ఎదిరించుడని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

‘లోకము ద్వేషించుట’ నుగూర్చి ముందుగా చెప్పుట (15:18–27) : 15:18 లోకము తమను ద్వేషించునపుడు శిష్యులు ఆశ్చర్యము చెందనవసరము లేదు. అధైర్యపడనవసరములేదు. లోకము ప్రభువును ద్వేషించెను మరియు ఆయనను పోలియున్న ప్రతివానిని లోకము ద్వేషించును.

15:19 లో కనుసారులు తమవలె చెడుమాటలు మాటలాడువారిని, శరీరాశలు నెరవేర్చువారిని ప్రేమించుదురు. పరిశుద్ధమైన జీవితము జీవించు క్రైస్తవుడు వారిని ఖండించును. గనుక లోకానుసారులు క్రైస్తవుని ద్వేషింతురు.

15:20 ఈ వచనములో నున్న ‘సేవకుడు’ అను మాటకు ‘బానిస’ అనియు, ‘ప్రభువు’ అనగా ‘బోధకుడు’ అనియు అర్థము వచ్చును. తమ ప్రభువు ఈ లోకమునుండి పొందిన అనుభవముకంటె మంచిదైన రీతిలో ఆదరణను తాము పొందగలమని శిష్యులు ఆశించరాదు. క్రీస్తు హింసింపబడినట్లే శిష్యులును హింసింపబడుదురు. రక్షకుని వాక్కులను తృణీకరించినట్లే శిష్యుల వాక్కులనుకూడ లోకము తృణీకరించును.

15:21 హింసయు, ద్వేషింపబడుటయు ఆయన నామము నిమిత్తమే. ఎందుకనగా విశ్వాసి క్రీస్తుతో జతచేయబడెను. అతడు క్రీస్తువలన లోకమునుండి వేరు చేయబడెను. మరియు విశ్వాసి క్రీస్తు నామమును ధరించి, క్రీస్తును పోలి యుండినందు వలననే లోకము దేవుడనిన నిర్లక్ష్యముగా నుండును. ప్రభువును రక్షకునిగా ఈ లోకములోనికి తండ్రి పంపెనని వారికి తెలియలేదు. నిర్లక్ష్య వైఖరి క్షమాపణ నొందదు.

15:22,23 నేను ఈ లోకమునకు వచ్చియుండనియెడల మీరు పాపాత్ములై యుండరని ఆయన చెప్పలేదు. ఆదామునుండి మానవులందరు పాపాత్ములే. అయితే వారి పాపము ఈ తరము వారి పాపముకంటె గొప్పదికాదు.

ఈ తరము వారు దేవుని కుమారునిచూచి, ఆయన (మాటలు) బోధ వినియున్నారు. వారికి ఆయన యందు ఏ దోషము కానరాలేదు. ఆయినను వారాయనను తృణీకరించిరి ఇదే వారియొక్క గొప్ప పాపము.

మహిమాన్వితుడైన ప్రభువుని తృణీకరించినందు వలన కలిగిన పాపము వారి పాపములన్నిటికంటె గొప్పది. కావున వారి పాపములకు క్షమాపణ లేదు. లోకమునకు వెలుగును వారు ద్వేషించిరి.

క్రీస్తు మార్గములో సంభాషణ విషయంలో పద్యాలు

క్రీస్తును ద్వేషించినందువలన వారు తండ్రిని ద్వేషించిన వారైరి. వారిరువురును ఏకమైయున్నారు. వారు మేము దేవుని ప్రేమించితిమని చెప్పుట లేదు. అట్లు ప్రేమించినచో, దేవుడు పంపించిన వానినికూడ ప్రేమించియుందురు.

15:24 క్రీస్తు బోధ వినుటలో వారు బాధ్యత కలిగియుండుట కాక ఆయన చేసిన అద్భుతములు కూడ వారు చూచియున్నారు. ఇది వారు శిక్షార్హులగుటకు మరి ఎక్కువగ దోహదపడెను. ఏ మనుష్యుడు చేయగా చూడని అద్భుతములను ఆయన చేయగా వారు చూచిరి.

క్రీస్తును తృణీకరించుట క్షమింపరానిది. మిగిలినవారి పాపములన్నియు ఈ పాపముతో ఎన్నదగినవి కావు. ప్రభువు వారి పాపములన్నియు ఈ ఒక్క పాపమునకు పోల్చి చూచి, వారి పాపములన్నియు ఈ ఒక్క పాపము ప్రక్కన నిలువ బెట్టుటకు చాలినవి కావని చెప్పెను. ఎందుకనగా వారు కుమారుని, తండ్రిని. అసహ్యించుకొనుట చేత వారు ఘోర శిక్షకు లోనైరి.

