ఘనుడైన కాన్స్టాంటైన్ (రోమా చక్రవర్తి, క్రీ.శ. 306-337)
క్రీ.శ. 293 లో చక్రవర్తియైన డయోక్లేషియన్ గాలు (Gaul), బ్రిటన్ కు కాన్ స్టాంటియస్ నన్ను కైసరుగ నియమించినప్పుడు కాన్స్టాంటియస్ కుమారుడైన కాన్ స్టాంటైన్ (Constantine) తూర్పుప్రాంతపు చక్రవర్తి, డయోక్లేషియన్ పెంపుడు కుమారుడైన గలేరియస్ ఆస్థానములో వాస్తవమునకు బందీగా ఉంచబడి, క్రీ.శ. 305 లో పారిపోయి పశ్చిమ ప్రాంతమున తండ్రియొద్దకు చేరెను.
అదే సంవత్సరము డయోక్లేషియన్ రోమా చక్రవర్తి పదవికి రాజీనామా చేయగా గలేరియస్ చక్రవర్తి అయ్యెను. ఇతడు మాగ్జిమియన్ (Maximian), సెవరస్ (Severus) లను కైసరులుగ తనక్రింద నియమించుకొనెను. అదేవిధముగ కాన్స్టాంటి యస్ తన కుమారుడైన కాన్స్టాంటైన్ ను తన క్రింద కైసరుగ నియమించెను. ఇటలీ, ఆఫ్రికాలు పశ్చిమ సామ్రాజ్యములో భాగమైనప్పటికి వాటి పరిపాలన సమస్యాత్మకముగా ఉన్నందున కాన్ స్టాంటియస్ వాటిని అంగీకరింపక ఫ్రాన్సు, స్పెయిను, బ్రిటన్లను పరిపాలించెను.
కనుక ఇటలీ, ఆఫ్రికాలు తూర్పు సామ్రాజ్య భాగములోని మాగ్జిమియన్ పాలనలోనికి వచ్చినవి. అయినప్పటికిని తూర్పుప్రాంతమున కొంతకాలముపాటు హింసలు కొనసాగినవి. పడమటి ప్రాంతములో కాన్స్టాంటియస్, కాన్ స్టాంటైన్ల కాలములో హింసలు వాస్తవమునకు ఆగినవి. వారిద్దరు ప్రజలతో మంచి సంబంధములు ఏర్పరచుకొని, వారి సహకారమును పొందుచు అందరిని సమానముగ పరిపాలించిరి.
కాన్ స్టాంటియస్ పరిపాలనాదక్షత, జాగ్రత్త, నెమ్మది, మంచితనము, ఉదార భావములు కలవాడు కనుక అతని పరిపాలనలో ఉన్నవారందరికి మంచిని పెంపొం దింపవలెనని తలంచెను. “తన స్నేహితులను ఐశ్వర్యవంతులుగ చేసినప్పుడు తనకు ఐశ్వర్యము లభించినద”ని చిన్న సైరస్ (Cyrus, the younger – క్రీ.పూ. 424? -401) చెప్పిన విధముగ కాన్స్టాంటియస్ క్కూడ “తన ధనాగారములో డబ్బు నిల్వ ఉండుటకంటె తన ప్రజలు ధనవంతులుగా నుండుట మంచిద”ని తరచు చెప్పెడివాడు. కాన్ స్టాంటియస్ స్వతహాగా నిరాడంబరజీవి, డంబముగా ఉండుటకంటె మట్టిపాత్రలలో తిని, త్రాగితే అతనికి తృప్తి కలిగేది. అతని సుగుణముల ఫలితముగ అతడు పరిపా లించిన ప్రాంతములలో గొప్ప శాంతి, సమాధానము లేర్పడినవి.
ఈ సుగుణములకు తోడు, అతనికి దేవుని వాక్యముయెడల అమితమైన ప్రేమ కలదని చెప్పబడుచున్నది. తన జీవితమును, పరిపాలనను ఆ సిద్ధాంతములకనుగుణ ముగ నడిపించెను. క్రైస్తవ నీతికి, సిద్ధాంతమునకు వ్యతిరేకమైనందున అతడు ఏవిధమైన యుద్ధములలో పాల్గొనలేదు మరియు యుద్ధములలో పాల్గొను ఇతర నాయకులకుకూడ అతడు సహకరించలేదు.