15:25 మానవులు తనపట్ల ప్రవర్తించినదంతయు ప్రవచనముల నెరవేర్పు అని ప్రభువు గ్రహించెను. కీర్తన 69:4 లో “నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించిరి” అని వ్రాయబడియున్నది. పాత నిబంధనలోని లేఖన భాగములు ఆయనను వారు ద్వేషించి రని చెప్పుచుండెను.

వారు ద్వేషించుటను గూర్చి ముందుగా ప్రవచింపబడెను గనుక వారు ద్వేషించిరని దీని అర్ధమా? కాదు. గాని వారి స్వాభిలాష మేరకు వారాయనను ద్వేషించిరను సంగతిని దేవుడు ముందుగా చూచి, దావీదుచే దానిని వ్రాయించెను.

15:26 మనుష్యుల తృణీకారము పొందుచున్నప్పటికి, క్రీస్తుకొరకు నిరంతరము సాక్ష్యమిచ్చువారు కలరు. పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్తద్వారా ఈ పని జరుగు చున్నది. తండ్రి యొద్దనుండి మీకొరకు ఆదరణకర్తను పంపుదునని ప్రభువు చెప్పు చున్నాడు.

ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే.

14:16 లో ఈ ‘ఆత్మ దేవుని’ తండ్రి పంపినట్లుగా చూచుచున్నాము. తండ్రియు, కుమారుడును ఒకేస్థాయి యందున్నారని చెప్పుటకు ఇదియొక నిదర్శనము. సత్యాత్మ తండ్రి నుండి బయలు వెడలెను.

అనగా ఈ ఆత్మ ‘దేవుని’ యొద్దనుండి పంపబడెనని స్పష్టమగుచున్నది. పెంతెకొస్తు దినమున ఈ ‘రాక’ ఒక ప్రత్యేకమైన గుర్తు. క్రీస్తును గురించి ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నది. ఇది ఆ ఆత్మ దేవునియొక్క గొప్పపరిచర్య.

మార్గములో సంభాషణ

తాను త్రిత్వములో ఒకడైనను తనతో ప్రజల హృదయము నింపుటకు మనస్సులేని ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. మహిమ గల దేవునివైపు పాపాత్ముని, పరిశుద్ధుని మళ్ళించువాడు పరిశుద్ధాత్మ దేవుడు.

15:27 పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులద్వారా ప్రత్యక్షముగా సాక్ష్యమిచ్చుచుండెను. ప్రభువు తనయొక్క పరిచర్య ప్రారంభమునుండి శిష్యులు ఆయనతో నుండిరి గనుక ఆయన వ్యక్తిత్వమును గూర్చియు, పనినిగూర్చియు ప్రకటించుటకు వారు చాలినవారు.

ఆయనతో నుండినవారే ఆయనయందు తప్పుపట్టుటకు సరిపోయినవారు. అయితే వారు ఆయన ఏవిధమైన పాపము చేసినట్లుగా కనుగొనలేదు. కనుకనే వారు ఆయన ఏ పాపమెరుగని దేవుని కుమారునిగాను, లోకరక్షకునిగాను సాక్ష్యమివ్వగలిగిరి.

పరలోకమునకు మార్గము – క్రీస్తు – Bible Verses Chapter 14 in Telugu

పద్నాలుగవ అధ్యాయము

పరలోకమునకు మార్గము – క్రీస్తు

“నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

14:1,2 కొందరు ఈ వచనమును 13వ అధ్యాయములోని చివరి వచనముతో జోడించి, ఇది పేతురు నుద్దేశించి, చెప్పబడెనందురు. పేతురు ఆయనను ఎరుగ ననును. అయితే ప్రభువు అతనిని ఆదరించును. ప్రభువు ఈ విషయము అందరితోను చెప్పెను.

13వ అధ్యాయము తరువాత కొంత సమయము గడచినట్లుగా మనము గ్రహింపవలెను. దీనిలో తలంపు ఇట్లున్నది. “నేను వెళ్ళబోవుచున్నాను గనుక మీరిక నన్ను చూడరు. అయితే మీ హృదయమును కలవరపడనియ్యకుడి, దేవునియందు విశ్వాసముంచియున్నారు.

మీరు ఆయనను చూడకపోయినను, దేవునియందు విశ్వాస ముంచినట్లు, నా యందును విశ్వాసముంచుడు. ప్రభువైన యేసు మరల ఇంకొకసారి తన్ను దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడు. తండ్రి ఇల్లు పరలోకముగా చెప్పబడినది. మరియు అచ్చట నివాసములు కలవు. విమోచింపబడిన వారికందరికి నివాసములు కలవు.

క్రీస్తు లేక పరలోకములోకి ప్రవేశము

అట్లు లేనియెడల ప్రభువు చెప్పియుండెడివాడు. ఆధారములేని నివాసములు ఆయన నిర్మించడు. “నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. దీనిలో రెండు అర్థములు కలవు. తన స్వంతవారికి స్థలము సిద్ధపరచుటకు ముందుగా ఆయన ‘కలువరి’ కేగెను.

ఆయన ప్రాయశ్చిత్తార్థ మరణమువలన విశ్వాసులకు పరలోకమందు స్థలము సిద్ధపరచెను. మరియు ఆయన పరమునకు తిరిగివెళ్ళి మన కోసరము స్థలము సిద్ధపరచెను. ఆ స్థలమునుగురించి మన కంతగా తెలియకపోయి నను అక్కడ దేవుని బిడ్డలకొరకు స్థలము సిద్ధపరచబడుచున్నదని ఎరుగుదుము. సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలము.

Read and Learn More Telugu Bible Verses

14:3,4 ఈ వచనము ప్రభువు మధ్యాకాశమునకు వచ్చుటనుగూర్చి వివరించు చున్నది. ఆయన వచ్చినప్పుడు ప్రభువునందు మృతులు మొదట లేతురు. మరియు సజీవులై యుండువారు మార్చబడుదురు.పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఆయన రక్తముతో విమోచింపబడిన వారందరు ఇట్లు పరమునకు కొనిపోబడుదురు (1 థెస్స 4:13-18; 1 కొరింథీ 1515-58 ఆయన రాకడను గూర్చి ఇట్లు లిఖిత పూర్వకముగా చెప్పబడినది. ఆయన ఎట్లు పరమునకు కొనిపోబడెనో అట్లే రానై యుండెను.

నిత్యత్వమంతయు తనవారు తనతో ఉండునట్లుగా ఆయన అట్లు చేయును. “నేను వెళ్ళు చోటికి మీకు మార్గము తెలియును”. ఆయన అనేకసార్లు ఈ విషయము వారికి చెప్పియుండెను గనుక వారికి పరలోకమునకు పోవు మార్గము తెలియును.

పరలోకమునకు మార్గము – క్రీస్తు – Bible Verses Chapter 14 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

 

14:5,6 తోమాకు ప్రభువు చెప్పు మాటలు బోధపడలేదు. ఈ భూమిపైన ప్రభువైన యేసు మరొకచోటికి ప్రయాణించుచుండెనని తోమాకూడా పేతురువలె తలంచెను. ప్రభువైన యేసు తానే పరలోకమునకు మార్గమైయుండెనని చెప్పెను.

ఆయన మార్గము చూపించలేదుగాని, తానే మార్గమైయుండెను. రక్షణ ఒక వ్యక్తియందున్నది. ఆ వ్యక్తిని నీవు అంగీకరించినయెడల నీకు రక్షణ కలుగును. క్రైస్తవ్యమనగా క్రీస్తు. ప్రభువే సత్యము.

యేసు మాత్రమే పరలోకమునకు మార్గము

ఆయన కేవలము సత్యము బోధించువాడు కాదుగాని, ఆయనే సత్యమై యుండెను. ఆయన సత్యమునకు నివాసస్థానమైయుండెను. క్రీస్తును కలిగియున్నవారు సత్యమును కలిగియుందురు, సత్యము మరెక్కడ లభించదు, క్రీస్తుయేసు జీవమై యుండెను.

జీవమునకు ఆధారము ఆయనే. ఆత్మీయ జీవమునకును, నిత్యత్వము నకును ఆధారమాయనే. ఆయనను స్వీకరించువారందరు నిత్యజీవమును పొందుదురు. ఎందుకనగా ఆయనే జీవమైయుండెను.

అనేక మార్గములలో యేసు ఒక మార్గమై యుండలేదు. ఆయనే ఏకైక మార్గమైయున్నాడు. ఆయనద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. పది ఆజ్ఞలుగాని, బంగారు సూత్రముకాని, అభిషేకములుగాని, సంఘ సభ్యత్వముగాని, దేవునియొద్దకు నడిపించలేవు గాని, యేసుక్రీస్తు మాత్రమే నడిపించగలడు.

చాలమంది ఒకడు నిజాయితీగా జీవించగలిగిన చాలునని చెప్పుదురు. ప్రతి మతమునందు ఏదేని కొంత మంచి ఉండును గనుక, అన్ని మతములు పరలోకమునకు దారితీయునని చెప్పుదురు నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. అని యేసు చెప్పెను.