దేవాలయములను నాశనము చేయుటను ఆపి క్రైస్తవులను బ్రతుకనీయుమని, చిత్రహింసలవలన వారికి కలిగిన గాయములనుండి ఉపశమనము కలగనీయుమని ఆజ్ఞాపించెను. కాని సామ్రాజ్యములోని యితర ప్రాంతములలో హింసలు అంతగా తగ్గలేదు. కాన్ స్టాంటియస్మాత్రము క్రైస్తవులు తమ విశ్వాసమును యధేచ్ఛగా కొనసాగించుటకు అనుమతించెను.
ఒక సందర్భములో కాన్ స్టాంటియస్ తన ఆస్థానములోని క్రైస్తవులలో ఎవరు యథార్థవంతులో తెలిసికొనవలెనని నిశ్చయించుకొని, ఒక దినమున ఆస్థానములోని అధికారులను, సేవకులందరిని పిలిచి ఎవరైతే దయ్యములకు బలి అర్పించెదరో వారుమాత్రమే తమ తమ ఉద్యోగములలో కొనసాగెదరు, ఎవరు దీనికి అంగీకరించరో వారు తన ఆస్థానమునుండి నెట్టివేయబడుదురని చెప్పెను.
అది వినగానే ఆస్థానము లోని సేవకులందరు గుంపులుగా విడిపోయి, కొంతమంది సేవకులు ఇష్టపూర్వకము గానే దయ్యములను పూజించెదమని చెప్పిరి. మరికొందరు బహిరంగముగ ధైర్యముతో దయ్యములను పూజించుటకు నిరాకరించిరి. ఇది గ్రహించిన చక్రవర్తి స్థిరవిశ్వాసము కలిగి దైవికముగా జీవించుచున్న క్రైస్తవులను అవిశ్వాసులనుండి వేరుచేసెను.
దయ్యములకు బలి అర్పించెదమని చెప్పినవారిని చక్రవర్తి సున్నితముగ మంద లించి, వారు దేవునికి విశ్వాసఘాతకులని, తన ఆస్థానములో సభ్యులుగనుండుటకు తగినవారు కారని, వారిని దేశ బహిష్కరణ గావించెను. దయ్యములకు బలి అర్పిం చుటకు నిరాకరించి దేవుని ఒప్పుకొనినవారిని చక్రవర్తి అభినందించి వారుమాత్రమే తన కొలువులో ఉండతగినవారని, వారు తాను ఆధారపడతగిన సలహాదారులని; తనను, రాజ్యమునుకూడ కాపాడగలరని చెప్పెను. మరియు వారు తన కొలువులో ఉద్యోగులుగామాత్రమేగాక, వారిని తన నిజస్నేహితులుగ భావించి, తన రాజ్యములోని ధనాగారముకంటె గొప్పవారని ఘనపరచెను.
క్రీ.శ. 306 లో కాన్ స్టాంటియస్ చనిపోగా, అతని కుమారుడైన కాన్ స్టాంటైన్ చక్రవర్తియయ్యెను. బానిసత్వమునుండి సంతోషకరమైన స్వాతంత్య్రములోనికి దేవుని పిల్లలను నడిపించుటకు దేవుడు పంపించిన రెండవ మోషేవంటివాడు ఈ కాన్స్టాంటైన్ అని క్రైస్తవులనేకులు విశ్వసించిరి.
ఫ్లావియస్ వెలేరియస్ కాన్ స్టాంటినస్ (కాన్ స్టాంటైన్) {Flavius Valerius Constantinus (Constantine)} రోమా సామ్రాజ్యములోని నైసుస్ (Naissus) పట్టణములో క్రీ.శ. 280 లో జన్మించెను. అదే ఈనాటి ఆగ్నేయ ఐరోపాలోని సెర్బియా.
క్రీ.శ. 312 కు పూర్వము కాన్స్టాంటైన్ అన్యుడైనను తనకు సహాయము చేసెడి క్రైస్తవులను చేర్చుకొనుటకు ఇష్టపడెను, కాని అతడు ఏ ఒక్క దేవుని ఆరాధించెడివాడు కాదు. ఏదిఏమైనను క్రీ.శ. 312 నుండి 324 మధ్యకాలములో నిజదేవుడైన క్రీస్తును అంగీకరించి, అనేక పర్యాయములు సంఘములకు, బిషప్లకు ప్రోత్సాహములను అందించెను. క్రీ.శ. 324 సెప్టెంబరు 18న తన రాజకీయ శత్రువు, చక్రవర్తియైన లిసినియస్ (Licinius) ను ఓడించిన తర్వాత కాన్ స్టాంటైన్ బహిరంగముగ క్రైస్తవ్య మును స్వీకరించెను.