14:7,8 తండ్రికి తనకుగల సంబంధమును మరియొకసారి ప్రభువు వివరించు చున్నాడు. యేసు ఎవరోయని శిష్యులు గుర్తించిరా? వారికి తండ్రి ఎవరో తెలియును. ఎందుకనగా ప్రభువు తండ్రిని ప్రత్యక్షపరచెను. యేసు పునురుత్థానుడైనప్పటినుండి, ఆయన దేవుని కుమారుడని గుర్తించిరి.

క్రీస్తును ఎరిగినయెడల తండ్రిని ఎరుగుదు రనియు, యేసును చూచువాడు తండ్రిని చూచుననియు శిష్యులు తెలిసికొందురు. దేవుడును, ప్రభువైన యేసును ఒకే వ్యక్తియని ఈ వాక్యము వివరించుటలేదు. దైవత్వమునందు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కలరుగాని దేవుడొక్కడే. తండ్రిని గురించి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత నపేక్షించి, ఫిలిప్పు ప్రభువు నడిగెను. ప్రభువు చెప్పిన దంతయు, చేసినదంతయు ప్రభువే తండ్రిని ప్రత్యక్షపరచెనని ఫిలిప్పునకు తెలియలేదు.

14:9 – 11 ప్రభువు ఎంతో సహనముతో ఫిలిప్పును సరిచేసెను. ప్రభువుతో ఫిలిప్పు చాలాకాలము జీవించెను. ఇతడు మొదటిగా పిలువబడిన శిష్యుడు (యోహాను 1:43). అయినను క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చిన సంపూర్ణ సత్యమును, క్రీస్తు తండ్రితో ఏకమైయున్న సంగతి ఫిలిప్పునకు బోధపడలేదు.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

తాను యేసును చూచునప్పుడెల్ల తండ్రిని నిర్ధిష్టముగా ప్రత్యక్షపరచు యేసును చూచుచున్నానని ఫిలిప్పు గ్రహించుటలేదు. “నేనే తండ్రిననియు, తండ్రి నా యందున్నాడనియు” ప్రభువు చెప్పుటలో తండ్రికి, ఆయనకుగల సన్నిహిత సంబంధము కానవచ్చుచున్నది.

వారిరువురు వేర్వేరు వ్యక్తులే. తలంపులయందును, పనులయందును వారేకమైయున్నారు. దీనిని మనము గ్రహింప కున్న యెడల నిరుత్సాహము చెందనవసరములేదు. మానవులెవరూ దైవత్వమును గూర్చి సంపూర్ణముగా గ్రహించలేరు. మన మెన్నడు తెలిసి కొనలేని విషయములు తెలిసికొన్నప్పుడు ప్రభువుకే మనము ప్రాధాన్యత నివ్వవలసియున్నది.

మన మాయనను పూర్తిగా అర్థము చేసికొనినయెడల ఆయన ఎంత గొప్పవాడో అంతటి గొప్పవారము కాగలము. “నేను మీతో మాట్లాడు మాటలు నాయంతటనేనే చెప్పుటలేదు గాని, నా యందు నివసించుచున్న తండ్రియే ఈ మాటలను పలుకుచున్నాడు, మరియు నేను చేయు పనులు నా యంతట నేను చేయుట లేదుగాని నాయందు నివసించుచున్న తండ్రియే ఈ అద్భుతములను నిర్వర్తించుచున్నాడు.

పరలోకము గురించిన బోధలు – యేసు మాత్రమే మార్గము

” అని ప్రభువు చెప్పెను. అయితే ఆయన యెహోవా దేవుని సేవకునిగా వచ్చినందున తండ్రికి సంపూర్ణ విధేయతతో సమస్తమును మాట్లాడి నెరవేర్చెను. ఆయన ఇచ్చు సాక్ష్యమునుబట్టి ఈయన తండ్రితో నున్నాడని శిష్యులు విశ్వసింపవలసియున్నారు. లేనియెడల ఆయన చేయుచున్న కార్యములను బట్టియైనను వారు నమ్మవలసి యున్నది.

14:12 తనయందు విశ్వాసముంచువాడు తాను చేయుచున్నట్లు సూచకక్రియలు, అద్భుతములు మరిగొప్పవియు చేయునని చెప్పెను. ప్రభువు చేసిన స్వస్థత కార్యములు (శారీరక స్వస్థతలు) అపొ॥ కార్య॥ గ్రంథమందు శిష్యులు చేసినట్లుగా చూడగలము అంతకంటే గొప్పక్రియలు అనగా ఒక దినమున (పెంతెకొస్తు దినమున) 3 వేలమంది రక్షింపబడుటను మనము గమనించుచున్నాము.