తండ్రివలె నిరాపేక్షగల రాజైనప్పటికిని, కాన్స్టాంటైన్ నిరంకుశాధికారముతోను, అణచివేత, క్రూరత్వములతోను పరిపాలించెను. తన సలహా సంఘములో సంఘకాపరు లను చేర్చుకొనెను. బానిసలు, ఖైదీలను ఆదరించు విషయములో అతనిపై క్రైస్తవ బోధనలు మిక్కిలి ప్రభావము చూపెను. అయితే తన జ్యేష్ఠ కుమారుడైన క్రిస్పస్ (Crispus) ను, రెండవ భార్య ఫౌస్తా (Fausta) ను చంపించెను. ఆ కాలమునకు చెందిన అనేకులవలె కాన్స్టాంటైన్ జీవితము, ప్రవర్తన క్రైస్తవ్యము, అన్యమతముల కలయికయైయున్నది.
కాన్స్టాంటైన్ పరిపాలనా కాలములో మూడు ప్రాముఖ్య సంఘటనలు జరిగెను. అవి, అతడు రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తియగుట. క్రైస్తవ మతమును చట్ట సమ్మతమైన మతముగా చేయుట. మరియు కాన్ స్టాంటినోపిల్ (Constantinople) పట్టణమును కట్టించుట. కాన్ స్టాంటినోపిల్ తూర్పు రోమా సామ్రాజ్యమునకు రాజధానియై, క్రైస్తవ మత విజయమునకు సంకేతమైనది.
పశ్చిమ ప్రాంతమునకు కాన్ స్టాంటైన్ చక్రవర్తియైనప్పుడు సింహాసనమునకు వారసులైనవారినుండి ఎన్నో కష్టముల నెదుర్కొనెను. మాగ్జిమియన్ చక్రవర్తిగా రాజీనామా చేయగానే, అతని కుమారుడైన మాగ్జెన్షియస్ (Maxentius) సైన్యముచేత చక్రవర్తిగ ఎన్నుకొనబడెను. ఇటలీకూడ పశ్చిమ రాజ్యములోని భాగము కనుక రోమా సామ్రాజ్యమంతటికి మహాచక్రవర్తినని మార్జెన్షియస్ తలంచెను.
కాన్స్టాంటైన్ పరి పాలన కాలములోకూడ అతని సైనికపాలన రోములో కొనసాగెను. అందుచే రోమను శాసనసభ మాగ్జెన్షియసనకు మిక్కిలి భయపడి అతనిని ఎదిరించుటకు సందేహించినది కాని అతని తండ్రియైన మాగ్జిమియన్ ను ప్రాధేయపడగా అతడు తన కుమారుని ఆధీనములో లేని ప్రాంతముపై అజమాయిషీని విధించుటకు ఎత్తువేసి మాగ్జెన్షియస్ ను పడద్రోయుటకు డయోక్లేషియను తనతో సహకరింపుమని కోరెను. కాని డయోక్లేషి యన్ అందుకు అంగీకరింపలేదు. మార్జెన్షియస్ ను చక్రవర్తిగా ఎన్నుకొనిన సైనికులు అతనిని తొలగించుటకు అతని తండ్రి పన్నిన కుట్రను ఎరిగినవారై మాగ్జిమియన్ ను హెచ్చరించిరి.
మాగ్జెన్షియసు ఎదిరింపలేనని గ్రహించిన మాగ్జిమియన్ ఫ్రాన్స్ను పరిపాలించు చున్న కాన్స్టాంటైన్ వైపు తన దృష్టిని మరల్చెను. అతని కుమారునిమీద ఫిర్యాదుచేయు నెపముతో అతడు కాన్స్టాంటైన్ వద్దకు వెళ్ళెను. కాని, వాస్తవమునకు అతనిని చంపి పడమటి రాజ్యమును వశపరుచుకొనవలెనని తలంచెను. అయితే మాగ్జిమియన్ కుమార్తె మరియు కాన్స్టాంటైన్ భార్యయగు ఫౌస్తా ఆ కుట్రను తెలిసికొని భర్తకు సమాచార మందించగా, కాన్స్టాంటైన్ ఫ్రాన్స్కు పారిపోవుచున్న తన మామను బంధించి, ఉరితీయించెను.