ప్రపంచ వ్యాప్తంగా సువార్త ప్రకటింప బడుట, అనేకులు రక్షింపబడుట, ప్రభువుయొక్క సంఘము కట్టబడుట అనునవి ప్రభువు చెప్పిన గొప్పకార్యములు శరీర స్వస్థతకంటే ఆత్మ రక్షణ గొప్పది. ఆయన పరమునకు తిరిగి వెళ్ళినప్పుడు మహిమపరచబడెను.

పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి పంపబడెను పరిశుద్ధాత్మయొక్క శక్తినిబట్టి శిష్యులు ఇట్టి గొప్ప కార్యములు చేసిరి. 14:13,14 ప్రభువు వారితో లేకున్నప్పటికి, ఆయనద్వారా తండ్రిని వారడిగిన దానినెల్ల పొందగలుగుటలో వారికెంత ఆదరణ! విశ్వాసి తాను అడిగిన ప్రతిదానిని పొందగలుగునని దీని భావము కాదు.

ఈ వాగ్దానములోని రహస్యము ‘ఆయన నామములో’ అనునది. నా నామము పేరిట మీరేది అడిగినను అనుటలో ప్రతి ప్రార్థన చివర ఆయన పేరును ఉచ్ఛరించుట కాదు; మనము అడుగునది ఆయన చిత్తప్రకారము, ఆయన ఉద్దేశ్యము చొప్పున అడుగవలెను;

పరలోకమునకు మార్గము - క్రీస్తు  Bible Verses Chapter 14

మనము అడుగునది ప్రభువు మహిమార్థమై, మానవకోటి ఆశీర్వార్థమై మన ఆత్మీయ క్షేమము నిమిత్తము అడుగవలెను క్రీస్తు నామమున అడుగుటకు ఆయనతో సహవాసము కలిగియుండ వలెను, అట్లు సహవాసము లేనియెడల ఆయన చిత్తము కనుగొనలేము; మనము ఆయనకు ఎంత సమీపముగా జీవించుదుమో అంతగా ఆయన కోరికకు అను గుణముగా అడిగెదము.

దేవుని దృష్టికి అనుకూలమైన దానిని ప్రభువు చేసియున్నాడు గనుక తండ్రి ఆయనయందు మహిమపరచబడెను! దేవుని ప్రజలకు ప్రోత్సాహ కరముగా నుండుటకు ఈ వాగ్దానము గట్టిగా చెప్పబడెను. ఆయన చిత్త ప్రకారము జీవించుచు, ప్రభువుతో సహవాసముకలిగి నడుచుకొనుచు, ఆయన కోరిక మేరకు మనము అడుగుచు నుండిన యెడల అట్టివాటికి సమాధాన మనుగ్రహింపబడును.

ఆదరణకర్తను గూర్చిన వాగ్దానము (14:15-26) :

14:15 ప్రభువైనయేసు తన శిష్యులను వదలి వెళ్ళనైయుండగా, వారి హృదయములు దుఃఖముతో నిండుకొనెను. ఆయనిచ్చిన ఆజ్ఞలను గైకొనుటద్వారా వారు ఆయనపట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచవలెను. కన్నీరు కార్చుటవలననే కాదు గాని, విధేయత చూపించుటవలననే. ఆయన ఆజ్ఞలేవనగా క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తలలోను, ఇతర పుస్తకములలోను యిమిడియున్న నియమములే.

14:16 ప్రార్ధన అను పదము తక్కువవాడు ఎక్కువ వానికిచేయు విజ్ఞాపన కాదుగాని, ఒకే స్థాయిలోనున్నవాడు చేసికొను విన్నపమైయున్నది. ఇక్కడ ప్రభువు ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకొనెను.

ఆదరణకర్త అనగా ఒక వ్యక్తికి సహాయకారిగా నిలుచువాడు ‘వకీలు’ అని కూడ చెప్పవచ్చును. ప్రభువైన యేసు ‘వకీలు’ లేదా ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు మరియొక ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే స్వభావము కల్గిన ఆదరణకర్తగాని, వేరు స్వభావము కల్గిన వాడుకాదు. విశ్వాసియందు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు వసించును.

యోహాను 14:6 వచనం – నేను మార్గమును, సత్యమును, జీవితమును

పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్ముడు ఆయా సమయములందు మనుష్యులమీదికి వచ్చుచుండెడివాడు. మరల తిరిగి వెళ్ళు చుండెడివాడు. ఇప్పుడు అట్లుకాదు, ఆదరణకర్త ఎల్లప్పుడు వసించుటకే వచ్చెను.

14:17 పరిశుద్ధాత్మ దేవుడు ‘సత్యాత్మ’గా పిలువబడుచున్నాడు. ఎందుకనగా ఆయన బోధ సత్యమైనది మరియు సత్యమైయున్న క్రీస్తును మహిమపరచువాడు. లోకము ఆయనను అంగీకరింపదు ఎందుకనగా లోకమాయనను చూడలేదు. అవిశ్వాసులు తాము విశ్వసించకముందే చూడనపేక్షించుదురు. రక్షింపబడని వారు పరిశుద్ధాత్మను తెలిసికొనలేరు, గ్రహింపలేరు.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

 

ఆయన వారిని పాపములనుగూర్చి ఒప్పింపజేయును గాని వారు దీనినెరుగరు. శిష్యులు పరిశుద్ధాత్మను ఎరుగుదురు. పరిశుద్ధాత్ముని కార్యము వారి జీవితములలో ఎరుగుదురు మరియు, ప్రభువైన యేసు ద్వారా ఆయన చేయు కార్యములలో ఆయనను చూచుదురు.

ఆయన నీతో నివసించును, ఆయన నీలో నివసించును, అని యేసు చెప్పెను. పెంతెకొస్తు పండుగకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకివచ్చి వారిలో నివసించెను. అయితే పెంతెకొస్తు దినమునుండి ఎవడైనను ప్రభువైనయేసునందు విశ్వాసముంచినయెడల పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తియందు స్థిరనివాసమేర్పరచుకొనును.

దేవా నాయందున్న పరిశుద్ధాత్మను తీసివేయకుమని దావీదు ప్రార్థించెను. అయితే యీ దినములలో పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడినను, ఆర్పివేయబడినను, అభ్యంతరపరచబడినను, ఒక విశ్వాసినుండి పరిశుద్ధాత్ముడు తీసివేయబడడు.

14:18 ప్రభువు తన శిష్యులను అనాధలుగాను, దిక్కులేనివారిగాను ఎన్నడు వదలివేయడు. ఆయన వారియొద్దకు మరల వచ్చును. ఆయన పునరుత్థానుడైన తరువాత వారియొద్దకు వచ్చెను. పునరుత్థానుడై ఎట్లు వచ్చునని అనుమానము పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మునిద్వారా ఆయన వారియొద్దకు వచ్చునని మరియొక తలంపు. వ్రాయబడినట్లుగా ఆయన తనవారిని పరమునకు చేర్చుటకు వారి కొరకు రానై యుండెనని ఆ రీతిగా వచ్చునని మూడవ తలంపు.

పరలోకములో స్థానము పొందడం

14:19 ప్రభువైన యేసు సమాధి చేయబడిన తరువాత ఏ విశ్వాసియు ఆయనను చూడలేదు. ఆయన లేచిన తరువాత ఆయనను ప్రేమించిన వారికి అగుపించెను. ఆయన పరమునకు ఆరోహణమైన తరువాత ఆయన శిష్యులాయనను విశ్వాసము ద్వారా చూచుచున్నారు. ‘మీరు చూచెదరు’, ‘మీరు చూచుచున్నార’ను మాటలకు వ్యత్యాసమును దీనిలో మనము గమనించుచున్నాము. “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారని” ప్రభువు చెప్పెను.

ఇక్కడ ఆయన పునరుత్థాన జీవితము కొరకు ఎదురు చూచుచు, ఆయనయందు విశ్వాసముంచువారందరికి ఆ జీవితము ఒక సవాలుగా ఉండునని చెప్పెను. వారు మరణించినప్పటికి, మరల మరణించకుండు నట్లు వారు తిరిగి లేతురు.

14:20 ‘ఆ దినము’ అనగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దినము. తండ్రి కుమారుల మధ్య ఎట్టి సన్నిహిత సంబంధము కలదో క్రీస్తునకు, ఆయనను నమ్మిన పరిశుద్ధ లకు జీవితములోను, ఆశయములలోను అట్టి సంబంధముండును, క్రీస్తు ఎట్లు విశ్వాసి యందుండునో అదే సమయమునందు విశ్వాసి క్రీస్తుయందెట్లుండునో వివరించుట కష్టతరము.

ఇనుపకోల నిప్పులో నుండును. నిప్పు ఇనుపకోలలో నుండును గాని ఇది సంపూర్ణ అర్థము నివ్వదు, క్రీస్తు విశ్వాసియందు జీవించుననగా ఆయన జీవితము విశ్వాసికి సంగ్రహింపబడెనని అర్థము. పరిశుద్ధాత్మునిద్వారా క్రీస్తు విశ్వాసియందు జీవించును. విశ్వాసి క్రీస్తుయందున్నాడనగా, వ్యక్తిత్వములోను, క్రియలలోను ఉత్తమమైనవానిగా దేవునియందు నిలుచునని అర్థము.