ఇంతకాలము మాగ్జెన్షియస్ సహింపరాని దుర్మార్గముతో రోమును పరిపాలించెను. అనేకమంది ప్రజలను ఉరితీయించి, వారి అస్తులను స్వాధీనపరచుకొనెను. అందుచే ఇతనిని మరియొక ఫరో లేక నీరోగా ప్రజలు భావించిరి. ఇతడు అప్పుడప్పుడు ఉన్మాదియై అనేకమంది రోమా పౌరులను చంపుమని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇతడు శరీరేచ్ఛలకు, దుర్మార్గమునకు హద్దులు లేనంతగా చెడ్డవాడై మంత్ర తంత్ర విద్యలకు అలవాటుపడి, తన చెడుకార్యములలో సహాయపడుటకు పిశాచములను ఆశ్రయించేవాడు. కాన్ స్టాంటైన్ తనపై యుద్ధము చేయుటకు సిద్ధపడుచున్నాడని ఊహించుకొని, యుద్ధ నివారణకు తగిన జ్ఞానమును అనుగ్రహింపుమని పిశాచములను కోరెడివాడు.
కొంతకాలము ఇతడు క్రైస్తవులకు అనుకూలముగ ఉన్నట్లు నటించెను. రోమీ యులను స్నేహితులుగా చేసికొనుటకు క్రైస్తవులను హింసింపరాదని శాసించి, అతడుకూడ వారిపై గర్వముతోకూడిన నిందలు మోపుట మానివేసెను. అయితే ఆ తరువాత మరల వారిని బహిరంగముగ హింసించుట మొదలుపెట్టెను.
మాగ్జెన్షియస్ క్రూర పరిపాలనకు విసుగుజెందిన రోమా ప్రజలు కాన్ స్టాంటైన్ ను జోక్యము కలిగించుకొని, తమ పట్టణమును, రాజ్యమును మాగ్జెన్షియస్ నుండి విడిపింపు మని ప్రాధేయపడిరి. కాన్స్టాంటైన్ వారి విజ్ఞాపనను విని, వారి దుస్థితికి జాలిపడి అతని అవినీతిక్రియలను, క్రూరత్వమును విడనాడుమని మాగ్జిన్షియస్ ను హెచ్చరించుచు ఒక ఉత్తరము వ్రాసెను. అయినను మాగ్జెన్షియస్ తన క్రూరత్వమును విడనాడనందున, కాన్స్టాంటైన్ ఉత్తరములు వ్రాసి ప్రయోజనములేదని గ్రహించి ఫ్రాన్సు, బ్రిటన్ లో తన సైన్యమును సమకూర్చుకొని క్రీ.శ. 313 లో రోముపై దండెత్తుటకు సిద్ధపడెను.
కాన్స్టాంటైన్ సైన్యముతో వచ్చుచున్నాడని మార్జెన్షియస్ విని అప్రమత్తుడయ్యెను. బహిరంగ యుద్ధములో అతనిని ఎదుర్కొనుటకు ఇష్టపడక, పట్టణమునకు వచ్చు దారిపొడవున రహస్య సైనికస్థావరములను ఏర్పరచి, కాన్స్టాంటైన్ సైన్యముపై అకస్మాత్తుగా దాడిచేయుటకు ఏర్పాటు చేసెను. కాని వారందరిపై కాన్స్టాంటైన్ విజయము సాధించెను.
అయినను అన్యమూఢవిశ్వాసములచేత ప్రభావితుడైన మాగ్జెన్షియస్ యొక్క మంత్ర తంత్ర శక్తులనుగురించి కాన్స్టాంటైన్ ఆందోళనచెంది, అతని శక్తులను జయించెడు మార్గమును అన్వేషింపసాగెను. అతని సైన్యము రోమును సమీపించుచున్నపుడు దేవుని సహాయముకొరకు అతడు అనేకసార్లు ఆకాశమువైపు చూచినాడని ఒక కథ చెప్పబడినది.