14:21 ఒకడు ప్రభువును ప్రేమించుచున్నాడనుటకు నిదర్శనము-ఆయన ఆజ్ఞలను విధేయతతో గైకొనుటే. అట్టివారిని దేవుడు ప్రేమించును. ఒక విధముగా చెప్పవలెనంటే తండ్రి ఈ లోకము నెంతయో ప్రేమించెను అయితే తన కుమారుని ప్రేమించువానిని ఆయన ప్రత్యేకముగా ప్రేమించును.

క్రీస్తుకూడ వారిని ప్రేమించును. తననుతాను ప్రత్యేకముగా కనుపరచుకొనును. మన మాయనను ప్రేమించుకొలది ఆయనను మరెక్కువగా తెలిసికొందుము.

14:22 ఈ వచనములో ప్రస్తావించబడిన ‘యూదా’ అనునతడు, ద్రోహియగు ‘యూదా’ పేరును కలిగియుండుట దురదృష్టకరము. దేవుని ఆత్మ ఇతనిగూర్చి ‘ఇస్కరియోతు కాని యూదా’ అని చెప్పుటద్వారా వీరిద్దరిమధ్య ఉన్న తేడా స్పష్టమగు చున్నది.

ఇతడు ‘యూదా పత్రిక’ వ్రాసిన యూదాయై యుండవచ్చును. ప్రపంచములో ఎవరికి కన్పించక, తన శిష్యులకు ఆయన ఎట్లు కన్పించగలడని అతడు తలంచెను. రక్షకుని రాక లోకమును జయించిన రాజు రాకవలె నుండునని అతడు తలంచెను.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఆత్మద్వారా ప్రభువు తనవారికి ప్రత్యక్షపరచుకొనునన్న సంగతి అతడు గ్రహించలేదు. వారు విశ్వాసముద్వారా దేవుని వాక్యమునందు ఆయనను చూతురు. ప్రభువు ఈ భూమిపైనున్నప్పుడు శిష్యులు ఆయననుగూర్చి తెలిసికొనిన దానికంటే మరి ఎక్కువగా దేవుని ఆత్మద్వారా మనమాయనను తెలిసికొనుచున్నాము. వెనుక ఉన్న వారికంటె గుంపులో మొదటివాడే కేంద్రమునకు అతి సమీపముగానుండును కాని, విశ్వాసము ద్వారా మనలో ప్రతి ఒక్కరము ఆయనతో సన్నిహిత సహవాసము కలిగియుందుము.

14:23 – 25 ఒకడు వాస్తవముగా దేవుని ప్రేమించిన యెడల, ఆయన ఆజ్ఞలకే కాక బోధలన్నింటికి విధేయుడై యుండవలెను. ఏ ప్రశ్నలు లేక, నియమ నిబంధనలు లేక తన కుమారునికి విధేయుడైనవానిని తండ్రి ప్రేమించును. అట్టివారికి అనగా ప్రభువును ప్రేమించి, విధేయులైన వారికి తండ్రియు, కుమారుడును చేరువగా నుందురు.

ఆయనను ప్రేమింపనివారు ఆయన ఆజ్ఞలను గైకొనరు. వారు క్రీస్తు మాటలనే ధిక్కరించువారైయుండి తండ్రియైన దేవుని మాటలనుకూడ ధిక్కరించు చున్నారు. ఆయన వారితోనున్నంత కాలము వారు గ్రహింపగలిగినంతకంటె ఎక్కువగా వారికేమియు బోధింపలేదుగాని, తగుమాత్రమే బోధించెను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కువగా వారికి బోధించును.

14:26 పెంతెకొస్తు దినమున క్రీస్తు నామమున తండ్రి ఆత్మను పంపెను. క్రీస్తు ఉద్దేశములను ప్రకటించుటకు ఆయన వచ్చెను. ఆయనను మహిమపరచుటకు ‘ఆత్మ’గా దేవుడు రాలేదుగాని స్త్రీ పురుషులను రక్షకుని యొద్దకు చేర్చుటకు వచ్చెను. ఆయన మీకు సమస్తము బోధించునని ప్రభువు చెప్పెను.

అపొస్తలుల బోధద్వారా ఆయన దానిని నెరవేర్చెను. తరువాత వ్రాతపూర్వకమైన క్రొత్త నిబంధనద్వారా నెరవేర్చెను. రక్షకుని బోధయంతయు పరిశుద్ధాత్మ దేవుడు వారి జ్ఞాపకములోనికి తెచ్చెను.

యేసు తన శాంతినే శిష్యులకు అనుగ్రహించుట (14:27-31) : 14:27

సాధారణముగా ఒక వ్యక్తి చనిపోవుటకు ముందుగా తన స్వాస్థ్యము తనవారికి చెందుటకు వీలు వ్రాయును. అటులనే ప్రభువైన యేసు చేసెను. అయితే అది సొమ్ముకంటే విలువైనదియు వెలయిచ్చి కొనలేనిదగు సమాధానము.