ఒక సాయంకాల సంధ్యాసమయములో అతడు ఆకాశపు దక్షిణ దిక్కును చూచినప్పుడు గొప్ప ప్రకాశమానమైన వెలుగు సిలువ ఆకారములో కనబడెను. ఆ సిలువమీద “దీనితో జయించు” అని వ్రాయబడి యుండెను. ఈ దర్శనమును కాన్స్టాంటైన్తో పాటు అతని సైన్యాధికారియైన యూస్టేబియస్ పామ్ఫలస్ మరియు ఇతర సైనికులుకూడ చూచిరి ఆ దర్శనభావము కాన్ స్టాంటైను తెలియలేదు. అతడు తనతోకూడ ఉన్న అనేకమందిని సంప్రదించెను గాని ఎవరివద్దను జవాబులేదు. అయితే ఆ రాత్రి క్రీస్తు అదే సిలువతో కలలో కనిపించి, అట్టి సిలువను తయారుచేయించి, తనతోపాటు యుద్ధభూమికి ఆ సిలువను తీసికొనివెళ్లినచో నీవు వెళ్లు ప్రతి యుద్ధమందును తప్పక విజయము పొందగలవని క్రీస్తు పలికినట్లు చెప్పబడినది.
“ఒక ముఖ్యవిషయమును గమనించవలెను. మూఢవిశ్వాసమునకు గుర్తుగ ఆ సిలువ యీయబడలేదు. కాని ఆ సిలువలో యుద్ధములను జయించెడి శక్తియున్నది. అది అతనికి, అతని జనమునకు ఎల్లప్పుడు జ్ఞాపక చిహ్నమైయున్నది. ఎవరిపేరున వారు యుద్ధము చేయుచున్నారో, ఎవరి మహిమ, ఎవరి రాజ్యవ్యాప్తికొరకు వారు యుద్ధము చేయుచున్నారో, ఆయనయందు నమ్మికయుంచవలెను.”
మరుసటి దినము కాన్ స్టాంటైన్ తాను యుద్ధముచేయు ప్రతి స్థలమునకు తీసికొనివెళ్లుటకు బంగారముతోను, ప్రశస్తమైన రత్నములతోను సిలువను చేయించెను. వారికి ముందున్న ఆ సిలువ వారిలో క్రొత్త ఆశను, నమ్మకమును పునరుద్ధరింపజేయగా, కాన్ స్టాంటైన్, అతని సైన్యము రోమువైపు త్వరితముగ బయలుదేరి వెళ్లిరి.
ఇప్పుడు మాగ్జెన్షియస్ కచ్చితముగ ప్రత్యక్ష యుద్ధములో కాన్స్టాంటైన్ సైన్యమును ఎదుర్కొనవలెను. కనుక, అతని సైన్యములను తైబర్ నది ఆవలగల మైదానమునకు నడిపించెను. నది దాటిన వెంటనే వారు దాటివచ్చిన వంతెనను మాగ్జెన్షియస్ పడ గొట్టించి, అదే స్థలములో తెడ్లతో నడుపు పడవలను, పలక బల్లలను ఉపయోగించి పడగొట్టించిన వంతెనవంటి ఆకారమును నిర్మించెను. కాన్స్టాంటైన్ సైనికులు నది దాటుటకు ప్రయత్నించినప్పుడు, అది వారితోపాటు కూలి నదిలో పడును గనుక అప్పుడు వారిపై దాడిచేయుట మాగ్జిన్షియస్ యుక్తియైయున్నది.
అయితే దానికిబదులు ఏమి జరిగినదో కీర్తనల గ్రంథములో వ్రాయబడినది :

రెండు సైన్యములు యుద్ధములో నిమగ్నమైయున్నప్పుడు మాగ్జెన్షియస్ మనుష్యులు సిలువ పతాకము క్రింద యుద్ధముచేయుచున్న కాన్స్టాంటైన్ సైన్యము ముందు నిలువలేకపోయిరి. కనుక అతడు, అతని సైన్యము పట్టణమువైపు పరుగెత్తిరి. రౌద్రముతోకూడిన కాన్స్టాంటైన్ ముట్టడిని తప్పించుకొను తొందరలో కాన్స్టాంటైన్’ సైనికులను పడద్రోయవలెనని మోసముతోకట్టిన వంతెనమీద వారే మోసపోయి పడిపోయిరి. తొందరగ దాటుటకు కట్టిన వంతెన కూలి, తిరుగబడినది. చాలమంది సైనికులు ఇటు అటు కొట్టుకుపోయిరి.
మాగ్జెన్షియస్, అతని గుఱ్ఱము నదిలో పడిపోయెను. అతడు ధరించిన బరువైన కవచము అతనిని నది అడుగుభాగమునకు లాగినది. కనుక అతడు నీటమునిగి చనిపోయెను. ఫరో సైన్యము ఏవిధముగ ఎర్రసముద్రములో మునిగి చనిపోయినదో ఆ ప్రవచనపు నెరవేర్పునకు సాదృశ్యముగా మాగ్జెన్షియస్, అతని సైన్యము తైబర్ నదిలో మునిగి చనిపోయిరి.
ఐగుప్తు దాస్యములో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు శ్రమననుభవించి నట్లు, రోమా ప్రభుత్వపు కాలిమడమక్రింద క్రైస్తవులు 300 సంవత్సరములు శ్రమ ననుభవించిరి. సంహారదూత ఐగుప్తును దాటిపోవునప్పుడు గొఱ్ఱపిల్ల రకము ఇశ్రాయే లీయులను ఫరో ఇనుప పిడికిలినుండి విడిపించెను. ఇప్పుడైతే దేవుని గొఱ్ఱపిల్లయొక్క సిలువ సైన్యసమూహమును చివరి రోమా ప్రభుత్వ క్రూరబంధకములనుండి విడిపించి, దేవుని ప్రజలను స్వతంత్రులనుగా చేసెను. ఇప్పటికి సుమారు 1600 సంవత్సరములు గతించినవి, అయినను అదే ప్రభువు తన ప్రజలను కాపాడుచునే యుండెను.
కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యమంతటికి చక్రవర్తియయ్యెను. క్రీ.శ. 324 లో తన రాజధానిని రోమునుండి తూర్పు ప్రాంతమునకు మార్చెను. ఉత్తరమున నల్ల సముద్రము, మర్మరా సముద్రముల మధ్యగల జలసంధియగు బోస్ఫరస్లోని బైజాంటి యమ్ (Byzantium) అను గ్రీకుల పురాతన పట్టణమును తన రాజధానిగా ఎన్ను కొనెను. పురాతన కాలమునుండి అది గొప్ప వర్తక మార్గము. ఎంతో డబ్బు వెచ్చించి కాన్స్టాంటైన్ దానిని విస్తృతపరచి, దానిని ఐశ్వర్యవంతమైన పట్టణముగ చేసి, ‘నూతన రోము’ అను పేరుతో ప్రతిష్ఠించెను. కాని అది కాన్స్టాంటినోపిల్ (Constantinople) అను పేరుతో పిలువబడెను.
కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తి. పశ్చిమ ప్రాంతపు క్రైస్తవ్యమునకు కాన్ స్టాంటినోపిల్ రాజధాని నగరమైనది. కాని తూర్పు ప్రాంతములోని క్రైస్తవ్యమును రోము ఏలుబడిచేసెను. కాన్స్టాంటైన్చే స్థాపించబడిన పశ్చిమ రోమా సామ్రాజ్యము వేయి సంవత్సరములపైగా నిలచెను.
ఆ కాలములో క్రైస్తవ్యము శాంతిగా యుండెను. కాన్స్టాంటైన్ క్రీ.శ. 327 మే 22న చనిపోయెను. చనిపోవుటకు ముందు రోమా సామ్రాజ్యమును మిగిలియున్న తన ముగ్గురు కుమారులకు పంచియిచ్చెను.
రోమా చక్రవర్తుల పరిపాలనలో జరిగినట్లు సర్వ సాధారణమైన రీతిలో, క్రమ పద్ధతిలో క్రైస్తవులపై హింసలు జరుగలేదు కాని ప్రపంచములో వేల వేల ప్రాంతములలో చెదురుమదురుగ క్రైస్తవులు హింసింపబడెను. తాను శిరచ్ఛేదము చేయబడక పూర్వము, శ్రమలపాలైన అపొస్తలుడైన పౌలు రోమా చెరసాలనుండి తన శిష్యుడైన తిమోతికి ఈలాగు వ్రాసెను : కనుక శాంతితోకూడిన ఆ వేయి సంవత్సరములలోకూడ క్రీస్తునందలి విశ్వాసమునుబట్టి క్రైస్తవులు హతసాక్షులుగా చేయబడిన దృష్టాంతములు లేకపోలేదు.