ఈ సమాధానము పాపములు క్షమింపబడుటద్వారాను, దేవునితో సమాధానము పొందుట ద్వారాను కలుగుచున్నది. కలువరిలో తన రక్తమిచ్చి సంపాదించిన సమాధానమును వారి కనుగ్రహించెను. లోకమిచ్చునట్లుగా స్వార్థముతోను, కొన్ని నియమములతోను ఆయన వారికిచ్చియుండలేదు. ఆయన సమాధానము శాశ్వతకాలముండును. అట్లయిన క్రైస్తవుడెందుకు భయపడవలెను?

14:28 యేసు ఇప్పుడు వారిని వదలి వెళ్ళుచున్నాననియు, మరల వారిని కొని పోవుటకు వత్తుననియు ఇంతకు మునుపే వారికి చెప్పియుండెను. వారు ఆయనను ప్రేమించుచున్నయెడల, ఈ విషయము వారిని సంతోషింపజేయును. వారాయనను ప్రేమించుచున్నారు గాని, ఆయన ఎవరో పూర్తిగా ఎరిగియుండలేదు గనుక ఆయనపట్ల వారి ప్రేమ ఎంతగా ఉండవలెనో అంతగా లేదని చెప్పవచ్చును.

క్రీస్తు ద్వారా పరలోకము మరియు నిత్యజీవము

“తండ్రి నా కంటే గొప్పవాడు గనుక, మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు.” ప్రభువు మొదటినుండి తానును, తండ్రియు ఏకమైయున్నామని చెప్పు సమానత్వము ఇక్కడ భేదించుచున్నట్లుగా కనబడుచున్నది.

కాని ఏ భేదము లేదు. ప్రభువైన యేసు భూమిపైనున్నప్పుడు ఆయన తృణీకారము, వేదన హింస పొందెను. ప్రజలాయనను దూషించిరి. వ్యతిరేకించిరి. ఆయనపై ఉమ్మివేసిరి. సృష్టింపబడిన వారినుండి భయంకరమైన తిరస్కారమును ఆయన పొందెను.

అయితే తండ్రి అట్లు తిరస్కారమును ఎదుర్కొనలేదు. కౄరులైన పాపులకు దూరముగా ఆయన పరలోకమునందు నివసించెను. ప్రభువు పరమునకు వెళ్ళునప్పుడు తిరస్కారమునకు తావులేని స్థలమున ప్రవేశించెను. తాను తండ్రియొద్దకు వెళ్ళుచున్నానని చెప్పినపుడు వారు సంతోషించిరి.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఈ విషయములో తండ్రి ‘యేసు’ కంటె గొప్పవాడై యున్నాడు. దైవత్వమునుగూర్చి చెప్పినయెడల తండ్రి, కుమారుడు సమానులే. అయితే ప్రభువైన యేసు ఎంతో తగ్గింపబడినవాడై దాసునిస్వరూపమును ధరించుట వలన తండ్రియైన దేవుడు ఆయనకంటె గొప్పవాడైయున్నాడు.

14:29,30 భయకంపితులైన శిష్యులకు వారు భయముచెందక బాధపడకుండునట్లు నిస్వార్ధముతో ఈ సంగతులను ప్రభువు వారికి తెలియజేసెను. తాను అప్పగింపబడ బోవు సమయము సమీపించుచున్నది.

పరలోకమునకు మార్గము – క్రీస్తు

గనుక తన వారితో ఎక్కువ సమయము గడుపుటకు సమయము లేదని ప్రభువునకు తెలియును. సాతాను వచ్చుచున్నాడనియు, తనయొద్ద ఏ పాపపు చిహ్నము వానికి దొరకదనియు ప్రభువునకు తెలియును.

14:31 ఈ చివరి వచనము మనమీలాగు చెప్పవచ్చును. నా సమయము సమీ పించియున్నది. నాకై నేనే సిలువను సమీపించుచున్నాను. నాయందు తండ్రి చిత్తమిదే. నేను నా తండ్రిని ప్రేమించుచున్నానని లోకము దీనినిబట్టి తెలిసికొనును.

కనుక నాయంతట నేనే దీనిని చేయుచున్నానని చెప్పి మనము ఇక్కడనుండి వెళ్ళుదుము లెండి అని వారినక్కడనుండి బయలుదేరదీసెను. వారు ఆ సమయమందు మేడగదిని విడచి వెలుపలికి వచ్చిరోలేదో వ్రాయబడలేదు గాని ఆ తరువాత సంభాషణయంతయు వారి మార్గమధ్యమున జరిగియుండవచ్చును.